Ravi  Talluri
ShareChat
click to see wallet page
@91775
91775
Ravi Talluri
@91775
feelgood
*_ఓహ్ సమాజమా_* *భార్యలు కాబోయే వారు కన్యలుగానే ఉండాలని కోరుకోవడం అనాగరికం, మూర్ఖత్వం అని ప్రముఖ నటి నీనా గుప్తా చెప్పింది. మన దేశం ఇంకా మారలేదని ఆవేదన వ్యక్తం చేసింది*. *తనకు ఒక భర్త ఉండగా వివాన్ రిచర్డ్స్ అనే క్రికెటర్ ను అడిగి, అతడితో నీనా గుప్తా ఒక బిడ్డను కనింది. పెళ్ళికి ముందే అనేక మందితో సహజీవనం చేసింది. ఇప్పటికీ సొసైటీలో హై ప్రొఫైల్ లేడీగా చలామణిలో ఉంది. మగవాళ్ళు ఇంకా భార్యల కన్నీళ్ళని కోరుకుంటున్నారని ,ఇది మన దేశం అభివృద్ధి చెందుతున్నట్టా..?* *లేక వెనకబడి పోతున్నట్టా.??. అని ఆలోచించాలని చెప్పింది. భర్త ఉండగానే తనకు ఇష్టమైన వాడితో తాను ఒక బిడ్డను కన్నానని చెప్పింది. తన కూతురు కూడా పెళ్లి కాకుండా ఎవరినైనా సెలెక్ట్ చేసుకోమని చెప్పానని పేర్కొంది*. *ఇప్పటికి పెళ్లయిన మహిళలు భర్త కాళ్ళకు, మామ కాళ్ళకు దండం పెట్టుకోవడం మంచి పద్ధతి కాదని, అలా ఉంటే స్త్రీ స్వేచ్ఛ ఎలా సాధ్యమని నిలదీసింది . స్త్రీని ఇంకా కించపరచడం సమాజం మానుకోలేదని స్త్రీలు కూడా ఆ బానిస సంకెళ్ల నుంచి బయటికి రావాలని కోరింది.* *సమానత్వం, స్వేచ్ఛ నాగరికతలకు పాత సాంప్రదాయాలు, అడ్డుగా ఉంటాయని వాటిని తొలగించుకుని ముందుకు పోతేనే స్త్రీ స్వేచ్ఛ సాధ్యమని చెప్పింది.. నీనా గుప్తాకు ఇప్పుడు 67 ఏళ్ళు..* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
#మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - - SAMSON L0 ss 23 VU UINAMGMIIAILIAIUI K3007 491 99089 48909 JUST RIDII BATTERY   ه ಖಿಗಲಿನರಂಡು ಮಯಾಎಲು ಗಶಿವಿನಾ సెమీస్చేరద్య రెక్కలు ఇవిగో! దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేదాతో ఓటమిపాలైన టీమిండియా సంక్లిష్టంగగా మారాయి. భారీ పరాజయంతో సెమీ-ఫైనల్ అవకాశాలు భారత జట్టు నెట్ రన్ రేట్-3.800కు పడిపోయింది. దీంతో వెస్టిండీస్, జింబాబ్వే మ్యాచ్లలో భారీ సూపర్-శిలో మిగిలిన విజయాలు సాధించదం భారత్కు తప్పనిసరి అయింది. కేవలం గెలుపు మాత్రమే కాకుందా నెట్ రన్ రేట్ను మెరుగుపరచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది: ఇతర జట్ల ఫలితాలపై కూడా భారత్ భవితవ్యము మ్యాచ్ల్లో భారీ విజయాలు సాధిస్తేనే ఆధారపడనుంది  తదుపరి ನಮಿಸ ಆಕಲು ನಜಿಎಂಗಾ ಹಂಡನುನ್ನಾಯ. + اآ + - SAMSON L0 ss 23 VU UINAMGMIIAILIAIUI K3007 491 99089 48909 JUST RIDII BATTERY   ه ಖಿಗಲಿನರಂಡು ಮಯಾಎಲು ಗಶಿವಿನಾ సెమీస్చేరద్య రెక్కలు ఇవిగో! దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేదాతో ఓటమిపాలైన టీమిండియా సంక్లిష్టంగగా మారాయి. భారీ పరాజయంతో సెమీ-ఫైనల్ అవకాశాలు భారత జట్టు నెట్ రన్ రేట్-3.800కు పడిపోయింది. దీంతో వెస్టిండీస్, జింబాబ్వే మ్యాచ్లలో భారీ సూపర్-శిలో మిగిలిన విజయాలు సాధించదం భారత్కు తప్పనిసరి అయింది. కేవలం గెలుపు మాత్రమే కాకుందా నెట్ రన్ రేట్ను మెరుగుపరచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది: ఇతర జట్ల ఫలితాలపై కూడా భారత్ భవితవ్యము మ్యాచ్ల్లో భారీ విజయాలు సాధిస్తేనే ఆధారపడనుంది  తదుపరి ನಮಿಸ ಆಕಲು ನಜಿಎಂಗಾ ಹಂಡನುನ್ನಾಯ. + اآ + - ShareChat
