DUDEKULA DASTAGIRI
570 views 1 days ago
*CMRF చెక్కు పంపిణీ చేసిన ముత్తుముల క్రిష్ణ కిశోర్* *గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన శ్రీ దూదేకుల వనురయ్య గారు కాలు గాయంతో శస్త్రచికిత్స చేయించుకుని వైద్య ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.60,199/- విలువైన చెక్కును గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గౌ. శ్రీ ముత్తుముల క్రిష్ణ కిశోర్ రెడ్డి గారు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.* *ఈ సందర్భంగా క్రిష్ణ కిశోర్ గారు మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం ఆర్థిక చేయూత అందించడం అభినందనీయమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా కృషి చేస్తామని తెలిపారు.* *కుటుంబ సభ్యులు కూటమి ప్రభుత్వనికి మరియు క్రిష్ణ కిశోర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.* #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్
21 likes
17 shares

More like this