P.Venkateswara Rao
3K views 9 days ago
#😍కింగ్ కోహ్లీ 🔥 *చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ఏకైక ఆటగాడిగా వరల్డ్ రికార్డ్❗* By Uppala Shivaprasad August 3 2026🏏 టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. మూడు ఫార్మాట్లలో 900+ ఐసీసీ రేటింగ్ పాయింట్స్ అందుకున్న ఏకైక ఆటగాడిగా నిలిచాడు. టెస్ట్‌ల్లో విరాట్ కోహ్లీ కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్స్ 937 కాగా.. వన్డేల్లో 911, టీ20ల్లో 909 రేటింగ్ పాయింట్స్ అందుకున్నాడు. ప్రపంచంలోనే మరే ఆటగాడు కూడా మూడు ఫార్మాట్లలో 900 ప్లస్ రేటింగ్ పాయింట్స్ అందుకోలేదు. భారత్ తరఫున ఐసీసీ ర్యాంకింగ్స్ 900 రేటింగ్ పాయింట్స్ అందుకున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ మాత్రమే ఉన్నారు. సునీల్ గవాస్కర్, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా టెస్ట్‌ల్లో ఈ ఫీట్ సాధించగా.. సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ టీ20ల్లో ఈ ఘనతను అందుకున్నారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తమ కెరీర్‌లోనే ఈ ఫీట్ సాధించలేదు. అంతర్జాతీయ టీ20లతో పాటు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ.. కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2027 వన్డే ప్రపంచకప్ ఆడటమే లక్ష్యంగా కోహ్లీ కొనసాగుతున్నాడు. గతంలో కంటే సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లీ.. తనకు అచ్చొచ్చిన వన్డే ఫార్మాట్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. కోహ్లీ కాదు.. కష్టకాలంలో ధోనీనే ఎంచుకుంటా: రవీంద్ర జడేజా ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న విరాట్ కోహ్లీ.. సెప్టెంబర్‌లో సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ ఖాళీ సమయంలోనూ కోహ్లీ తన బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టనున్నాడు. ఇప్పటి వరకు 314 వన్డేలు ఆడిన కోహ్లీ 14,941 పరుగులు చేశాడు. ఇందులో 54 శతకాలతో పాటు 79 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డ్ సాధించాడు. వన్డే ప్రపంచకప్ 2027 గెలిచి సగర్వంగా ఆటకు వీడ్కోలు పలకాలనే ఉద్దేశంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు.
12 likes
13 shares

More like this