Mohan
990 views 17 days ago
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #BRS party 🌾 రాష్ట్ర సర్కార్‌ తరఫున గింజ కూడా కొనం ⛔❌ కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయం 🆘📣 కేంద్రం టార్గెట్‌ పెట్టినంతనే సేకరిస్తం📢 రైతుల నెత్తిన రేవంత్‌ సర్కార్‌ మరో పిడుగు⚠️ ధాన్యం, మక్కలు, జొన్నలు సహా ఏ పంటనూ ఇకపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనబోమని ప్రకటన🛑 కాంగ్రెస్ సర్కార్‌ చేతులెత్తేయడంతో రైతుకు దిక్కెవరు?🧑‍🌾 పంటలు పండించి రోడ్డున పడనున్న అన్నదాతలు పంటల కొనుగోళ్లపై కాంగ్రెస్‌ సర్కార్‌ కాడెత్తేసింది. తమది రైతు సంక్షేమ ప్రభుత్వం.. రైతులు పండించిన చివరి గింజ వరకు కొంటామంటూ ప్రగల్భాలు పలికి, ఇప్పుడు అన్నదాతల నెత్తిన ఊహించని రీతిలో పిడుగువేసింది. ధాన్యం, మక్కజొన్న, జొన్న, కందులు, పెసర్లు.. ఇలా పంట ఏదైనా సరే ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంటలు కొనుగోలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఎంత కొనాలని చెబితే అంతే కొంటామని, అంతకుమించి గింజ కూడా ఎక్కువ కొనేది లేదని స్పష్టంచేసింది. ఆ నిర్ణయాలను రాష్ట్ర సివిల్‌ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ధాన్యం, మక్కలు, జొన్నలు, కందులు, పెసర్లు ఇలా పంటల కొనుగోళ్ల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపైకి నెట్టేసింది. పంటల కొనుగోళ్లలో తమకేమీ బాధ్యత లేదన్నట్టు కాంగ్రెస్‌ సర్కార్‌ చేతులెత్తేసింది.
7 likes
12 shares

More like this