Mahbubnagar Police
507 views 24 days ago
మద్యం మత్తులో ఆటో నడిపిన డ్రైవర్‌కు 3 రోజుల జైలు శిక్ష డ్రంక్ అండ్ డ్రైవ్‌పై రాజీ లేదు – ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె.రాజేందర్ రెడ్డి మరియు సిబ్బంది నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి ఆటో నడుపుతున్న ఓ డ్రైవర్‌ను పోలీసులు గుర్తించి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని శుక్రవారం సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆర్.శశిధర్ న్యాయస్థానంలో హాజరుపరచగా, విచారణ అనంతరం న్యాయస్థానం అతనికి 3 రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కె.రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల డ్రైవర్‌తో పాటు ఇతర రహదారి వినియోగదారుల ప్రాణాలకు కూడా తీవ్రమైన ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా ప్రయాణికులను తరలించే ఆటోలు, క్యాబ్‌లు, బస్సులు వంటి ప్యాసింజర్ వాహనాలను మద్యం మత్తులో నడపడం అత్యంత నిర్లక్ష్యపూరితమైన, తీవ్రమైన నేరమని పేర్కొన్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి, ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. #MahabubnagarPolice #📰 వార్తలు
11 likes
14 shares

More like this