*_#బిల్లా, #రంగా ఎవరు❓_* *_వాళ్లను #ఉరి తీయాలని #దేశమంతా ఎందుకు కోరుకుంది❓_* *_C tv news..._* *అది 1982, జనవరి 31. తిహార్ జైల్లో ఇద్దరు కరడుగట్టిన నేరగాళ్లను ఉరి తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ నేరగాళ్ల పేర్లు బిల్లా, రంగా తెల్లవారు జామున 5 గంటలకు వాళ్లిద్దరూ నిద్ర లేవగానే, జైలు అధికారులు టీ ఇచ్చారు.* *మేజిస్ట్రేట్ ముందు విల్లు ఏమైనా రికార్డు చేయించుకోవాలనుకుంటున్నారా అని చివరిసారిగా వారిని అధికారులు అడిగారు. ఆ ఇద్దరూ లేదని చెప్పారు*. *ఇద్దరి చేతులు, కాళ్లకు అధికారులు బేడీలు వేశారు. డెత్ వారెంట్‌లో ఉరి తీసేందుకు సూచించిన సమయానికి ఇంకా పది నిమిషాలు ఉంది. ఉరికంబం వైపు వాళ్లను తీసుకువెళ్లడం మొదలుపెట్టారు.* *''రంగా చాలా ఉత్సాహంగా ఉండే మనిషి. అతడి ఎత్తు ఐదడుగుల 10 అంగుళాలు. ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు. తనను ఉరి తీస్తున్నారన్న బాధ అతడిలో కనిపించేది కాదు. అప్పట్లో బాలీవుడ్‌లో 'రంగాఖుష్' అనే పేరుతో ఓ సినిమా కూడా వచ్చింది'' అని చెప్పారు 'బ్లాక్ వారెంట్ కన్ఫెషన్స్ ఆఫ్ ఎ తిహార్ జైలర్' పుస్తక రచయిత సునీల్ గుప్తా. బిల్లా, రంగాల ఉరిశిక్షల అమలుకు ఆయన ప్రత్యక్ష సాక్షి. ఆ సమయంలో ఆయన ఆ జైల్లో అధికారిగా ఉన్నారు*. *''బిల్లా వృత్తిరీత్యా టాక్సీ డ్రైవర్. అతడి ఎత్తు ఐదున్నర అడుగులు. ఎప్పుడూ సీరియస్‌గా ఉండేవాడు. రంగానే తనను మోసపూరితంగా నేరంలోకి లాగాడంటూ ఏడుస్తుండేవాడు. బిల్లానే తనను నేరంలోకి లాగాడని రంగా అనేవాడు. ఇలా ఇద్దరూ ఒకరినొకరు నిందించుకునేవారు'' అని సునీల్ వివరించారు.* *రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించే వరకూ ఉరి శిక్ష పడ్డ ఖైదీలను కూడా చట్ట ప్రకారం సాధారణ ఖైదీల్లానే చూస్తారని సునీల్ గుప్తా అన్నారు. పిటిషన్ తిరస్కరణ తర్వాతే వారిని చీకటి గదిలోకి తీసుకువెళ్లి, బేడీలు వేస్తారని చెప్పారు*. *''నేను ఆ జైలుకు వెళ్లే సమయానికి వాళ్ల న్యాయ ప్రక్రియ కొనసాగుతోంది. ఆ ఇద్దరూ బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్ ఆడుతూ కనిపించేవారు'' అని సునీల్ చెప్పారు.* *_#లిఫ్ట్ ఇచ్చింది గూండాలు’_* *ఒక రిపోర్టర్‌గా నేను గమనించినదాని ప్రకారం.. ఈ తరంలో మనం చూసిన అతిపెద్ద నేరం నిర్భయ ఘటన. అలాగే, మన ముందు తరంలో బిల్లా, రంగా కేసు కూడా అలాంటిదే'' అని 'బ్లాక్ వారెంట్' సహరచయిత, హిందుస్థాన్ టైమ్స్ పొలిటికల్ ఎడిటర్ సునేత్రా చౌధరీ అన్నారు*. *''1978 ఆగస్టు 26న (శనివారం) సాయంత్రం 16 ఏళ్ల గీతా చోప్రా, ఆమె సోదరుడు 14 ఏళ్ల సంజయ్ చోప్రా.. ఆల్ ఇండియా రేడియో స్టూడియోకు వెళ్లేందుకు లిఫ్ట్ అడిగి ఓ కారు ఎక్కారు. అక్కడ 'యువవాణి' అనే కార్యక్రమంలో వాళ్లు పాల్గొనాల్సి ఉంది. దురదృష్టవశాత్తు వారికి లిఫ్ట్ ఇచ్చింది ఇద్దరు గూండాలు. ఆ ఇద్దరూ బొంబాయి నుంచి దిల్లీకి వచ్చిన చిల్లర నేరగాళ్లు. పిల్లలను అపహరించి, వాళ్ల దగ్గరి నుంచి డబ్బులు వసూలు చేయాలన్నది వారి పథకం. అలా బాగా డబ్బు గుంజాలని భావించి.. గీతా, సంజయ్‌లను వాళ్లు అపహరించారు. కానీ, ఇది తర్వాత అత్యాచారం, హత్య కేసుగా మారిపోయింది'' అని చెప్పారు*. *గీతపై అత్యాచారం చేయడం.. ఆమెను, ఆమె సోదరుణ్ని హత్య చేయడం మొత్తం భారత్‌ను కుదిపేసింది*. *ఈ కేసు గురించి 1978, సెప్టెంబర్ 30న వెల్లడైన 'ఇండియా టుడే' సంచికలో దిలీప్ బాబ్ ఓ కథనం రాశారు*. *''గీతా, సంజయ్‌ల తండ్రి నావికాదళంలో కెప్టెన్. ఆయన పేరు ఎమ్ఎమ్ చోప్రా. అపహరణకు గురైన రోజు సాయంత్రం 6:15కు.. గీత, సంజయ్ వారి ఇంటి (ధౌలా కువా ఆఫీసర్స్ క్వార్టర్స్) నుంచి బయటకు వెళ్లారు. గీత జీసస్ అండ్ మేరీ కాలేజీలో కామర్స్ రెండో సంవత్సరం విద్యార్థిని. పార్లమెంటు వీధిలోని ఆల్ ఇండియా రేడియో స్టూడియోకు ఆమె వెళ్లాల్సి ఉంది'' అని పేర్కొన్నారు*. *'గీత సోదరుడు సంజయ్ 5 అడుగుల 10 అంగుళాల ఎత్తు ఉంటాడు. అతడు పదో తరగతి