AVUKU VENKATESH
567 views • 2 months ago
*🔥 పెరిగిన ఇంధన ధరలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం 🔥*
ప్రజలపై కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య పాలనతో రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల భారంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు, కార్మికులు, ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులు మరియు మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా నలిగిపోతున్న ఈ పరిస్థితిని నిరసిస్తూ...
*రేపు అనగా 18-05-2026 సోమవారం ఉదయం 9:30 గంటలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారి మరియు రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి గార్ల* ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయానికి భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం ఎమ్మార్వో గారికి వినతి పత్రం అందజేయడం జరుగును.
ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ కో-ఆప్షన్ మెంబర్లు, మాజీ కౌన్సిలర్లు, మూడు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, రాష్ట్ర, జిల్లా మరియు నియోజకవర్గ స్థాయి వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, మండల అధ్యక్షులు,సర్పంచులు, వార్డ్ మెంబర్లు, మాజీ జేసీయస్ కన్వీనర్లు, గ్రామ కమిటీ సభ్యులు, యువ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి.
📢 ఇంధన ధరల పెంపు ప్రజలపై మోపిన భారాన్ని తగ్గించాలి!
📢 సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలి!
📢 ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రజల పక్షాన పోరాడుతుంది!
✊ జై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ✊
#FuelPriceHike
#YSRCP
#Yemmiganur
#YerrakotaRajeevReddy
# YerrakotaJaganMohanReddy
#SaveCommonPeople
#PetrolDieselPriceHike
#YSRCPForPeople #👍👍👍
8 likes
18 shares