Sekhar Digitals & Reporter 9603197203
539 views 1 months ago
#🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #రాజకీయ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ *ఎన్నికలకు మూడేళ్ళ ముందే...* *కాపులతో వైకాపా సమావేశం..* *✍️..పై ప్రత్యేక కథనం..రిపోర్టర్ :- శేఖర్📲..9603197203..✍️* మొదలయ్యాయి.గోదావరి జిల్లాల్లో కాపులు అంతా ఎన్నికల్లో జనసేనకు, టిడిపికి అనుకూలంగా నిలబడ్డారు. అయితే ఎన్నికల తర్వాత నామినేటెడ్ పదవుల్లో కాపులకు ఆశించిన స్థాయిలో పదవులు దక్కలేదు. ఈ అసంతృప్తి ఇప్పటికే వారిలోగూడుకట్టుకుని ఉంది. ఇక తాజాగా రాజమండ్రిలో కాపులను ఉద్దేశించి జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కాపుల్లో మరింత అగమ్యగోచర పరిస్థితి సృష్టించింది. వీటిని ఆసరాగా చేసుకుని వైకాపా పావులు కదపడం మొదలెట్టింది. ఆ పార్టీలోని కాపునాయకుల్తో పాటు తటస్థంగా ఉన్న కాపు నాయకులందర్నీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు చేపట్టింది. ఇందుకోసం ఈ నెల21వ తేదీన రామచంద్రపురం నియోజకవర్గంలోని ద్రాక్షారామ కళ్యాణ మండపంలో ఓ భారీ కాపు సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. వైకాపాకు చెందిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు ఆ పార్టీ బాధ్యతల్ని అప్పగించింది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా వైకాపాలో కీలకంగా ఉన్న కాపు నాయకుల్తో పాటు ఇతర పార్టీల్లోని కొందరు కాపులకు కూడా ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. పెద్దసంఖ్యలోనే ఈ సమావేశానికి కాపు నాయకులు హాజరవుతారన్న అంచనాలున్నాయి.. *దేశంలో గుబులు.. ప్రశాంతంగా జనసేన :* తాజా పరిణామాల్లో గోదావరిజిల్లాల్లోని తెలుగుదేశంలో కాస్తగుబులు మొదలైంది. అయితే జనసేన మాత్రం ఈ విషయంలో ప్రశాంతంగానే ఉంది. ఆచితూచి పరిస్థితుల్ని బట్టి వ్యవహరించాలని భావిస్తోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు కాపు నాయకులు ఇప్పటికే ఈ సమావేశానికి ఆహ్వానాలు పొందిన 72మంది కాపు సామాజిక వర్గీయుల్లోని కొందరితో నేరుగా సంప్రదింపులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. గత మూడు రోజులుగా టిడిపికి చెందిన కాపు నాయకులకు అధిష్టానం ఈ బాధ్యతల్ని అప్పగించింది. అయితే ఈ విషయంలో వారికి జనసేన నుంచి ఎలాంటి సహకారం అందడంలేదు. జనసేన మాత్రం ఎవరెన్ని సమావేశాలు నిర్వహించుకున్నా కాపు ఓటర్లు తమకు దూరం కారన్న దృడవిశ్వాసంతో ఉంది.. *మూడేళ్ళ ముందే హడావిడి :* కొందరు రాజకీయ నాయకులైతే మూడేళ్ళకు ముందే ఇంత హడావిడి అవసరమా అని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడిప్పుడే తమ సామాజికవర్గానికి చెందిన పవన్ కళ్యాణ్కు రాష్ట్ర, జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు లభిస్తోందని ఈ దశలో కాపులు వైకాపాకు అనుకూలంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే వైకాపాలోని కాపు నాయకులు మాత్రం ఇప్పటి నుంచి ముందడుగు వేయాల్సిందేనని తేల్చిచెబుతున్నారు. వారిలో అత్యధికులు అధిష్టానం నిర్ణయానికే మద్దతు ప్రకటిస్తున్నారు. గత ఎన్నికల్లో కాపుల్లో అత్యధిక శాతం పవన్ కళ్యాణ్ వెంట నడిచి కూటమికి అనుకూలంగా ఓట్లేసినా ఈ రెండేళ్ళలో కాపుల్లో అసంతృప్తి గూడుకట్టుకుని ఉందని వారు వాదిస్తున్నారు.. *అధినేతను ప్రసన్నం చేసుకోవాడనికా..??* అసలు ఈ ప్రయత్నాలన్నీ వైకాపా అధ్యక్షుడు జగన్ ఆదేశాలకు అనుగుణంగానే జరుగుతున్నాయా లేక ఆయన్ను ప్రసన్నంచేసుకోవడానికి ఈ సమస్యను కొన్నివర్గాలు తెరపైకి తెచ్చాయా అన్న సందేహాలు రాజకీయ నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. వైకాపా అధికారంలో ఉండగా పలు పదవులు నిర్వహించిన వారిలో కొందరు ఇప్పుడు ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. పార్టీ ఓటమి తర్వాత ఏ కార్యక్రమంలోనూ వీరి జాడ కనిపించడంలేదు.ఇందులో కాపు సామాజిక వర్గీయుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వీరందరిని తిరిగి చైతన్యపర్చేందుకు ఈ సమావేశం ఉపకరిస్తుందన్న విశ్వాసం వైకాపా వర్గాల్లో ఉంది. అయితే ఇంత ముందుగా తేనెతుట్టెను కదపడం అవసరమా అన్న వ్యతిరేకతకూడా అదే పార్టీలోని మరికొందరి నుంచి వినిపిస్తోంది.. ___________________________ *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 2️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/GLEFRjZEzc17SzBaKlBfdW?mode=ems_wa_c ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
9 likes
13 shares

More like this