Ravi  Talluri
ShareChat
click to see wallet page
@91775
91775
Ravi Talluri
@91775
feelgood
*_బెజవాడ #కాళేశ్వరరావు_మార్కెట్ పేరు ఎలా వచ్చింది!!_* *_ఒక వ్యక్తి కాదు శక్తిగా రాజకీయ శక్తిగా నిలిచిన కాళేశ్వరరావు గారి ప్రస్థానం!!?_* *_అయ్యదేవర కాళేశ్వరరావు_* *(జనవరి 22, 1881 - ఫిబ్రవరి 26, 1962)* *స్వాతంత్ర్య సమర యోధులు* *"ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మొదటి శాసనసభాధిపతి"* *ఈయన జీవిత చరిత్ర "నవ్యాంధ్రము నా జీవిత కథ" అనే పుస్తక రూపంలో వెలువడింది*. *కృష్ణా జిల్లా "నందిగామలో" లక్ష్మయ్య, వరలక్ష్మమ్మ దంపతులకు 1881 సంవత్సరంలో జన్మించారు. 1901 లో బి.ఎ. పరీక్షలో ఉత్తీర్ణులై నోబుల్ కళాశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేశారు. తరువాత మద్రాసు విశ్వవిద్యాలయంలో బి.ఎల్. పరీక్షలో నెగ్గి 1906లో విజయవాడలో న్యాయవాదిగా పనిచేశారు*. *జమిందారీల చట్టం విషయంలోగల విశేష పరిజ్ఞానం మూలంగా పలువురు జమిందారులకు లాయరుగా పనిచేశారు*. *రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి ప్రభావం వలన వీరిలో సంఘ సంస్కరణపై మక్కువతో బ్రహ్మ సమాజ కార్యక్రమాలలో కృషి చేశారు. స్వాతంత్ర్య సంగ్రామంలో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలోను, హోంరూలు ఉద్యమంలోను వీరు పనిచేశారు*. *మహాత్మా గాంధీ నాయకత్వంలోని అన్ని ఉద్యమాలలోనూ వీరు ఉత్సాహంగా పాల్గొని కారాగార శిక్షను అనుభవించారు*. *రాజకీయాలతో పాటు వీరు గ్రంథాల ప్రచురణలో శ్రద్ధ వహించారు*. *విజయవాడలోని రామమోహన గ్రంథాలయ స్థాపనకు సహాయం చేశారు*. *కొమర్రాజు లక్ష్మణరావు నెలకొల్పిన విజ్ఞాన చంద్రికా గ్రంథమండలిలో కార్యదర్శిగా పనిచేశారు.* *కారాగారంలో ఉండగా 'ఫ్రెంచి విప్లవ చరిత్ర', 'అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్ర', 'తురుష్క ప్రజాస్వామికం', చీనా జాతీయోద్యమ చరిత్ర', 'ఈజిప్టు చరిత్ర' అను పుస్తకాలను రచించారు*. *1926, 1937, 1946, 1955 సంవత్సరాలలో జరిగిన శాసనసభ ఎన్నికలలో విజయవాడకు ప్రాతినిధ్యం వహించారు*. *ప్రజా ప్రతినిధిగా వీరు విజయవాడ పురపాలక సంఘానికి అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు*. *వీరు ఎంతోమందికి విద్యాదానము చేశారు. ఈయన విజయవాడ పురపాలక సంఘ అధ్యక్షుడిగానూ, మద్రాసు శాసనసభకు చీఫ్ విప్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు*. *1939లో మద్రాసు శాసనసభకు కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ- బందరులకు ప్రాతినిధ్యం వహిస్తూ పోటీ చేసి ఘన విజయం సాధించారు.* *రాజగోపాలాచారి ప్రధానమంత్రిగా మద్రాసు ప్రభుత్వమేర్పడింది.* *దానిలో కాళేశ్వరరావు రాజగోపాలాచారికి కార్యదర్శిగా ఎన్నికయ్యారు.