#గిద్దలూరులో_ఘనంగా_మహిళా_దినోత్సవ_వేడుకలు
మహిళల సర్వతోముఖాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం:
గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలోని చీతీరాల కళ్యాణ మండపంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు శ్రీ Muthumula AshokReddy గారు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వేడుకల్లో పాల్గొన్న మహిళామూర్తులందరికీ ఆయన మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
సమాజ నిర్మాణంలోనూ, కుటుంబ పురోగతిలోనూ మహిళల పాత్ర ఎంతో కీలకమైనదని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కొనియాడారు. అనంతరం, మహిళల సంక్షేమం, వారి ఆర్థిక ప్రగతి కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకుంటున్న వివిధ సంక్షేమ పథకాలను, నిర్ణయాలను ఆయన వారికి కూలంకషంగా వివరించారు.
మహిళలకు ఆర్థిక, సామాజిక సాధికారత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు. "మహిళలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. మీ అభివృద్ధి, శ్రేయస్సే మా ప్రభుత్వ లక్ష్యం" అని తెలుపుతూ మహిళల్లో ఆయన భరోసా నింపారు. అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
#womansday2026
#MuthumulaAshokReddy #GiddalurMLA
#GiddalurTelugudesamparty
#ముత్తుముల_అశోక్_రెడ్డి
#🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్
స్త్రీ లేకపోతే జననం లేదు 🙏
స్త్రీ లేకపోతే గమనం లేదు 🙏
స్త్రీ లేకపోతే మనుగడలేదు 🙏
స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు 🙏
మహిళామూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 🙏🙏💐💐💐💐😍😍 #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను కలిసిన ఎమ్మెల్యే ముత్తుముల
త్రాగునీరు , రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
#మార్కాపురంజిల్లా :#గిద్దలూరు నియోజకవర్గంలో త్రాగునీరు సమస్య రాకుండా ప్రజలు ఇబ్బంది కలగకుండా పరిష్కారించాలని అలాగే రోడ్ల మరమ్మత్తుల కోసం ఉప ముఖ్యమంత్రివర్యులు గౌ శ్రీ Pawan Kalyan గారిని కలసి వినతి పత్రం అందించిన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు...
ఈ సందర్భంగా ముత్తుముల అశోక్ రెడ్డి గారు నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి కొరత లేకుండా అవసరమైన త్రాగునీరు సమస్య మరియు గత ఏడాది అధిక వర్షాలు ప్రభావం వలన పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తుల అవసరాన్ని వివరించారు ప్రజల సౌకర్యం కోసం ఈ సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు.వినతి పత్రాన్ని స్వీకరించిన పవన్ కల్యాణ్ గారు సానుకూలంగా స్పందించి సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ చర్యలతో గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు ఆశాభావం వ్యక్తం చేశారు.
#IdhiManchiPrabhutvam #GiddalurMLA
#PawanKalyan #MuthumulaAshokReddy
#GiddalurTelugudesamparty #మనగిద్దలూరుమనముత్తుముల
#🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్
#విద్యుత్_సమస్యలపై_అసెంబ్లీలో_గళమెత్తిన_ఎమ్మెల్యే_ముత్తుముల
#మార్కాపురంజిల్లా :#అసెంబ్లీ #గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధి మరియు సమస్యలపై Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు అసెంబ్లీలో గళం వినిపించారు. మా ప్రాంతం బాగా వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటి రాయలసీమ జిల్లాల తర్వాత ల్యాండ్ అవైలబులిటీ ఎక్కువగా ఉండటంతో భవిష్యత్తులో పరిశ్రమలు స్థాపించడానికి మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అదే విధంగా వ్యవసాయ రంగంలో కూడా అధిక లోడ్లు ఉండటం వల్ల విద్యుత్ అవసరాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గిద్దలూరు ప్రాంతంలో 220 కేవీ సబ్స్టేషన్ నిర్మాణం చేపడితే విద్యుత్ సమస్యలు గణనీయంగా తగ్గి పరిశ్రమలు మరియు వ్యవసాయ రంగానికి ఎంతో మేలు జరుగుతుందని గౌరవ మంత్రివర్యులు Gottipati Ravikumar గారికి విజ్ఞప్తి చేశారు. అలాగే గిద్దలూరు ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు కోరారు.
