Ravi  Talluri
ShareChat
click to see wallet page
@91775
91775
Ravi Talluri
@91775
feelgood
*_24/04/2025 - వైశాఖ శుద్ధ అష్టమి - శ్రీ బగళాముఖి దేవీ జయంతి_* *_వైశాఖ శుద్ధ అష్టమిని "బగళాష్టమి" అంటారు. ఈ రోజు దశమహావిద్యల్లో ఒకరైన బగళాముఖి అమ్మవారి జయంతి_*. *_చింతామణి ద్వీప నివాసిని అయిన ఆదిపరాశాక్తి భండాసుర సంహారానికి లలితాదేవిగా ఆవిర్భవించినప్పుడు ఆమెకు సహకరించిన పది మహాశక్తులైన_* *_1)కాళీ_* *_2)తార_* *_3)షోడశి_* *_4)భువనేశ్వరి_* *_5)భైరవి_* *_6)ఛిన్నమస్త_* *_7)ధూమవతి_* *_8)బగళాముఖి_* *_9)మాతంగి_* *_10)కమలాత్మిక_* *_దశమహావిద్యలని తెలుస్తుంది. అందుకే ఈ మహావిద్యలకి ఇంత గొప్ప ప్రాముఖ్యత కలిగింది_*. *_తంత్రసాధనలో దేవి_ _దశమహావిద్యల పూజ అత్యంత ప్రముఖమైనది. ఆ చరిత్రను బ్రహ్మాండపురాణం వివరంగా చెబుతుంది. ఉత్తర భారతదేశంలో *"పీతాంబరి"అనే పేరుతో శత్రువులను సైతం మనకు అనుకూలంగా మార్చే తల్లిగా బగళాముఖి దేవీని ప్రత్యేకంగా పూజిస్తారు_*. *_బగళాముఖి ధ్యానశ్లోమ్_* *_సౌవర్ణాసనసంస్థితాం త్రినయనాం_ _పీతాంశుకోల్లాసినీం_* *_హేమాభాంగరుచిం_ _శశాంకముకుటాం_ _సచ్చంపక గ్యుతాం_* *_హస్త్రైర్ముద్గరపాశవజ్రరశనాః సంబిభ్రతీం భూషణైః_* *_వ్యాప్తంగీం బగలాముఖీం త్రిజగతాం సంస్తంభినీం చింతయే_* *_బగళాముఖి సింహాసనంపై ఆశీనురాలై మూడుకన్నులతో, పసుపు పచ్చని వస్త్రాలు ధరించి, బంగారం వర్ణ శరీరం తో, శిరస్సున కిరీటంతో పాటు చంద్రరేఖను, మెడలో కలవపూల మాలను ధరించినదై, కొరడా, పాశం, వజ్రం భోజన పాత్రలను నాలుగు చేతులలో ధరించి మూడులోకాలలోనూ వ్యాపించినది, భక్త రక్షణ కోసం అన్నింటినీ స్తంభింప చేయగలిగిన శక్తి కలది._* *_స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాద, ప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్థంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది_*. *_అరిషడ్వర్గాల రూపంలో మనలోనే దాగిఉండే అంతర్గత శత్రువులను శిక్షించి, మన నోటి ద్వారా వచ్చే మాటలు ఎవరికీ హానీ చేయనివిగా, అందరికీ మేలు చేసేవిగా ఉండాలని, మనలో కోపాన్ని, దుర్వాక్కులను నశింపజేయమని ఈ అమ్మవారిని మనం ప్రార్థిస్తే సత్ఫలితాలు పొందుతారు_*. *_హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా, మధ్యప్రదేశ్ లోని దతియా, గుజరాత్ లోని వడోదరలతో పాటు అస్సాంలోని కామాఖ్యలో అతి ప్రాచీనమైన బగళాముఖి ఆలయాలున్నాయి_* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - దిగళుముఖబయంతి శుధాకంక్షయు దిగళుముఖబయంతి శుధాకంక్షయు - ShareChat
