#ఇఫ్తార్_విందులో_పాల్గొన్న_ఎమ్మెల్యే_ముత్తుముల
#మార్కాపురంజిల్లా: #గిద్దలూరు పట్టణంలోని షాదిఖానా ఫంక్షన్ హాల్ నందు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా గిద్దలూరు పట్టణ అధ్యక్షులు శ్రీ #సయ్యద్_షానేషావలి గారు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో Giddalur Telugudesam పార్టీ శాసన సభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు పాల్గొన్నారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే గారు ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని వారికి రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఉపవాసం (రోజ) ఉన్న ముస్లిం సోదరులకు స్వయంగా భోజనం వడ్డించి, వారితో కలిసి అల్పాహారం స్వీకరించినారు. అనంతరం అశోక్ రెడ్డి గారు మాట్లాడుతూ సమాజంలో అన్ని మతాల మధ్య సౌభ్రాతృత్వం, ఐక్యత కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు, కౌన్సిలర్ లు , వార్డు ఇంచార్జ్ లు,పార్టీ నాయకులు తదితరులు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్
కుటుంబ సమేతంగా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ముత్తుముల
#తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానంలో Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న అనంతరం అశోక్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధి , ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారన్నారు...
ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ దప్పిలి భాస్కర్ రెడ్డి , దుగ్గా రమేష్ రెడ్డి, చలిచీమల శ్రీనివాస్ చౌదరి తదితరులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు... #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్
ప్రతి ఒక్కరూ తండ్రిని అభిమానిస్తారు, గౌరవిస్తారు కానీ తండ్రిని ఇంతగా అభిమానించే వ్యక్తి ఒక్క బాలయ్య మాత్రమే, ప్రతిఒక్కరి దగ్గర తన తండ్రి ఎన్టీఆర్ గురించి ఇంతగా మాట్లాడే వ్యక్తిని నేను చూడలేదు...
#తెలుగు అనే మూడు అక్షరాలకు నా రక్తం ఉప్పొంగుతుంది. #NTR అనే మూడు అక్షరాలకు నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి
స్వచ్ఛమైన మనసు మా Nandamuri Balakrishna గారిది...
#జైబాలయ్య 👌 #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్
ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టర్ను కలిసిన ఎమ్మెల్యే ముత్తుముల
ఆసుపత్రి నిర్మాణం పూర్తి – త్రాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరిన ఎమ్మెల్యే
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు నియోజకవర్గం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు మార్కాపురం జిల్లా కలెక్టర్ P. రాజాబాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా గిద్దలూరు ప్రాంతంలో అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయుటకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే రాబోయే వేసవి కాలంలో ఎండలు అధికమవనున్న నేపథ్యంలో ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, అవసరమైన చోట్ల నీటి వనరులను మెరుగుపరచి సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారిని కోరారు.
అనంతరం కలెక్టర్ గారు వెంటను సమస్యల గురించి పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు...
#Markapuramjillacollecter
#IdhiManchiPrabhutvam #GiddalurMLA
#GiddalurTelugudesamparty #NDAGovernment
#MuthumulaAshokReddy #NDAkutami
#మనముత్తుములమనగిద్దలూరు
#ముత్తుముల_అశోక్_రెడ్డి
#జైముత్తుముల #జైతెలుగుదేశం
#📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్
#గిద్దలూరులో_ఘనంగా_మహిళా_దినోత్సవ_వేడుకలు
మహిళల సర్వతోముఖాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం:
గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలోని చీతీరాల కళ్యాణ మండపంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు శ్రీ Muthumula AshokReddy గారు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వేడుకల్లో పాల్గొన్న మహిళామూర్తులందరికీ ఆయన మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
సమాజ నిర్మాణంలోనూ, కుటుంబ పురోగతిలోనూ మహిళల పాత్ర ఎంతో కీలకమైనదని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కొనియాడారు. అనంతరం, మహిళల సంక్షేమం, వారి ఆర్థిక ప్రగతి కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకుంటున్న వివిధ సంక్షేమ పథకాలను, నిర్ణయాలను ఆయన వారికి కూలంకషంగా వివరించారు.
మహిళలకు ఆర్థిక, సామాజిక సాధికారత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు. "మహిళలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. మీ అభివృద్ధి, శ్రేయస్సే మా ప్రభుత్వ లక్ష్యం" అని తెలుపుతూ మహిళల్లో ఆయన భరోసా నింపారు. అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
#womansday2026
#MuthumulaAshokReddy #GiddalurMLA
#GiddalurTelugudesamparty
#ముత్తుముల_అశోక్_రెడ్డి
#🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్
స్త్రీ లేకపోతే జననం లేదు 🙏
స్త్రీ లేకపోతే గమనం లేదు 🙏
స్త్రీ లేకపోతే మనుగడలేదు 🙏
స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు 🙏
మహిళామూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 🙏🙏💐💐💐💐😍😍 #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను కలిసిన ఎమ్మెల్యే ముత్తుముల
త్రాగునీరు , రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
#మార్కాపురంజిల్లా :#గిద్దలూరు నియోజకవర్గంలో త్రాగునీరు సమస్య రాకుండా ప్రజలు ఇబ్బంది కలగకుండా పరిష్కారించాలని అలాగే రోడ్ల మరమ్మత్తుల కోసం ఉప ముఖ్యమంత్రివర్యులు గౌ శ్రీ Pawan Kalyan గారిని కలసి వినతి పత్రం అందించిన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు...
