KP@KALIPRASAD
499 views 10 hours ago
🕊️ విషాదం | ముద్రగడ పద్మనాభం కన్నుమూత ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ప్రముఖ కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. 1953లో తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ఆయన, 1978లో జనతా పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్, మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా సేవలందించారు. కాపు రిజర్వేషన్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన, 2024 ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ, సామాజిక ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. 🕊️ #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🏛️రాజకీయాలు
12 likes
13 shares

More like this