శాశ్వతంగా మూగబోయిన సుమనోహర గాన స్వరం! ( 12 - 4 - 2026)
లేదా
ఆశా బోంస్లే నింగికి పయనమై వెళ్లడం,కానరాని లోకాలకు తరలివెళ్లడం కోట్లాది మంది సంగీత ప్రియులకు తీరనిలోటు!
దశాబ్దాలుగా కోట్లాది మంది శ్రోతలను,సంగీత ప్రియులను తన సమ్మోహన గాన స్వర మాధుర్యంతో ఓలఓల లాడించిన 92 ఏళ్ల ఆశా బోంస్లే గారు దురదృష్టవశాత్తు ఆనారోగ్య కారణాలతో తుది శ్వాస విడవడంతో యావత్ భారతదేశ సంగీత ప్రపంచానికి ఓ తీరనిలోటుగా పరిణమించింది.ఎందుకంటే ఆ మహా గాయని సంగీత చరిత్రలోనే ఓక యుగాన్ని సృష్టించింది అని నయగర్బంగా చెప్పవచ్చు.అంతేకాదు ఆమె భారతీయ సంగీతాన్ని తన గాన మధురిమలతో సుసంపన్నం చేశారు కూడా.అలాగే ఆమె వైవిధ్యమైన స్వరం కోట్లాది మంది గానాన్ని ఇష్టపడే సంగీత ప్రియులకు,అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుంది అనే మాట అక్షర సత్యం.ఇక ఈ బాలీవుడ్ లెజెండరీ గాయని ఆశా బోంస్లే కెరీర్ విషయానికి వస్తే 1943లో పదేళ్ల వయస్సులో మరాఠి చిత్రం ' మజా బల్ ' లో తొలి గీతం ఆలపించారు.అది మొదలు 2010 దశకం వరకు పాడుతూనే వున్నారు. అంతేకాదు సుదీర్ఘ కాలం పాటు పాడిన సింగర్ గా కూడా రికార్డులకెక్కారు.ఓక ఔట్ స్టాండింగ్ గాయనిగా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు కూడా.2000 సంవత్సరంలో దాదా సాహెబ్ పాల్కే,2008లో పద్మభూషణ్,2018లో బంగ భూషణ్,2021లో మహారాష్ట్ర భూషణ్ అవార్డులు ఆమెను వరించాయి. ఇక జాతీయ అవార్డులు,గౌరవాలకు లెక్కే లేదు. అదేమాదిరి 80 ఏళ్లలో 14 భాషల్లో 12,000 లకు పైగా పాటలతో శ్రోతలను రంజింపజేశారు.యాదోం కీ బారాత్,హమ్ దోనో,హారే రామ హారే కృష్ణ,డాన్, నమక్ హలాల్,ఉమ్రావ్ జాన్,కిస్మత్,మేరా సాయా,తీస్రీ మంజిల్,మేరే జీవన్ సాథీ తదితర చిత్రాల్లో ఆశ పాడిన పాటలు దశాబ్దాలుగా నభుతో న భవిష్యత్ అన్న విధంగా అశేష కొట్లాది మంది సంగీత ప్రియులను అలరిస్తూనే వున్నాయి.అన్నింటికి మించి ఆమె పాడటానికి పోరాడింది,జీవించడానికి పోరాడింది,' సింగిల్ ' మదర్ గా పిల్లల్ని పెంచడానికి పోరాడింది, తన కంటే వయస్సులో చిన్న వాడైనా వ్యక్తిని రెండో వివాహం చేసుకొని లోకంతో పోరాడింది, పాటకు చిరునామాగా ఎదిగిన సొంత అక్కను ఎదిరించి తన ఉనికిని చాటుకోవడానికి పోరాడింది.ఇక ఆశా బోంస్లే తన అంతిమ శ్వాస వరకు కూడా పోరాడుతూనే వుంది.ప్రతి యుద్దాన్ని గెలుస్తూనే వుంది.ఆమె జీవితం అసామాన్యం,ఆమెకే సాధ్యం.అందుకే ఆమెను వేయి యుద్దాల విజేతగా అభివర్ణిస్తారు ఆమె పాటంటే చెవి కోసుకునే అశేష సంగీత ప్రియులు.
ఏదిఏమైన ఆశా బోంస్లే హిందీలోనే కాకుండా తెలుగు,తమిళ,బెంగాలీ,కన్నడ,మలయాళం వంటి 20కి పైగా భాషల్లో సుమారు 11,000 లకు పై చిలుకు పాటలు పాడారు.అంతేకాదు అన్ని పాటలు పాడినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో సైతం ఆమె స్థానాన్ని సొంతం చేసుకున్నారు.అయితే తెలుగులో ఆమె తక్కువ పాటలు పాడినప్పటికి అన్నీ ఆల్ టైమ్ హిట్స్ గా నిలవడంతో తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో సైతం తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.ఆశా బోంస్లే తెలుగులో ఎంతో మధురంగా పాడిన పాటలు నేటికీ సంగీత ప్రియుల ప్లేలిస్టులో వున్నాయి అనే మాట అక్షర సత్యం.ఏమైనా తెలుగులో దివంగత లెజెండరీ దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ' పాలు - నీళ్లు ' ( 1981) చిత్రంలో ఆమె పాడిన తొలి పాట ' ఇది మౌనగీతం ఓక మూగ రాగం '.ఇక చిన్ని కృష్ణుడు ( 1992) చిత్రంలో ' జీవితం గుప్త సాగరం ', అశ్వ మేథం ( 1992) ' సీతా కాలం ప్రేమకు,ఓ ప్రేమ వంటి పాటలు ఆలపించారు.అదే మాదిరి ' పవిత్ర బంధం ' ( 1996) చిత్రంలో ఐస్సలకిడి,అదే విధంగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఆయనే సంగీతం అందించిన ' ఇద్దరు ' ( 1997) చిత్రంలో ' వెన్నెల ' పాట పాడారు.అన్నింటికి మించి చివరగా ఆమె పాడిన పాట కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ' చందమామ ' చిత్రంలో ' నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు ' అనే పాట ఆమెకు తెలుగునాట ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చింది.ఎంతగా అంటే ఈ మెలోడీ సాంగ్ ను ఇప్పటికి యువత తెగ ఇష్టపడుతూనే వున్నారు.ఇంతలా యావత్ భారతదేశ వ్యాప్తంగా తన వినసోంపైన గాన చాతుర్యంతో కోట్లాది మంది సంగీత ప్రియుల హృదయాల్లో వెలకట్టలేని శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకున్న ఆశా బోంస్లే గారు నింగికి పయనమై వెళ్లడం,కానరాని లోకాలకు తరలివెళ్లడం అత్యంత విషాదకరం.ఈ బాధాకరమైన సందర్బంగా ఆ ధ్రువతార ఆశా బోంస్లే గారి పవిత్ర ఆత్మకు ఆ దివిలో అనంత శాంతి చేకూరాలని ఆమె గానం అంటే చెవి కోసుకునే అశేష కోట్లాది మంది సంగీత ప్రియులం అయిన మనమందరం మనసా,వాచ,కర్మణ ప్రార్థిద్దాం. అమర్ రహే!అమర్ రహే లెజెండరీ సింగర్ ఆశా బోంస్లే గారు!జైహింద్! మేరా హిందూస్తాన్ మహాన్!🎸🎸🎸🇮🇳🇮🇳🇮🇳✍️✍️✍️
- బుగ్గన మధుసూదనరెడ్డి,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు & సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #బాలీవుడ్