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* *_శుక్రవారం ఏప్రిల్ 24 2026_* *_శ్రీ పరాభవ నామ సంవత్సరం_* *_ఉత్తరాయనం వసంత ఋతువు_* *_వైశాఖమాసం శుక్లపక్షమి_* *_తిథి: అష్టమి రా 11.45వరకు తదుపరి నవమి_* *_వారం: శుక్రవారం (భృగువాసరే)_* *_నక్షత్రం: పుష్యమి రా 12.29వరకు తదుపరి ఆశ్లేష_* *_యోగం: ధృతి ఉ 07.58వరకు తదుపరి శూలం తె 05.25వరకు ఆ తర్వాత గండ_* *_కరణం: భద్ర మ 02.52వరకు తదుపరి బవ రా 11.45వరకు ఆ తదుపరి బాలువ_* *_వర్జ్యం: ఉ 09.16-10.47వరకు_* *_దుర్ముహూర్తం: ఉ 08.26-09.16 మరల మ 12.35-01.24వరకు_* *_అమృతకాలం: రసా 06.24-07.55_* *_రాహుకాలం: ఉ 10.30-12.00_* *_యమగండం/కేతుకాలం: మ 03.00-04.30_* *_సూర్యరాశి: మేషం_* *_చంద్రరాశి: కర్కాటకం_* *_సూర్యోదయం: 05.46_* *_సూర్యాస్తమయం: 06.12_* *_ఓం నమో బగళాముఖి దేవతాయానమహ_* *_సర్వేజనాః సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవతు ఓం శాంతి శాంతి శాంతిః_* *_శుభమస్తు సంతోషమస్తు_* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
*_రోజూ 6 గంటలు కూర్చుంటే – 10 ఏళ్లలో మీ శరీరానికి ఏమవుతుందో తెలుసా?_* *_(What Happens to Your Body If You Sit for 6 Hours Daily for 10 Years?)_* *_మీరు రోజూ ఎన్ని గంటలు కూర్చుంటున్నారు? ఆఫీసులో, ఇంట్లో, ప్రయాణంలో – మనం తెలియకుండానే చాలా సేపు కూర్చుంటాం._* *_నిపుణులు ఇప్పుడు "కూర్చోవడం కొత్త పొగతాగడం" (Sitting is the New Smoking) అంటున్నారు. ఎందుకంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే నష్టాలు చాలా తీవ్రమైనవి._* *_రోజూ 6 గంటలు కూర్చుంటే – 10 ఏళ్లలో ఏం జరుగుతుంది?_* *_ప్రభావం వివరణ :_* *_వెన్ను నొప్పి శాశ్వతం ఎక్కువసేపు కూర్చోవడం వెన్నెముకపై ఒత్తిడి పెంచుతుంది. డిస్క్లు దెబ్బతింటాయి._* *_జీర్ణక్రియ దెబ్బతింటుంది :_* *_కూర్చున్న స్థితిలో కడుపుపై ఒత్తిడి పెరిగి, జీర్ణక్రియ మందగిస్తుంది._* *_బరువు పెరుగుతారు, కేలరీలు బర్న్ కావు, కొవ్వు పేరుకుపోతుంది గుండె ప్రమాదం 50% పెరుగుతుంది ఎక్కువసేపు కూర్చోవడం వల్ల రక్త ప్రసరణ తగ్గి, గుండెపోటు రిస్క్ పెరుగుతుంది._* *_ఇంకా తెలుసా ?_* *_సమస్య ప్రభావం కండరాలు బలహీనం నిలబడే కండరాలు ఉపయోగం లేకుండా పోతాయి._* *_మధుమేహం ప్రమాదం ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గుతుంది._* *_పోస్టర్ (భంగిమ) దెబ్బతింటుంది భుజాలు ముందుకు వంగి, వెన్ను గుండ్రంగా మారుతుంది._* *_మానసిక ఒత్తిడి నిశ్చలత్వం వల్ల డిప్రెషన్ ప్రమాదం పెరుగుతుంది._* *_మీ ఆరోగ్యాన్ని కాపాడు కోవడానికి చిట్కాలు :_* *_సూచన ఎలా చేయాలి :_* *_ప్రతి 30 నిమిషాలకు – 5 నిమిషాలు నిలబడండి టైమర్ పెట్టుకోండి. లేచి నిలబడండి, కొంచెం నడవండి._* *_నిలబడి