విద్యార్థి. ఆ రోజు ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో బయట అంతా మబ్బులుగా ఉంది. రేడియో కార్యక్రమం ముగిసిన తర్వాత ఆకాశవాణి భవనం నుంచి గీతను, సంజయ్‌ను ఎక్కించుకుని ఎమ్ఎమ్ చోప్రా ఇంటికి తీసుకువెళ్లాలి. ఆయన అక్కడికి వెళ్లేసరికి గీత, సంజయ్ లేరు. కార్యాలయం లోపలికి వెళ్లి, అడిగితే.. వాళ్లు అసలు రికార్డింగ్‌కే రాలేదని ఆల్ ఇండియా రేడియో సిబ్బంది చెప్పారు'' అని దిలీప్ బాబ్ రాశారు*. *_గీతపై #అత్యా*చారం_* *గీత, సంజయ్‌ల ఆచూకీ కనుక్కొనేందుకు దిల్లీతోపాటు ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా రంగంలోకి దిగారు.-* *''సాయంత్రం 6 గంటలకు లోహియా ఆసుపత్రి దగ్గర నా స్కూటర్ పక్క నుంచి ఓ ఫియట్ కారు చాలా వేగంగా వెళ్లిపోయింది. అందులో నుంచి ఓ అమ్మాయి అరుపు వినిపించింది. నేను వారిని వెంబడించి, దగ్గరికి వెళ్లాను. కారు ముందు సీట్లలో ఇద్దరు వ్యక్తులున్నారు. వెనుక సీట్లలో ఓ అమ్మాయి, అబ్బాయి కనిపించారు'' అని భగవాన్ దాస్ అనే ప్రత్యక్ష సాక్షి పోలీసులకు చెప్పారు.* *'రెడ్ సిగ్నల్ దగ్గర కారు నెమ్మదించింది. ఏం చేస్తున్నారంటూ నేను కారు వైపు అరిచాను. కారు అద్దానికి మొహం ఆనించి ఉన్న అబ్బాయి తన టీషర్ట్ వైపు చూడమని సైగ చేశాడు. ఆ టీషర్ట్‌కు రక్తపు మరకలు ఉన్నాయి. ఆ అమ్మాయి వెనుక నుంచి డ్రైవర్ జుట్టు లాగుతోంది'' అని భగవాన్ వివరించారు*. *''డ్రైవర్ ఒక చేత్తో కారు నడుపుతూనే మరో చేత్తో అమ్మాయిని కొడుతున్నాడు. మందిర్ మార్గ్, పార్క్ స్ట్రీట్ క్రాసింగ్ దగ్గర కారు వేగం పెంచి, రెడ్ సిగ్నల్ పడ్డా ముందుకు వెళ్లిపోయాడు. ఆ అబ్బాయి చూడటానికి కొంచెం విదేశీయుడిలా కనిపించాడు. అది మస్టర్డ్ రంగు కారు. నెంబర్ హెచ్ఆర్‌కే 8930'' అని పోలీసులకు తెలిపారు*. *గీత, సంజయ్‌లను అపహరించి, రిజ్ ప్రాంతంలోని బుద్ధా గార్డెన్‌వైపు రంగా, బిల్లా తీసుకువెళ్లారు. అక్కడో నిర్జన ప్రదేశంలో కారు ఆపి, మొదట సంజయ్‌ని హత్య చేశారు. ఆ తర్వాత గీతపై అత్యాచారం చేశారు*. *నేరాన్ని అంగీకరిస్తూ ఇచ్చిన వాంగ్మూలంలో రంగా తమ అకృత్యం గురించి వివరించాడు.* *''సంజయ్ మృతదేహం ఉన్నవైపు నేను గీతను తీసుకువెళ్తున్నా. ఆమె కుడివైపు నడుస్తున్నా. బిల్లా నాకు సైగ చేయడంతో, కొంచెం ముందుకు నడిచా. బిల్లా బలంగా ఆమె మెడపై కత్తితో వేటు వేశాడు. ఆ వెంటనే ఆమె చనిపోయింది. ఆమె మృతదేహాన్ని పొదల్లో పడేశాం'' అని రంగా అన్నాడు*. *పోస్ట్‌మార్టంలో గీత శరీరంపై ఐదు గాయాలున్నట్లు తేలింది. సంజయ్ శరీరం మీద మొత్తంగా 21 గాయాలున్నాయి. గీత ప్యాంట్‌లో గుర్తింపు కార్డు కూడా అలాగే ఉంది. ఓ వ్యాలెట్ కూడా వారి వద్ద లభించింది. అందులో రూ.17 ఉన్నాయి.* *#సైనికులకి చిక్కారు* *ఘటన జరిగిన తర్వాత బిల్లా, రంగా దిల్లీ నుంచి పారిపోయారు. మొదట ముంబయి (అప్పట్లో బొంబాయి)కి, ఆ తర్వాత ఆగ్రాకి వెళ్లారు.* *ఆగ్రా నుంచి దిల్లీకి వచ్చేందుకు వాళ్లు ఓ రైలు ఎక్కారు. అయితే, వారు ఎక్కింది సైనికులు ప్రయాణిస్తున్న బోగీ. బిల్లా, రంగాలను సైనికులు పట్టుకుని, పోలీసులకు అప్పగించారు*. *'హత్యల తర్వాత బిల్లా, రంగా భయపడిపోయారు. మిగతా నగరాల వైపు పారిపోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో వాళ్లు సైనికులు ప్రయాణిస్తున్న ఓ రైలు బోగీలో ఎక్కారు. వాళ్లతో గొడవపడ్డారు. సైనికులు వాళ్లను గుర్తింపు కార్డు చూపించమని అడిగారు*. *అప్పుడు రంగా 'చేతి రాతతో ఉన్న కార్డు' చూపించమని బిల్లాకు చెప్పాడు. వాళ్లపై సైనికులకు అనుమానం వచ్చి, దిల్లీ స్టేషన్‌లో పోలీసులకు అప్పగించారు'' అని సునేత్ర వివరించారు.