*తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి హన్మకొండ జిల్లా అధ్యక్షులుగా డాక్టర్ బండి సదానందం నియామకం*
తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా హన్మకొండ జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ బండి సదానందం నియమితులయ్యారు. ఈ మేరకు జనగామ జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్ర కమిటి సమావేశంలో అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొలిపాక లక్ష్మణ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బండి సదానందం మాట్లాడుతూ తన పనితీరును గుర్తించి జిల్లా అధ్యక్షులుగా నియమించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రజకుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానన్నారు. అందరి సహకారంతో సంఘాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. కాగా నియామకానికి సహకరించిన రాష్ట్ర బాధ్యులకు, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏదునూరి వీరన్న, ఈస్ట్ జోన్ కన్వీనర్ నార్లగారి కుమారస్వామి, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు సంగెం రమేష్ తదితరులు పాల్గొన్నారు. #🏛️రాజకీయాలు
*ఎస్సీ జాబితాలో చేర్చే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్న గోపి రజక*
➖ తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి
▪️ రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీని నెరవేర్చాలన్న జిల్లా ఉపాధ్యక్షురాలు సిహెచ్ లలిత
దేశవ్యాప్తంగా ఒకే కులవృత్తి చేసే రజకులకు భిన్న రిజర్వేషన్లు తగదని కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడకుండ మిగతా 11 రాష్ట్రాలను తక్షణమే ఎస్సీలో చేర్చాలని *గోపి రజక* డిమాండ్ చేశారు. *వికారాబాద్ జిల్లా కోడంగల్ మండలం పర్సాపూర్* తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా ఉపాధ్యక్షురాలు *చాకలి లలిత* అధ్యక్షతన 26-4-2026 ఆదివారం ఏర్పాటు చేసిన మండల నాయకుల సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు *గోపి రజక* హాజరై మాట్లాడుతూ దశాబ్దాలుగా రజక నాయకులు ఎస్సీ జాబితాలో చేర్చాలని పోరాటాలు చేస్తున్న పోరాటాలను గుర్తించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2016లో *ఏనుముల రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో , డీకే అరుణ 2023 ఎలక్షన్ సమయంలో, లోకేష్ యువగళం పాదయాత్రలో నారా చంద్రబాబు నాయుడు,శాసన మండలిలో కల్వకుంట్ల కవిత,జోడో పాదయాత్రలో రాహుల్ గాంధీ , లోక్ సభలో రెండు సార్లు ఎంపీలు దోబీలను ఎస్సీలో చేర్చాలని ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ నాయకులు వివిధ సందర్భాలలో మాట్లాడటం జరిగింది*. కానీ ప్రభుత్వ ఏర్పాటు అయ్యాక ఎస్సీ రిజర్వేషన్ అంశాన్ని మాట్లాడకుండా మరుగున పడేయడం రజకులను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడం, వృత్తిదారుల సమస్యలను గాలికి వదిలేయడం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం గత ప్రభుత్వాలు చేసిన పొరపాట్లను ఈ ప్రభుత్వం చేయకుండా అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.
సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు *అన్నారం సాయిలు*, జిల్లా మహిళా అధ్యక్షురాలు *లక్ష్మీ* , జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ *సిహెచ్ అశోక్* , జిల్లా ఉపాధ్యక్షులు *రావులపల్లి బాలప్ప, దౌల్తాబాద్ గడ్డమీద వెంకటప్ప, బిచ్చాల్ సిహెచ్ మొగులప్ప*, కోడంగల్ మండల అధ్యక్షులు *మొగులయ్య* తదితరులు పాల్గొన్నారు. #🏛️రాజకీయాలు
*ఎస్సీ జాబితాలో చేర్చే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్న గోపి రజక*
➖ తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి
▪️ రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీని నెరవేర్చాలన్న జిల్లా ఉపాధ్యక్షురాలు సిహెచ్ లలిత
దేశవ్యాప్తంగా ఒకే కులవృత్తి చేసే రజకులకు భిన్న రిజర్వేషన్లు తగదని కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడకుండ మిగతా 11 రాష్ట్రాలను తక్షణమే ఎస్సీలో చేర్చాలని *గోపి రజక* డిమాండ్ చేశారు. *వికారాబాద్ జిల్లా కోడంగల్ మండలం పర్సాపూర్* తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా ఉపాధ్యక్షురాలు *చాకలి లలిత* అధ్యక్షతన 26-4-2026 ఆదివారం ఏర్పాటు చేసిన మండల నాయకుల సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు *గోపి రజక* హాజరై మాట్లాడుతూ దశాబ్దాలుగా రజక నాయకులు ఎస్సీ జాబితాలో చేర్చాలని పోరాటాలు చేస్తున్న పోరాటాలను గుర్తించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2016లో *ఏనుముల రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో , డీకే అరుణ 2023 ఎలక్షన్ సమయంలో, లోకేష్ యువగళం పాదయాత్రలో నారా చంద్రబాబు నాయుడు,శాసన మండలిలో కల్వకుంట్ల కవిత,జోడో పాదయాత్రలో రాహుల్ గాంధీ , లోక్ సభలో రెండు సార్లు ఎంపీలు దోబీలను ఎస్సీలో చేర్చాలని ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ నాయకులు వివిధ సందర్భాలలో మాట్లాడటం జరిగింది*. కానీ ప్రభుత్వ ఏర్పాటు అయ్యాక ఎస్సీ రిజర్వేషన్ అంశాన్ని మాట్లాడకుండా మరుగున పడేయడం రజకులను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడం, వృత్తిదారుల సమస్యలను గాలికి వదిలేయడం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం గత ప్రభుత్వాలు చేసిన పొరపాట్లను ఈ ప్రభుత్వం చేయకుండా అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.
సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు *అన్నారం సాయిలు*, జిల్లా మహిళా అధ్యక్షురాలు *లక్ష్మీ* , జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ *సిహెచ్ అశోక్* , జిల్లా ఉపాధ్యక్షులు *రావులపల్లి బాలప్ప, దౌల్తాబాద్ గడ్డమీద వెంకటప్ప, బిచ్చాల్ సిహెచ్ మొగులప్ప*, కోడంగల్ మండల అధ్యక్షులు *మొగులయ్య* తదితరులు పాల్గొన్నారు. #🏛️రాజకీయాలు
*ఈదమ్మ జాతరలో ఎలుకగూడెం సర్పంచ్ బందెయ్య రజకపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ➖ గోపి రజక*
తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి
*రాంరెడ్డిపై హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్*
*ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక దాడికి కుట్ర*
రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం ఎలుకగూడెం గ్రామ సర్పంచ్ బందెయ్య రజకపై జరిగిన దాడి స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈదమ్మ దేవత జాతర సందర్భంగా జరిగిన ఈ ఘటనలో అదే గ్రామానికి చెందిన కొంతమందితో పాటు మాజీ సర్పంచ్ రాంరెడ్డి చాకులు, రాళ్లతో దాడి చేసినట్లు అందిన సమాచారం.
గాయపడిన సర్పంచ్ బందెయ్యను షాద్నగర్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక స్పందిస్తూ ప్రజలతో మమేకమై సేవలు చేస్తున్న ప్రజాప్రతినిధిపై ఇలాంటి దాడులు జరగడం దురదృష్టకరమని వారన్నారు.మాజీ సర్పంచ్ రాంరెడ్డి తోపాటు కొంత మంది నిందితులపై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా పునరావృతం కాకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో కూడా బందెయ్యపై దాడులు జరిగినట్లు గుర్తు చేశారు.
జాతర ఏర్పాట్లను స్వయంగా చూసుకుంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న సమయంలో ఈ దాడి జరగడం బాధాకరమని ఆయన తెలిపారు. గతంలో కుమ్మెర గ్రామ రజకులపై దాడి, ఆసిఫాబాద్ పట్టణంలో రజక స్త్రీపై చెప్పులతో దాడి, తాండూరు రజకుల భూ కబ్జా ఘటన ఇలా రజకులపై రోజురోజుకూ దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం కఠినతరమైన చట్టంను తీసుకురావాలని గోపి రజక ప్రభుత్వాన్ని కోరారు. #🏛️రాజకీయాలు
*ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు సంగెం రమేష్ గారిని సన్మానించిన చెన్నరావుపేట రజక సంఘం*
తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన సంఘం రమేష్ గారిని చెన్నారావుపేట రజక కుల పెద్ద చాపర్తి రాజు ఘనంగా సన్మానించడం జరిగింది అలాగే చాపర్తి రాజు మాట్లాడుతూ రజకుల పైన జరుగుతున్న దాడులను అన్యాయాలను అసమానతులను నిరంతరం ఖండిస్తూ రజకులను ఎప్పటికప్పుడు చైతన్య పరుస్తూ సమాజంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని రజకులకు అందుబాటులో ఉంటూ తను చేస్తున్న సేవలను రాష్ట్ర నాయకత్వం గుర్తించి తనకు ఉమ్మడి జిల్లా బాధ్యతలు అప్పగించడం పట్ల చెన్నారావుపేట మండల రజక కులస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు సంఘం రమేష్ గారు మాట్లాడుతూ నన్ను నమ్మి ఈ పదవి అప్పజెప్పిన రాష్ట్ర నాయకత్వానికి అలాగే నాకు సహకరించినటువంటి నా కుల బాంధవులు మరియు నా శ్రేయోభిలాషులు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రజకుల అభివృద్ధి తన ధ్యేయంగా ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ రజకులు ఉన్నత స్థానంలో ఉండేందుకు గాను కృషి చేస్తానని ఈ సభ ముఖంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఉప్పుల బిక్షపతి, ఉప్పుల వీరస్వామి మర్రి రమేష్ మర్రి మధుకర్ ఉప్పల శ్రీను వైనాల స్వామి బి శత్రు తదితరులు పాల్గొన్నారు #🏛️రాజకీయాలు




![🏛️రాజకీయాలు - {roe 99 Doe @೮೦ಗಾಣ' శధ్వర్యంలో . ನಜ0' మీజిలగ్లె (చాకలి] అభ్యిర్ధథుం ০০ট ٨٥٥٥5 స్మెంటర్లకు . {roe 99 Doe @೮೦ಗಾಣ' శధ్వర్యంలో . ನಜ0' మీజిలగ్లె (చాకలి] అభ్యిర్ధథుం ০০ট ٨٥٥٥5 స్మెంటర్లకు . - ShareChat 🏛️రాజకీయాలు - {roe 99 Doe @೮೦ಗಾಣ' శధ్వర్యంలో . ನಜ0' మీజిలగ్లె (చాకలి] అభ్యిర్ధథుం ০০ট ٨٥٥٥5 స్మెంటర్లకు . {roe 99 Doe @೮೦ಗಾಣ' శధ్వర్యంలో . ನಜ0' మీజిలగ్లె (చాకలి] అభ్యిర్ధథుం ০০ট ٨٥٥٥5 స్మెంటర్లకు . - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_643730_182b038a_1777274641961_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=961_sc.jpg)