పనిచేయండి స్టాండింగ్ డెస్క్ వాడండి. లేదా ఎత్తైన టేబుల్ దగ్గర నిలబడండి._* *_వాకింగ్ మీటింగ్స్ :_* *_ఫోన్లో మాట్లాడుతూ నడవండి, స్ట్రెచ్ చేయండి లేచిన ప్రతిసారీ, 1 నిమిషం స్ట్రెచ్ చేయండి._* *_నడవడానికి అవకాశాలు వెతకండి లిఫ్ట్ కాకుండా మెట్లు ఎక్కండి. దూరంగా పార్క్ చేయండి._* *_గుర్తుంచుకోండి :-_* *_కూర్చోవడం :_* *_ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే నష్టాలను వ్యాయామం కూడా పూర్తిగా తగ్గించలేదు. అంటే – మీరు ఉదయం వ్యాయామం చేసినా, మిగతా రోజంతా కూర్చుంటే ప్రమాదం అలాగే ఉంటుంది._* *_పరిష్కారం:-_* *_తరచుగా కదలండి. కూర్చోవడం తగ్గించండి. నిలబడటం పెంచండి._* *_నేడే మొదలుపెట్టండి – మీ వెన్ను, గుండె, జీర్ణక్రియ మీకు థ్యాంక్యూ చెప్తాయి_* #మన సంప్రదాయాలు సమాచారం
*తల్లి కొరకు కోర్టు మెట్లు ఎక్కిన అన్నదమ్ములు - కేసును చూసి షాక్ కు గురి అయిన జడ్జి:* *విచిత్ర సంఘటన…* *ఇటీవల సౌదీ రియాద్ హైకోర్ట్ లో ఒక కేసు బెంచ్ ముందుకొచ్చింది. జడ్జి కేసు చదువుతుండగా కేసు వేసిన వారు అన్న దమ్ములు. అన్న వయస్సు 80 సం.రాలు, తమ్ముని వయస్సు 70 సం.రాలు. బహుశా ఇది ఆస్తి కి సంభందించిన కేసు ఏమో! ఇంత పెద్ద వయస్సులో వీరికి ఆస్తి ఎందుకో అనుకుంటూ కేసు పూర్తిగా చదివాకా జడ్జి కి దిమ్మ దిరిగింది. ఇంత వరకు ఇటువంటి కేసు తన ముందుకు రాలేదు. వారికి ఆస్తి పాస్తులు కూడ ఎక్కువ లేవు.* *కేసు పూర్వ పరాలు ఏమిటంటే తన అన్న వద్ద తల్లి ( 110 సం.రాలు. ) గత 40 సం.రాలుగా ఉంటుంది. ఆలనా పాలన బాగానే చూసుకుంటాడు. తమ్ముని బాధ ఏమిటంటే తన తల్లిని తన వద్దకు పంపమని, సంవత్సరాల తరబడి ప్రాదేయబడ్డా కూడ తన అన్న తల్లిని తమ్ముని వద్దకు పంపడం లేదు. జడ్జి ఇద్దరినీ పిలిచి విడి విడిగా మీరే ఒక నిర్ణయానికి రండి అని అడిగాడు, కానీ ఇద్దరు అన్నదమ్ములు కూడ తల్లి తన వద్దనే ఉండాలని పట్టుబట్టారు. తుదకు తల్లిని స్ట్రెచ్చర్ లో కోర్టులో హాజరు పర్చారు. జడ్జి తల్లిని అడిగాడు ఎవరి వద్ద ఉంటావు అని, అప్పుడు ఆ తల్లి తనకు ఇద్దరు కుమారులు సమానమేననీ, ఇంతకన్నా ఏమి చెప్పలేనని, మీరు ఏం చెప్తే నేను అక్కడే ఉంటాను కానీ నేను ఎవరి మనసును గాయ పరిచలేను అంది.* *జడ్జి ఇద్దరన్నదమ్ముల ఆరోగ్య సమాచారం సేకరించి తల్లిని తమ్ముని వద్ద ఉండాలని ఆదేశించాడు. ఆ ఆదేశాలతో అన్న అక్కడే కుప్పకూలి పోయాడు. ఇది ప్రేమ అంటే...