#💪పాజిటీవ్ స్టోరీస్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్‌డేట్స్📢 *ఎమ్మార్పీ ధరకు మించి మద్యం విక్రయాలు..?* *అదనపు వసూళ్లపై మద్యం ప్రియుల ఆరోపణలు..* ఆంధ్రప్రదేశ్‌లోని పలు మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ (MRP) ధర కంటే అదనంగా *రూ.10 నుంచి రూ.20 వరకు వసూలు చేస్తున్నారని మద్యం కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు.* ఓ మద్యం ప్రియుడు రాయల్ ఛాలెంజ్ క్వార్టర్ బాటిల్ కొనుగోలు చేయగా, బాటిల్‌పై *ఎమ్మార్పీ ధర రూ.230గా ముద్రించి ఉన్నప్పటికీ, దుకాణంలో అదనంగా రూ.10 నుంచి రూ.20 వరకు వసూలు చేశారని తెలిపారు.* రాష్ట్రంలోని అనేక మద్యం దుకాణాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోందని, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని పలువురు మద్యం ప్రియులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధికంగా వసూలు చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాల నిర్వాహకులు, *ఎక్సైజ్ శాఖ అధికారులు కుమ్మక్కయ్యారా..?* అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధర వసూలు చేస్తున్న దుకాణాలపై *ఎక్సైజ్ శాఖ తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు* తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.. __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 5️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/B84kn3XfnsiIxEJyhmXoyV?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
12 likes
13 shares

More like this