Ravi  Talluri
ShareChat
click to see wallet page
@91775
91775
Ravi Talluri
@91775
feelgood
*_సెక్స్ ట్రాఫికర్ ఎప్‌స్టీన్ 'యమకూపం'లో రాలిన పసిమొగ్గలెన్నో..._* *_---మనకు ముంబై కామాఠీపుర, పుణె బుధ్వార్ పేట్, ఢిల్లీ GB రోడ్, వారణాసి శివదాస్‌పూర్ తెలుసు.._* *_చీకోటి ప్రవీణ్, నిఖిల్ బండి, మోనిష్ గల్లా, కోల్‌కతా సోనాగాచి ముఠా- సరస్వతి బెనర్జీ, పూజా మిస్త్రీ, ఆకాష్ ఛటర్జీ లాంటి సెక్స్ బ్రోకర్లూ తెలుసూ.._* *_కానీ ఈ సెక్స్ ట్రాఫికర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ ఎవరు? సెక్స్ ట్రేడింగ్ తో రూ. 55 వేల కోట్లు ఎలా పుట్టించాడు?_* *_డబ్బు, అధికారం, రాజకీయం.. కలిస్తే న్యాయమూ మూగబోతుందా? జెఫ్రీ ఎప్‌స్టీన్ కి అంత వికారపు సంపద ఎలా వచ్చిందీ? బ్రిటన్ రాజుకి ఉన్న సంబంధమేమిటీ? అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తో లింకేంటీ? ట్రంప్ సర్కార్ లేబర్ సెక్రటరీ పదవెందుకు ఊడిందీ? అన్ని తెలిసిన ఆ న్యాయమూర్తి ఆ మదాందుణ్ణి వదిలేసినందుకు ఎంత ముట్టిందీ? చివరికి అతడెందుకు కుక్కచావు చచ్చాడు? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు సమాధానమే_* *_"Jeffrey Epstein: Filthy Rich" (జెఫ్రీ ఎప్‌స్టీన్- వికారపు సంపద)డాక్యుమెంటరీ సీరీస్._* *ప్రస్తుతం ప్రపంచ కుబేరులను వణికిస్తున్న పేరు జెప్రీ ఎప్‌స్టీన్. ఇతడి చీకటి సామ్రాజ్యంలో ఓలలాడిన వందలాది సుఖపురుషుల రంకు ఇప్పుడు కుప్పలు తెప్పలుగా పారుతోంది. ఇప్పటికి బయటికొచ్చిన 30 లక్షల పేజీల్లో ఎవరి పేరు ఎప్పుడు తెరపైకి వస్తుందో తెలియక బిక్కుబిక్కు మంటున్నారు*. *ఎప్‌స్టీన్‌తో పరిచయాల వల్ల ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ఇండియా ఏఐ సమ్మిట్ కి వచ్చినా ఎంట్రీ దొరక్క చెప్పా పెట్టకుండానే ఇంటిదారిపట్టారు.* *ఇండియాకి చెందిన ఓ కేంద్ర మంత్రి సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు*. *సరిగ్గా ఇటువంటి దశలో నెట్ ఫ్లిక్స్ (ఇండియన్ సెక్షన్)లో Jeffrey Epstein: Filthy Rich డాక్యుమెంటరీ సంచలనం రేపుతోంది. ప్రైవేట్ జెట్‌లు, విలాసవంతమైన భవంతులు, ఎలైట్ క్లాస్ డిన్నర్లు, హైక్లాస్ విందులు, వినోదాలు, వాటి వెనుక దాగి ఉన్న లైంగిక దోపిడీ వంటి యమకూపాల సమాహారమే ఈ సీరీస్.* *Jeffrey Epstein జీవితం ఓ వ్యక్తి నేరగాథ మాత్రమే కాదు. వ్యవస్థల వైఫల్యానికి ప్రతీక. ఇది కేవలం క్రైమ్ కథ కాదు- ఇదో అధికారపు చట్రంలో దాగిన అన్యాయాన్ని కక్కించే సామాజిక సాక్ష్యం*. *డాక్యుమెంటరీలు మామూలుగా ఏదైనా ఒక ఘటనను చెబుతాయి. కానీ* *Jeffrey Epstein: Filthy Rich అంతకు మించి ఒళ్లు జలదరించే నిజాలను చెబుతుంది. వ్యవస్థల వైఫల్యాన్ని, అధికారం ఎలా రక్షణ కవచంగా మారుతుందో కళ్లకు కడుతుంది*. *ఈ సిరీస్ లో హీరో, విలన్ రెండూ జెఫ్రీ ఎప్‌స్టీన్. యూదు మూలాలున్న వ్యక్తి. చాలా సాదాసీదా కుటుంబం. తండ్రిది చిన్న వ్యాపారం, తల్లి ఓ స్కూలు టీచర్. అతనికో అన్న. మంచి మాటకారి. అవతని వాళ్లను బురిడీ కొట్టించడంలో దిట్ట. డిగ్రీ కూడా లేకుండానే సైంటిస్ట్ అవతారమెత్తుతాడు. ఫేక్ స్టాక్ బ్రోకర్ అవుతాడు. అధికార, అనధికార వర్గాల అవసరాలు తీరుస్తాడు*. *ఒక్కమాటలో చెప్పాలంటే సుఖవాదానికి ఇతనో నగ్నావతారం. రెండు ప్రైవేటు విమానాలు, విలాసాలకు సకల సౌకర్యాలున్న రెండు ద్వీపాలు (ఐలాండ్స్), ఫ్లోరిడా తీరంలో మరెవరికీ లేనట్టుండే రాజసౌధాలు, చీమచిటుక్కుమన్నా పసిగట్టే గూఢచారులు, గోడల్లోనే బిగించిన నిఘా నేత్రాలు.. ఇలా ఒకటేమిటీ.. అతనికి లేనిది లేదంటే నమ్మండి. కానీ ఈ తణుకు బెణుకుల మెరుపు ప్రపంచం వెనుక ఉన్నది మైనర్ బాలికల మాంసపు ముద్దలు. వందలాది మంది అభం శుభం తెలియని ఆడపిల్లల శరీరాలు.* *_బాధితుల స్వరమే ఈ కథనానికి మూలం.._* *ఈ డాక్యుమెంటరీలో అత్యంత ప్రభావవంతమైంది బాధితుల ప్రత్యక్ష వాంగ్మూలాలు. ముఖ్యంగా Virginia Giuffre వంటి మహిళలు తమ అనుభవాలను నిస్సంకోశంగా పంచుకోవడం సిరీస్‌కు నైతిక బలం*. *ఈ సీరీస్ ను తెరకెక్కించినందుకు ఆ దర్శకురాలు Lisa Bryant ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిందో. ఎన్నెన్ని పాట్లు పడిందో మాటల్లో చెప్పలేం. సెన్సేషన్ వైపు వెళ్లకుండా ఏ మాత్రం తోట్రుపాటు లేకుండా బాధితుల అనుభవాలను గౌరవంగా, నెమ్మదిగా వినిపిస్తుంది. కెమెరా బాధితుల ముఖాలపై ఎక్కువ సేపు నిలిపి, మింగుడు పడని ఓ నిజానికి ఎదురుగా ప్రేక్షకుల్ని నిలబెడుతుంది.