ఈ రోజుల్లో తల్లి తండ్రులను పోషించలేక కొట్టి చంపడమో, లేక వృద్ధ శ్రమంలో చేర్పించడమో లేక వంతుల వారిగా పోషించడమో చూస్తున్నాము కానీ ఇటువంటి కేసు వినలేదు*. *తల్లి తండ్రుల పాదాల కింద స్వర్గం ఉంటుందని ఎంత మందికి తెలుసు*. *అందుకే తమ పిల్లలకు చిన్నప్పటి నుండి ఇంట్లో మరియు బడులలో వారి విలువలను గుర్తించేటట్లు బోధించాలి*. *ఈ సౌదీ కేసు ఫలితం తమ్ముని వద్ద తల్లి ఉండాలని జడ్జి ఆదేశించడమే*. *తమ్ముడు వివాహితుడు, పిల్లలు ఉన్నవాడు కాబట్టి అతడి ఇంటి పరిస్థితి మెరుగ్గా ఉందని నిర్ణయించాడు*. *తీర్పు వివరాలు* *ఆరోగ్య పరీక్షలు చేసిన తర్వాత జడ్జి ఈ తీర్పు ఇచ్చాడు*, *అన్న కుప్పకూలిపోయినా ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు*. *కేసు ఇక సమతుల్యమైంది, ఇద్దరూ రాజీ అయ్యారు* *ప్రభావం* *ఈ తీర్పు తల్లీ-పిల్లల బంధానికి అద్భుత ఉదాహరణగా మారింది, దేశవ్యాప్తంగా ఆదరణ పొందింది.* *ఈ సంఘటన పాతది, ఖచ్చితమైన తేదీ తెలియదు కానీ ఎంతో కాలం క్రితం జరిగింది. 2025 డిసెంబర్‌లో సోషల్ మీడియాలో వైరల్ అయి, ఇటీవల తెలుగు సర్కిల్స్‌లో పునఃప్రచారం చేశారు.* *_వివరాలు_* *అల్-అసియా, కాసిమ్ కోర్టులో హిజామ్ అల్-ఘామ్ది (పెద్ద అన్న) మరియు తమ్ముడు తల్లి (100+ ఏళ్లు) పోషణ కోసం కోర్టుకు వచ్చారు*. *పాత కేసు అయినప్పటికీ, ఇటువంటి ప్రేమ వివాదాలు అరుదు*. *ప్రచారం* *ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో 2026 ఏప్రిల్ 22 నాటికి తెలుగు పోస్టులు వైరల్*. *"ఇటీవల" అని పేర్కొన్నా, అసలు పాత సంఘటన* #మన సంప్రదాయాలు సమాచారం
*_లివర్ సిర్రోసిస్: అవగాహన_- _నివారణ - చికిత్స_* *లివర్ సిర్రోసిస్ అనేది కాలేయం తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు ఏర్పడే పరిస్థితి*. *_కాలేయ సమస్యల ప్రధాన లక్షణాలు_* *​మీ శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే అప్రమత్తమవ్వండి:* *1.-​తీవ్రమైన బలహీనత మరియు రోజంతా అలసట*. *2.-​ఆకలి మందగించడం, వాంతులు మరియు వికారం.* *3.-​కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారడం (కామెర్లు).* *4.-​కడుపు కుడి వైపు పైభాగంలో నొప్పి లేదా వాపు*. *5.-​వేగంగా బరువు తగ్గడం మరియు నిద్రలేమి.* *6.-​మల విసర్జనలో రక్తం పడటం*. *_​ఆయుర్వేద ఆహార నియమాలు_ (Do's & Don'ts)* ​✅ *తీసుకోవలసిన ఆహారాలు:* *​చేదు కూరగాయలు* : *_కాలేయ నిర్విషీకరణకు (Detox) ఇవి ఎంతో మేలు చేస్తాయి._* *​సూపర్ ఫుడ్స్:* *_ఆకుకూరలు, వెల్లుల్లి, పసుపు, బెర్రీలు మరియు దుంపలు కాలేయ కణాలను రక్షిస్తాయి_*. *​అల్లం & పెరుగు* : *_ఇవి కాలేయ వాపును (Inflammation) తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి_*. *​త్రిఫల చూర్ణం:* *_ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమం కాలేయానికి దివ్యౌషధం_*. ​ *నివారించవలసినవి* : *_​మద్యపానం మరియు ధూమపానం_*. *​ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్స్, అధిక చక్కెర మరియు రెడ్ మీట్.