#AssemblySession #AndhraPradesh
#IdhiManchiPrabhutvam #GiddalurMLA
#GiddalurTelugudesamparty
#ముత్తుముల_అశోక్_రెడ్డి
#MuthumulaAshokReddy
#ThankyouMlaMuthumulaAshokReddySir #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్
మంత్రి #మండిపల్లిరాంప్రసాద్_రెడ్డి గారితో సమావేశమైన Muthumula AshokReddy
#తాడేపల్లి లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో క్రీడా అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రిని కోరిన ఎమ్మెల్యే #ముత్తుముల
#మార్కాపురంజిల్లా: #గిద్దలూరు నియోజకవర్గంలో క్రీడా అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ #ముత్తుముల_అశోక్_రెడ్డి గారు రాష్ట్ర రవాణా శాఖ మరియు యువజన సేవలు & క్రీడల శాఖ మంత్రి శ్రీ మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారిని కలసి #కొమరోలు మరియు #అర్ధవీడు మండలాల్లో అసంపూర్తిగా ఉన్న మినీ స్టేడియంల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే #గిద్దలూరు మరియు #కంభం మండలాల్లో నూతన స్టేడియంల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని కూడా మంత్రి గారిని కోరారు. అదే విధంగా నియోజకవర్గంలోని ప్రతి పాఠశాలలో విద్యార్థులు క్రీడల్లో చురుకుగా పాల్గొనేలా స్పోర్ట్స్ కిట్స్ అందించే కార్యక్రమాన్ని అమలు చేయాలని సూచించారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిని ప్రోత్సహించి రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచే క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు తెలిపారు. ఈ అంశాలపై మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకుని నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
#IdhiManchiPrabhutvam
#GiddalurTelugudesamparty #GiddalurMLA
#MuthumulaAshokReddy #గిద్దలూరు
#మనగిద్దలూరుమనముత్తుముల
#🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు
బిఆర్ నాయుడు గారి మీద నిందలు వేస్తే నవ్వుకుంటారు అనే బుద్ధి కూడా లేదా వైసీపీ వాళ్ళకి...
*కొండ మీద స్వామి నిజం పలికించిండు..* #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్
#తిరుమలనాథ_స్వామి_బ్రహ్మోత్సవంలో_పాల్గొన్న_ముత్తుములక్రిష్ణకిశోర్
#మార్కాపురంజిల్లా : #కొమరోలు మండలం #తిమ్మారెడ్డిపల్లె గ్రామంలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత మందలపాయ తిరుమలనాథ స్వామి వారి బ్రహ్మోత్సవంలో Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారి సోదరుడు గౌ శ్రీ Krishna Kishore Muthumula గారు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ సంప్రదాయానికి ప్రతీకగా నిర్వహించిన బండలాగుడు పందెం కార్యక్రమాన్ని ప్రారంభించారు.గ్రామోత్సవాలు మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడతాయని, ఇటువంటి కార్యక్రమాలు గ్రామీణ ఐక్యతను బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. భక్తులతో కలిసి ఉత్సవాలలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొమరోలు మండల పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు,సొసైటీ బ్యాంక్ చైర్మన్ ముత్తుముల సంజీవ్ రెడ్డి, బిజ్జల తిరుమల రెడ్డి,మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డి,చింతమరెడ్డి నారాయణ రెడ్డి, చెన్నబోయిన రామక్రిష్ణ, దూదేకుల మౌలాలి, కల్లూరి తిరుమల రెడ్డి, చిన్నపురెడ్డి తిరుమల రెడ్డి, జ్యోతి రెడ్డి, Dr " విరాట్ రెడ్డి, వెంకట సుబ్బయ్య, రామస్వామి,ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత మరియు భక్తులు పెద్దసంఖ్యలో బ్రహ్మోత్సవంలో పాల్గొన్నారు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు
#మీభూమి_మీహక్కు_కార్యక్రమంలో_పాల్గొన్న_ఎమ్మెల్యే_ముత్తుముల
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు మండలం #పొదలకుంటపల్లి గ్రామంలో మీ భూమి – మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు పాల్గొని, ప్రభుత్వ రాజముద్ర పట్టాదారు పాసు పుస్తకములను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ భూమి హక్కు రైతుల భవిష్యత్తుకు పునాది అని, ప్రభుత్వం ప్రజల ఆస్తి హక్కులను పరిరక్షించేందుకు కట్టుబడి ఉందన్నారు. ప్రతి రైతు తన భూమిపై పూర్తి హక్కుతో సాగు చేసుకునేలా ప్రభుత్వం చట్టబద్ధమైన పత్రాలు అందజేస్తోందని తెలిపారు మన ప్రాంతంలో 70% రైతులు వ్యవసాయం మీద ఆధారపడి జీవనము సాగిస్తున్నారు అని వెలుగొండ ప్రాజెక్టు ద్వారా 56 నియోజకవర్గలకు నీరు అందించవచ్చు అని, హార్టికల్చర్ పెట్టడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని త్వరలో వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ప్రతీ ఎకరాకు పూర్తి స్థాయిలో నీరు అందించవచ్చు అని తెలిపారు...