* *ఇంత దారుణమే 'మీ పిల్లలకు జరిగితే' అనే ప్రశ్న వేయకుండానే మనం జవాబు చెప్పుకునేలా చేస్తుంది*. *ఈ డాక్యుమెంటరీ ఓ వ్యక్తి పాపాల చిట్టా కాదు. ఇది మూడు వ్యవస్థల క్షుద్ర అవస్థ. డబ్బు, అధికారం, పలుకుబడి ప్రభావం. ఈ మూడు కలిస్తే బాధితుల గొంతు కీచుగొంతవుతుంది*. *ఎప్‌స్టీన్ చావు- అనేక ప్రశ్నలకు జవాబు లేకుండా చేసినా బాధితుల వాంగ్మూలాలను చరిత్రకెక్కించడం ఈ డాక్యుమెంటరీ ఘనత.* *_Jeffrey Epstein: Filthy Rich- సీరీస్ నాలుగు ఎపిసోడ్లు._* *ప్రతి ఎపిసోడ్ సుమారు 55-57 నిమిషాలు.* *తొలి ఎపిసోడ్ లో ఎప్‌స్టీన్ ఆడపిల్లలకు ఎలా వల వేస్తాడు అనేది డీల్ చేస్తుంది*. *1996 నుంచి మొదలవుతుంది*. *తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి మైనర్ బాలికలను టార్గెట్ చేయడం ఇందులో ఉంటుంది.* *మనకు తెలిసిన పిరమిడ్ యోగం, ధ్యానానికి సంబంధించింది. ఎప్‌స్టీన్ "పిరమిడ్ స్కీమ్" మాత్రం గొలుసుకట్టు రిక్రూట్మెంట్. ఒకరు ఇంకొకర్ని తీసుకురావాలి. వాళ్లు ఇంకొందర్ని తీసుకురావాలి. అలా మనదేశంలోని చెయిన్ మార్కెటింగ్ మాదిరి బాధితులను ఒకరికొకరు రిక్రూట్ చేయించడం ఇతని వ్యవస్థ.* *ఎప్‌స్టీన్ కబంధ హస్తాల నుంచి బయటపడిన వారి (సర్వైవర్స్) ఇంటర్వ్యూలతో మొదలవుతుంది. ఎలా వంచనకు గురయ్యారో, ఎలా భయపెట్టారో డీల్ చేస్తుంది ఈ భాగం.* *రెండో ఎపిసోడ్ -* *Follow the Money (ఫాలో ది మనీ)* *ఎప్‌స్టీన్ కి సంపద ఎలా వచ్చింది, అది ఎలా అతనికి రక్షణ కల్పించిందనేది డీల్ చేస్తుంది. డబ్బుతో దేన్నైనా కొనగలను అనే ధైర్యం రావడానికి కారణమేంటో వివరిస్తుంది.* *3వ ఎపిసోడ్- The Island (ది ఐలాండ్) ఎప్‌స్టీన్ కి రెండు సొంత ద్వీపాలు ఎలా వచ్చాయో, అవి టార్చర్ హౌసెస్ గా ఎలా మారాయో చెబుతుంది. ఇక్కడ ఆడపిల్లలు అరిచే అరుపులు ఎలా ఆర్తనాధాలవుతాయో చూస్తుంటే మనం గిలగిల్లాడాల్సిందే. మరియా ఫార్మర్ లాంటి బాధితులు తమ ఐలాండ్ అనుభవాలను వివరిస్తుంటే మనసున్నఎవరికైనా కళ్లంట నీళ్లు జలజలా రాలాల్సిందే. ఈ సీరీస్‌లో అత్యంత డిస్టర్బింగ్ ఎపిసోడ్ ఇది*. *ఇక ముగింపుగా చూపే 4వ ఎపిసోడ్ Finding Justice (ఫైండింగ్ జస్టిస్)లో బాధితుల న్యాయ పోరాటం, 2019లో మియామి హెరాల్డ్ జర్నలిస్ట్ జూలీ కె. బ్రౌన్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఎప్‌స్టీన్‌ను మళ్లీ అరెస్టు చేయించిందీ, న్యూయార్క్ జైల్లో అనుమానాస్పద చావును చూపుతుంది. ఆశ నిరాశల మధ్య న్యాయం ఇంకా చచ్చిపోలేదన్న సందేశంతో ముగిసినా అంతు చిక్కని ప్రశ్నలు, జవాబులు ఎన్నో*. *_ఇన్ని ఘోరాలు చేసినా తాను అమాయకుణ్ణని తప్పించుకునేందుకు ఎప్‌స్టీన్ కోర్టు విచారణలో చూపే హావభావాలు, ఆ బాడీ లాంగ్వేజ్ మనకు అరికాలి మంట తలకెక్కాలే చేస్తాయి. ఒంటి నిండా నింపుకున్న డబ్బు మదం, అహంకారంతో గతంలో తప్పించుకున్నట్టే 2019లోనూ తప్పించుకునేందుకు చేసే ప్రయత్నం, అతని చుట్టూ కుక్కపిల్లల్లా తిరిగే అమెరికన్ టాప్ మోస్ట్ లాయర్లు, వాళ్ల భాష చూస్తే మనకు ఒళ్లు మండిపోతుంది_*. *_కోపం కట్టలు తెంచుకుంటుంది._* *_ఆలోచన రేపుతుంది._* *_“Filthy Rich” కేవలం ఒక డాక్యుమెంటరీ కాదు. అధికారం, హోదా, సంపద, న్యాయ వ్యవస్థ కలగలిపితే జరిగే దుర్మార్గాలు ఎలా ఉంటాయనే దానికి అద్దం. ఇది చూసిన తర్వాత మీలో ఆగ్రహం పెల్లుబకవచ్చు. కీచు గొంతుకలు కూడా పెద్దగా అరవగలవు అన్పించవచ్చు. బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ అని అరవవచ్చు. మనవాళ్లు ఇలాంటి డాక్యుమెంటరీలు ఎందుకు తీయలేకపోతున్నారు అని మూలుగు వినిపించవచ్చు.!_* *గుండెలు పిండే వికృత నేరకాండ* *_{పీపుల్స్‌ డెమోక్రసీ సంపాదకీయం} :_* *అమెరికా న్యాయశాఖ జనవరి 30న ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ విడుదల చేసిన నాటి నుంచి ఆ దేశంలోనూ యూరప్‌లోనూ తీవ్ర అలజడి చెలరేగింది*. *30 లక్షల ఇ-మెయిల్‌ సంభాషణలు, లక్షకు పైగా ఫోటోలు, వేయికి పైగా వీడియో క్లిప్పింగులతో కూడిన ఈ పత్రాల విడుదలతో ఘోరమైన నేరస్త చర్యలు బయటపడ్డాయి. అయితే ఈ ఘోరాల పర్వం మొత్తం ఎప్‌స్టీన్‌ పాత్ర చుట్టూనే తిప్పుతూ తనే లక్ష్యంగా చర్చ సాగుతున్నది. అయితే ఎప్‌స్టీన్‌ అమానుష దురంతాలు అతనేదో వంటరి వ్యక్తిగా చేసినవి కాదని సుస్పష్టమవుతూనే వుంది. ఒక వ్యవస్థీకృత వాతావరణంలోనే ఇవన్నీ జరిగాయి*. *ఈ తప్పులు దశాబ్దాల పాటు సాగుతూ వచ్చాయి.