DUDEKULA DASTAGIRI
703 views • 2 days ago
ఏ మాత్రం నిజం లేని తప్పుడు ప్రచారాలు చేస్తూ వైకాపా వారు కాలక్షేపం చేస్తున్నారు. ప్రజల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేని ఈ వ్యక్తులు దిగజారి మరీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిపై తప్పుడు ఆరోపణలు కొనసాగిస్తూనే ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే పేరుతో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చి ప్రజల భూముల కొట్టేసిన వైకాపా నాయకులు ఇప్పుడు తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులను కూటమి ప్రభుత్వానికి ఆపాదించాలని చూస్తున్నారు. ప్రస్తుత గోవా గవర్నర్, గౌరవనీయులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారి భూమినే కొట్టేసి జగన్ రెడ్డి తన పార్టీ ఆఫీసు కట్టించుకున్నాడు. తాజాగా అప్పటి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని శీతారామ్ భూ భాగోతం బయటపడి కేసు బుక్ అయింది. రాయలసీమలోని చాలా జిల్లాల్లో వైసీపీ నేతల భూ ఆక్రమణలు బయటకు వచ్చాయి. సాక్ష్యాత్తూ జగన్ రెడ్డి కుట్రలను బట్టబయలు చేస్తూ బ్రాహ్మణీ స్టీల్స్ పేరుతో దోచుకున్న వేలాది ఎకరాలను కూటమి ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్నది. జగన్ రెడ్డి సొంత కంపెనీ అయిన సరస్వతీ పవర్ భూముల విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకున్నది. ఇలా ఒక్కక్కొటి బయటపడి కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటూ ఉంటే వైకాపా నాయకులు సంధి ప్రేలాపనలు పేలుతున్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి పని చేస్తుంది తప్ప భూములు ఆక్రమించడానికి, అక్రమ సంపాదనలతో అందలం ఎక్కడానికి కాదు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి శరవేగంగా జరుగుతున్నది. సంక్షేమం, అభివృద్ధి మూడు పువ్వులు ఆరు కాయలుగా ముందుకు వెళుతున్నాయి. కడుపు మండుతున్న వైకాపా నాయకులు ఇలా తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ బతుకుతున్నారు. ఇలాంటి వారి తప్పుడు ఆరోపణలను ప్రజలు నమ్మవద్దు.
#FakeAlert
#AndhraPradesh #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు
18 likes
13 shares