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, సర్పంచ్ ఆవుల వెంకట సుబ్బమ్మ, రాజ గోపాల్, గొంటు బ్రాహ్మణంద రెడ్డి, చేరెడ్డి జయరాం రెడ్డి, రామిరెడ్డి, పందనబోయిన రవి , గంటు పుల్లారెడ్డి, మాజీ సర్పంచ్ లు శీలం శివారెడ్డి, బోదనబోయిన గోపాల్, కడియం శేషగిరి, దప్పిలి శ్రీనివాస్ రెడ్డి, గూడపురెడ్డి రాఘరమ రెడ్డి స్థానిక నాయకులు, మండల రెవెన్యూ అధికారులు మరియు గ్రామస్తులు తదితరులు పట్టాదారు పాసు పుస్తకం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
#MuthumulaAshokReddy #GiddalurMLA #GiddalurTelugudesamparty #మనగిద్దలూరుమనముత్తుముల #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు
#శ్రీ_జమాలయ్య_స్వామి_ఉరుసు_మహోత్సవంలో_ముత్తుములక్రిష్ణకిశోర్
#మార్కాపురంజిల్లా : #కొమరోలు మండలం #నాగిరెడ్డిపల్లె గ్రామంలో శ్రీ జమాలయ్య స్వామి వారి ఉరుసు మహోత్సవం వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారి సోదరుడు తెలుగుదేశం పార్టీ నాయకులు గౌ శ్రీ Krishna Kishore Muthumula గారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక దువా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువత, పెద్ద సంఖ్యలో ఉత్సవంలో పాల్గొన్నారు ఉరుసు మహోత్సవం గ్రామంలో సామరస్యానికి, సాంస్కృతిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని, గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ తమ సహకారం ఉంటుందన్నారు. అనంతరం గ్రామంలోని ప్రతీ కుటుంబంనీ ఆత్మీయంగా పలకరించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్బంగా గ్రామస్థులు క్రిష్ణ కిశోర్ గారిని శాలువా, పూల మాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు, పందనబోయిన భూపాల్ యాదవ్, పోలయ్య,మహేష్, బాలరాజు, ఆవులయ్య, శేఖర్, నారాయణ, అంజి, బాలకృష్ణ, రాజగోపాల్ స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు , అభిమానులు మరియు గ్రామస్థులు ఉరుసు మహోత్సవం లో పాల్గొన్నారు. #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్
శ్రీ నెమలిగుండ్ల రంగస్వామి బ్రహ్మోత్సవం ఏర్పాట్లపై సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే ముత్తుముల
భక్తుల భద్రత, సౌకర్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు నియోజకవర్గం #రాచర్ల మండలంలోని #రంగస్వామిగుండం గ్రామంలో ఏప్రిల్ 2 నుండి 5 తారీకు వరకు జరగనున్న #శ్రీనెమలిగుండ్లరంగస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా అధికార యంత్రాంగంతో సమావేశం నిర్వహించిన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు, ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని అధికారులకు సూచించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దేవాలయ ప్రాంగణంలో అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీసు, రెవెన్యూ, విద్యుత్, ఆర్డబ్ల్యుఎస్ (తాగునీరు), వైద్య మరియు అగ్నిమాపక శాఖల మధ్య సమన్వయంతో సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.భక్తుల రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, తాత్కాలిక వైద్య శిబిరాల ఏర్పాటు, సముచిత లైటింగ్ సౌకర్యాలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, 24 గంటల పర్యవేక్షణ చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 2, 3, 4, 5 తేదీలలో నిర్వహించబడనున్న బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజలు మరియు అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు.
#GiddalurTelugudesamparty #GiddalurMLA
#📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్










