P.Venkateswara Rao
656 views • 15 days ago
#పొలిటికల్ ట్రోల్స్ 🤣
#చంద్రబాబు
*చంద్రబాబును శాటిస్ఫై చేయడం ఈజీ కాదు గురూ❗*
24.07.2026🎯
మీరు వంద రకాలుగా కష్టపడండి.. వంద రకాలు పనులు చేయండి.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం నూటొకటో కష్టం గురించి అడుగుతారు.. అది చేయలేదు ఏం? అంటూ పెదవివిరుస్తారు.. అనేదే ప్రస్తుతం ఏపీలోని తెలుగు తమ్ముళ్ల ఆవేదనగా కనిపిస్తోంది.
సాధారణంగా రాజకీయ నాయకులు తమ మైలేజీ కోసం ఆశ్రయించే పద్ధతుల్లో ఆత్మస్తుతి- పరనింద రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి ఆత్మస్తుతి- అంటే బీభత్సంగా సొంత డబ్బా కొట్టుకోవడం. రెండు పరనింద- అంటే నిత్యం ప్రత్యర్థులను తిట్టిపోస్తూ ఉండడం.
ఎక్కువ మంది నాయకులు సొంత డబ్బాకే పరిమితం అవుతుంటారు. కానీ.. రాజకీయాల్లో నెగ్గాలంటే.. సొంతడబ్బా కొట్టుకుంటూనే అంతకంటే ఎక్కువగా ప్రత్యర్థిని తిట్టిపోయడం ముఖ్యం అనే సూత్రాన్ని నమ్మే వ్యక్తి చంద్రబాబునాయుడు.
అందుకే ఆయన రోజులో కనీసం పదిసార్లయిన జగన్మోహన్ రెడ్డి పారాయణం చేస్తుంటారు. గొడ్డలిపార్టీ నామజపం చేస్తుంటారు. ఆ రేంజిలో- ప్రజలకు చీదర పుట్టించేలాగా.. పాడిందే పాడుతూ పాచి విమర్శలు చేయడం అందరు మంత్రులకూ చేతకావడం లేదు. బాబు గారి బాటలో మంత్రులందరూ కూడా జగన్ ను, వైసీపీని తిట్టడంలో తమ వంతగా చెలరేగుతూనే ఉన్నారు గానీ.. ఒకే నింద కొన్ని వందలసార్లు రిపీట్ చేయడానికి చాలా మందికి సిగ్గుగా ఉంది. అందుకే చంద్రబాబు గారికి ఇప్పుడు కోపం కూడా వస్తోంది.
కేబినెట్ మీటింగులో లాంఛనప్రాయమైన ఎజెండా అంశాల తర్వాత.. చంద్రబాబునాయుడు తన ఫోకస్ మొత్తం మంత్రుల్ని మందలించడానికి, ప్రేరణ పేరుతో వారిని వైసీపీ, జగన్ మీదకు ఉసిగొల్పడానికి కేటాయించారు.
‘‘వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద అబద్ధపు ఆరోపణలు చేస్తోంది. ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తోంది. మీరు ఏదో ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి ఆ వ్యాఖ్యలను ఖండించి వదిలేస్తున్నారు. అలా ఊరుకుంటే సరిపోదు. వారు మళ్లీ మళ్లీ నిందలు వేస్తూ ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నప్పుడు.. మీరు మళ్లీ మళ్లీ వారిని తిడుతూ ఉండాల్సిందే అని చంద్రబాబునాయుడు మంత్రులకు హితోపదేశం చేస్తున్నారు.
నిజం చెప్పాలంటే.. మంత్రులు ఎక్కడ ఏం మాట్లాడాలో పార్టీనే నిర్ణయిస్తుంటుంది.. స్క్రిప్టులు కూడా పంపిస్తుంటుంది.. అనే వాదన కూడా పార్టీ వర్గాల్లో ఉంది. వీటిని మించి తమ తమ రోజు వారీ కార్యక్రమాల్లో భాగంగా.. మీడియా ఎదుట మాట్లాడే అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ మంత్రులు చెలరేగిపోతూనే ఉన్నారు. వైఎస్ జగన్ ను కార్నర్ చేసి.. ఆ పార్టీమీద విరుచుకుపడుతూనే ఉన్నారు. కానీ.. ఆ డోసేజీ చంద్రబాబుకు చాలడం లేదు.
చూడబోతే.. మంత్రులందరూ తమ అధికారిక కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి.. రోజుకు పద్దెనిమిది గంటల పాటు ప్రెస్ మీట్లు పెడుతూ జగన్ ను తిడుతూ గడపాలేమో అని.. అలా చేస్తే తప్ప.. చంద్రబాబు సంతృప్తి చెందరిన పార్టీ వర్గాలే అనుకుంటున్నాయి. ఏ విషయంలో అయినా చంద్రబాబునాయుడును శాటిస్ ఫై చేయవచ్చునేమో గానీ.. జగన్ ను తిట్టే విషయంలో ఎంతగా కష్టపడినా సరే.. ఆయనను శాటిస్ ఫై చేయలేం అని ఆ పార్టీ వారే నవ్వుకుంటున్నారు.
8 likes
10 shares