* *#తలారులు మద్యం తీసుకుంటారు’* *బిల్లా, రంగాలకు కోర్టు ఉరిశిక్ష విధించింది. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఆ తీర్పును సమర్థించాయి*. *క్షమాభిక్ష కోసం బిల్లా, రంగా చేసుకున్న పిటిషన్లను ఆ సమయంలో రాష్ట్రపతిగా ఉన్న నీలం సంజీవరెడ్డి తిరస్కరించారు. ఉరి తీయడానికి ఒక వారం ముందు మూడో నెంబర్ జైల్లోని ఉరి ఖైదీల గదికి అధికారులు వాళ్లను తరలించారు. మిగతావారికి దూరంగా వారిని ఒంటరిగా ఉంచారు. నిరంతరం తమిళనాడు స్పెషల్ పోలీసు సిబ్బంది వారికి గస్తీ కాశారు*. *బిల్లా, రంగాలను ఉరి తీసేందుకు ఫరీద్‌కోట్ నుంచి ఫకీరా, మేరట్ నుంచి కాలూ అనే తలారులను పిలిపించారు*. *'కాలూ, ఫకీరా 'దిగ్గజాలు'. ఉరి తీయడానికి ముందు వాళ్లకు 'ఓల్డ్ మాంక్' మద్యం ఇవ్వడం ఓ సంప్రదాయంలా మారింది*. *ఎందుకంటే, తలారిగా ఉన్నాగానీ, పూర్తి స్పృహలో ఉంటే వాళ్లు మరొకరి ప్రాణాలు తీయలేరు. జైలు మాన్యువల్‌లో ఉరి తీసినందుకు వారికి రూ.150 ఇవ్వాలని మాత్రమే ఉంటుంది. అది చాలా తక్కువ మొత్తం'' అని సునేత్రా అన్నారు*. *ఈ ఇద్దరినీ ఉరి తీసేందుకు ప్రత్యేకంగా బక్సర్ జైలు నుంచి తాడును తెప్పించారు*.- *''ఆ తాడు బయట మార్కెట్‌లో దొరకదు. బక్సర్ జైల్లోనే ప్రత్యేకంగా దాన్ని తయారు చేస్తారు. సాగే గుణం వచ్చేందుకు ఆ తాడుకు మైనం గానీ, వెన్న గానీ పూస్తారు. కొందరు తలారులు అరటిపళ్ల గుజ్జును కూడా పూస్తుంటారు. ఆ తాడు పొడవు 1.8 మీటర్ల నుంచి 2.4 మీటర్ల దాకా ఉంటుంది. తలారి ఫకీరా నల్లగా ఉండేవాడు*. *తనను తాను యముడిలా చూపించుకునే ప్రయత్నం చేసేవాడు. కాలూ పొట్ట బయటకు వచ్చి ఉంటుంది. ఇద్దరూ భయంకరంగా కనిపించే ప్రయత్నం చేసేవారు'' అని సునీల్ గుప్తా చెప్పారు.* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - TWITTER TWITTER - ShareChat
1️⃣4️⃣4️⃣ *_సంపూర్ణ మహాభారతము_* *_144 వ రోజు_* *_వన పర్వము షష్టమాశ్వాసము:_* *_కబంధుడు_* *రామలక్ష్మణులు సీతను వెదుకుతూ దక్షిణ దిశగా వెళ్ళారు. దారిలో కబంధుడు లక్ష్మణుని పట్టుకున్నాడు. కబంధుడు ఒక వింత జీవి. దాని గుండెలో కళ్ళు పొట్టలో నోరు ఉంది. చేతులు మాత్రం చాలా పొడవు అది కూచున్న చోటు నుండి కదలక చేతులను చాచి చిక్కిన జంతువులను పట్టుకుని తింటూ జీవిస్తుంది*. *లక్ష్మణుడు కంబంధుడి పట్టు నుండి తప్పించుకో లేక పోయాడు* *“అన్నా! శ్రీరామా! నన్ను రక్షించు. నీకు రాజ్యం పోయింది, తండ్రి మరణించాడు, భార్యను పోగొట్టుకున్నావు ఇప్పుడు ఈ కబంధుడు నన్ను పట్టుకున్నాడు. నా వంటి దురదృష్టవంతుడు ఉంటాడా” అని అరిచాడు*. *రాముడు లక్ష్మణునికి ధైర్యం చెప్పి బాణాలతో కబంధుని హస్తాలు ఖండించి లక్ష్మణుని విడిపించాడు. ఒక కత్తి తీసుకుని కబంధుని పొట్ట చీల్చగా అతడు ఒక దివ్య పురుషుడుగా మారి పోయాడు*. *“రామా! నేను విశ్వావసు అనే గంధర్వుడను*. *బ్రహ్మదేవుని శాపం వలన నాకు ఈ రాక్షస జన్మ వచ్చింది. నేడు నీ వలన నాకు మోక్షం కలిగింది. రావణుడు అనే రాక్షసుడు నీ భార్యను తీసుకు వెళ్ళి లంకలో ఉంచాడు. పంపా సరస్సు ఒడ్డున ఉన్న ఋష్య మూక పర్వతం పై వాలి సోదరుడైన సుగ్రీవుడు నివసిస్తున్నాడు*. *అతనితో నీవు సఖ్యం చేసిన నీ కార్యం సిద్ధిస్తుంది” అని చెప్పి గంధర్వుడు వెళ్ళి పోయాడు.