P.Venkateswara Rao
543 views 2 months ago
#తమిళనాడు రాజకీయాలు 🚩🥱 *నలుగురి లేఖల్ని కొనుక్కున్నారా❓* MAY 11, 2026🎯 మొత్తానికి తమిళనాడులో సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం కొలువు తీరింది. తలా ఇద్దరేసి ఎమ్మెల్యేలు ఉన్న నాలుగు చిన్న పార్టీలు 'వెలుపలి నుంచి మద్దతు' ఇవ్వడంతో అవాంతరాలు తొలిగాయి. కానీ సాధారణంగా ఈ ‘వెలుపలి నుంచి మద్దతు' వ్యవహారాల్లో ఎలాంటి లుకలుకలు ఉంటాయో అవన్నీ తొలిరోజునే కనిపించాయి. కాపురం చేసే కళ కాలుతొక్కిన నాడే తెలుస్తుందన్నట్టుగా ఆ పార్టీలు – ప్రమాణ స్వీకారం నాడు వ్యవహారాల మీదనే తమ అసంతృప్తిని వెళ్లగక్కాయి. అయితే వారి వ్యవహార సరళిని గమనిస్తోంటే.. ఆ నాలుగు పార్టీల లేఖల్ని విజయ్ కొనుక్కున్నారా? ప్రమాణస్వీకారం అనే గండం గడిచిపోతే.. ఆ తర్వాత.. తనదైన శైలిలో రాజకీయంగా చక్రం తిప్పి, స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుచేయవచ్చునని ఆయన భావించారా? అనేది ఇప్పుడు కీలకంగా ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కేవలం పది మంది ఎమ్మెల్యేల దూరంలో ఆగిపోయిన దళపతి విజయ్ ను గవర్నర్ ఎన్ని రకాలుగా టెన్షన్ పెట్టవచ్చునో, అన్ని రకాలుగానూ టెన్షన్ పెట్టారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం అనేది గవర్నర్ స్వీయ నిర్ణయాధికారానికి సంబంధించిన వ్యవహారమే అయినప్పటికీ ఆయన వ్యవహరించిన తీరు వివాదాస్పదం అయింది. బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజయ్ కోరితే గవర్నర్ తిరస్కరించడం గమనించాల్సిన సంగతి. అలాగే కేవలం రెండు సీట్ల దూరంలో ఆగిపోయి, '‘ఆ ఒక్క పార్టీ లేఖను తర్వాత సమర్పిస్తాను' అన్నప్పటికీ కూడా గవర్నర్ ఒప్పుకోలేదు. విజయ్ ముఖ్యమంత్రి కాకుండా ఆపగల శక్తి తన చేతిలో లేకపోయినప్పటికీ ఆయనను టెన్షన్ పెట్టడం ఒక్కటే పరమావధి అన్నట్లుగా గవర్నర్ ప్రవర్తించారు. మొత్తానికి రెండేసి సీట్లు ఉన్న నాలుగు పార్టీల నుంచి అతి కష్టం మీద మద్దతు లేఖలను కూడగట్టి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆ నాలుగు పార్టీలు కూడా తాము ఇప్పటికీ డిఎంకె కూటమిలో భాగంగానే ఉన్నామని, విజయ్ ప్రభుత్వానికి కేవలం బయట నుంచి మాత్రమే మద్దతు ఇస్తున్నామని తమిళనాడులో మళ్లీ ఎన్నికలు రావడం ఇష్టం లేదు కనుకనే ఈ పని చేస్తున్నామని రకరకాల సన్నాయి నొక్కులు నొక్కారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వందేమాతరం, జనగణమన తరువాత తమిళంలోని రాష్ట్ర గీతాన్ని ఆలపించడం తమ భాషకు జరిగిన అతి పెద్ద ద్రోహం గా ఇప్పుడు వారు ఆరోపిస్తున్నారు. తొలి రోజునే ఈ అంశం మీద వారు విజయ్ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. ఒకవైపు తాము డిఎంకె మిత్రులమే అని చెప్పుకుంటూ ప్రభుత్వం ఏర్పడేందుకు లేఖలు ఇచ్చి, ఆ వెంటనే ప్రభుత్వ చర్యల మీద విమర్శల దాడికి దిగుతుండడం గమనిస్తే.. ఆ లేఖలు ఏదో మొక్కుబడిగా ఇచ్చారా? అనే అనుమానం ప్రజలలో కలుగుతోంది. అదే సమయంలో ఒకసారి ప్రభుత్వం ఏర్పాటైతే.. బలనిరూపణ ఏ రూపంలో అయినా సాధించుకోగలను గాని, ప్రభుత్వం తర్వాత.. తనదైన శైలిలో రాజకీయంగా చక్రం తిప్పి, స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుచేయవచ్చునని ఆయన భావించారా? అనేది ఇప్పుడు కీలకంగా ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కేవలం పది మంది ఎమ్మెల్యేల దూరంలో ఆగిపోయిన దళపతి విజయ్ ను గవర్నర్ ఎన్ని రకాలుగా టెన్షన్ పెట్టవచ్చునో, అన్ని రకాలుగానూ టెన్షన్ పెట్టారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం అనేది గవర్నర్ స్వీయ నిర్ణయాధికారానికి సంబంధించిన వ్యవహారమే అయినప్పటికీ ఆయన వ్యవహరించిన తీరు వివాదాస్పదం అయింది. బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజయ్ కోరితే గవర్నర్ తిరస్కరించడం గమనించాల్సిన సంగతి.
10 likes
16 shares

More like this