Mahbubnagar Police
497 views • 15 hours ago
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి – బాలానగర్ గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించిన బాలానగర్ SI నరేందర్ రెడ్డి
జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ప్రతి బుధవారం నిర్వహిస్తున్న సైబర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా, బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలానగర్ గ్రామంలో గ్రామస్థులకు సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బాలానగర్ ఎస్ఐ నరేందర్ రెడ్డి మరియు పోలీసు సిబ్బంది పాల్గొని, ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న వివిధ మోసపూరిత పద్ధతుల గురించి ప్రజలకు వివరించారు. ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని ఆశ చూపే ఇన్వెస్ట్మెంట్ మోసాలు, లోన్ యాప్ల ద్వారా జరిగే మోసాలు, ఫేక్ లింకులు, ఓటీపీలు, కేవైసీ అప్డేట్ పేరుతో జరిగే మోసాలు, సోషల్ మీడియా మరియు వాట్సాప్ ద్వారా వచ్చే నకిలీ సందేశాలు, డిజిటల్ అరెస్ట్ వంటి కొత్త తరహా సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అలాగే సైబర్ మోసానికి గురైన వెంటనే గోల్డెన్ అవర్ ఎంతో కీలకమని, మొదటి గంటలోనే 1930 హెల్ప్లైన్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో పాటు www.cybercrime.gov.in పోర్టల్లో ఆన్లైన్ ద్వారా వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఇలా వెంటనే స్పందించడం ద్వారా మోసపోయిన నగదు తిరిగి పొందే అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు.
ప్రజలు ఎలాంటి అనుమానాస్పద ఫోన్ కాల్స్, సందేశాలు, లింకులు లేదా పెట్టుబడి ఆఫర్లను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని, సైబర్ భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పోలీసులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
#MahabubnagarPolice #📰 వార్తలు
18 likes
8 shares