* *మొదట్లో 2008లో వ్యక్తిగత స్థాయిలో చేస్తూ వచ్చిన ఆరోపణలు ఉన్నత స్థాయిలో వారి నేరస్థ చర్యలపై దర్యాప్తుగా మారింది. తర్వాత ఆయనను అరెస్టు చేయడం, 2019లో ఎప్‌స్టీన్‌ ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్నారు*. *1980, 90లలో అతను స్త్రీలనూ బాలికలనూ రిక్రూట్‌ చేసుకోవడం మొదలు పెట్టాడు*. *ఎప్‌స్టీన్‌ తన చెల్లెళ్ల ఫోటోలు దొంగిలించి, ఆ విషయాన్ని బయటపెడితే చంపుతానని బెదిరించినట్టు ఒక నటి ఎఫ్‌బిఐ గూఢచారి సంస్థకు చెప్పారు. 1998లో అతను వర్జిన్‌ దీవులలో లిటిల్‌ సెయింట్‌ జేమ్స్‌ దీవిని కొనుగోలు చేశాడు. ఎప్‌స్టీన్‌ సెక్స్‌ దురంతాలలో ఇదే కేంద్ర బిందువుగా తయారైంది. అతనికి మసాజ్‌ సేవకురాలిగా మారనున్న మహిళ 2000 సంవత్సరంలోనే తాను సెక్స్‌ బానిసగా వున్నానని ప్రకటించింది*. *_తప్పించిన తొలి విచారణ_* *14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిందన్న కథనాలు వచ్చాక 2005 మార్చిలో పామ్‌ బీచ్‌లో దర్యాప్తు ప్రారంభమైంది. వ్యభిచారాన్ని నడిపిస్తున్నారన్న అధికారిక ఆరోపణతో ఎప్‌స్టీన్‌ను 2006 జులైలో అరెస్టు చేశారు. ఒక మైనర్‌ బాలికను వ్యభిచారం చేయవలసిందిగా అడిగినట్టు అతను ఫ్లోరిడా కోర్టులో నేరం అంగీకరించాడు. తర్వాత ఎప్‌స్టీన్‌ ‘ప్రేమ పూర్వక’ అభ్యర్థన తర్వాత అమెరికా ప్రభుత్వ న్యాయవాది అలెగ్జాండర్‌ అకోస్టా ఆమోదించడంతో ప్రభుత్వ ఆరోపణల నుంచి తప్పించుకుని 18 నెలల శిక్షతో బయటపడ్డాడు*. *2011లో వర్జీనియా గుఫ్రే (అంతకు ముందు పేరు వర్జీనియా రాబర్ట్స్‌)˜ బహిరంగంగా బయటికొచ్చి ప్రిన్స్‌ ఆండ్రూతో వ్యభిచారం కోసం తనను పంపినట్టు బయటపెట్టింది. 2018 నవంబర్‌లో మియామి హెరాల్డ్‌ ప్రచురించిన సిరీస్‌లో 2008 నాటి అభ్యర్థన వివరాలు వెల్లడైనాయి. దాంతో ప్రజల దృష్టి, చట్టాల దృష్టి కూడా కేంద్రీకృతమైంది. 2019 జులై ఆరున ఎప్‌స్టీన్‌ న్యూయార్క్‌లో అరెస్టయ్యాడు. మైనర్లను వినియోగించి, జాతీయ మానవ అక్రమ రవాణా చట్టం కింద నేరాలు, కుట్రలకు పాల్పడినట్టు కేసు వేశారు. 2019 ఆగస్టు 10న జైలులో అనుమానాస్పద పరిస్థితుల్లో ఉరి తాడుకు వేలాడుతూ కనిపించాడు. దాన్ని ఆత్మహత్యగా నిర్ధారించారు*. *_చనిపోయాక కూడా…_* *ఎప్‌స్టీన్‌ మరణానంతరం కూడా దీనిపై తెరపడలేదు. 2021 డిసెంబర్‌లో ఎప్‌స్టీన్‌కు అతి సన్నిహిత సహచరుడు ఘిస్లానే మాక్స్‌వెల్‌కు మహిళల అక్రమ రవాణా నేరానికిగాను ఇరవై ఏళ్ల శిక్ష పడింది. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత కోర్టు అతని క్లైంట్ల పేర్లు వారి వారి నిర్దిష్ట తప్పుల ఆరోపణలు లేకుండా ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ విడుదలకు ఆదేశాలిచ్చింది*. *ఈ నేపథ్యంలోనే వేయిమంది బాధితుల ఆరోపణలతో నిరసన ప్రజ్వరిల్లింది. ప్రజా స్ఫూర్తిగల పాత్రికేయులు, ఇతర విమర్శకుల తక్షణ పరిశోధనల ఫలితంగా అమెరికా కాంగ్రెస్‌ ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ పారదర్శకత చట్టాన్ని ఆమోదించవలసి వచ్చింది. ఫలితంగా మరింత లోతైన దర్యాప్తు కథనాలు వెలుగులోకి వచ్చాయి*. *ఈ ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ ఇ-మెయిళ్లు, ఫోటోలు, వీడియో క్లిప్పులతో కూడిన భారీ భాండాగారంలో భాగం. అమెరికాలో శక్తివంతులైన అధికార శక్తుల ఆనుపానులన్నీ వాటిలో వున్నాయి. అలాగే అనేకమంది యూరోపియన్‌ దేశాల వారూ వున్నారు. కేవలం రాజకీయ నాయకులే కాదు. లారీ సమర్స్‌, పీటర్‌ మండేల్సన్‌ వంటి విధాన శిల్పులు, ప్రతిఫలం తీసుకునే మేధావులు, బిల్‌గేట్స్‌, ఎలన్‌మస్క్‌, రిచర్డ్‌ బ్రాన్సన్‌ వంటి బడా వ్యాపారులూ వున్నారు*. *ఇన్ని రకాలైన సెలబ్రిటీలతో ఎప్‌స్టీన్‌ నెట్‌వర్క్‌ పని చేసిందంటే నిజంగా బుర్ర తిరిగిపోతుంది. డోనాల్డ్‌ ట్రంప్‌ పేరే లక్ష సార్లకు పైగా వినిపిస్తుంది. నాకు అత్యంత సన్నిహిత మిత్రుడు అని ట్రంప్‌ను ఎప్‌స్టీన్‌ అభివర్ణిస్తాడు. ఇజ్రాయిల్‌తోనూ, ఇజ్రాయిల్‌ మాజీ ప్రధాని ఎహుద్‌ బరాక్‌తోనూ ఎప్‌స్టీన్‌కు భద్రతాపరంగా సున్నితమైన సంబంధాలున్నాయి.