DUDEKULA DASTAGIRI
1K views • 3 days ago
*"మీ భూమి – మీ హక్కు" కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల*
*గిద్దలూరు నియోజకవర్గం బేస్తవారిపేట మండలం పూసలపాడు పంచాయతీ ఒందుంట్ల గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన "మీ భూమి – మీ హక్కు" కార్యక్రమంలో ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన 346 పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ఘనంగా నిర్వహించడం జరిగింది.*
*ఈ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ విజయ సునీత గారు, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు గారు పాల్గొని రైతు లబ్ధిదారులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు.*
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతుల భూ హక్కులను మరింత పటిష్ఠంగా పరిరక్షించాలనే లక్ష్యంతో ప్రభుత్వం "మీ భూమి – మీ హక్కు" కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు.ప్రభుత్వ రాజముద్రతో అందజేస్తున్న పట్టాదారు పాసుపుస్తకాలు రైతులకు తమ భూమిపై పూర్తి హక్కుకు అధికారిక గుర్తింపుగా నిలుస్తాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా రైతులు , ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు అని నేడు కూటమి ప్రభుత్వం లో ఆ యాక్ట్ రద్దు చేసి అత్యంత పారదర్శికంతో అన్ని రక్షణ ప్రమాణాలతో రాజ ముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది అని తెలిపారు*
*ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.* #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు
8 likes
8 shares