* *_కిష్కింద_* *రామలక్ష్మణులు పంపా సరోవర తీరాన తమ పితరులకు తర్పణం విడిచారు. అక్కడి నుండి చాలా ఎత్తుగా కనపడు తున్న ఋష్యమూక పర్వతాన్ని చేరారు*. *ఋష్యమూక పర్వతం పైనున్న వానర రాజు సుగ్రీవుడు రామలక్ష్మణులను చూసి వారి వృత్తాంతం తెలుసుకు రమ్మని మంత్రి అయిన హనుమంతుని పంపాడు*. *హనుమంతుడు చాకచక్యంగా వ్యవహరించి రామలక్ష్మణుల గురించిన సకల వృత్తాంతం గ్రహించి సుగ్రీవునకు నివేదించాడు*. *రామలక్ష్మణులకు సుగ్రీనికి మైత్రి చేసాడు. సుగ్రీవుడు సీతాదేవి కిందకు జారవిడిచిన ఆభరణాలు చూపించాడు*. *రాముడు ఆ ఆభరణాలు గుర్తు పట్టాడు. సుగ్రీవుడు తన అన్న వాలి తన భార్యను అపహరించి తన మీద నిష్కారణ కక్ష పెంచుకుని తనను రాజ్యం నుండి వెడలగొట్టాడని తన అన్నను చంపి తనకు రాజ్యం ఇప్పించమని కోరాడు. బదులుగా సీతాన్వేషణలో తాను సాయం చేస్తానని చెప్పాడు. రాముడు అందుకు ఒప్పుకున్నాడు.* *_వాలి వధ_* *అందరూ కిష్కిందకు బయల్దేరి నగరం వెలుపల నిలిచి సుగ్రీవుడు తన అన్న వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి సుగ్రీవునితో యుద్ధానికి పోతుండగా వాలి భార్య తార “నాధా! సుగ్రీవుడికి ఏదో సాయం లభించినట్లు ఉంది. అయోధ్య రాజు దశరధుని కుమారులైన రామ లక్ష్మణులతో సుగ్రీవునకు మైత్రి కుదిరిందని చారుల ద్వారా విన్నాను*. *రాముని భార్య సీతను రావణుడు అపహరించాడు. రాముడు సుగ్రీవుని సాయం కోరాడు*. *సుగ్రీవుడు అంగీకరించాడు*. *ప్రతిఫలంగా సుగ్రీవునకు సాయం చేస్తానని అన్నాడంట. మహా బలవంతులైన మైందుడు, ద్వివిదుడు, హనుమంతుడు, జాంబవంతుడు అతనికి మంత్రులుగా ఉన్నారు. కనుక ఇప్పుడు సుగ్రీవునితో యుద్ధానికి పోవడం ప్రమాదకరం” అని తార వాలిని వారించింది.* *కాని వాలి భార్యమాట లక్ష్యపెట్టక సుగ్రీవునితో యుద్ధానికి సిద్ధం అయ్యాడు*. *సుగ్రీవుని చూసి వాలి* *“ఓరీ! మంద బుద్ధీ నేను ఎన్నో మార్లు నిన్ను ఓడించి తరిమి వేసాను. మరల సిగ్గు లేకుండా యుద్ధానికి ఎందుకు వచ్చావు?” అన్నాడు*. *సుగ్రీవుడు “వాలీ! నేను భార్యను పోగొట్టుకుని రాజ్యభ్రష్టుడనయ్యాను. నేను ఉండి చేసేదేముంది అందుకే యుద్ధానికి వచ్చాను” అని వాలితో అన్నాడు*. *వాలి సుగ్రీవులు చెట్లతోను, బండలతోను యుద్ధం చేసుకున్నారు*. *తరువాత ఒకరితోనొకరు ముష్టి యుద్ధం చేసుకుంటున్నారు.* *కవలలైన వారిని పోల్చలేక రాముడు వాలిని చంపలేక పోయాడు*. *సుగ్రీవుడు తిరిగి వచ్చి రామునితో నిష్టూరంగా మాట్లాడాడు. రెండవ సారి రాముని సలహాతో గుర్తు కొరకు వనపుష్ప మాలను ధరించి సుగ్రీవుడు వాలితో యుద్ధంచేసాడు*. *రాముడు వేసిన బాణాలకు వాలి నేల కూలాడు.* *తనను చంపడం అధర్మమని వాలి రామునితో వాదించాడు*. *రాముడు చెప్పిన ధర్మసూక్ష్మాలను అంగీకరించి తనభార్యను సుగ్రీవునికి అప్పగించి కుమారుడైన అంగదుని యువ రాజుని చేసే బాధ్యత రామునికి అప్పచెప్పి వాలి ప్రాణాలు వదిలాడు.* *సుగ్రీవుడు రామునకు నమస్కరించి* *“రామా నీమాట నీవు నిలబెట్టు కున్నావు. ఇప్పుడు ఎండా కాలం తరువాత వర్షాకాలం సీతాన్వేషణకు ఇది తరుణం కాదు కనుక నేను వర్షాకాలం ముగియ గానే సీతాన్వేషణ ప్రారంభిస్తాను” అన్నాడు* #మన సంప్రదాయాలు సమాచారం
6️⃣ *_శ్రీ మహావిష్ణు పురాణం_* *_ఆరవ భాగం_* *_యోగమాయ జననం: -_* *శ్రీ మహావిష్ణువు సృష్టి జరగాలంటే యోగమాయ శక్తి అవసరమని తలచాడు. విష్ణువు సంకల్పం చేయగానే వక్షస్థల వామభాగం నుంచి ఒక స్త్రీ శక్తి ఉద్భవించింది*. *చతుర్భుజాలతో జగన్మోహన రూపం గల యోగమాయ చేతులు జోడించి తన సృష్టికర్త మహావిష్ణువుకి నమస్కరించింది*. *మహావిష్ణువు మానసము నుండి కామము, క్రోధము, మోహము, లోభము, మదము, మాత్సర్యము, దర్పము, అహంకారం, త్వక్తు, ఘ్రాణము, శ్రవణము, వాక్కు, జిహ్వ, తమము, రజము, సత్త్వము, అవిద్య, విద్య అనే పద్దెనిమిది గుణాలు ఉద్భవించి యోగమాయలో కలసిపోయాయి. మరుక్షణం ఆమె పద్దెనిమిది బాహువులతో ఉగ్రరూపణిగా విరాటస్వరూపిణిగా మారింది. విష్ణువుతో “ఎవరు నేను" అని భీకర స్వరంతో