Mahbubnagar Police
587 views 10 days ago
పదవీ విరమణ పొందిన నలుగురు పోలీసు అధికారులను ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ జిల్లా పోలీసు శాఖలో సుదీర్ఘకాలం పాటు విశిష్ట సేవలు అందించి పదవీ విరమణ పొందిన నలుగురు పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన అధికారులకు శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి వారి సేవలను కొనియాడారు. పదవి విరమణ పొందిన అధికారులు భూపాల్ రెడ్డి, ఎస్‌ఐ-2, మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ – 37 సంవత్సరాల సేవ, సుదర్శన్ రెడ్డి, ఎస్‌ఐ (వి.ఆర్.) – 37 సంవత్సరాల సేవ, శ్రీనివాసులు, ఏఎస్‌ఐ, మహబూబ్‌నగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ – 35 సంవత్సరాల సేవ, ప్రభాకర్, పీసీ-563, మహబూబ్‌నగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్, 35 సంవత్సరాల సేవ చేయడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగం ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణకు అంకితమైన గొప్ప సేవ అని అన్నారు. పదవీ విరమణ అనేది ఉద్యోగ జీవితానికి ముగింపు మాత్రమేనని, సమాజానికి సేవ చేసే అవకాశాలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. తమ విధి నిర్వహణలో నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసిన ఈ అధికారులు యువ పోలీసు సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తారని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం వారు ఆరోగ్యంగా, ఆనందంగా కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో AR అదనపు ఎస్పీ సురేష్ కుమార్, DSP రమణా రెడ్డి, AO రుక్మిణి భాయ్, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య, RI అడ్మిన్ కృష్ణయ్య, RI HGs అశోక్ కుమార్, ఆఫీస్ సూపరింటెండెంట్ లు మధు, అశోక్ శెట్టి, బాల్ రాజ్, అధికారులు, సిబ్బంది, పదవీ విరమణ పొందిన అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. #MahabubnagarPolice #📰 వార్తలు
7 likes
12 shares

More like this