🎡 M.𝚂 𝙰 𝚂 𝙸 2277🎡
522 views • 2 days ago
మనం మన జీవితం లో ఇంకో కలాంను చూడలేము అన్నారు పి ఎం నాయర్ గారు. నాయర్ గారు కలాం గారికి సెక్రటరీగా చేశారు.
కలాం గారి సెక్రెటరీగా పనిచేసిన పి ఎం నాయర్ గారిని ఒకసారి దూరదర్శన్ పోదిగై వారు చేసిన ఇంటర్వ్యూ లో ఆయన చెప్పిన కొన్ని విషయాలు :
1 . డాక్టర్ కలాం గారు భారత రాష్ట్రపతిగా వివిధ దేశాలు పర్యటించినపుడు ఆయనకు ఆయా దేశాల వారు ఇచ్చిన బహుమతులను తిరస్కరిస్తే అది వారి దేశాన్ని అవమానించినట్టుగా వారు బాధపడతారు అని అది మన దేశాన్ని ఇరకాటంలో పెడుతుందని వాటిని తీసుకునేవారు. ఇండియా తిరిగి రాగానే వాటికి ఫోటో తీయించి వాటికి ఫోటోఫ్రేమ్ తయారు చేయించి అన్నీ ఆర్కైవ్స్ లో భధ్రపరిచేవారు. ఆయన రాష్ట్రపతి భవన్ విడిచి వెళ్ళేటపుడు ఒక్క పెన్సిల్ కూడా వాటిలో నుండి కలాం గారు తీసుకు వెళ్ళలేదు
2. 2002 లో రంజాన్ జూలై ఆగస్ట్ నెలలో కాబోసు వచ్చింది. రంజాన్ కి రాష్ట్రపతి ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆచారం మన దేశంలో. ఒక రోజు కలాంగారు నన్నుపిలిచి నాయర్ ఇఫ్తార్ విందుకు ఎంత ఖర్చు అవుతుంది అని అడిగారు. దాదాపు 22 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పాను. “ బాగా స్తోమత ఉన్నవారికి విందు ఇవ్వడం కోసం అంత ఖర్చు పెట్టడం అనవసరం. ఆ సొమ్మును పేదవారికి బ్లాంకెట్లు, బట్టలు, ఆహారం ఇవ్వడం కోసం కేటాయించండి అని అనాదాశ్రమాలకు ఇవ్వమని చెప్పారు. అనాదాశ్రమాల పేర్లు ఎంపిక చేసే పని కొందరికి అప్పచెప్పారు. అందులో ఆయన ఎటువంటి జోక్యమూ చేసుకోలేదు. ఎంపిక అయ్యాక నన్నుతన రూమ్ లోకి పిలిచి “ ఈ లక్ష రూపాయలూ నా వ్యక్తిగత సంపాదన, నేను ఇచ్చే ఈ సొమ్ము విషయం ఎవరికీ చెప్పకండి “ అన్నారు. నేను ఈ విషయం అందరికీ చెబుతాను అంటే ఆయన వద్దు అన్నారు. తను ఖర్చు పెట్టదగిన సొమ్ము తన సొమ్మూ కూడా ఇలా ఖర్చు పెట్టిన వ్యక్తి ఇంకొకరు లేరు. ఇఫ్తార్ పార్టీ ఇవ్వని నిఖార్సయిన ముస్లిం రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు !
3. ఆయనకీ తన మాటలకు అందరూ “ ఎస్ సర్ “ అనాలి అనే నైజం లేదు. ఒకరోజు సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారితో చర్చల సందర్భంగా ఏమంటావు నాయర్ అని నన్ను అడిగారు.
“ నో సర్ ! “ అన్నాను . ఆయన మౌనంగా ఉండిపోయారు. మీటింగ్ అయ్యాక ప్రధాన న్యాయ మూర్తి గారు నన్ను పిలిచి అలా అన్నారేమిటండి అన్నారు. ఆయన తరువాత నన్ను నా అభిప్రాయం చెప్పమని అడుగుతారు సార్ ! విని అవసరం అయితే తన అభిప్రాయం మార్చుకుంటారు సార్ “ అన్నాను. ఆయన ఆశ్చర్య పోయారు.