అడిగింది*. *శ్రీమహావిష్ణువు ఆమెతో "నీవు విశ్వవిరాట స్వరూపిణి అయిన యోగమాయవు. నా సంకల్పంతో సృష్టి కోసం అవతరించావు. మంగళ, చండి, కాళి అనేవి నీకు ప్రత్యాయ నామాలు. జయించ శక్యం గాని దుర్గమమైన దుర్గవు నీవు. నా మానసము నుండి జనించిన కామ మోహ క్రోధాది అష్టాదశగుణాలు నీలో కలిసాయి. అష్టాదశ గుణాలకు నీవు అధిష్టాన దేవతవి. నీతో పాటు ఈ గుణాలు అదృశ్యంగా విశ్వ మంతా వ్యాపిస్తాయి*. *సృష్టి ప్రారంభమైనపుడు నీవు మాయవై అదృశ్యంగా ఉండి ఈ అష్టాదశ గుణాలు సకల జీవులలో ప్రవేశపెట్టి, గుణాలతోపాటు నీవు సృష్టి జీవులను ఆశ్రయించి ఉంటావు. జీవులను నడిపించే శక్తివి అవుతావు. నీవు లేకపోతే ఏ జీవి జీవించలేదు" అని కీర్తించాడు.* *యోగమాయ పొంగిపోయి "నేను జీవులను ఆడించే మహాశక్తిని! విశ్వాన్ని శాసించే మహాకాళిని" అని వికటాట్టహాసము చేసింది.* *మరుక్షణం విద్య అవిద్య సత్త్వము రజము తమము జిహ్వ వాక్కు శ్రవణము ఘ్రాణము త్వక్తు అనే పది గుణములకు ప్రతీకలైన యోగ మాయ పదిబాహువులు అదృశ్య మయ్యాయి*. *అష్టభుజి అయిన యోగమాయ ఖిన్నురాలై "నా బాహువులెందుకు మాయమై నాయి" అని విష్ణువుని అడిగింది*. *విష్ణువు నవ్వుతూ "నీ లోని దశగుణాలు అదృశరూపంతో విశ్వమంతా వ్యాపించాయి*. *ఇప్పుడు నీవు అష్టభుజాలు గల చండివి. నీ చండికాశక్తి ఆపగల వారు విశ్వములో లేరు" అని ప్రకటించాడు*. *ఆ ప్రశంసకు గర్వం, అహంకారం పొంది చండి "నా చండ చండికా శక్తిజయించగలవారువిశ్వములో లేరు" అని గర్జించింది*. *మరుక్షణం అహంకారం దర్పము మదము మాత్సర్యము ప్రతీకలైన నాలుగు బాహువుల అదృశ్యమయ్యాయి.* *చతుర్భుజి అయిన ఆమె విష్ణువుని "ఇప్పుడు ఇదేమిటి?" అని విస్మయంగా అడిగింది*. *"నీలోని అహంకారదర్పమదమత్సరాలు జగమంతా వ్యాపించాయి. ఇప్పుడు నీవు శుభములు కలిగించే చతుర్భుజివి అయిన "మంగళ" వి" అన్నాడు విష్ణువు.* *మంగళాదేవి అతిశయం చెంది "సకల జీవులకు శుభములను అనుగ్రహించే మంగళాదేవిని నేను! నాకు సాటియైన వారు లేరు" అని పలికింది*. *తక్షణం క్రోధ లోభాలకు ప్రతీకలైన రెండు భుజాలు అదృశ్యమై ద్విభుజిగా మారింది. శ్రీమహావిష్ణువు ఆమె వంక ప్రసన్నంగా చూసి "యోగ మాయా! నీ అష్టాదశ శక్తులలో పదహారు శక్తులు విశ్వమంతా వ్యాపించాయి. మిగిలిన కామ మోహములకు ప్రతీకవై ప్రకృతివై ఉంటావు. బీజానికి క్షేత్రముగా నిలచి సృష్టికి మాతృదేవతవై సహకరిస్తావు. నీవు, నీ శక్తులు విశ్వవ్యాప్తం అయ్యాయి కనుక "విశ్వంభర" అనే నామంతో ప్రసిద్ధి చెందుతావు*. *యోగమాయా! సృష్టి మొత్తం నీ అష్టాదశ గుణ మాయా ప్రభా వితమై నడుస్తుంది. సకలజీవులు నీమాయామేయమైనప్రపంచంలో చిక్కుకుని జననమరణ కాలచక్ర భ్రమణంలో తిరుగాడుతుంటారు. ఈ మాయ నుండి బయటపడటం దుర్లభం. కేవలం యోగశక్తితో, తపస్సుతో మాత్రమే ఈ మాయా బంధనం నుంచి తప్పించుకోగలరు. అట్టివారు మాత్రమే జననమరణ రహిత మోక్షము పొంది నాలో లీనమవుతారు. అటువంటి వారు కొద్దిమంది మాత్రమే ఉంటారు*. *లోకములలో గల చరాచరము లన్నింటిలో అదృశ్యంగా, అంతర్లీనంగా ఉండే మహా మాయవి నీవు. సృష్టిలో నీకు లొంగనిది, నీవు ఆవహించనది, లోబడనిది ఏది లేదు, వుండదు. విశ్వము జయింపలేని దుర్గా దేవివి నీవు! కేవలం యోగశక్తి, తపశక్తితో మాత్రమేయోగమాయ వైన నీ సత్య స్వరూపం దర్శించ గలరు. నాతో సరిసమానురాలి వైన సహోదరివి నీవు! జగత్ సృష్టి సంకల్పం కోసం నేను కొంతకాలం యోగనిద్ర పోవాలి. నీవు విష్ణుమాయవై నన్ను ఆవ హించు" అని యోగమాయను ఆహ్వానించాడు.* *మహాశక్తి యైన దుర్గాదేవి విష్ణువుకి నమస్కరించి విష్ణు మాయగా అదృశ్యరూపం దాల్చి దేవదేవుడైన మహావిష్ణువుని ఆవరించింది. మాయకు లోనైన మహావిష్ణువు అనేక యుగాలు యోగనిద్రలో ఉండిపోయాడు* #మన సంప్రదాయాలు సమాచారం