ఈ సందర్భంగా ముత్తుముల అశోక్ రెడ్డి గారు నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి కొరత లేకుండా అవసరమైన త్రాగునీరు సమస్య మరియు గత ఏడాది అధిక వర్షాలు ప్రభావం వలన పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తుల అవసరాన్ని వివరించారు ప్రజల సౌకర్యం కోసం ఈ సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు.వినతి పత్రాన్ని స్వీకరించిన పవన్ కల్యాణ్ గారు సానుకూలంగా స్పందించి సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ చర్యలతో గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు ఆశాభావం వ్యక్తం చేశారు.
#IdhiManchiPrabhutvam #GiddalurMLA
#PawanKalyan #MuthumulaAshokReddy
#GiddalurTelugudesamparty #మనగిద్దలూరుమనముత్తుముల
#🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్
#విద్యుత్_సమస్యలపై_అసెంబ్లీలో_గళమెత్తిన_ఎమ్మెల్యే_ముత్తుముల
#మార్కాపురంజిల్లా :#అసెంబ్లీ #గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధి మరియు సమస్యలపై Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు అసెంబ్లీలో గళం వినిపించారు. మా ప్రాంతం బాగా వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటి రాయలసీమ జిల్లాల తర్వాత ల్యాండ్ అవైలబులిటీ ఎక్కువగా ఉండటంతో భవిష్యత్తులో పరిశ్రమలు స్థాపించడానికి మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అదే విధంగా వ్యవసాయ రంగంలో కూడా అధిక లోడ్లు ఉండటం వల్ల విద్యుత్ అవసరాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గిద్దలూరు ప్రాంతంలో 220 కేవీ సబ్స్టేషన్ నిర్మాణం చేపడితే విద్యుత్ సమస్యలు గణనీయంగా తగ్గి పరిశ్రమలు మరియు వ్యవసాయ రంగానికి ఎంతో మేలు జరుగుతుందని గౌరవ మంత్రివర్యులు Gottipati Ravikumar గారికి విజ్ఞప్తి చేశారు. అలాగే గిద్దలూరు ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు కోరారు.
#AssemblySession #AndhraPradesh
#IdhiManchiPrabhutvam #GiddalurMLA
#GiddalurTelugudesamparty
#ముత్తుముల_అశోక్_రెడ్డి
#MuthumulaAshokReddy
#ThankyouMlaMuthumulaAshokReddySir #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్
మంత్రి #మండిపల్లిరాంప్రసాద్_రెడ్డి గారితో సమావేశమైన Muthumula AshokReddy
#తాడేపల్లి లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో క్రీడా అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రిని కోరిన ఎమ్మెల్యే #ముత్తుముల
#మార్కాపురంజిల్లా: #గిద్దలూరు నియోజకవర్గంలో క్రీడా అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ #ముత్తుముల_అశోక్_రెడ్డి గారు రాష్ట్ర రవాణా శాఖ మరియు యువజన సేవలు & క్రీడల శాఖ మంత్రి శ్రీ మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారిని కలసి #కొమరోలు మరియు #అర్ధవీడు మండలాల్లో అసంపూర్తిగా ఉన్న మినీ స్టేడియంల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే #గిద్దలూరు మరియు #కంభం మండలాల్లో నూతన స్టేడియంల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని కూడా మంత్రి గారిని కోరారు. అదే విధంగా నియోజకవర్గంలోని ప్రతి పాఠశాలలో విద్యార్థులు క్రీడల్లో చురుకుగా పాల్గొనేలా స్పోర్ట్స్ కిట్స్ అందించే కార్యక్రమాన్ని అమలు చేయాలని సూచించారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిని ప్రోత్సహించి రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచే క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు తెలిపారు. ఈ అంశాలపై మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకుని నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
#IdhiManchiPrabhutvam
#GiddalurTelugudesamparty #GiddalurMLA
#MuthumulaAshokReddy #గిద్దలూరు
#మనగిద్దలూరుమనముత్తుముల
#🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు
బిఆర్ నాయుడు గారి మీద నిందలు వేస్తే నవ్వుకుంటారు అనే బుద్ధి కూడా లేదా వైసీపీ వాళ్ళకి...
*కొండ మీద స్వామి నిజం పలికించిండు..* #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్