* *మద్యపాన నిషేధ చట్టం, సేల్సుటాక్సు, హరిజన దేవాలయ ప్రవేశ చట్టాల రూపకల్పనలో కాళేశ్వరరావు తన మేధాసంపత్తిని, భాషానైపుణ్యాన్ని ప్రయోగించి అందరి మన్ననలూ పొందారు. 1946లో విజయవాడ నుంచి శాసనసభకు ఎన్నికైన కాళేశ్వరరావు ప్రకాశం పంతులు పక్షం వహించారు టంగుటూరి ప్రకాశం మంత్రివర్గంలో కాళేశ్వరరావుకు మంత్రి పదవి రాలేదు కానీ ఆయన శిష్యుడు వేముల కూర్మయ్యకు మంత్రి పదవి కాళేశ్వరరావు ప్రభావం వల్ల లభించింది*. *ఆ ప్రభుత్వం ఏడాది లోపే పడిపోయినా కాళేశ్వరరావు ప్రకాశం పక్షాననే ఉన్నారు. 1947లో కాళేశ్వరరావు శాసనసభలో బహుభార్యత్వ నిషేధపు బిల్లును ప్రవేశపెట్టారు*. *స్వాతంత్ర్యానంతరం 1955లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయవాడ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎన్నికై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తొలి శాసనసభకు అయ్యదేవర కాళేశ్వరరావు తొలి సభాపతిగా ఎన్నికయ్యారు.* *1956 నుండి 1962 వరకు రాష్ట్ర శాసనసభ సభాపతిగా బాధ్యతలు నిర్వర్తించారు శాసనసభాపతిగా శాసనసభలో భాష తెలుగులోనే ఉండాలని 1959 డిసెంబరు 14న రూలింగ్ ఇచ్చారు. 1961 ఆగస్టు 11న సభాపతి అనుమతి లేనిదే సభలో ఎవరైనా ఎలాంటి ప్రకటనలు, ప్రసంగాలు చేయరాదని రూలింగ్ ఇచ్చారు. 1962లో శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు, కానీ ఫలితాలు వెలువడడానికి ముందురోజే తుదిశ్వాస వదిలారు. అయ్యదేవర కాళేశ్వరరావు పలు పుస్తకాలను తెలుగులో రచించారు.* *వేదాంతం, చరిత్ర, రాజకీయాల నేపథ్యం పై అనేక రచనలు చేసారు. జైలు శిక్షను అనుభవిస్తున్న సమయంలో చైనా జాతీయోద్యమ చరిత్ర, ఈజిప్టు చరిత్ర, ఫ్రెంచి విప్లవ చరిత్ర, అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్రపై పుస్తకాలు రాసారు. ఆయన రాసిన 'నా జీవిత కథ' అనాటి ఆంధ్రోద్యమ చరిత్రకు సంబంధించిన విషయాలు కలిగి ఉంది.* *విజయవాడలో పేరొందిన మునిసిపల్ మార్కెట్ ఈయన పేరు మీదుగా నిర్మించారు అదే కాళేశ్వరరావు మార్కెట్!!* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
*_USS GERALD R FORD విమాన వాహక యుద్ధనౌక!_* *టాయిలెట్స్ పనిచేయక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నావికులు, ఇంజినీర్లు, పైలట్లు!* *USS గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ యుద్ధనౌక విలువ $13 బిలియన్ డాలర్లు!* *మొత్తం 4,600 మంది గెరాల్డ్ ఫోర్డ్ మీద పనిచేస్తున్నారు!* *నౌకలో 650 టాయిలెట్స్ ఉన్నాయి.* *గత ఎనిమిది నెలలుగా సముద్రంలోనే తిరుగుతున్నది!* *కానీ గత కొన్ని రోజులుగా నౌకలో ఉన్న టాయిలెట్స్ లో 80% నికి పైగా పనిచేయడంలేదు!* *వ్యర్ధాలని బయటికి పంపించే వాక్యూమ్ సిస్టమ్ సరిగా పని చేయకపోవడంతో నారో గా ఉండే సీవేజ్ పైప్స్ లో వ్యర్ధాలు ఇరుక్కుపోయి బయటికి వెళ్లడం లేదు!* *ఈ సమస్య గత జనవరి లో తీవ్రమైనప్పటికి సిబ్బంది టీ షర్ట్స్, 6 అడుగుల బలమైన తాడుని ఉపయోగించి తాత్కాలికంగా సరి చేసినా సమస్య మళ్ళీ మళ్ళీ తలె ట్టడంతో వదిలేశారు!