* *_లక్షల సాక్ష్యాలు_* *ఎప్‌స్టీన్‌కు వున్న అత్యంత ఖరీదైన ఆస్తులలో ఒకటైన న్యూయార్క్‌ సౌధం నుంచి ఈ ఫైల్స్‌ పట్టుబడ్డాయి. చాలా పకడ్బందీ అయిన చోట వాటిని దాచిపెట్టారు. అయితే ఇప్పుడు న్యాయశాఖ ఆదేశాలతో వాటిని బయటపెట్టాక ఒక్కసారిగా కొంప మునిగినంత పనైంది. ఇంకా లక్షోపలక్షల సాక్ష్యాలు బయటకు రావలసి వుందనే అనుకుంటున్నారు*. *న్యాయశాఖకు సంబంధించిన కాంగ్రెస్‌ కమిటీ తన బహిరంగ విచారణలలో అమెరికా అటార్నీ జనరల్‌ పామ్‌ బొందీని, అలాగే ఎఫ్‌బిఐ డైరెక్టర్‌ కాశ్‌ పటేల్‌ను ప్రత్యేకంగా చీల్చి చెండాడింది. పారదర్శకతా చట్టం నిబంధనలు పాటించనందుకు తప్పు పట్టింది*. *కనుక ఈ మొత్తం విచారణ తీరుతెన్నులన్నింటినీ బట్టి చూస్తే కావాలని సాగదీసేందుకూ, దారుణ కృత్యాలనూ నేరపూరిత సంబంధాలనూ కప్పిపుచ్చేందుకూ ఉద్దేశపూర్వకంగానే ప్రయత్నం జరిగిందని స్పష్టమవుతుంది*. *అంతేగాక మొత్తం సత్యం బయటికి రాకుండా చేస్తున్నారనీ, కీలకమైన వ్యక్తిగత సమాచారాలు తొక్కిపడుతున్నారనీ కూడా స్పష్టమవుతుంది. సాక్ష్యాలను వెల్లడించే క్రమంలో బాధితుల వివరాలు చెప్పడంలో కూడా బలీయమైన శక్తివంతులైన వారి సంగతులు వెల్లడి కాకుండా ఎంపిక చేసుకున్నట్టు వ్యవహరిస్తున్నారనీ తెలిసిపోతుంది. ప్రధాన మీడియా ఎప్‌స్టీన్‌ పైనే కేంద్రీకరిస్తున్నది. ఆ విధంగా చేయడంలో ఉద్దేశం ఆయన ఘోర నేరాలకు పాల్పడ్డం వెనక వున్న వ్యవస్థీకృత రక్షణలను, ప్రోత్సాహాలను మరుగుపరుస్తున్నది*. *వివరంగా బయటికి వస్తున్నదాన్ని పైపైన చూసినా సరే ఈ క్రమపద్ధతి ఏమిటో తెలిసిపోతుంది. 150 ఏళ్ల కిందటనే కారల్‌ మార్క్స్‌ పారిశ్రామిక పెట్టుబడి పుట్టుక పైన రాసిన అధ్యాయం ముగింపులో ఇలా అంటారు: ”పెట్టుబడి అనేది నఖశిఖ పర్యంతం ప్రతి అణువూ నెత్తురుతో మురికితో తడిసి వుంటుంది.” దీనికి మద్దతునిచ్చే విధంగా పాదపీఠికలో కార్మిక నాయకుడైన టిజె డన్నింగ్‌ మాటలను ఉటంకిస్తాడు: కావలసినంత లాభం వస్తే పెట్టుబడి ఎంతకైనా తెగిస్తుంది.* *పది శాతం వచ్చేట్టయితే అది ఎక్కడైనా వాలుతుంది. 20 శాతం వస్తే ఆదుర్దా పెంచుతుంది. యాభై శాతం వస్తే సానుకూల సాహసం సమకూరుతుంది. అదే వంద శాతం వస్తే మానవ చట్టాలన్నిటినీ తొక్కిపారేసేందుకు సిద్ధమైపోతుంది. 300 శాతం వస్తే గనక అది ఎంతటి నేరానికైనా పాల్పడేందుకు వెనుకాడే ప్రసక్తి వుండదు. తన యజమానిని ఉరి తీయడానికి కూడా సిద్ధమైపోతుంది.” ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ బయట పెట్టిన కథనం చూస్తే మార్క్స్‌ వాదన ఎంత వాస్తవికమో అర్థమవుతుంది.* *మానవత మృగ్యమైన తీరు* *పెట్టుబడిదారీ విధానం ప్రస్తుత నయా ఉదారవాద అవతారం దాల్చేందుకు దాన్ని వెంటనంటి వుండే ఆశ్రిత పోకడలు అగాధమైన అసమానతలకూ నిరుద్యోగానికి దారితీస్తున్నాయి. ఇది సృష్టించిన ప్రమాదకరమైన నయా ఉదారవాద భావజాలం దాని ఆర్థిక నమూనాను దాటేసి ముందుకు పోతుంది*. *విపరీతమైన అసమానతల వల్ల వ్యాఖ్యాతలు చెబుతున్నట్టు ఎప్‌స్టీన్‌ బాపతు ప్రపంచ పీడక సంతతి పుట్టుకొచ్చారు. వీరు ఇతరులను ఆర్థికంగానూ ఇతరత్రా కూడా కొల్లగొడతారు. సాధారణ మానవతా విలువలను ఇంకే మాత్రం పట్టించుకోరు. వీరినే ఎలన్‌ మస్క్‌ ”పని లేని పాత్రలు” అంటాడు. పాశ్చాత్య నాగరికతలో అతి ప్రాథమికమైన బలహీనత సహానుభూతి మాత్రమేనని తేల్చేస్తాడు*. *ఈ బరితెగింపు, ఏమీ కాదనే ధీమా వల్లనే వారు కనీసమైన జవాబుదారీతనం కూడా లేకుండా ప్రవర్తించేలా కొమ్ములు తెస్తుంది. కార్పొరేట్‌ మీడియా ఈ భావాన్ని మళ్లీ మళ్లీ సృష్టిస్తూ దాన్ని మామూలు విషయంగా మార్చేసి ఇప్పుడున్న వ్యవస్థీకృత వాతావరణాన్ని కొనసాగించే పరిస్థితులు కల్పిస్తుంది. మీడియా యాజమాన్యాలలోనూ సమాచార భావజాల రంగంలోనూ ఎలాంటి స్వేచ్ఛా వాణిజ్యం వుండతగదు. ఈ రంగంలో ఆధిపత్యం వహించే చిరు బృందాలు ఇబ్బందికరమైన ఆలోచనలను చిదిమివేస్తాయి.తమ భాగ్యరేఖలను పెంచే విధానాలనే ప్రోత్సహిస్తాయి*. *మోడీ ప్రభుత్వంలో ప్రస్తుత పెట్రోలియం శాఖామంత్రి హరదీప్‌ సింగ్‌, అలాగే ప్రస్తుతం ఆరోపణల పాలైన పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీ జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో తమ సంభాషణలను పత్రాలకెక్కించారు. నిజంగా ఏమి జరిగిందీ, దానికి ప్రేరణ ఏమిటి అన్నది తెలియాలంటే సరైన విచారణ ద్వారానే సాధ్యమవుతుంది.* *అయితే అదంతా జరిగింది 2014, 2016, 2017, 2019లలో…దాదాపు ఒక దశాబ్ది తర్వాత ఎప్‌స్టీన్‌ స్వయంగా తన ఘోర నేరాలను అంగీకరించాడు*. *ఇక్కడ నిజమేమిటో బయటికి లాగడానికి మనం పట్టుదలగా కృషి చేయాలి*. *మానవాళికే వ్యతిరేకమైన ఇలాంటి నేరాలు జరిగేందుకు అనుమతిస్తున్న వ్యవస్థాగత మౌలిక చట్రం అంతర్జాతీయ ప్రభావం ఎదుర్కొనేందుకు మనం సిద్ధం కావాలి.* #😁Hello🙋‍♂️
