Mahbubnagar Police
547 views 20 days ago
మోడిఫైడ్ సైలెన్సర్లు, మైనర్ల డ్రైవింగ్, నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై ప్రత్యేక తనిఖీలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు – మహబూబ్ నగర్ DSP వెంకటేశ్వర్లు హెచ్చరిక జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ పట్టణం నందు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ రెడ్డి మరియు సిబ్బంది మంగళవారం మాడిఫైడ్ సైలెన్సర్లపై ప్రత్యేక తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో మోడిఫైడ్ సైలెన్సర్లను బిగించుకుని అధిక శబ్దంతో వాహనాలు నడుపుతూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటిపై చర్యలు చేపట్టారు. అలాగే మైనర్లు వాహనాలు నడపడం, నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడపడం వంటి నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించి సంబంధిత వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. వీరందరినీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి DSP వెంకటేశ్వర్లు గారు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా DSP వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, మోడిఫైడ్ సైలెన్సర్ల వల్ల శబ్ద కాలుష్యం పెరిగి ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని, ఇటువంటి వాహనాలను నడిపేవారిపై మోటారు వాహనాల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు సూచించారు. వాహనాలకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించి రోడ్డు భద్రతకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ రెడ్డి మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. #MahabubnagarPolice #📰 వార్తలు
7 likes
14 shares

More like this