* *ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ శాంతి సమయంలో అంటే యుద్ధ పరిస్థితులు లేనప్పుడు సంబంధిత పోర్టుకి వెళ్ళిపోయి మెయింటనెన్స్ చేసిన తరువాత తిరిగి సముద్రంలోకి వెళతాయి!* *2025 జూన్ నెలలో సముద్రంలోకి వచ్చింది గెరాల్డ్ ఆర్ ఫోర్డ్! 2025 డిసెంబర్ లో తిరిగి మెయింటనెన్స్ కోసం వెళ్ళాల్సి ఉండగా వెనిజులా తీరంలో మొహరించాల్సి రావడంతో వాయిదా పడ్డది!* *2026 జనవరి లో వెనిజులా ఆపరేషన్ అయిపోయిన తరువాత నేరుగా డాక్ యార్డ్ కి పంపిస్తారేమో అని సిబ్బంది ఆశపడ్డారు కానీ కరేబియన్ సముద్రం నుండి నేరుగా పర్షియన్ గల్ఫ్ వెళ్ళాల్సిందిగా ఆర్దర్స్ రావడంతో నేరుగా పర్షియన్ గల్ఫ్ లో అప్పటికే అక్కడ ఉన్న అబ్రహం లింకన్ కారియర్ తో కలిసి ఇరాన్ మీద దాడుల కోసం వేచి చూస్తున్నది గెరాల్డ్ ఆర్ ఫోర్డ్!* *వాల్ స్ట్రీట్ జర్నల్ కధనం ప్రకారం గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ నౌకలో టాయిలెట్స్ దగ్గర 40 నిమిషాలు వేచి చూసే విధంగా క్యూ లైన్స్ ఉంటున్నాయి!* *4,600 మంది సిబ్బందికి కేవలం 150 టాయిలెట్స్ మాత్రమే పాక్షికంగా అందుబాటులో ఉన్నట్లుగా తెలుస్తున్నది!* *గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ లో పనిచేస్తున్న సిబ్బందిలో 1500 మంది 23 నుండి 26 ఏళ్ళ యువతీ యువకులు ఉన్నారు!* *వీళ్ళు గత డిసెంబర్ లోనే డ్యూటీ పూర్తి చేసుకొని ఇళ్ళకి వెళ్ళాల్సి ఉండగా యుద్ధం ఉందని ప్రయాణాన్ని పొడిగించడం ఒకటైతే గత. నెలరోజులుగా టాయిలెట్స్ అందుబాటులో లేకపోవడంతో ఉద్యోగానికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని జర్నల్ తెలిపింది!* *మొత్తం సీవేజ్ వాక్యూమ్ సిస్టమ్ ని మారిస్తే కానీ టాయిలెట్స్ పని చేయవు! దానికోసం డాక్ యార్డ్ కి వెళ్ళాలి కానీ ఇప్పట్లో అది జరిగేలా లేదు!* *ఇరాన్ తో యుద్ధం ఏమో కానీ టాయిలెట్స్ దగ్గర 40 నిమిషాలు వేచి ఉండడం అనేది కష్టమైన యుద్ధం కదూ?* *మొత్తం 11 ఎయిర్క్రాఫ్ట్ కారియర్స్ ఉన్నాయి అమెరికన్ నావీ దగ్గర కానీ వాటిలో గెరాల్డ్ ఫోర్డ్ 2017 లో మొదటిసారిగా జల ప్రవేశం చేసిన న్యూక్లియర్ పవర్ తో నడిచేది కావడంతో ట్రంప్ పర్షియన్ గల్ఫ్ లోనే ఉండాల్సిందిగా ఆదేశించాడు!* *మిగతా వాళ్ళని పక్కనపెడితే 1500 మంది యువతీ యువకులు గత ఎనిమిది నెలలుగా తల్లి తండ్రులతో మాట్లాడకుండా ఉండాల్సిరావడం ఇంకో కష్టం!* *అదండీ అత్యాధునిక న్యూక్లియర్ పవర్ విమానవాహక యుద్ధ నౌక టాయిలెట్స్ కష్టాలు!* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - MADEWITHAl 5000US SailorsOn The Worlds Largest Aircraft Carrier Face 650 Failing Toilets After Over8 Months At Sea MADEWITHAl 5000US SailorsOn The Worlds Largest Aircraft Carrier Face 650 Failing Toilets After Over8 Months At Sea - ShareChat
