#P P P #ఏపీ అప్ డేట్స్..📖
RTCని అమ్మకానికి పెట్టారు
-పేర్ని నాని
2004లో YS ముఖ్యమంత్రి అయ్యుండకపోతే
అప్పుడే చంద్రబాబు ఆర్టీసీని అమ్మేసేవారు.
2014 నుంచి 2019 వరకూ
జయము జయము చంద్రన్న అని
ఆర్టీసీని వాడుకున్నారు.
ఆర్టీసీ టిడిపి సొత్తులాగా..
ఖర్జూర నాయుడు సంపాదించిన
సొత్తులాగా అప్పనంగా వాడేశారు
నయా పైసా ఆర్టీసీకి చంద్రబాబు జమ చేయలేదు.
2018లో ఆర్టీసీని ప్రభుత్వంలో
విలీనం చేయాలని కోరితే చంద్రబాబు కుదరదన్నారు.
2019లో జగన్ సీఎం అయిన తర్వాత
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు.
54 వేల మందిని ఆర్టీసీ కార్మికులను
ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించారు.
చంద్రబాబు దిగిపోయే నాటికి
ఆర్టీసీ ఆపరేషనల్ అప్పులు 6300 కోట్లు,
ఎక్యుమలేటెడ్ అప్పు 3350 కోట్లు.
2020 జనవరిలో
ఆర్టీసీని జగన్ ప్రభుత్వంలో విలీనం చేసింది.
ఆర్టీసీ ఉద్యోగులకు
జగన్ ఏడాదికి రూ.3600 కోట్లు జీతాలుగా చెల్లించారు
వైఎస్ జగన్ దిగిపోయేనాటికి
ఆర్టీసీ అప్పుల భారం 2,500 కోట్లకు తగ్గింది.
వైఎస్ జగన్ చొరవతో
9 వేల కోట్ల నుంచి 2500 కోట్లకు అప్పులు తగ్గాయి
ప్రజారవాణాలో
ఎలక్ట్రికల్ బస్సులు కొంటే
కేంద్రం 40 లక్షలు సబ్సిడీ ఇస్తుంది.
2014-19 లో
చంద్రబాబు ఒక్క ఎలక్ట్రికల్ బస్సైనా కొన్నాడా?.
2019-24 లో వైఎస్ జగన్ ప్రభుత్వం
100 ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేసింది.
తిరుపతిలో ఆ బస్సులను అందుబాటులోకి తెచ్చింది.
తిరుపతిలో ఎలక్ట్రికల్ బస్సులు నడిపేది ఆర్టీసీ డ్రైవర్లే.
ఆర్టీసీ డ్రైవర్లకు వైఎస్ జగన్ ట్రైనింగ్ ఇప్పించారు.
వైఎస్ జగన్ అప్పులు తీర్చి..
ఉద్యోగులకు జీతాలు చెల్లించినప్పుడు మీరెందుకు చేయలేరు?.
ఆర్టీసీని దోచుకుతినడానికి
రాష్ట్ర ప్రజలకు వేసిన ఎర
మహిళలకు ఉచిత బస్సు స్కీమ్.
మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వడం వల్లే
ఆర్టీసీ కుదేలైపోయిందని చంద్రబాబు చెప్పించాడు.
స్త్రీ శక్తి హామీ ఎవరిది?.
ఆర్టీసీకి ఎందుకు ఇంత కష్టం వచ్చింది.
ఉచిత మహిళ పథకం ఇస్తున్నప్పుడు
ఆర్టీసీకి ప్రభుత్వం ఎందుకు డబ్బులు కట్టడం లేదు?
ఆర్టీసీలో ఉన్న
10 వేల బస్సులను ప్రైవేట్ పరం చేసేస్తామంటున్నారు.
మీ మనుషులు , మీ బ్రోకర్లకు
ఆర్టీసీని కట్టబెట్టడమేనా మీ సంపద సృష్టి.
ఆర్టీసీని సర్వనాశనం చేసి..
మహిళలపై నెపం వేస్తున్నారు.
రాష్ట్రంలోని మహిళలకు పంగనామాలు పెట్టారు.
వైఎస్ జగన్ మహిళలకు రూ.24 వేల కోట్లు ఇచ్చారు.
సచివాలయ ఉద్యోగాల్లో సగం మహిళలకు ఇచ్చారు.
కోటి 70 లక్షల చొప్పున
వైఎస్ జగన్ 100 బస్సులు కొన్నాడు కదా.
ఒక్క ప్రైవేట్ వ్యక్తిని కూడా రాకుండా
ఆర్టీసీ డ్రైవర్లతోనే నడిపిస్తున్నారు కదా..
ఈరోజుకీ ఆహా ఓహో అంటూ
ఆ బస్సులపై వస్తున్న డబ్బులను
మీరు తీసుకుంటున్నారు కదా.
ఎలక్ట్రికల్ బస్సు
కిలోమీటర్కు 7 రూపాయలే భారం అని చెప్పడం పచ్చిమోసం.
ఎలక్ట్రికల్ బస్సుల కాంట్రాక్ట్
పినాకిల్ అనే కంపెనీకి ఇచ్చారు.
పినాకిల్ సంస్థ ఎలక్ట్రికల్ బస్సులు నడిపితే
కిలోమీటర్కు 71 రూపాయలు బిల్ వేస్తారట.
71 రూపాయల బిల్లులో 21 మోదీ ఇస్తే
మిగిలిన 50 రూపాయలు మీ బాబు ఇస్తాడా
కరెంట్ బస్సుకు
కిలోమీటర్ కు 7 రూపాయలని
చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పిస్తున్నాడు.
పీఎంఈబస్ స్కీమ్ కింద
రాబోయే రోజుల్లో బస్సులు వస్తే
పేదలు, సామాన్యులు బస్సులు ఎక్కగలరా?.
ఆర్టీసీలో ఉన్న 10 వేల బస్సులు
పీఎంఈబస్ స్కీమ్ కింద ఎలక్ట్రికల్ బస్సులు
మార్చేస్తామనడం కరెక్ట్ కాదు.
పీఎంఈబస్ స్కీమ్ ప్రకారం
3 లక్షల పైబడి 40 లక్షల లోపు జనాభా
ఉన్న నగరాల్లో మాత్రమే కరెంట్ బస్సులు తిప్పాలి.
రాబోయే 750 కరెంట్ బస్సులన్నీ
రాజధానిలోని 29 గ్రామాల్లో తిప్పుతారా?