*_స్త్రీ జన్మ....??_* *ధర్మరాజుకొక ధర్మసందేహం* *వచ్చింది. ‘స్త్రీ* *పురుషుల్లో కుటుంబం పట్ల ఎవరికి ఎక్కువ అనురాగం వుంటుంది’ అని.* *ఇదే విషయం భీష్ముడిని అడిగాడు*. *దానికి భీష్ముడు నవ్వి “నీకొక కథ చెబుతాను. అందులో సమాధానం దొరకవచ్చు” అని చెప్పడం ప్రారంభించాడు*… *“పూర్వము భంగస్వనుడు అనే రాజు వుండేవాడు. అతను ధర్మ నిరతుడు, సత్య సంధుడు. ప్రజలను కన్న బిడ్డల కన్న మిన్నగా చూసుకునేవాడు. అటువంటి రాజుకు  సంతానము కలుగ లేదు*. *‘అపుత్రస్య గతిర్నాస్తి’ట అని పున్నామ నరకం నుండి తప్పించడానికి ఒక పుత్రుడయినా లేడే అనే బాధతో  అగ్ని దేవుడిని ప్రార్ధించి అగ్నిస్తుత యజ్ఞం చేసాడు. అగ్ని దేవుడు సంతుష్టుడై 100 మంది పుత్రులను అనుగ్రహించాడు*. *విషయం ఇంద్రుడికి తెలిసింది. దేవతల రాజయిన తన అనుమతి లేకుండా భంగస్వనుడు యజ్ఞము చేసి నూరుగురు కుమారులను కన్నందుకు ఆగ్రహం తెప్పించింది.* *అతడికి తగిన శిక్ష వేసి తన అహాన్ని చల్లార్చుకోవాలనుకున్నాడు. తగిన సమయం కోసం వేచివున్నాడు*. * ఒకరోజు భంగస్వనుడు వేటకు వెళ్లాడు. ఇంద్రుడు అదను చూసి అతడిని దారి తప్పేలా చేసాడు. ఫలితంగా ఆ రాజును గుర్రము ఎటోతీసుకుని వెళ్ళింది.* *ఇంతలో అతడికి బాగా దాహము వేసింది. అటూ ఇటూ చూడగా సమీపంలో ఒక కొలను కనిపించింది*. *వెంటనే గుర్రము దిగి కొలనులో నీటిని సేవించాడు*. *స్పటికంలా స్వచ్ఛమైన నీటిని చూడగానే స్నానం చేయాలనిపించి అందులో మునిగాడు*. *మునిగి పైకి లేచే సరికి ఆ రాజు  ఆశ్చర్య కరంగా స్త్రీ గా మారిపోయాడు. అయాచితం గా ప్రాప్తించిన స్త్రీత్వానికి  చాలా చింతించాడు*. *“ఈ రూపముతో రాజధానికి వెళ్ళి నేను నా భార్యా పిల్లలకు, పుర జనులకు ఎలా ముఖము చూపించగలను !?” అని విచారించి*... *“అయినా ఇలా అడవిలో ఉండలేను కదా!" అనుకుని చివరకు రాజధానికి వెళ్ళాడు*.        *ఓ5మంత్రులను పిలిచి విషయము చెప్పి తన పెద్ద కొడుక్కి రాజ్యాభిషిక్తుడిని చేసి పుత్రులందరికీ రాజ్యాన్ని అప్పగించి తాను మాత్రము తపస్సు చేసుకోవడానికి అడవులకు పోయి అక్కడ ఒక ముని ఆశ్రమంలో నివసించ సాగాడు*. *కాలక్రమంలో, ప్రకృతి వైపరీత్యాన మునికి స్త్రీలాగా మారిన రాజుకి జత కుదిరి  మోహించి వివాహమాడారు*.  *స్త్రీగా ఆ మునివలన అత్యంత బలసంపన్నులైన నూరుగురు కుమారులను పొందాడు*. *వారు పెరిగి పెద్దయిన తరువాత ఆ నూరుగురు కుమారులను తీసుకుని రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న తన కుమారులతో....*         *"కుమారులారా ! నేను పురుషుడిగా ఉన్నప్పుడు మిమ్ము కుమారులుగా పొందాను*. *స్త్రీగా ఉన్నప్పుడు ఈ నూరుగురు కుమారులను పొందాను. కనుక వీరు కూడా మీ సోదరులు. ఇక మీదట మీరంతా ఈ రాజ్యాన్ని పంచుకుని పాలించండి" అంది.* *స్త్రీ గా మారినా ఆమె ఒకప్పటి తమ తండ్రి కనుక పితృ వాక్య పాలకులుగా* *తండ్రిమాట పాటించి వారు రాజ్యాన్ని* *పంచుకుని పాలించసాగారు*. *ఇది చూసిన* *ఇంద్రుడు ‘నేను ఈ రాజుకు కీడు* *చేద్దామనుకుంటే అది* *అతడికి మేలు అయ్యింది.* *ఎలాగైనా వీరి మధ్య బేధము కల్పించాలని’* *సంకల్పించి ఒక బ్రాహ్మణుడి రూపము దాల్చి భంగస్వనుడికి పురుష రూపంలో కలిగిన పుత్రుల వద్దకు వెళ్ళి....* *"రాజకుమారులారా ! ఏమిటీ వెర్రి! ఎవరో ఎవరినో తీసుకు వచ్చి వీరు మీ తమ్ముళ్ళు అని చెప్పగానే నమ్మడమేనా!? అసలు వీరి తండ్రి ఎవరు? ఎవరికో పుట్టిన కుమారులు మీ తమ్ముళ్ళు ఎలా కాగలరు?" అని వారిలో కలతలు రేపాడు*. *అలాగే భంగస్వనుడు స్త్రీగా ఉన్నపుడు జన్మించిన కుమారుల వద్దకు వెళ్ళి లేని పోని మాటలు చెప్పి అన్నదమ్ముల మధ్య ద్వేషము రగిల్చాడు*. *అన్నదమ్ములు బద్ధశత్రువులై ఒకరితో ఒకరు కలహించి యుద్ధము చేసుకుని చివరకు అందరూ మరణించారు. చని పోయిన కుమారులను చూసి స్త్రీ రూపంలో ఉన్న భంగస్వనుడు గుండెలు బాదుకుని రోదించసాగింది*. *ఇది చాటుగా గమనిస్తున్న ఇంద్రుడు మరల ఏమీ ఎరుగని వాడిలా బ్రహ్మణ రూపుడై...