* *_​అతిగా వేయించిన పదార్థాలు (Oily Foods) మరియు నిల్వ ఉంచిన ఆహారం._* *​రాత్రిపూట అతిగా భోజనం చేయడం.* *_జీవనశైలి మార్పులు & నివారణ_* *​క్రమ తప్పకుండా వ్యాయామం:* *కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతుంది*. *_తగినంత విశ్రాంతి:_* *కాలేయం తనను తాను రిపేర్ చేసుకోవడానికి నిద్ర అవసరం.* *​టాక్సిన్స్ నివారణ* : *_రసాయనాలు ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండటం ద్వారా కాలేయంపై భారం తగ్గుతుంది._* *ఆయుర్వేద మూలికలు -* *_సంప్రదాయ చికిత్స_* *​కాలేయ రక్షణలో ఈ క్రింది మూలికలు కీలక పాత్ర పోషిస్తాయి:* *​పునర్నవ & నేల వేము:* *కాలేయ వాపును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి*. ​ *కటుక రోహిణి:* *ఇది కాలేయానికి సహజ టానిక్‌లా పనిచేస్తుంది*. ​ *ఆయుర్వేద ఔషధాలు* : *లివ్ అమృత్, పునర్నవారిష్ట, మరియు ఫారెస్టికా సిరప్ వంటివి వైద్యుల పర్యవేక్షణలో వాడవచ్చు.* _సూచన: పైన పేర్కొన్న సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే_ ​ *కాలేయ వ్యాధిగ్రస్తులు తీసుకోవలసిన జాగ్రత్తలు:* *​స్వయంగా మందులు వాడకూడదు (No Self-Medication): ​చాలామంది తలనొప్పి లేదా జ్వరం వస్తే వెంటనే* *'పారాసెటమాల్' వంటి పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. కానీ కాలేయం దెబ్బతిన్నప్పుడు ఇలాంటి మందులు వాడటం ప్రాణాంతకం కావచ్చు. అందుకే వైద్యుల సలహా లేకుండా ఏ మందులూ వేసుకోకూడదు*. *2.-​ మద్యపానానికి స్వస్తి* : *​లివర్ సిర్రోసిస్ లేదా ఫ్యాటీ లివర్ ఉన్నవారు ఒక్క చుక్క మద్యం తీసుకున్నా అది కాలేయాన్ని మరింత వేగంగా దెబ్బతీస్తుంది. కాబట్టి మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి.* *3.-​ రెగ్యులర్ చెకప్స్:* *​లివర్ ఫంక్షన్ టెస్ట్ (LFT), అల్ట్రాసౌండ్ స్కాన్ వంటివి డాక్టర్ చెప్పిన సమయానికి చేయించుకుంటూ వ్యాధి స్థితిని గమనిస్తూ ఉండాలి*. #మన సంప్రదాయాలు సమాచారం
#మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - HNDSM India KEDARNATH Start Date: April 22, 2026 BADRINATH Start Date: April 23,2026 AMARNATH Start Date: July 3, 2026 HNDSM India KEDARNATH Start Date: April 22, 2026 BADRINATH Start Date: April 23,2026 AMARNATH Start Date: July 3, 2026 - ShareChat
