DUDEKULA DASTAGIRI
646 views 1 days ago
*తక్కువ ధరలకే బియ్యం విక్రయాల కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల* *గిద్దలూరు నియోజకవర్గం బేస్తవారిపేట పట్టణంలోని బస్టాండ్ సమీపంలోని మట్టాల కాంప్లెక్స్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తక్కువ ధరలకే బియ్యం అమ్మకాల (రైస్ మార్ట్) కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు ప్రారంభించారు.* *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ సునీత గారు, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు గారితో కలిసి ప్రజలకు బియ్యం పంపిణీ చేశారు.* *ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరల్లో పేద , మధ్యతరగతి ప్రజలకు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. ప్రతి కుటుంబానికి అవసరమైన నిత్యావసర వస్తువులు సరసమైన ధరలకు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.* *ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.* #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు
9 likes
12 shares

More like this