*ముంబై నగర అద్భుత పరిణామం: ఏడు విడిపోయిన ద్వీపాల నుండి భారతదేశ ఆర్థిక రాజధానిగా ఎదిగిన అరుదైన చారిత్రక ప్రయాణం!* *చాలా మందికి తెలియని ఆసక్తికరమైన నిజం ఏమిటంటే, నేడు మనం చూస్తున్న ముంబై నగరం ఒకప్పుడు ఇలా ఒకే భూభాగంగా ఉండేది కాదు. 1600వ కాలంలో ఇది మాహిమ్, మజగావ్, పరేల్, బాంబే, వర్లి, లిటిల్ కొలాబా మరియు కొలాబా అనే ఏడు విడివిడి ద్వీపాల సమూహంగా ఉండేది. ఈ చిత్రంలో కనిపిస్తున్నట్లుగా, 17వ శతాబ్దం చివరలో బ్రిటిష్ వారు చేపట్టిన భారీ 'ల్యాండ్ రీక్లెమేషన్' (భూమిని తిరిగి పొందే) ప్రాజెక్ట్ ద్వారా ఈ ద్వీపాలన్నింటినీ కలిపి ఒకే ప్రధాన భూభాగంగా మార్చారు. 1890 నాటి మ్యాప్‌ను గమనిస్తే, సముద్రపు నీటిని మళ్లించి భూమిని ఎలా విస్తరించారో స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం సముద్రపు అలల మధ్య ఉన్న చిన్న దీవులు, ఇంజనీరింగ్ అద్భుతం వల్ల నేడు దేశంలోనే అత్యంత సంపన్నమైన, అభివృద్ధి చెందిన మహానగరంగా మరియు భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచింది. ప్రకృతి సిద్ధంగా ఉన్న భౌగోళిక స్వరూపాన్ని మానవ ప్రయత్నంతో ఎలా మార్చవచ్చో చెప్పడానికి ముంబై నగర నిర్మాణమే ఒక గొప్ప ఉదాహరణ. భారతదేశ చరిత్రలో ఇదొక మరువలేని అద్భుత ఘట్టం. ఈ చారిత్రక పరిణామం ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన విషయం. మన దేశ నగరాల వెనుక ఉన్న ఇలాంటి అద్భుతమైన చరిత్రను గౌరవిద్దాం.* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ముంబై నగర అద్ుత పరిణామం మాహిమ ಮೌಜ್ಞಾನಿ) { ಬಂದಿ್ మరాగ్ర్ావ్ మాహిమ్ ೦೦೮ಐಲಬ್ 386 మజ్గావ్ ಮುನು rೆನಲಿ మజ్గావ్ బాంబే బాంబే  0 ಬಾಂಬ್ లిటిల్ కొలాబా B OMBAY ^01110 కొలాబా' ఈరోజు 1600లు 1890 చాలా మందికి; ముఖ్యంగా భారతదేశానికి వెలుపల ఉన్నవారికి; ముంబై నిజానికి ఏడు ద్వీపాలను కలిపి భూమిని తిరిగి పొందే ప్రాజెక్ట్ ద్వారా నిర్శించబడిందని తెలియదు; ఇది 17వ శతాబ్దం బ్రిటిష్ వారిచే చేపట్టబడింది నేడు; ముంబై చివరలో భారతదేశంలో అత్యంత అభివృచెందిన నగరం; సంపన్న నగరం మరియు దాని ఆర్ధిక రాజధాని ఇలాంటి చరిత్ర తెలిసిన మనసు .. లైక్ కొట్టకుండా ఉండదే ముంబై నగర అద్ుత పరిణామం మాహిమ ಮೌಜ್ಞಾನಿ) { ಬಂದಿ್ మరాగ్ర్ావ్ మాహిమ్ ೦೦೮ಐಲಬ್ 386 మజ్గావ్ ಮುನು rೆನಲಿ మజ్గావ్ బాంబే బాంబే  0 ಬಾಂಬ್ లిటిల్ కొలాబా B OMBAY ^01110 కొలాబా' ఈరోజు 1600లు 1890 చాలా మందికి; ముఖ్యంగా భారతదేశానికి వెలుపల ఉన్నవారికి; ముంబై నిజానికి ఏడు ద్వీపాలను కలిపి భూమిని తిరిగి పొందే ప్రాజెక్ట్ ద్వారా నిర్శించబడిందని తెలియదు; ఇది 17వ శతాబ్దం బ్రిటిష్ వారిచే చేపట్టబడింది నేడు; ముంబై చివరలో భారతదేశంలో అత్యంత అభివృచెందిన నగరం; సంపన్న నగరం మరియు దాని ఆర్ధిక రాజధాని ఇలాంటి చరిత్ర తెలిసిన మనసు .. లైక్ కొట్టకుండా ఉండదే - ShareChat