😁Hello🙋‍♂️ - ShareChat
*_టోక్యోకు చెందిన షోజీ మోరిమోటో అనే వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత వింతైన వ్యాపారాన్ని చేస్తున్నాడు. అతను తనను తాను "ఏమీ చేయని వ్యక్తి"గా అద్దెకు ఇచ్చుకుంటాడు. దీని ద్వారా అతను సంవత్సరానికి సుమారు 80,000 డాలర్లు (దాదాపు 66 లక్షల రూపాయలకు పైగా) సంపాదిస్తున్నాడు_*. *ముఖ్యమైన విషయాలు:* *🤝 వినూత్నమైన సేవ: మోరిమోటో తన క్లయింట్‌లకు కేవలం తోడుగా (Presence) మాత్రమే ఉంటాడు. అతను వారితో మాట్లాడడు, పనులు చేయడు, కేవలం పక్కన ఉండి వారు చెప్పేది వింటాడు లేదా వారితో కలిసి కూర్చుంటాడు.* *🍱 అతను చేసే పనులు: పార్కులో ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు తోడుగా వెళ్లడం, రెస్టారెంట్‌లో ఒంటరిగా భోజనం చేయలేకపోయేవారి పక్కన కూర్చోవడం లేదా ఎవరైనా విడాకులు తీసుకుంటున్నప్పుడు వారికి నైతిక మద్దతుగా పక్కన నిలబడటం వంటివి చేస్తాడు*. *🚫 నిబంధనలు: అతను లైంగిక పరమైన పనులు చేయడు, బరువులు ఎత్తడు మరియు ఎక్కడికీ ప్రయాణాలు చేయడు. కేవలం "ఉండటం" మాత్రమే అతని పని.* *_💰 ఆదాయం:_* *ఒక్కో అపాయింట్‌మెంట్‌కు అతను కొంత మొత్తాన్ని ఫీజుగా తీసుకుంటాడు, దానితో పాటు అతని భోజనం మరియు ప్రయాణ ఖర్చులను క్లయింట్‌లే భరించాలి.* *_ఎందుకు ఈ క్రేజ్?:_* *జపాన్ వంటి రద్దీగా ఉండే నగరాల్లో ఒంటరితనం ఎక్కువగా ఉంటుంది.* *ఎటువంటి తీర్పులు ఇవ్వకుండా (Non-judgmental), కేవలం మౌనంగా తోడుండే మనిషి కావాలనుకునే వారికి మోరిమోటో ఒక వరంలా మారాడు* *_మన దగ్గర కూడా ఇలా ఉంటే ఊహించుకోండీ_* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
*ఖమ్మం జిల్లాకు ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ఒక మైలురాయిగా నిలిచే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది*. *ఖమ్మంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దేవాలయ నిర్మాణం కోసం ద్వంసలాపురం రెవెన్యూ పరిధిలో 20 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది*. *ఈ నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకోబడింది.* *ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లాలో భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, తిరుమల దర్శనానికి వెళ్లలేని భక్తులకు స్థానికంగా టీటీడీ దేవాలయం ఏర్పడితే ఆధ్యాత్మిక అవసరాలు నెరవేరుతాయని ఆయన వివరించారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, వెంటనే రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలు తడవుగా రెవిన్యూ శాఖ సమన్వయంతో భూమి కేటాయింపునకు కాంగ్రెస్ సర్కారు చర్యలు చేపట్టింది*. *_ఖమ్మానికి ఆధ్యాత్మిక కేంద్రమవుతుందా?..._* *ద్వంసలాపురం పరిధిలో కేటాయించిన 20 ఎకరాల్లో టీటీడీ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణంతో పాటు యాత్రికుల కోసం వసతి గృహాలు, కళ్యాణ మండపం, పార్కింగ్ సౌకర్యాలు, ధార్మిక కార్యకలాపాల కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇది ఖమ్మం నగర అభివృద్ధికి దోహదపడటమే కాకుండా, భక్తులకు మరింత సౌలభ్యం కల్పించనుంది*. *మంత్రి తుమ్మల ధన్యవాదాలు*... *భూమి కేటాయింపుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు*. #మన సంప్రదాయాలు సమాచారం
*_తెల్ల జిల్లేడు_* *_మీ ఇంటి ఆవరణ ఈశాన్య వైపు...ఈ ఒక్క మొక్క మీ ఇంట్లో ఉంటె చాలు..దుష్టశక్తుల పరార్.......!!_* *దేవుడు ఉన్నట్టే ఈ ప్రపంచంలో దెయ్యాలు, భూతాలు కూడా ఉన్నాయని నమ్మేవారు ఉన్నారు*. *ఈ క్రమంలోనే అలాంటి వారు తమ దగ్గరకు దుష్ట శక్తులు రాకుండా తాయత్తులు కట్టుకోవడం, దేవుళ్ల ఫొటోలు దగ్గర ఉంచుకోవడం, ఇతర పనులు చేస్తుంటారు*. *అయితే దుష్ట శక్తుల బారిన పడకుండా ఉండేందుకు ఇవే కాదు, ఇంకా కొన్ని రకాల సూచనలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు*. *వాటిని పాటిస్తే దుష్ట శక్తులే కాదు, నెగెటివ్ ఎనర్జీ కూడా దగ్గరకు రాదని సెలవిస్తున్నారు*. *దీంతో అదృష్టం కలసి వస్తుందని పేర్కొంటున్నారు. అలాగే తాము అనుకున్న పనులు నెరవేరుతాయి అని సూచిస్తున్నారు*… *ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్న ప్రకారం.. అలాంటి సూచనల్లో జిల్లేడు మొక్క కూడా ఒకటి… ఔషధపరంగా ఇది గొప్ప మూలిక. ఇక ఆధ్యాత్మిక పరంగా చూస్తే, దానిలో దేవతాశక్తులను ఆకర్షించే సుగుణం అధికంగా ఉంది.