*_నేరపరిశోధన:_* *_శ్రావస్తి నగరాన్ని ప్రసేనజిత్తు_* *పరిపాలించే కాలంలో దూరదేశం* *నుంచి ఒంటరివాడైన బ్రాహ్మణుడు ఒకడు వచ్చాడు.* *అదృష్టవశాత్తూ నగరంలోని గొప్ప వైశ్యుల ప్రాపకం ఆ బ్రాహ్మణుడికి దొరికింది. నిత్యమూ ఆయనకు అన్న వస్త్రాలు పుష్కలంగా దొరకడమే గాక దానాలూ, దక్షిణలూ, సంభావనలూ దొరుకుతుండేవి. ఒంటరివాడు కావడం చేత ఆయన ఇలా దొరికిన సొమ్మును కొద్దికాలానికి వెయ్యి బంగారు దీనారాలుగా నిలువ చేసి, దాన్ని మరొక విధంగా భద్రపరచలేక, అడవిలో ఒక చోట పాతి పెట్టేశాడు*. *భార్యా బిడ్డలూ, అన్నదమ్ములూ, బంధువులూ, ఎవరూ లేని ఆబ్రాహ్మణుడి పంచప్రాణాలూ ఆ బంగారం మీదే ఉండేవి. రోజూ ఆయన అడవికి పోయి, తాను పాతిపెట్టిన ధనం ఎవరూ తవ్వుకు పోలేదు కదా అని చూసుకుని తిరిగి ఇంటికి వెళ్తుందేవాడు.* *ఒకరోజు ఇలాగే ఆయన అడవికి పోయి చూసేసరికి అక్కడ బంగారం లేదు. అంతకుముందే దానినెవరో తవ్వి తీసుకున్నారు. ఇది తెలుసుకుని బ్రాహ్మణుడు పిచ్చెత్తిపోయి, గుండెలు బాదుకుని ఎడుస్తూ నగరంలో వచ్చి పడ్డాడు. కనిపంచినవారి కల్లా తనకు కలిగిన ఆపదను గురించి చెప్పుకున్నాడు. ఆయనను ఓదార్చటం ఎలాగో ఎవరికీ తెలియలేదు*. *“నా డబ్బే పోయాక నేను జీవించటం మాత్రం దేనికి? నది దగ్గరకెళ్ళి అందులో పడి ఆత్మహత్య చేసుకుంటాను! అంటూ బ్రాహ్మణుడు నది కేసి పరిగెత్తాడు*. *రాజు ప్రసేనజిత్తు అప్పుడే నదిలో స్నానం చేసి తిరిగివస్తూ*. *ఆత్మహత్య చేసుకోబోయే బ్రాహ్మణుడిని చూసి, విషయం తెలుసుకుని, 'ఎందుకయ్యా పిచ్చి బ్రాహ్మణుడా, ఆత్మహత్య చేసుకుంటావు? రాజ్యంలో దొంగతనం జరిగితే తెలుసుకునేటందుకు నేను లేనా? నీ సొత్తు అపహరించినవాణ్ణి పట్టుకుంటాను. లేదా, నీ సొమ్ము నా బొక్కసం నుంచి ఇప్పిస్తాను. నువు నీ డబ్బు పాతిపెట్టిన చోటుకు ఏమైనా గుర్తులుంటెే చెప్పు?' అని అడిగాడు*. *“మహాప్రభూ, నేను ధనం పాతిపెట్టి నచోట అడవిబీర మొక్క ఒకటి గుర్తుండేది. ఇప్పుడు అది కూడా పోయింది," అన్నాడు బ్రాహ్మణుడు* *అడవిబీర మొక్క ఎలా గుర్తవుతుంది*. *అలాంటివి అడవిలో ఎన్నయినా ఉండవచ్చు గదా?* *అన్నాడు రాజు* *“లేదు, మహాప్రభూ! ఆ ప్రాంతంలో అదొక్కటే అడవిబీరమొక్క, అన్నాడు బ్రాహ్మణుడు*. *“అయితే, నువ్వక్కడ సొమ్ము దాచిన సంగతి ఎవరెవరికి తెలుసు? అన్నాడు రాజు*. *“మహాప్రభూ, నాకు తప్పనిచ్చి మరే పిట్టకు కూడా తెలీదు. చెప్పుకునేందుకైనా నాకెవ్వరున్నారు? “మహాప్రభూ, నాకు తప్పనిచ్చి మరే పిట్టకు కూడా తెలీదు. చెప్పుకునేందుకైనా నాకెవ్వరున్నారు? నేనక్కడికి పోవటం ఎన్నడూ ఎవరూ చూసి ఉండలేదు," అన్నాడు బ్రాహ్మణుడు*. *రాజు తన భవనానికి తిరిగి వచ్చి ఈ దొంగతనం గురించి చాలా తీవ్రంగా ఆలోచించాడు.* *ఆ దొంగను పట్టుకునే ఉపాయం రాజుకు కొద్దిసేపట్లోనే స్పురించింది. ఆయన మంత్రిని పిలిపించి;* *“మంత్రీ, నాకు ఆరోగ్యం సరిగా లేదు. వెంటనే నేను వైద్యులను చూడటం మంచిదనుకుంటున్నాను. నగరంలో ఉన్న వైద్యుల నందరినీ పిలిపించండి" అన్నాడు*. *త్వరలోనే వైద్యులంతా వచ్చారు*. *రాజు ఒక్కొక్కరినే తన సన్నిధికి రప్పించి, “ఏమయ్యా, నువు నిన్నా, ఇవాళ ఏయే రోగాలకు ఎలాంటి బెషధం ఇచ్చావు?