1️⃣4️⃣7️⃣ *_సంపూర్ణ మహాభారతము_* *_147 వ రోజు_* *_వన పర్వము సప్తమాశ్వాసము_* *_లంకపై దండెత్తుట:_* *రాముడు సుగ్రీవునితో “సుగ్రీవా! ఇక ఆలస్యం ఎందుకు లంకపై దండెత్తుటకు తగు సన్నాహాలు చెయ్యి” అని చెప్పాడు.* *సుగ్రీవుడు వానరులందరికీ వర్తమానం పంపాడు. నలు దిక్కుల నుండి వానరాలు కోట్ల సంఖ్యలో తరలి వచ్చారు. గవయుడు, గజుడు, కుముదుడు, సుషేషణుడు కోట్ల కొలది వానరాలతో తరలి వచ్చారు. జాంబ వంతుడు భల్లూక సేనతో తరలి వచ్చాడు. శుభ ముహూర్తం చూసి రాముడు రావణుని పై దండయాత్రకు బయలు దేరాడు*. *హనుమంతుడు సేనా నాయకత్వం వహించాడు*. *అంగదుడు, నీలుడు, నలుడు అతనికి సాయం నిలిచారు. కపి సైన్యం దక్షిణ తీరానికి చేరింది*. *రాముడు సుగ్రీవునితో “సుగ్రీవా ఈ సముద్రాన్ని దాటే ఉపాయం నువ్వే చెప్పాలి” అన్నాడు.* *కొంత మంది వానరులు తెప్పలు కట్టుకుని దాటుదాం అన్నారు.* *రాముడు “ఇన్ని కోట్ల సైన్యం మన సైన్యం లెక్కకు మించి ఉంది. వీరికి సరిపోవు తెప్పలు పడవలు తయారు చేయడం అసాధ్యం. మనం దాటే సమయంలో శత్రు సైన్యం మన సైన్యాలను సముద్రంలో ముంచి వేయడానికి ప్రయత్నిస్తాయి. నేను ఉపవాస దీక్ష వహించి సముద్రుని పూజిస్తాను. అతని సహాయం లేక ఏమీ చేయలేము*. *సముద్రుడు లొంగక పోతే నా బాణాలతో సముద్రాన్ని ఇంకిస్తాను” అన్నాడు.* *ఉపవాస దీక్షతో ఆరాధిస్తున్న రామునికి సముద్రుడు ప్రత్యక్షమైయ్యాడు. రాముడు “మాకు ససైన్యంగా దారి ఇవ్వు. లేకున్న సముద్రాన్ని ఇంకిస్తాను” అన్నాడు*. *సముద్రుడు “రామా! నేను నీకు ఎటువంటి ఆటంకం కలిగించను. నీవు ఈ రోజు ఇంకిస్తే ఇతరులు ఆ మార్గాన్ని అనుసరిస్తారు. నన్ను వశపరచుటకు ప్రయత్నిస్తారు. అది మంచిది కాదు. కపి వీరులలో నలుడు అనే శిల్పకర్మ ఉన్నాడు. వాని సాయంతో సేతువు నిర్మించండి. నేను దానిని సాగర జలాల్లో మునగ కుండా కాపాడతాను. మీరు ఆ సేతువు మీద ప్రయాణించి సముద్రం దాటవచ్చు” అన్నాడు.* *నలుడు వంద యోజనములు పొడుగు పది యోజనములు వెడల్పున్న ఒక వారధి నిర్మించాడు*.``` *_విభీషణుడు రాముని చేరుట_* *విభీషణునికి రావణుడితో పొసగ లేదు. అతడు లంక నుండి బయటకు వచ్చి శ్రీరాముని శరణు జొచ్చాడు.* *శ్రీరాముడు విభీషణునికి అభయం ఇచ్చాడు. శ్రీరాముడు వానర సేనలతో విభీషణునితో వారధి దాటి లంకను చేరుకున్నాడు*. *శ్రీరాముడు త్రికూట పర్వతంపై ఎక్కి లంకకు నాలుగు వైపులా సైనిక శిబిరాలు ఏర్పాటు చేయించాడు*. *రావణుని గూఢచారులైన సారణుడు, శకుడు అనే వారు వానర రూపాలు ధరించి వానరులలో కలిసి పోయారు.* *విభీషణుడు వారిని రామునికి పట్టి ఇచ్చాడు*. *రాముడు వారికి సైన్యమంతా చూపించి రావణుని వద్దకు పంపాడు.* *వారు రావణుని వద్దకు పోయి రాముడి సేన అజేయమని గెలువ సాధ్యం కానిదని చెప్పారు*. *రావణుడు లంకకు తగిన రక్షణ కల్పించాడు.