ShareChat
click to see wallet page
search
#🕉️om namo viswakarma 🙏 #👋విషెస్ స్టేటస్ #😇My Status #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #✌️నేటి నా స్టేటస్ >>> విశ్వబ్రాహ్మణులు శఠగోపాన్ని శిరస్సుపై ఎందుకు ధరించరు? >> శఠగోపం పుట్టుక పూర్వోత్తరాలు : సాధారణంగా వైష్ణవ ఆలయాలలో పూజారి మన తలపై పెట్టే ఒక లోహపు కిరీటమే శఠగోపం. దీని పైభాగంలో శ్రీమహావిష్ణువు పాదముద్రలు ఉంటాయి. >>'శఠ' అనే మాయను గెలిచినవాడు: శాస్త్రాల ప్రకారం, ఏ మానవుడైనా సరే భూమిపై జన్మించగానే 'శఠము' అనే ఒక ప్రాపంచిక వాయువు (మాయ) అతన్ని స్పృశిస్తుంది. దానివల్ల జీవుడు తన పూర్వ జన్మల జ్ఞానాన్ని, భగవంతునితో ఉన్న బంధాన్ని మర్చిపోయి సంసార మోహంలో పడిపోతాడు. కానీ, పుడుతూనే ఆ మాయను తన ఆధ్యాత్మిక శక్తితో తరిమికొట్టిన మహానుభావుడు నమ్మాళ్వార్ (పన్నెండు మంది ఆళ్వారులలో ప్రముకుడు). అందుకే ఆయనకు 'శఠగోపన్' (శఠాన్ని లొంగదీసుకున్నవాడు) అనే పేరు వచ్చింది. >> పాదాల చెంతే పరమపదం: నమ్మాళ్వార్ తన జీవితమంతా భగవత్ ధ్యానంలోనే గడిపారు. ఆయన భక్తికి మెచ్చిన శ్రీమహావిష్ణువు "ఏం వరం కావాలో కోరుకో" అన్నప్పుడు, ఆయన ముక్తిని కోరలేదు; "నీ పాదపద్మాల కిందే నాకు నిరంతర స్థానం ప్రసాదించు స్వామి" అని వేడుకున్నారు. >> శరణాగతికి ప్రతీక: భక్తుడి హృదయాన్ని భగవంతుని పాదాలతో ముడిపెట్టే ఈ బంధానికి రూపమే శఠగోపం. ఆలయంలో దానిని మన తలపై ఉంచినప్పుడు—కింద ఉన్న భాగం నమ్మాళ్వార్ శిరస్సుగా, పైన ఉన్నది స్వామివారి పాదాలుగా భావిస్తాం. అంటే, ఒక పరమ భక్తుని ద్వారా మనం భగవంతుని పాదాలను ఆశ్రయిస్తున్నామని, మన అహాన్ని స్వామి చెంత మోకరిల్లుతున్నామని దీని అంతరార్థం. శఠగోపం అనేది జీవాత్మ - పరమాత్మలో లీనమవ్వడం సూచిస్తుంది ------------------------------ >> విశ్వబ్రాహ్మణులు (విశ్వకర్మలు) శఠగోపాన్ని శిరస్సుపై ఎందుకు ధరించరు? విశ్వబ్రాహ్మణులు ఆలయాలలో శఠగోపాన్ని తలపై పెట్టించుకోకపోవడం వెనుక ఏ విధమైన తిరస్కార భావన లేదు. దీని వెనుక వారి విశిష్టమైన పుట్టుక, బ్రహ్మజ్ఞానం మరియు అత్యున్నత ఆధ్యాత్మిక స్వయంప్రతిపత్తి (ఆత్మగౌరవం) దాగి ఉన్నాయి. దీనిని 'ఆత్మగౌరవ సంప్రదాయం' అనవచ్చు. >> 1. మూలపురుషుడు విశ్వకర్మ (జగద్గురువు) విశ్వబ్రాహ్మణుల వంశం త్రిమూర్తుల (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల) కంటే పూర్వమే, ఈ సమస్త సృష్టిని సంకల్పించిన విరాట్ విశ్వకర్మ (విశ్వబ్రహ్మ) నుండి నేరుగా ఉద్భవించింది. సనగ, సనాతన, అహభూన, ప్రత్నస, సుపర్ణస అనే ఐదుగురు బ్రహ్మర్షుల సంతతిగా వారు. సృష్టికర్త మూలాల నుండి వచ్చినందువల్ల, వారు అంతర్గతంగానే ద్విజత్వాన్ని (బ్రాహ్మణత్వాన్ని) కలిగి ఉంటారు. కాబట్టి, సృష్టిలోని మరొక రూపానికి లేదా వ్యవస్థకు లోబడి ఆధ్యాత్మికంగా శరణు కోరడం వారి మూల సిద్ధాంతానికి విరుద్ధం. >> 2. శరణాగతి సిద్ధాంతం వర్తించకపోవడం విశ్వబ్రాహ్మణులు తమకంటూ ప్రత్యేకమైన స్వతంత్ర పురోహిత వ్యవస్థను, గాయత్రీ ఉపాసనను, సొంత అగమ శాస్త్రాలను కలిగి ఉన్నారు. వేరొక పూజారి వర్గం ఇచ్చే దీవెనలను లేదా శరణాగతి ముద్రలను వారు స్వీకరించరు.....(సుధీర్ బాబు) Fb నుండి సేకరణ
🕉️om namo viswakarma 🙏 - ShareChat