👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
611 views 19 hours ago
#తెలుసుకుందాం "నేనెవరు?" జీవితంలో అత్యంత గొప్ప ప్రశ్న నేను అంటే శరీరము నామము రూపము మనసు బుద్ధి జ్ఞానము వ్యక్తిత్వము ఎమోషన్స్ ఫీలింగ్స్ భావాలు ఆలోచనలు ఇవి మీరు నేను నేను కాదు ఏది కాదు మరి నిజమైన నేను ఎవరు? మరి నిజమైన మీరు ఎవరు? నేను ఎవరు అనే ప్రశ్న ఉదయించడం గొప్ప విషయం నేను ఎవరు దానిని తెలుసుకునే ప్రయత్నం చేయడం ఇంకా గొప్ప విషయం నేను ఎవరు అనేదాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం చాలా చాలా గొప్ప విషయం "నేనెవరు?" అనే ప్రశ్న చాలా చిన్నదిగా కనిపిస్తుంది. కానీ ఈ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం తెలుసుకోవడానికి కొందరికి ఒక జన్మ కూడా సరిపోకపోవచ్చు. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, మహర్షుల బోధనలు అన్నీ చివరికి ఈ ఒక్క ప్రశ్నకే సమాధానం చెప్పడానికి ఉద్దేశించబడ్డాయి. మొదటి ప్రశ్న: సాధారణంగా ప్రతి మనిషి ఇలా అంటాడు: నాకు పేరుంది. నాకు రూపం ఉంది. నాకు శరీరం ఉంది. నాకు ఆలోచనలు ఉన్నాయి. నాకు భావాలు ఉన్నాయి. నాకు సుఖదుఃఖాలు ఉన్నాయి. అందుకే "ఇవన్నీ కలిసినదే నేను" అని భావిస్తాడు. కానీ విచారణ మొదలైనప్పుడు ప్రశ్న వస్తుంది: ఈ శరీరమే నేనా? లేక శరీరాన్ని తెలుసుకుంటున్న వాడా నేను? కలలో జీవితం నిజమైన జీవితమ కల అదినేనా? ప్రశ్న వచ్చినప్పుడు కల కనడం నేనా కల మీరు కాదు మేలుకున్న తర్వాత ఇది కల అని గుర్తించడమే జ్ఞానం కలల ప్రపంచం అనేది నిద్రించిన తర్వాత కలల ప్రపంచం మొదలవుతుంది ఈ కలల ప్రపంచం మేల్కొన్న తర్వాత మేలుకోవడమే జ్ఞానం అలాగే భౌతిక దేహం శరీరం చిన్నప్పటి నుండి ముసలితనం వరకు మారుతుంది. కానీ "నేను" అనే అనుభూతి మాత్రం అలాగే ఉంటుంది. మారేది శరీరం, మారనిది "నేను". శరీరానికి ఆకలి దప్పికలు ఉంటాయి ఆత్మకు ఏది ఉండదు జనన మరణాలు శరీరానికి మాత్రమే ఆత్మకు కాదు బాల్యము యవ్వనము వృద్ధాప్యము శరీరానికి మాత్రమే ఆత్మకు కాదు ఇన్ని రోజులు ఎంతో కాలం నుండి ఎన్నో జన్మల నుండి ఈ శరీరం నేనే అనుకోవడం వల్లనే మనకు ఈ కష్టాలు బాధలు జన్మలు ఎప్పుడైతే నేను ఈ శరీరం కాదు ఆత్మను అని తెలిసి వస్తుందో ఇక అప్పటి నుండి కష్టాలు బాధలు చావు పుట్టుకలు ఏది ఉండదు మనం శరీరాన్ని మనం అనుకుంటాం అదే నేను అనుకుంటాం నిజానికి ఈ నేను, ఆ నేను, వేరు వేరు కుండ మట్టి ఉదాహరణ ఒకవేళ కుండా మాట్లాడితే ఒక కుండను. "నీవెవరు?"అని అడిగితే అది "నేను కుండను" అంటుంది. కానీ జ్ఞాని ఇలా చెబుతాడు: "నీవు కుండవు కాదు. నీవు మట్టి."అని ఎందుకంటే: మట్టితో తయారైంది. కుమ్మరి రూపం ఇచ్చాడు. అగ్నిలో కాల్చాడు. పేరు పెట్టాడు. చివరకు మళ్లీ మట్టిలో కలిసిపోతుంది. అందువల్ల కుండ అనేది తాత్కాలిక నామరూపం మాత్రమే. అసలు సత్యం మట్టి. శరీరం కూడా అలాగే మన శరీరం కూడా: ఆహారం వల్ల పెరిగింది. పంచభూతాలతో నిర్మించబడింది. కాలం వచ్చినప్పుడు పంచభూతాలలో కలిసిపోతుంది. అందువల్ల శరీరం కూడా శాశ్వతం కాదు. రెండవ ప్రశ్న: నేను మనస్సునా? మనస్సులో ప్రతి క్షణం ఆలోచనలు మారుతాయి. కొన్ని సార్లు సంతోషం. కొన్ని సార్లు బాధ. కొన్ని సార్లు