* *శ్రీరాముడు అంగదుని పిలిచి.. “అంగదా! నీవు రావణుని వద్దకు వెళ్ళి సీతను విడువమని చెప్పు. తగిన విధముగా బుద్ధి మతి చెప్పుము” అన్నాడు.* *అంగదుడు రావణుని కొలువు కూటమిలో ప్రవేశించి “రావణా! సూర్య వంశ సంభూతుడు రాముడు నీతో ఇలా చెప్పమన్నాడు*. *‘అడవులలో తపస్సు చేసుకుంటున్న మునులను చంపావు, దేవతాస్త్రీలను బంధించి మహాపరాధం చేసావు ఇవన్నీ ఒక ఎత్తు! నీవు నాపట్ల చేసిన అపరాధం ఒక ఎత్తు. నా భార్య సీతను అపహరించి మహాపరాధం చేసావు. ఆమెను నాకు అప్పగించు లేకున్న నాతో యుద్ధం చెయ్యి. నీకు మరొక మార్గం లేదు. నీకు మానవులంటే చులకన భావం ఉంది. రాక్షసకులం అన్నది లేకుండా చేస్తాను జాగ్రత్త” అని అంగదుడు రాముడు చెప్పమన్నది చెప్పాడు* *రావణుడు కను సైగ చేయగానే కొంతమంది రాక్షసులు అంగదుని పట్టు కోవడానికి వచ్చారు*. *అంగదుడు పైకి ఎగిరి వారిని కిందకు తోసాడు.* *ఆ తోపిడికి వారు మరణించారు. తరువాత అంగదుడు రాముని వద్దకు పోయి జరిగినది చెప్పాడు* #మన సంప్రదాయాలు సమాచారం
9️⃣ *_శ్రీ మహావిష్ణు పురాణం_* *_తొమ్మిదవ భాగం_* *_బ్రహ్మదేవుడు సరస్వతిల వివాహం:_* *జ్ఞాన తేజస్సుతో ప్రకాశిస్తున్న బ్రహ్మను చూసి శ్రీమహావిష్ణువు "కుమారా!వేదజ్ఞానము, పరబ్రహ్మ జ్ఞానము పొందిన నీవు భూత భవిష్యత్తు వర్తమానాలుతెలిసిన త్రికాల జ్ఞాని వయ్యావు. నిన్ను సృష్టికర్తను చేస్తున్నాను*. *పరబ్రహ్మమైన నేను బ్రహ్మాండమును రెండు భాగాలు చేసి సప్త (ఏడు) ఊర్థ్వలోకాలు, సప్త ఏడు) అధోలోకాలు ఏర్పాటు చేసాను. మధుకైటభుల మేధతో మేధిని (భూమి) రెండింటి మధ్యన ఏర్పడింది. ఈ మేధిని భూమిగా మారి సృష్టి చేయడానికి అనుకూల ప్రదేశంగా మారుతుంది. నీవు ఊర్థలోకాలలో ఏడు దేవతా భువనాలు, భూలోకంతో పాటు అధో లోకాలలో అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల పాతాళ అనే ఏడు భువనాలు సృష్టి చేయడానికి సంకల్పించుము*. *నా అంశామూర్తిగా విశ్వకర్మ అవతరించి ఈ పద్నాలుగు లోకాల నిర్మాణంలో నీకు సహకరిస్తాడు. మేథిని అయిన భూదేవిని నా దేవేరి అయిన లక్ష్మీదేవికి అంశామూర్తిగా భావించుము. భూమిపై నారాయణ భక్తులైన నరులను సృష్టించుము. ఈ కల్పంలో పద్నాలుగు భువనాల సృష్టికర్త నీవేనని గ్రహించుము" అని ఉపదేశం చేశాడు*. *బ్రహ్మ విష్ణువుకి నమస్కరించి "తండ్రీ! నీ ఆదేశము అనుసరించి పద్నాలుగు లోకాలు సృష్టిస్తాను. నీకు ఇష్టమైన భూలోకంలో శ్రేష్ఠులైన నరులను కూడా సృష్టిస్తాను. కానీ ఈ లోకాలన్ని వెలుగు లేకుండా చీకటిలో ఉన్నాయి. అంధకారమైన లోకాలలో లోక జీవులను సృష్టించినంత మాత్రాన ప్రయోజనం ఏమి ఉంటుంది. మేధిని అయిన భూమి ఇంకా తడిగానే ఉంది. తడి ఆరి గట్టిపడేది ఎప్పడు? భూమి పై ప్రాణుల జీవనం ప్రారంభ మయ్యేది ఎప్పుడు?" అని అడిగాడు*. *విష్ణువు "బ్రహ్మదేవా! నీవన్నది సమంజసమే! లోకాలలో చీకటితో పాటు ప్రకాశం ఉండే టట్టు రాత్రి పగళ్ళను ఏర్పాటు చేస్తాను. చూడుము" అని మనస్సులో సంకల్పించాడు. తక్షణమే శ్రీమహావిష్ణువు