4. కలాం గారు ఒక సారి తన బంధువులను సుమారు 50 మందిని రాష్ట్రపతి భవన్ కు అతిధులుగా పిలిచారు. వారికి ఢిల్లీ చూపడానికి ఒక బస్సును ఆయన బుక్ చేయించారు. దానికి అయిన ఖర్చును ఆయన చెల్లించారు. ఒక్క అధికారిక వాహనం కూడా ఆయన వారికి కేటాయించలేదు. వారికోసం అయిన ఖర్చును లెక్క కట్టించారు. అది సుమారు రెండు లక్షలు అయ్యింది. ఆ రెండు లక్షలూ ఆయన చెల్లించారు. ఈ దేశ చరిత్రలో ఇటువంటి సంఘటన ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. ఆయన అన్నయ్యను ఒక వారం రోజులు తనతో పాటే అట్టే పెట్టుకున్నారు. ఆ రోజులకి ఆయన అద్దె చేల్లిస్తాను అంటే మాత్రం ఎవరూ ఒప్పుకోలేదు. ఒక రాష్ట్రపతి తన అన్నయ్యను తనతో పాటు అట్టేపెట్టుకున్నందుకు తన నివాసానికి తానే అద్దె చెల్లించాలి అనే నిజాయతీ ని మేము భరించలేము అని మేము ఒప్పుకోలేదు.
5. ఆయన రాష్ట్రపతి భవన్ వదిలి వెళ్లేముందు అందరమూ ఒక్కొక్కరుగా కుటుంబాలతో వెళ్లి కలిశాము. అందరినీ పేరు పేరునా పలకరించారు. నా భార్య కాలు విరిగినందువలన నాతో రాలేకపోయింది. ఆయన అడిగారు నా భార్య ఎందుకు రాలేదు అని చెప్పాను.
మర్నాడు మాఇంటి ముందు పోలీస్ లు. ఏమిటి హడావుడి అని అడిగితే రాష్ట్రపతి గారు మాఇంటికి వస్తున్నారు అని చెప్పారు.
ఇంత వరకూ ప్రపంచం లో ఏ దేశాధినేత తన వద్ద పనిచేసే ఒక ఉద్యోగి భార్య కాలు విరిగింది అని అతడి ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించడం చరిత్రలో ఎక్కడా జరగలేదు.
చివరిగా ఒక టివి వారు చెప్పిన ఆయన ఆస్తి వివరాలు :
1) 3 పేంట్లు
2) 6 షర్టులు
3) 3 సూట్లు
4) 1 వాచ్
5) 2500 పుస్తకాలు
6) Bangalore Flat handed over to scientists community long time ago
7) ఇంచుమించు సున్నా బ్యాంకు బ్యాలన్స్
8) 120 మంది కోట్ల భారతీయుల ప్రేమాభిమానాలు .
అబ్దుల్ కలాం.. ఈ మహోన్నత వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయినా మనం చెప్పుకోవాలి. ఆయన మానవత్వాన్ని, తోటివారి పట్ల ఆయన చూపించే కరుణ నిజంగా ఈ రోజుల్లో కూడా ఇలాంటి మనుషులు ఉన్నారా? అనిపిస్తుంది.
కలాం గురించి ఇప్పుడు మరో ఆసక్తి కరమైన విషయం :
సోమవారం ఆయన ఈ లోకాన్ని విడిచి నింగికేగసిన రోజు కూడా తన వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి చాటాడు. సోమవారం IIM ఐఐయం, షిల్లాంగ్ లో ప్రసంగించటానికి ఆ రోజు ఢిల్లీలో మ.12 గంటలకు బయలుదేరారు. రెండున్నర గంటల విమాన ప్రయాణం, తర్వాత మరో రెండున్నర గంటల కారు ప్రయాణం. అంటే దాదాపు ఐదు గంటలు ఎక్కడ కాలు కదపకుండా అంత వయస్సులో కూర్చోవాలి. ఇంత వయస్సులో ఆ వ్యక్తికి ఇంత కష్టం అవసరమా? కానీ ఆయన వెళతారు. వయస్సుని కూడా లెక్క చేయకుండా విద్యార్ధులతో మాట్లాడెందుకు ఎక్కడికైనా..