* *ఒక తెల్ల జిల్లేడు చెట్టు 12 సం.ల పైగా అవిచ్ఛిన్నంగా పెరిగితే దాని తల్లివేరు గణపతి ఆకారంగా గానీ, ఆంజనేయ ఆకారంగా గానీ దానంతట అది గానే రూపొందుతుందిట. దాన్ని శాస్త్రోక్త విధానంగా ఆరాధన చేస్తే ఆయా దేవతల అనుగ్రహం విశేషంగా లభిస్తుందిట*. *తెల్లజిల్లేడు సూర్య భగవానుడికి గూడా ప్రియమైనదే. తెల్ల జిల్లేడును శ్వేతార్కం అంటారు*. *వృక్షజాతిలో ఈ తెల్ల జిల్లేడు విశిష్టమైంది. ఇందులో విషం ఉంటుందని చాలామంది ఈ మొక్కలకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా జిల్లేడు పాలు కళ్ళలో పడితే చూపు పోతుందని భయపడతారు*. *కానీ గమ్మత్తేమిటంటే ఈ మొక్కలో ఉన్న విషంతో ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధాలు తయారుచేస్తున్నారు*. *జిల్లేడులో రెండు రకాలు ఉంటాయి. వంగపూవు రంగు పూలు పూసే జిల్లేడు ఒకటి, తెల్ల పూల జిల్లేడు మరొకటి. ఇది హేరంబ గణపతికి ప్రతీక. ఈ తెల్ల జిల్లేడును దొరికించుకుంటే మహాశివుడు, విఘ్నాదిపతుల దయ మనమీద ప్రసరిస్తుందట.* *తెల్ల జిల్లేడు వేళ్ళ మీద గణపతి నివసిస్తాడు. ఈ వేళ్ళు కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణేశుని పోలి ఉంటాయి. అందుకే చాలామంది తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి, తులసి మొక్కలా ఇంట్లో నాటుతారు*. *ఈ మొక్క గనుక ఉంటే ధన ధాన్యాలు పుష్కలంగా లభిస్తాయట. ఆలోచనల్లో పరిపక్వత వస్తుందని, ఎవరైనా హాని తలపెట్టినా, దుష్టశక్తులు మీ ఇంటిపైకి వచ్చినా, అలాంటివి దుష్ప్రభావం చూపకుండా, వారి ప్రయోగాలే నశిస్తాయని ప్రతీతి*. *ఇళ్ళలో జిల్లేడు మొక్కలు ఉండకూడదనేది ఒక అపోహ మాత్రమే. నిజానికి శ్వేతార్కం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్ర్యం అంటే ఏమిటో తెలీదట*. *జిల్లేడు మొక్కలు అధికంగా ఉన్న ఊళ్ళో పంటలు బాగా పండుతాయంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లేడు సిరిసంపదలకు చిహ్నం అని నమ్ముతారు*. *తెల్ల జిల్లేడు వేళ్ళు గనుక గణపతి రూపాన్ని సంతరించుకుంటే, అది స్వయంభూ శ్వేతార్క గణపతి అన్నమాట. మరి ఈ శ్వేతార్క రూపాన్ని ఎలా పూజించాలి అని సందేహం వస్తుంది కదూ! ఈ గణపతికి ఎరుపు రంగు ఇష్టం. ఆసనం మీద కుంకుమ వేసి శ్వేతార్క గణపతిని నిలిపి, ఎర్ర వస్త్రం కప్పి, నైవేద్యం సమర్పించి పగడాలు లేదా ఎర్ర రుద్రాక్షలతో పూజించాలి. మందార లాంటి ఎర్రటి పూలు, ఎర్ర చందనంతో పూజ చేయాలి. శ్వేతార్క గణపతిని పూజించిన వారికి వెంటనే గొప్ప ఫలితాలు సాక్షాత్కరిస్తాయని ఎందరో అనుభవపూర్వకంగా చెప్తున్నారు.* *ఇంకెందుకండీ ఆలస్యం ఇంట్లో తులసి చెట్టును ఎలాగైతే పూజిస్తున్నారో అలాగే తెల్లజిల్లేడు మొక్కను కూడా పెంచుకోండి దుష్టశక్తుల బారినుండి బయటపడండని వేద పండితులు సూచిస్తున్నారు.* *_సేకరణ_* #మన సంప్రదాయాలు సమాచారం
*_1️⃣4️⃣6️⃣_* *_సంపూర్ణ మహాభారతము_* *_146 వ రోజు_* *_వన పర్వము సప్తమాశ్వాసము:_* *_సుగ్రీవుడు సీతాన్వేషణకు కపులను పంపుట_* *సుగ్రీవుడు రాజ్య భోగాలను అనుభవిస్తున్నాడు. రామలక్ష్మణులు మాల్యవంతం అనే గుహలో ఉన్నారు. వర్షాకాలం గడిచి పోయింది. రాముడు లక్ష్మణునితో “లక్ష్మణా! సుగ్రీవుడు రాజ్య భోగములతో గడుపుతూ మనలను మరచినట్లున్నాడు. నీవు సుగ్రీవుని వద్దకు వెళ్ళి హెచ్చరించి రమ్ము. అతడు అనుకూల వర్తనుడైతే ఇక్కడకు తీసుకురా” అని పంపాడు.* *అన్న మాటలను విని లక్ష్మణుడు సుగ్రీవుని హెచ్చరించాడు*. *సుగ్రీవుడు వణికి పోయాడు. “నేను ఇచ్చిన మాట మరచు నీచుడిని కాను. సీతను వెతుకుతూ వానరులను నలుదిక్కులకూ పంపాను. నెల రోజులు గడువు ఇచ్చాను. గడువు తీరటానికి అయిదు రోజులు ఉంది. సీతాదేవి జాడ తెలియగానే నేను రాముని వద్దకు వస్తాను” అన్నాడు*. *ఆ సమాధానంతో తృప్తి చెందిన లక్ష్మణుడు సుగ్రీవుని తీసుకుని రాముని వద్దకు వెళ్ళాడు.