దక్షిణ (కుడి) నేత్రం నుండి కోటి కిరణాలతో వెలుగులు చిమ్మే సూర్యుడు ఆవిర్భవించాడు*. *సూర్యకిరణాల తీక్షణతకు అనగా వేడికి మేధిని తడి ఆరి భూమి గట్టి పడింది. భూమి చుట్టూ నిలిచిన నీరు కొంచం కొంచెం ఇంకిపోయి సప్త సముద్రాలుగా మారి భూమి చుట్టూ ఏర్పడినాయి. మేధిని సప్త సముద్రాల మధ్య ఉండే ఏడు ద్వీపాలుగా మారి భూదేవి సప్త సముద్ర వేలాయుత సప్త ద్వీప వసుంధర అయ్యింది*. *కోటి కిరణాల సూర్య వేడిమిని బ్రహ్మతో లోకాలన్ని భరించలేక పోయాయి. బ్రహ్మ నారాయణునితో "శ్రీహరీ! సూర్య కిరణాల వేడిని నేనే భరించలేకపోతూ ఉన్నాను. లోకాలలో ఏర్పడే నా సృష్టి ఎలా భరించగలుగుతుంది. సృష్టికి అవసరమైనంత ప్రకాశము, వేడి ఇచ్చేలా సూర్య కిరణాల సంఖ్య పరిమితము చేయండి. మిగిలిన తేజో కిరణాలను ఉపసంహరించండి" అని ప్రార్ధించాడు*. *విష్ణువు సరేనని కోటి సువర్ణ సూర్య కిరణాలలో సృష్టికి కావలసిన పన్నెండు కిరణాలు ఉంచి మిగిలిన కిరణాలను తన దక్షిణనేత్రములోనిలుపుకున్నాడు.* *"బ్రహ్మదేవా! పన్నెండు కిరణాలతో ఉన్న సూర్యుడు "ద్వాదశాదిత్యుడు" అవుతాడు. సువర్ణ కిరణాలు వెదజల్లుతాడు కాబట్టి సూర్యుడు అనిపిలవబడ తాడు. నా అంశతో జన్మించాడు కాబట్టి "సూర్య నారాయణుడు" అని కీర్తించబడతాడు.* *లోకాలకు ప్రత్యక్షంగా కనిపిస్తూ లోకాల ప్రజలకు ఆహారం, ఆరోగ్యం ప్రసాదిస్తాడు కనుక "ప్రత్యక్ష నారాయణడు" అవుతాడు. పగటి పూటకు అధిదేవతయై వెలుతురు, జీవశక్తి ప్రసాదిస్తాడు. వెలుగు వేడిమిని ఇచ్చే సూర్యుని పగటి పూటకు ఇచ్చాను కనుక రాత్రికి వెన్నెల, చల్లదనం ఇచ్చే చంద్రుని ఇస్తాను" అని సంకల్పం చేశాడు*. *నారాయణుని వామ నేత్రం నుంచి చల్లటి వెన్నెల కురిపిస్తూ చంద్రుడు ఉదయించి ఆకాశంలో నిలిచాడు. బ్రహ్మకు చూపిస్తూ "నాయనా! చంద్రుడు ఇతడు. సూర్యుడి వలన పగలు ఏర్పడితుంది. సూర్యాస్తమయం తరువాత ఏర్పడే చీకటిని తక్కువ చేస్తూ చంద్రకాంతి కిరణాలతో చంద్రుడు ఉదయించి లోకాలికి ఆహ్లాదం కలిగించే చల్లదనం, వెన్నెల ఇస్తాడు.* *ఈ సూర్య చంద్రుల గమనం ఆధారంగా "కాలమానం" ఏర్పాటు చేయుము. కాలచక్రం గమనం నిర్దేశించుము.నక్షత్రాలు, గ్రహాలు ఆధారంగా సౌరమాన చాంద్రమానాలు, గణిత సంఖ్య జ్యోతిష్య శాస్త్రాలను ఏర్పాటు చేయుము. పద్నాలుగులోకాలలో సృష్టించిన జీవులను వృద్ధి చేయడం సృష్టికర్తగా నీ కర్తవ్యం" అని దశ దిశలను నిర్దేశించాడు.* *తత్తరపడి కలవరం చెందిన బ్రహ్మదేవుడు విష్ణువుకి నమస్కరించి "తండ్రీ! సృష్టించడమే కష్టతరమైతే గణిత జ్యోతిష్యాది శాస్త్రాలు ఏర్పరచడం నా శక్తికి మించిన పని అవుతుంది. కనుక తగిన శక్తి సామర్థ్యాలు ప్రసాదించుము" అని కోరాడు. విష్ణువు నవ్వి "బ్రహ్మా! నాకు తెలుసును. అందుకే నీకు శక్తి సామర్థ్యాలు ఇచ్చి తోడుగా ఉండటానికి సకలవిద్యాధిదేవత అయిన సరస్వతీదేవిని నీకు ధర్మపత్నిని చేస్తున్నాను*. *నీవు సృష్టికర్తవైతే, సరస్వతీదేవి విద్యలకు అధిదేవతయై నీకు వాణియై సహకరిస్తుంది" అని తన హృదయంలో నివసించే లక్ష్మీదేవి వంక చూశాడు*. *లక్ష్మీదేవి వచ్చి విష్ణువు పక్కన నిలుచుంది. ఇద్దరు కలిసి బ్రహ్మదేవుడికి, సరస్వతీదేవికి వేదోక్తంగా వివాహం చేశారు. సృష్టి కార్యం అప్పగించి ఆదృశ్యమయ్యారు* #మన సంప్రదాయాలు సమాచారం
