P. Chandra Shekar
715 views 19 days ago
ఉడుపి శ్రీకృష్ణ మహాభిషేకం : ఉడుపి శ్రీకృష్ణమఠం క్షేత్రానికి పూర్వపు పేరు శివళ్ళీ. ఇది పరశురామ క్షేత్రాలలో ప్రథమస్థానం కలిగి ఉంది. ఈ స్వామి దర్శనం నవరంధ్రాలున్న కిటికీ ద్వారా చేసుకోవలసి ఉండటం ఈ దేవాలయ ప్రత్యేకత. ఉడుపి రథవీధిలో శ్రీకృష్ణ మందిరం ఉంది. ఉత్తర ద్వారం గుండా గుడిలోకి ప్రవేశించినప్పుడు కుడివైపు దేవాలయ కార్యాలయం, ఇంకొద్దిగా ముందుకు వెళితే మధ్య సరోవరం కనిపిస్తుంది. ప్రధాన ఆలయానికి ద్వారం ఎడమవైపు ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళితే చెన్నకేశవ ద్వారం వస్తుంది. దీనిద్వారా గర్భగుడిలో ప్రవేశం పీఠాధిపతులకు తప్పితే అన్యులకు ఉండదు. చెన్నకేశవ స్వామి ద్వారం నుండి ముందుకు వెళితే ప్రదక్షిణం చేసిన తరువాత శ్రీకృష్ణ దర్శనం వెండితో తాపడం పెట్టిన నవరంధ్రాల గవాక్షం గుండా చేసుకోవచ్చు. గర్భగుడికి కుడివైపు ముఖ్యప్రాణ దేవత (హనుమంతుడు), వామభాగాన గరుడ దేవర ఉన్నారు. స్వామి దర్శనం చేసుకొని ముందుకు వెళ్లి దక్షిణ మార్గం వైపు వెళితే, ఎడమభాగాన మధ్వాచార్యుల మంటపం కనిపిస్తుంది. #🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹
8 likes
17 shares

More like this