* *సుగ్రీవుడు తాను చేసిన ఏర్పాట్లు రామునికి చెప్పాడు. రాముడు తృప్తి చెందాడు. కొన్ని రోజులకు అన్ని దిక్కుల నుండి కోతులు వచ్చి సీతమ్మ జాడ దొరకలేదని చెప్పారు*. *దక్షిణ దిక్కు వెళ్ళిన కపులు ఇంకా రాలేదు. కొంతమంది వానరాలు సుగ్రీవుని వద్దకు వచ్చి “మహారాజా! తమరు అత్యంత ప్రియంగా పెంచుకున్న మధువనంలో అంగదుడు హనుమంతుడు మొదలైన వారు ఇష్టం వచ్చినట్లు విహరిస్తూ ఫలములు తింటున్నారు వనరక్షకులమైన మేము వారిని వారించగా మమ్ములను కొట్టారు” అని చెప్పారు*. *సుగ్రీవుడు దక్షిణ దిక్కుగా వెళ్ళిన అంగదుడు, హనుమంతుడు మొదలగు వారు సీతను చూసి ఉంటారు. అందుకే వారు ఆనందోత్సాహాలను ప్రదర్శించి ఉంటారు” అనుకున్నాడు.* *_సీత జాడ రామునికి తెలుపుట_* *దక్షిణ దిక్కుగా వెళ్ళిన వానరులంతా వచ్చారు. హనుమంతుడు సుగ్రీవుడు, రాముని చూసి “దేవా! సీతను చూసాను. దక్షిణ దిశగా వెళ్ళి అశోక వనంలో రావణ కట్టుబాటులో ఉన్న సీతను నేను చూసాను. మేము సీతను వెదుకుచూ వెళుతుండగా మాకు ఒక పెద్ద సొరంగం కనపడింది. ఆ సొరంగంలో ప్రవేశించి కొన్నాళ్ళకు ఒక నగరం చేరుకున్నాము. అక్కడ మాకు ఒక తాపసి కనపడింది. మమ్మలిని ఆదరించింది. తరువాత మలయ పర్వతం చేరుకున్నాము. అక్కడ ఒక పెద్ద సముద్రం. ఆ సముద్రం దాటటానికి ఎవరికీ శక్యం కాలేదు. సీతను వెదకకుండా వెనుకకు మరలడం కంటే చావడం మేలనుకున్నాము. అక్కడ ఒక సంపాతి అనే పక్షిరాజు మాకు కనిపించాడు. మేము జరిగినదంతా చెప్పుకుని విచారిస్తుండగా ఆ పక్షిరాజు “అయ్యా! మీ మాటలలో జటాయువు అనే పేరు వినవచ్చింది. నేను నా తమ్ముడు ఒకసారి సూర్య మండలానికి ఎగిరాము. నా రెక్కలు మాడి పోవడంతో నేను ఇక్కడ పడి ఉన్నాను. నా తమ్ముడు జటాయువు గురించి మీకు తెలిస్తే చెప్పండి” అని అడిగాడు*. *నేను సంపాతితో రావణుడు సీతను ఎత్తుకు వెళ్ళడం జటాయువును చంపడం చెప్పాను. జటాయువు మరణ వార్త విన్న సంపాతి “అయ్యా! నాకు రావణుని గురించి తెలియును. వాడు రాక్షసుడు. ఇక్కడికి నూరు యోజనముల దూరంలో ఉన్న లంకను రాజధానిగా చేసుకుని రావణుడు రాజ్యం చేస్తున్నాడు. మీకు అక్కడ సీతాదేవి కనిపించవచ్చును” అన్నాడు*. *మాలో ఎవరికీ సముద్రాన్ని దాటే శక్తి లేదు. నా తండ్రి వాయు దేవుని వలన నాకు సముద్రాన్ని దాటే శక్తి కలిగింది. నేను లంకకు వెళ్ళి సీతాదేవిని చూసి నన్ను రామ దూతగా నన్ను పరిచయం చేసుకుని మీ ముద్రికను ఇచ్చాను ఆమెకు మీ క్షేమం చెప్పాను. ఆమె నన్ను నమ్మ లేదు రావణుడు కామ రూపియై వచ్చాడు అనుకుంది. నేను ఆమెకు విశ్వాసం కలిగించాక ఆమె నన్ను నమ్మింది. తన ఆనవాలుగా ఈ శిరోభూభణం మీకు ఇమ్మంది. సుగ్రీవుని సాయంగా తీసుకు వచ్చి అతి త్వరలో తనను తీసుకు పొమ్మని మీకు చెప్పమని చెప్పింది. ఆమెకు నేను ధైర్య వచనాలు చెప్పి వచ్చాను. ఆమె నాకు చిత్రకూటం పై జరిగిన కాకాసురుని వృత్తాంతం చెప్పింది" అన్నాడు*. *హనుమంతుడు రామునికి శిరోభూషణం అందించాడు. రాముడు ఆ శిరోభూషణాన్ని గుండెలకు హత్తుకున్నాడు* #మన సంప్రదాయాలు సమాచారం
_8️⃣_ *_శ్రీ మహావిష్ణు పురాణం_* *_ఎనిమిదవ భాగం_* *_భూగోళ ఆవిర్భావం:-_* *_బ్రహ్మోపదేశం - చతుర్వేద సంపుటి_* *శ్రీ మహావిష్ణువు మధుకైటభుల విన్నపం మన్నించి వారికి సదా చరితార్థులై బ్రహ్మాండంలో ఉంటారు అని వరమిచ్చి, తన ఊరువులపైకి తీసుకుని చక్రంతో శిరస్సులు ఖండించాడు*. *శిరస్సులు తెగిన మధుకైటభుల మొండాల నుండి రక్తం పొంగి ప్రవహించింది. కొంతసేపటి తరువాత ఖండించబడిన ఇరువురి శిరస్సుల నుండి నల్లని పదార్ధం వెలువడి నీటిలోకి పొంగి ప్రవహించి ఒక్కటై గుండ్రటి పదార్థంగా మారసాగింది*. *విష్ణువు వెంటనే తన ఊరువుల పరిమాణము కుదించి మాములుగా చేసాడు. ముధు కైటభుల మేధస్సు నల్లని పదార్ధముగా ఒక్కటై బంతి ఆకృతిలో గుండటి ముద్దగా మారింది*. *నారాయణుని వక్షస్సులో నివసిస్తున్న లక్ష్మీదేవి చూసి "నాథా! ఏమిటీ నల్లని గోళ పదార్థము? ఎందుకు మధు కైటభుల శిరస్సుల నుండి ప్రవహించి నల్లని గోళంగా మారింది" అని విస్మయంగా అడిగింది*. *విష్ణువు "లక్ష్మీ! మధు కైటభుల మేధస్సు అది. నారాయణ నామ స్మరణతో పవిత్రమై "మేధిని" గా మారి భూగ్రహం అవుతుంది.* *పద్నాలుగు లోకాలకు మూలమైన భూలోకంగా మారి నవగ్రహాలలో ఒకటవుతోంది*. *నా జగత్ సృష్టికి, జగత్ లీలలకు ఈ భూమి మూలం కాబోతుంది. ముల్లోకాలకు పుణ్యభూమిగా, కర్మ భూమిగా ఈ భూగ్రహము తయారవుతుంది" అని పలికాడు*. *లక్ష్మీదేవి ఆశ్చర్యపడి "మధుకైటభుల మేధతో ఏర్పడిన నల్లటి మట్టిముద్దకు ఇంతటి గౌరవం, ఆదరం లభిస్తోందా!" అని ప్రశ్నించింది.