Satya Vadapalli
3K views 27 days ago
రామకోటి యజ్ఞమే శ్రీరామరక్ష! ‘రామ’నామ రచన, స్మరణ, కీర్తన రసరమ్యంగా విశ్వవ్యాప్తమై విరాజిల్లుతున్న ది. ‘రామకోటి’ రచన ఇంటింటా దీపకాంతి వలె తరతరాలుగా విరాజిల్లుతు న్నది. పలక, కాపీ, పుస్తకం ఏదైనా కొని, శ్రీకారం చుట్టడానికి ముందు తొలుత "శ్రీరామ"అని రాయడం మన సంప్రదాయం. సామాన్య ప్రజలలో ‘రామ’నామానికి అంతటి ప్రాధాన్యం కన్పిస్తున్నది. ఆదికావ్యంగా ‘రామాయణం’, ఆదికవిగా వాల్మీకి మహర్షికే ఇంతటి గొప్ప గౌరవం దక్కింది. ఆవేదనతో వున్న వాల్మీకితో నారదుడు ‘కురు రామ కథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోహరాం హితావద్రామాయణ కథాలోకేషు ప్రచరిష్యతి’ (రామనామ కథను కావ్యంగా రాయండి, ఈ పంచభూతాలు ఉన్నంత కాలం నిలుస్తుంది) అన్నాడు. ఈ మాటలకు పులకించి పోయిన వాల్మీకి ఏకంగా 24,000 శ్లోకాలు, 6 కాండలతో ‘రామాయణం’ తొలి ఇతిహాసాన్ని సృష్టించాడు. భక్తుల నోళ్ళే కాగితాలుగా, వారి హృదయాలే గూళ్లుగా శాశ్వతంగా నిలిచిన ‘రామకథ’, అందులోని మధురాతి మధురమైన ‘రామ’నామం భారత జాతికి ఒక గొప్ప సంస్కారంగా స్థిరపడింది. "శ్రీరామరామ రామేతి రమేరామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే " ఈ శ్లోకాన్ని వెయ్యిసార్లు చదివినా, "శ్రీరామ"నామాన్ని లక్షసార్లు రాసినా ‘రామకోటి ఫలం’ లభించి, జన్మధన్యమవుతుందన్నది భక్తుల విశ్వాసం. దీనికి గణాంక విశ్లేషణకూడా ఉన్నది. ఈ శ్లోకం విష్ణు సహస్రనామ పారాయణంతో సమానమని పార్వతికి శంకరుడు చెప్పినట్లు శాస్త్ర ప్రమాణం వున్నది. అందుకే, ఇంటింటా శ్రీరామకోటి రాస్తూ, సమూహాలుగా పుస్తకాలు కట్టలు కట్టి, వాటిని పరమ పవిత్రంగా శ్రీరామచంద్రమూర్తి పాదాలవద్దకు చేర్చడం ద్వారా ‘రామకోటి యజ్ఞం’ చేస్తున్న వారెందరో. ఇదే సమయంలో దానికి పదోవంతు హవనం చేసి, ఏడు రోజులపాటు హోమాలు, క్షీర తర్పణాలు, అన్నదానం వంటివి కూడా నిర్వహిస్తారు. ‘వల్మీకం’ అనే పర్వతంలో పుట్టిన నది ‘రామ’నామం. అది రాముడనే సముద్రంలోకి వచ్చి చేరుతుంది. రాముని గుణగణాలైన ధర్మం, సత్యవాక్పరిపాలన, ఒకే బాణం, ఒకే మాట, ఏకపత్నీ వ్రతం వంటివన్నీ కరుణా సముద్రుడైన రాముడు లోకానికి అందించిన జీవన ఫలరత్నాలు. ఒక్కో యుగానికి ఒక్కో భక్తిమార్గం వుంటుంది. మహా పుణ్యం, మోక్షం పొందటానికి యజ్ఞయాగాదులు, వేదాధ్యయనం, సప్త సంతానాల నిర్వహణ, దానధర్మాలు వంటి మార్గాలు ఎన్నో వున్నా, ఈ కలియుగంలో నామ స్మరణ, రచన, కీర్తనలే అత్యంత ప్రధానం. ‘రాసిందే మళ్ళీ ఎందుకు రాస్తున్నారు?’ అని ‘రామాయణ కల్పవృక్షం’ సృష్టికర్త విశ్వనాథ సత్యనారాయణ వారిని ఒకరు ప్రశ్నించినప్పుడు, ఆయన గొప్ప సమాధానమే ఇచ్చారు. ‘తిన్న అన్నమే రోజూ తినటం లేదా? ఎవరి రుచి వారిదే. ఎక్కడ కొరికినా ఎవరు తిన్నా చెరకు తీపి అలానే ఉంటుంది’. రామనామ రచన, స్మరణ, కీర్తనలలోని మాధుర్యం అంతటిది. సముద్రంలోని రత్నాలవలె రామనామం యుగయుగాలుగా విశ్వవ్యాప్తంగా వెలుగులు చిమ్ముతునే ఉన్నది. ‘రామకోటి’ రచన మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, నిరాశను దూరం చేస్తుంది. అహంకారాన్ని తొలగించి, మానసిక పరివర్తనకు మార్గదర్శనం చేస్తుంది. భర్జనం భవబీజా నామార్జనం సుఖసంపదామ్‌ తర్జనం యమదూతానాం రామరామేతి గర్జనమ్‌ ॥ - రామరక్షా స్తోత్రం (36) రామనామ రచన, పఠనలవల్ల అన్ని పాపాలూ పటాపంచలై పోవడమేకాదు, యమదూతలు సైతం దూరమవుతారు. జీవితంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. కల్పవృక్షం, కామధేనువులకు సమమైంది ‘రామనామ’ స్మరణ. ‘ర’ అగ్ని బీజాక్షరం అజ్ఞానమనే చీకట్లను తొలగించి, జ్ఞానమనే వెలుగును ప్రసాదిస్తుంది. ‘మ’ లక్ష్మీమాతకు మారు రూపం. ఇది జీవితానికి కావలసిన న్యాయబద్ధమైన వనరులను, సౌభాగ్యాలను అందిస్తుంది. ఈ రెండక్షరాల సమ్మేళనమే రామనామం. సమస్త మానవాళి జన్మసాఫల్యతకు గొప్ప దివ్య దిక్సూచి ఇదే. #దేవుళ్ళ స్టేటస్ #🙏🏻భక్తి సమాచారం😲 #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #జై శ్రీరామ్ #శ్రీరామ జయ రామ సీతారామ
133 likes
60 shares

More like this