“అమ్మా నీవు ఎవరవు?ఎందుకిలా రోదిస్తున్నావు?" అని అడిగాడు*. *అప్పుడు ఆమె తాను యజ్ఞము చెయ్యడము కుమారులను కనడము అడవిలో దారి తప్పి కొలనునీరు త్రాగి స్త్రీగా మారడము మునిద్వారా కుమారులను కనడము పూసగ్రుచ్చినట్లు చెప్పింది*. *అది విన్న ఇంద్రుడు తన నిజరూపంతో ప్రత్యక్షమై .. "రాజా! నేను ఇంద్రుడను*. *నీవు నా అనుమతి తీసుకోకుండా యజ్ఞము చేసినందుకు నీ మీద కోపించి ఈ కష్టాలు నీకు కలిగించాను" అని చెప్పాడు*. *దానికి  ఆమె "దేవా !* *అజ్ఞానంతో* *తెలియక పొరపాటు చేసాను. అయినా దేవతలకు* *అధిపతివైన నీవు పగ తీర్చుకోడానికి నేను తగిన వ్యక్తినా ! కనుక నన్ను దయతో రక్షించు" అని వేడుకోగా....* *ఆ మాటలకు కరిగి పోయిన ఇంద్రుడు "రాజా ! నీకు నేను ఒక వరము ఇస్తున్నాను. నీవు పురుషుడిగా ఉన్నప్పుడు పొందిన పుత్రుల నైనా లేక స్త్రీగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా బ్రతికిస్తాను ఎవరు కావాలో నీవే ఎంచుకో " అన్నాడు*. *ఆమె (భంగస్వనుడు) సిగ్గుపడుతూ స్త్రీగా ఉన్నప్పుడు కలిగిన కుమారులను బ్రతికించమని కోరుకుంది.* *"అదేమిటి రాజా ! మిగిలిన వారు నీ కుమారులు కాదా !?" అని అడిగాడు.* *భంగస్వనుడు "వారు కూడా నా పుత్రులే వారికి నేను తండ్రిని, వీరికి నేను తల్లిని. తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పది కదా!” అని చెప్పింది*. *ఇంద్రుడు సంతోషంతో  "రాజా ! నీ సత్యనిష్టకు సంతోషించాను*. *నీకుమారులు అందరినీ బ్రతికిస్తాను" అని... “రాజా ! నీకు ఇంకొక వరము ఇస్తాను నీవు పోగొట్టుకున్న పురుషత్వము తిరిగిఇస్తాను" అన్నా దానికి ఆమె "మహేంద్రా ! నా కుమారులను బ్రతికించావు అదే చాలు స్త్రీగానే ఉంటాను" అంది*. *ఇంద్రుడు ఆశ్చర్యంతో  "అదేమిటి రాజా ! పురుషుడవైన నీవు స్త్రీగా ఉండి పోతాననడానికి కారణం ఏమిటి?" అని అడిగాడు*. *స్త్రీగా ఉన్న భంగస్వనుడు సిగ్గు పడి "మహేంద్రా ! నేను స్త్రీగా ఉండడంలో ఆనంద పడుతున్నాను. ఇందులో వున్న తృప్తి నాకు పుంసత్వములో కనబడలేదు కనుక ఇలాగే ఉండి పోతాను" అంది.* *దేవేంద్రుడు నవ్వి “అలాగే అగుగాక”అని ఆశీర్వదించాడు.* *అని పై కథంతా ధర్మరాజుకు చెప్పిన భీష్ముడు..* *“యుధిష్టిరా! ఇప్పుడు తెలిసిందా నీ ప్రశ్నకు సమాధానం!” అని అడిగాడు*. *స్త్రీ జన్మ యొక్క ఔన్నత్యం అర్థమయిన ధర్మజుడు మౌనంగా తల పంకించాడు*.  *“ఒకతెకు జగములు* *వణకున్ అగడితమై* *ఇద్దరు కూడిన* *అంబులు ఇగురున్।* *ఓముగ్గురాండ్రు కలిసిన సుగుణాకరాపట్టపగలె చుక్కలు రాలున్ ..!”* *[ఒక్క ఆడది ఉంటేనే లోకాలు వణుకుతాయి, ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే సముద్రాలే ఇగిరిపోతాయి*, *ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే ఇంకేముంది?* *పట్టపగలే నక్షత్రాలు రాలతాయి*. *అంటే స్త్రీ చాలా శక్తివంతురాలని భావము]* #మన సంప్రదాయాలు సమాచారం
#మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
00:37
#మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
00:14
*_ఓo కాంచనాభాయ నమః_* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
01:00
https://www.youtube.com/live/1bXc7guUKC0?si=t5WaIS_BqVXhKczv #మన సంప్రదాయాలు సమాచారం
youtube-preview