*_పాంచజన్యం_* *భగవాన్‌ శ్రీకృష్ణపరమాత్ముడి శంఖం పాంచజన్యం. ఆయన ఈ శంఖాన్ని కుఱుక్షేత్ర యుద్ధంలో పూరించేవాడు. వసుదేవుడు బలరామ,కృష్ణులకు గర్గాచార్యుడనే పురోహితుడి ద్వారా ఉపనయనం చేయించాడు*. *అనంతరం ఆ ఆచార్యులు వారికి గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించారు. తరువాత బలరామ కృష్ణులను సాందీప మహాముని ఆశ్రమానికి తీసుకువెళతారు. ఆ ఆశ్రమంలో అన్ని విద్యలను ఆచార్యుల వారు వారికి బోధించారు. ఈ ఆశ్రమంలోనే కుచేలుడు కృష్ణునికి స్నేహితుడిగా పరిచయమవుతాడు*. *కొంతకాలం అనంతరం శిక్షణ ముగియడంతో బలరాముడు,కృష్ణుడు ఆచార్యులకు ప్రణమిల్లి గురుదక్షిణ ఏమివ్వాలో ఆజ్ఞాపించమని కోరతారు. వీరు సామాన్యులు కాదని వైకుంఠం నుంచి భువిపై అవతరించిన వారని తన దివ్యజ్ఞానంతో సాందీపుడు తెలుసుకొంటాడు. తన మరణించిన కుమారుడిని తిరిగి బతికించమని కోరతాడు. గురుపత్ని శోకాన్ని నివారించినట్టు అవుతుందని వారికి సూచిస్తాడు*. **** **** **** *గురుకుమారుడు కొంతకాలం క్రితం సముద్రస్నానం చేస్తూ భారీ అల రావడంతో కడలిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు*. *ఆ సముద్రతీరానికి వెళ్లిన బలరామ కృష్ణులు గురుకుమారుడిని తిరిగివ్వమని సాగరుణ్ని కోరారు.* *సాక్షాత్తు నారాయణుడే తన దగ్గరకు రావడంతో సముద్రుడు వారికి వినమ్రంగా నమస్కరించి ‘గురుపుత్రుడిని మింగింది పంచజనుడనే రాక్షసుడనీ, కడలి గర్భంలో దాగి వున్నాడనీ’ వెల్లడిస్తాడు*. *దీంతో వారు సముద్రంలోపలికి వెళ్లి పంచజనుడితో యుద్ధం చేసి అతన్ని సంహరిస్తారు. అనంతరం అతని కడుపును చీల్చిచూడగా గురు కుమారుడు కనిపించడు. ఒక శంఖువు మాత్రమే కనిపిస్తుంది*. *ఆ శంఖాన్ని శ్రీకృష్ణుడు తీసుకున్నాడు. గురుకుమారుడు నరకంలో వున్నాడని గ్రహించిన వారు అక్కడికి చేరుకుంటారు. అక్కడ ఆ శంఖువును పూరిస్తాడు కృష్ణుడు*. *ఆ శబ్దానికి భీతిల్లిన యమధర్మరాజు అక్కడకు చేరుకొని ఇద్దరినీ తీసుకెళ్లి అతిథి మర్యాదలు చేసి ఎందుకొచ్చారో తెలుసుకుంటాడు*. *భగవంతుని ఆజ్ఞ కావడంతో వెంటనే సాందీపుని కుమారుడిని వారితో పంపిస్తాడు*. *మునికుమారుడిని వెంటబెట్టుకొని ఆశ్రమానికి చేరుకుంటారు.* *మృతుడైన తమ కుమారుడు తిరిగి రావడంతో సాందీప దంపతులు ఎంతో సంతోషిస్తారు.* *పంచజనుడి నుంచి తీసుకున్న శంఖం కనుకనే దానికి పాంచజన్యం అని పేరొచ్చింది* #మన సంప్రదాయాలు సమాచారం
#మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
01:00
#మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
00:13