Aaryan Rajesh
871 views 4 months ago
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ ... 23 - 04 - 2026, *_నేటి విశేషం_* _*గంగా సప్తమి / గంగా జయంతి*_ భగీరథుని తపోఫలంగా పరవళ్ళు త్రొక్కుతూ వస్తున్న గంగమ్మను పానము చేసిన జహ్ను మహర్షి తన కుడిచెవినుండి గంగాదేవిని వైశాఖ శుక్ల సప్తమినాడు తిరిగి ప్రవహింపజేశాడు, కనుక ఇది కూడా గంగా జయంతిగా ప్రసిద్ధికెక్కింది. గంగకు జాహ్నవి అనే పేరు కూడా వచ్చింది. ఈ రోజున గంగను షోడశోపచారములతో పూజించాలి. గంగ లభ్యముకాని పరిస్థితిలో ఏదైనా ఒక నీటిపాత్రయందు గంగను ఆవాహనము చేసి పూజింపవచ్చును. గంగా గంగా గంగా గంగా గంగా అని అయిదు సార్లు స్మరించి స్నానం ఆచరించినా అది పుణ్యఫలమే, వైశాఖశుద్ధసప్తమి గంగోత్పత్తి కథను పురాణనామచంద్రిక ఇట్లు చెబుతూ ఉంది. “తన ముత్తాతలు అగు సగరపుత్రులు కపిల మహాముని యొక్క కోపాగ్ని చేత నీఱు కాగా వారికి సద్గతి కలిగింప తలంచి గంగను కూర్చి తపస్సు చేసి భూలోకమునకు దిగి వచ్చునట్లు భగీరథుడు ప్రార్థించెను. అప్పుడు ఆ మహానది తాను భూలోకమునకు వచ్చునెడ తన ప్రవాహ వేగమును ధరింప గల వారిని ఒకరిని ఏర్పఱుచు కొనిన పక్షమున తానువచ్చునట్లు ఒప్పుకొనెను. అంతట భగీరథుడు రుద్రుని గూర్చి తపము ఆచరించి అతని అనుగ్రహము పడసి గంగా ప్రవహమును వహింప ప్రార్ధించెను. అపుడు గంగ మిక్కిలి అట్టహాసముతో భూమికి దిగిరాసాగెను. రుద్రుడు గంగను తన జటా జూటము నందు నిలిపి పిదప కొంతకాలమునకు భగీరథుని ప్రార్ధనచే తన శిరస్సు నుండి ఏడుబిందువులను భూమిమీదకు వదలెను. ఆబిందువులు పడిన చోటు బిందుసరస్సు, అసరస్సు నుండి వెడలి ప్రవహించుచూ గంగ జహ్నుమహాముని యజ్ఞశాలయందు ప్రవేశింపగా అతడు కోపగించి దానిని పానముచేసి, పిమ్మట భగీరథుడు ప్రార్థింపగా ప్రసన్నుడై తన చెవి నుండి వెడల విడిచెను, ఇందువలన గంగకు జాహ్నవి అనుపేరు కలిగెను. గంగా నది జహ్నుముని చెవినుండి పుట్టిన రోజు వైశాఖశుద్ధ సప్తమి, కాగా ఈరోజున గంగానదిలో స్నానం చేసి పూజ చేయాలి, శర్కరాసప్తమి, నింబాసప్తమి, అనోదనసప్తమి, ద్వాదశసప్తమి మున్నగు వ్రతాలు ఈనాడు చేస్తారని చతుర్వర్గ చింతామణి. ఈనాడు పర్జన్యపూజ చేయాలని కూడా వ్రతగ్రంథాలు చెప్తున్నాయి. *_🎡శుభంభూయత్🎡_* 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏 రాజేష్ #🙏గంగా సప్తమి🙏
13 shares

More like this