కోపం. కొన్ని సార్లు ప్రేమ. మారుతున్నది మనస్సు. మార్పును గమనిస్తున్నది ఎవరు? అదే నిజమైన "నేను". మూడవ ప్రశ్న: నేను బుద్ధినా? బుద్ధి చిన్నప్పుడు తక్కువగా ఉంటుంది. చదువుతో పెరుగుతుంది. వృద్ధాప్యంలో తగ్గిపోవచ్చు. మారేది బుద్ధి. అయితే బుద్ధి మార్పును తెలుసుకుంటున్నది ఎవరు? ఆ సాక్షి నేనే. నాలుగవ ప్రశ్న: మరి నేనెవరు? శరీరం కాదు. ఇంద్రియాలు కాదు. మనస్సు కాదు. బుద్ధి కాదు. అహంకారం కాదు. ఇవన్నిటినీ తెలుసుకుంటున్న చైతన్యమే నేను. అదే ఆత్మ. అదే సాక్షి. అదే నిత్యమైన చైతన్యం ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? ఆత్మజ్ఞానం అనేది కొత్తగా ఏదైనా సంపాదించడం కాదు. ఎప్పటినుంచో ఉన్న నిజస్వరూపాన్ని తెలుసుకోవడం. తాడును పాముగా భ్రమించినవాడు వెలుతురులో అది తాడు అని తెలుసుకున్నట్లే, శరీరమే నేను అనే భ్రమ తొలగి ఆత్మనే నేను అనే అనుభవం కలగడమే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? శ్రవణం గురువు నుండి శాస్త్రసత్యాన్ని వినడం. మననం సందేహాలను నివృత్తి చేసుకోవడం. నిదిధ్యాసనం ధ్యానంలో ఆ సత్యాన్ని స్థిరపరచుకోవడం. ప్రత్యక్షానుభవం "నేనే ఆత్మ" అనే అఖండ అనుభూతి. ఆత్మజ్ఞానం వచ్చిన తరువాత జననమరణ భయం తగ్గిపోతుంది. శరీరాభిమానం కరిగిపోతుంది. సుఖదుఃఖాలపై సమత్వం ఏర్పడుతుంది. అందరిలోనూ అదే ఆత్మను దర్శిస్తాడు. ద్వేషం, అసూయ, అహంకారం తగ్గిపోతాయి. శాంతి, కరుణ, ప్రేమ సహజంగా వెలుగుతాయి. "నేనెవరు?" అనే ప్రశ్నకు సమాధానం పుస్తకంలో చదివితే పూర్తికాదు. అది విచారణ ద్వారా, గురుకృప ద్వారా, ధ్యానం ద్వారా, స్వానుభవంగా వెలుగుతుంది. శరీరం పంచభూతాలది. మనస్సు ఆలోచనల సమాహారం. బుద్ధి నిర్ణయాల సాధనం. అహంకారం తాత్కాలిక భావన. కానీ వీటన్నింటికీ సాక్షిగా, ఎప్పటికీ మారకుండా ప్రకాశించే శుద్ధ చైతన్యమే నిజమైన "నేను". 1 ప్రజ్ఞానం బ్రహ్మ. అంటే ఏమిటి? చూసే కన్ను కనబడే దృశ్యం మధ్యన ఒకటి ఉంటుంది కన్ను ఉన్న చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు చూడబడే వస్తువు కూడా ఉండాలి కన్ను మంచిగా ఉన్న ఈ చూడబడేది ప్రజ్ఞానం బ్రహ్మ అదే జ్ఞానం 2 తత్వమసి. అంటే ఏమిటి? మరి అది ఎవరు అని ప్రశ్న ఉదయిస్తుంది మళ్ళీ అది నీవే అయి ఉన్నావు అని జవాబు 3 అయమాత్మ బ్రహ్మ. అంటే ఏమిటి? ఏది నేను అయి ఉన్నాను అనే ప్రశ్న ఉదయిస్తుంది ఆ పరబ్రహ్మము నీవే అనే సమాధానం వస్తుంది 4 అహం బ్రహ్మాస్మి. అంటే ఏమిటి? ఆ పరబ్రహ్మము ఎవరు అనే ప్రశ్న ఉదయిస్తుంది ఆ పరబ్రహ్మము ఎవరు కాదు నేనే అహం బ్రహ్మాస్మి బ్రహ్మము నేనే అనే సమాధానం తో ముగుస్తుంది ఈ నాలుగు మహావాక్యాల ప్రత్యక్ష అనుభవమే వేదాంత పరమార్థం, అదే మానవ జన్మ యొక్క పరమ లక్ష్యం. . ఇది తెలుసుకోవాలంటే జీవితం పణంగా పెట్టాలి ఇది తెలుసుకునే వారికి భౌతిక జీవితం ఉండదు కుటుంబము సంసారము రాగాద్వేషాలు సమాజము ప్రపంచము లోకము అన్ని వదిలిపెట్టాలి మనసులో తెలుసుకున్న వారికి జీవితం ఉండదు ఇక అంత జ్ఞానమై ఉంటారు. వీరికి అనుభవించడానికి ఏమీ ఉండదు ఒకవేళ అనుభవించిన వీరికి ఏది అంటుకోదు చూసిన విన్న కర్మ చేసిన ఫలితాలు అంటుకోవు మళ్లీ జన్మ ఉండదు వీరికి.
22 likes
11 shares

More like this