సరే ఆసలు విషయానికి వద్దాం.. ఫ్లైట్ దిగిన తరువాత ఐఐయం వెళ్ళేందుకు కారులో బయలుదేరిన కలాంజీకి మాజీ రాష్ట్రపతి హోదాలో ప్రోటోకాల్ ప్రకారం కాన్వాయ్ ఉంటుంది. ఇందులో సుమారు ఆరు కార్ల వరకు ఉంటాయి. కాన్వాయ్ లో రెండు కారులో కలాం ప్రయాణిస్తున్నారు. ఆయన వెనుక మరి కొన్ని పోలిస్ వాహానాలు ఫాలో అవుతున్నాయి.అయితే వెనుక వస్తున్న పోలీస్ జీప్ లో ముగ్గురు పోలీసులు ఉండగా - అందులో ఒక వ్యక్తి గన్ పట్టుకుని నిలబడి ఉన్నారు. ఇది చూసిన కలాం తన పక్కనున్న వ్యక్తితో సెక్యూరిటీతో మాట్లాడమన్నాడు.. ఎందుకో తెలుసా? ఆతన్ని కూర్చోమని చెప్పడానికి. " అలా ఎంతసేపు నిలబడి ప్రయాణిస్తాడు ఆతన్ని కూర్చోమని చెప్పండి.." అంటూ కలాం తన జాలి గుండెను చాటుకున్నారు. అయితే ఆయన చెప్పినా సెక్యూరిటీపరంగా వాళ్ళకుండే ఆంక్షల మేరకు ఆతను కూర్చోలేదు. దాదాపు మూడుసార్లు కలాం ఆతనికి చెప్పినా - ఆతను వినలేదు.
మొత్తానికి గమ్యం చేరిన వెంటనే పక్కనున్నవారితో ఆ పోలీస్ ని తనవద్దకి రమ్మని చెప్పి పిలిపించుకున్నాడు. అప్పటిదాకా నిలబడి ఉన్న ఆ పోలీస్ కలాం గారి దగ్గరకు వచ్చాడు. ఆతడు రాగానే - అబ్దుల్ కలాం ఆతనికి షేక్ హ్యండ్ ఇచ్చి " థ్యాంక్స్.." చెప్పారు.
" ఆలసిపోయావా? ఏమైనా తింటావా?? నాకోసం చాలాసేపటినుండి నిలబడ్డావ్.." అన్నారు అబ్దుల్ కలాం గారు.
" సార్..! మీ కోసం మరో ఆరుగంటలైనా నిలబడి ఉంటాను సార్.." అంటూ బదులిచ్చాడు ఆ పోలీస్. తరువాత కాన్ఫరెన్స్ హాల్ కి వెళ్ళటం ప్రసంగం మొదలుపెట్టిన కొద్దిసేపటికే ఆయన కుప్పకూలిపోవడం, వెంటనే హస్పిటల్ కి తీసుకెళ్ళటం జరిగిపోయింది. అయినా భారత రత్నం, జాతి గర్వించదగ్గ బిడ్డ - మనల్ని ఒంటరివాళ్ళని చేసి, ఈ లోకాన్ని వదిలి పోయారు.
చివరి నిమిషం వరకు కూడా మనుషుల పట్ల తను చూపిన ప్రేమ చిరస్థాయిగా నిలిచిపోతుంది. భరత జాతి ముద్దు బిడ్డ కలాం అందుకో మా సలాం.. ( ప్రక్కన మీరు చూస్తున్న ఫోటో ఆ పోలీస్ కి సారీ చెపుతూ షేక్ హ్యండ్ ఇస్తున్న కలాం )
ఇలాంటి గొప్ప వ్యక్తి మనదేశంలో పుట్టడం మనకెంతో గర్వకారణం 🇮🇳🇮🇳🇮🇳
చివరిగా ఒకమాట భారత దేశం ఎప్పుడుకుడా కులాన్ని మతాన్ని చూడలేదు. ఒక్క దేశభక్తి తప్ప అలా కాకుండా కులాన్ని మతాన్ని చూసివుంటే బీమ్ రాం జి అంబేద్కర్ గారు అబ్దుల్ కలాం లాంటివాళ్ళు ను ఈరోజు ఇలా గౌరవించుకునే వాళ్ళమా భారత్ దేశం దేశభక్తులను ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటుంది. జయహో భారత్ భారత్ మాతాకి జై జై హింద్
#apj అబ్దుల్ కలామ్ వర్ధoతి 🙏🙏 #apj అబ్దుల్ కలామ్ #APJ అబ్దుల్ కలామ్ ఆజాద్ జయంతి🇮🇳🇮🇳🇮🇳 #APJ అబ్దుల్ కలామ్ వర్ధంతి జులై27 #dr.ఏ పి జె అబ్దుల్ కలామ్ గారి జయంతి💐 అటల్ బీహార్ వాజపేయి ❤️💐🌹
14 likes
12 shares