* *ఏయే మూలికలు వాడావు?' అని ప్రశ్నించాడు.* *వారంతా చెప్పింది విని పంపివేయసాగాడు* *ఇదంతా యోచనగా చూస్తున్న మంతికి రాజుగారి అభిప్రాయం కొంచెమైనా అర్దం కాలేదు.* *ఆఖరుకు ఒక వైద్యుడు "ప్రభూ, మాతృదత్తుడు అనే వైద్యశిఖామణికి అడవి బీరమొక్క రసం నిన్న వాడాను" అన్నాడు.* *రాజు ఆసక్తితో, అలాగా? ఆ మొక్క ఎక్కడ దొరికింది?. అని అన్నాడు. “అడవిలో కష్టపడి వెతికి నా సేవకుడు పట్టుకొచ్చాడు మహారాజా" అన్నాడు వైద్యుడు*. *“అయితే, ఆ సేవకున్ని మావద్దకు వెంటనే పంపించు, అన్నాడు రాజు.* *వెద్యుడి సేవకుడు రాగానే రాజు "ఒరే నిన్న నువ్వు అడవిబీర మొక్కను తవ్వినప్పుడు దానికింద దొరికిన వెయ్యి నాణేలను ఏం చేసావు?" అన్నాడు.* *సేవకుడు తెల్లబోయి, మాయింట దాచాను, మహారాజా! అన్నాడు.* *అవి ఫలానా బ్రాహ్మణుడివి అప్పగించి వెళ్లు, అన్నాడు రాజు.* *చిత్తమంటూ సేవకుడు నమస్కరించి వెళ్ళిపోయాడు*. *ఇదంతా పరికిస్తున్న మంత్రికి, రాజు ఏ విధంగా ఆ బంగారం ఎత్తుకుపోయిన వాణ్ణి గుర్తించాడో ఎంత ఆలోచించినా బోదపడలేదు.* *రాజునే అడిగి ఆ రహస్యం తెలుసుకోదలిచాడు.* *“మహారాజా, మీరీ దొంగతనం చేసినవాన్ని ఇంత సులువుగా ఎలా పట్టగలిగారో నాకు అర్ధం కాలేదు.* *అన్నాడు మంత్రి.* *రాజు చిరు నవ్వు నవ్వి ఇలా వివరించాడు*. *“దొంగతనం గురించి బ్రాహ్మణుడు చెప్పినదంతా నిజమనే నమ్మకంతోటే నేను దొంగను పట్టటానికి ఆలోచించాను*. *నగరంలోని ఇన్ని లక్షలమందిలో ఒక్కడే ఆ దొంగతనం చేసి ఉండాలి గద! అక్కడ ధనం ఉన్న సంగతి ఏ ఒక్కరికి గాని తెలియదని బ్రాహ్మణుడు చెబుతున్నాడు. ఆ ప్రత్యేక స్థలంలో ధనం ఉన్నదని తెలియకుండా అక్కడ తవ్వవలిసిన అవసరం ఎవరికి కలుగుతుంది? అడవిబీర మొక్కతో పని ఉన్నవాడికిమాత్రమే.* *ఆ చుట్టుపక్కల ఎక్కడ కూడా అడవిబీర మొక్క లేదని, ఆ సంగతి బంగారం పోగొట్టుకున్న బ్రాహ్మణుడే చెబుతున్నాడు. అది నిజమేనని నాకు నమ్మకం కలిగింది.* *అదీగాక, ధనంకోసమే తవ్వినవాడెవడైనా అడవిబీర మొక్కను అక్కడే పారేసి పోతాడు. కానీ, అడవి బీర మొక్కకోసం తవ్విన వాడైతేనే మొక్కనూ, దాంతో పాటు ధనాన్నీ కూడా తీసుకుపోవడం జరుగుతుంది. అయితే అడవిబీర మొక్కతో ఎవరికి పని ఉంటుంది? అని ఆలోచిస్తే వైద్యుడికి మాత్రమే పని ఉంటుందని తెలిసింది. అందుచేతనే వైద్యులందరిని పిలిపింఛాను . అడవిబీర మొక్కతో వైద్యం చేసిన వైద్యుడు దొరకగానే దొంగ కూడా దొరికిపోయాడు. ఇందులో కష్టం ఏమిటీ మంత్రీ!"* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - నేర పరిశోధన చిట్టి పొట్టి కథలు 05 సితార నేర పరిశోధన చిట్టి పొట్టి కథలు 05 సితార - ShareChat