👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
ప్రస్తుత సమాజంలో అరకొర జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా ఉపన్యాసాలు చెప్పేటంతటి గొప్పవాళ్లుగా చలామణి అవుతున్నారు.
ఒక విషయము మంచిది అని ఒక విషయం చెడ్డది అని ఇది పాపము అని ఇది పుణ్యము అని ఇది ధర్మము అని ఇది అధర్మము అని నిర్ణయించే అధికారం ఒక్క భగవంతుడికి మాత్రమే ఉంది.
ఆ భగవంతుడు ఈ మంచి చెడులన్నిటిని నిక్షిప్తం చేసిన గ్రంధాన్ని వేదము(శాస్త్రము)అని అంటారు.
అందుకే మనం ఏది చేయాలన్నా ఏది చేయకూడదన్న దానికి ఏది ప్రమాణం అంటే శాస్త్రమే (వేదం) ప్రమాణము.
దేవత ఆరాధన చేసేవాడు మాత్రమే ఉపవాసించాలి మిగిలిన వాళ్ళు అందరూ ఉపవాసించాలని ఎక్కడా లేదు శాస్త్రంలో.
అయితే ఏకాదశి రోజు మాత్రం ప్రతి ఒక్కరూ ఉపవసించి తీరాలి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు తప్ప.
ఎందుకంటే ఏకాదశి రోజు భోజనం చేసిన వాడి పుణ్యములు అన్నీ కూడా హరించుకుపోతాయని బ్రహ్మదేవుని వాక్కు.
ఉపవసించడము అంటే భగవంతునికి సమీపంలో ఉండడము అంటే దేవతారాధన చేయడము.
ఈ దేవత ఆరాధన చేసేవాళ్లు పీకలదాకా తింటే శరీరం సహకరించదు.నిద్ర ఆవహిస్తుంది కాబట్టి మితంగా తినాలి కేవలం పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి అది కూడా మితంగా తీసుకోవాలి కేవలం ఆకలికి శరీరం తీవ్రంగా ఇబ్బంది పడకుండా ప్రాణాలను నిలబెట్టుకునేంత మాత్రమే తీసుకోవాలి అని శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడినది.
ఉపవాసం చేసినప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరికి పస్తు ఉండే అధికారం ఉంది మిగిలిన సమయంలో పస్తు ఉంచడం వల్ల మన శరీరం బడలి పోతుంది ఇబ్బంది పడుతారు కాబట్టి మిగిలిన సమయాల్లో భోజనం తినకుండా ఉండే హక్కు ఎవరికీ లేదు.
నిజానికి భోజనం మానేయడం అనేది కేవలం దేవతారాధన కొరకు మాత్రమే. ఇది తెలియక చాలామంది కేవలం పస్తులు ఉంటూ తమ పనులు తాను చేసుకుంటూ తామ ఉపవాసం ఉంటున్నాము అని భ్రమలో బతుకుతున్నారు. ఇది నిజానికి ఉపవాసమే కాదు.
భోజనం మానేయడం మాత్రమే కాకుండా ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరము భగవంతునికి సమీపంలో గడపడమే (భగవంతుని ఆరాధన చేయడమే)ఉపవాసము.
#తెలుసుకుందాం #సనాతన ధర్మం.. దేవుళ్ళు #సనాతాన ధర్మం #సనాతన హిందూ ధర్మం #సనాతన ధర్మం(భక్తి)🙏💐
santhana dharmam(devotional)🙏🙏💐🏵️