* *నారాయణుడు నవ్వుతూ "లక్ష్మీ! ఇది సాధారణ మట్టి ముద్ద కాదు. మహామాయ నన్ను ఆవహించినప్పుడు, నా స్పర్శతో ఋతు స్నాత అయ్యింది. ఆ మలినమే నా సంకల్పంతో మధు కైట భులుగా మారారు. వారు మరణించాక వారి మేధ మేధినిగా మారి భూమి రూపం పొందింది.* *మహామాయ మేధినిగా మారి ప్రకృతిగా అవతరించి సృష్టికి క్షేత్రము అవుతుంది*. *అష్టాక్షరి మహామంత్రం పుణ్య ఫలం ఈవిధంగా సృష్టికి కేంద్రం అవుతుంది. నిజానికి ఇదంతా మాయ*. *ఈ మహామాయ ప్రభావంతో మహాశూన్యంలో అండపిండ బ్రహ్మాండాలు,లోకాలు,లోకాధిపతులు, జీవరాశులు ఆవిర్భవిస్తాయి.* *ఇదే శాశ్వతం, సర్వస్వం అనే మాయలో సకల చరాచర ప్రాణులు ఉంటారు. జనన మరణ చక్రంలో బంధీలు అవుతారు. స్వర్గ నరక భూలోకాల మధ్య తిరుగాడుతుంటారు*. *జ్ఞానము పొంది ఇది అంతా మిధ్య, మాయ,అశాశ్వతం అని తెలుసుకున్నప్పుడు మాత్రమే నన్ను శాశత్వుడని గ్రహిస్తారు. అప్పుడు నన్ను చేరుకుని నాలో లీనమవుతారు. దీనినే మోక్షం అంటారు. పరబ్రహ్మ లీలగా నా చేత ఈ మాయా ప్రపంచం కల్పించబడుతుంది, రక్షించబడు తుంది. చివరికి లయం చెంది నాలో లీనమై పోతుంది. ఇదే నేనాడే లీలావినోద జగన్నాటకం" అనడంతో లక్ష్మీదేవి సంతృప్తురాలైంది*. *మధుకైటభుల మరణంతో భయం తొలగిన బ్రహ్మదేవుడు కనపడని శ్రీమన్నారాయణునికి నమస్కరించి "తండ్రీ! నా కర్తవ్యం ఉపదేశించండి" అని అడిగాడు*. *"సృష్టి చేయి! సృష్టి చేయి!" అన్న శబ్దం వినిపించింది*. *చుట్టూపరికించిచూశాడు.అంతా నీరు, నీటి మధ్యలో ఒక మట్టి గోళం కనిపించింది. ఆ మట్టిగోళం నీటితో తడిగానే ఉంది. గట్టి పడలేదు. ఈ మృత్తికాగోళం నీటిపై ఎంత సేపు నిలబడుతుంది? మునిగిపోతుందేమో? నేను ఏమి సృష్టించాలి? ఎక్కడ సృష్టించాలి? ఎలా సృష్టించాలి?* *ఈ ప్రశ్నలకు సమాధానం బ్రహ్మదేవుడికి తట్టలేదు. మనస్సులో నారాయణుని తలచి "నీ ఆదేశం పాటించి సృష్టి ఏమి చేయాలో తెలియడం లేదు. నాకు సృష్టించడానికి శక్తి ప్రసాదించండి" అని ప్రార్థించాడు.* *ప్రసన్నుడైన మహావిష్ణువు బ్రహ్మ ఎదుట ప్రత్యక్షమై "చతుర్ముఖా! నీకు మొదట ఉపనయనం చేసి బ్రహ్మోపదేశం చేస్తాను" అని సంకల్పం చేశాడు.* *వేదమంత్రాలు వేదబ్రహ్మ ఆదేశంతో ప్రతిధ్వనించ సాగాయి. లక్ష్మీదేవి సువర్ణ యజ్ఞోపవీతం సృష్టించి విష్ణువుకి ఇచ్చింది. బ్రహ్మ మెడలో యజ్ఞోపవీతం వేసి ఉపనయనం పూర్తి చేశాడు. విష్ణు సంకల్పంతో మహాసరస్వతి అక్కడకు వచ్చింది. బ్రహ్మకు పరిచయం చేస్తూ "ఈమె పరబ్రహ్మమైన కృష్ణుడి నుంచి ఆవిర్భవించింది. సమస్త జ్ఞాన స్వరూపిణి, జ్ఞానానికి అధిదేవత. ఈ సరస్వతి అంశరూపంగా గాయత్రీదేవి ఇక్కడ ఉద్భవిస్తుంది" అనగానే సరస్వతి నుండి అంశారూపంగా గాయత్రీదేవి ఉద్భవించింది*. *“బ్రహ్మదేవా! నాలుగు ముఖాలతో నీవు పలికిన ఓంకారానికి అధిష్ఠాన దేవత ఈ గాయత్రీదేవి. సమస్త మంత్రాలకు ఈమె మూలము అవుతుంది. ఈ గాయత్రీదేవిని నియమ నిష్టలతో త్రి (మూడు) కాలములలో ఆచరిస్తే సకల శుభాలు కలుగు తాయి" అని బ్రహ్మదేవుడి కుడి చెవిలో మూడు పాదాలు, ఇరవై నాలుగు అక్షరాలు గల గాయత్రీ మంత్రం ఉపదేశం చేశాడు*. *బ్రహ్మదేవుడు స్వీకరించి తన నాలుగు ముఖాల ద్వారా ఆరేసి అక్షరాల చొప్పున గాయత్రి మంత్ర జపం చేశాడు. ఫలితంగా గాయత్రీదేవి వచ్చి బ్రహ్మ వాక్కు లో స్థిర నివాసం ఏర్పర చుకుంది. ఇరవైనాలుగు అక్షరాల గాయత్రి జప ఫలంగా వేదము నాలుగు భాగాలై బ్రహ్మ నాలుగు ముఖాల నుండి వెలువడింది. నాలుగు వేదాలు చతుర్వేద సంపుటిగా మారి బ్రహ్మదేవుని హస్తాన్ని అలంకరించాయి*. *గాయత్రీదేవి వాక్కులో స్థిర నివాసం ఉండటం, వేదాలలోని సమస్త జ్ఞానం లభించడం వలన బ్రహ్మ పరబ్రహ్మ జ్ఞానము పొందాడు. బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించాడు* #మన సంప్రదాయాలు సమాచారం
*_చిరంజీవులు_* *_చిరంజీవులు అంటే చిరకాలం జీవించి వుండే వారని అర్థం._* *1)అశ్వత్థామ,* *2)బలిచక్రవర్తి,* *3)వ్యాసుడు,* *4)హనుమంతుడు,* *5)విభీషణుడు,* *6)కృపాచార్యుడు మరియు* *7)పరశురాముడు.* *వీరు ఏడుగురు చిరంజీవులు. నిత్యం వీరిని స్మరించడం వల్ల ఆనందంగా జీవిస్తారు.* *సప్త చిరంజీవులు (ఏడుగురు అమరజీవులు) గురించి స్మరించే శ్లోకం ఇది.* *హిందూ సంప్రదాయం ప్రకారం ఈ శ్లోకాన్ని ఉదయాన్నే పఠించడం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు*. *శ్లోకం:~* *అశ్వత్థామా బలిర్వ్యాసో హనూమాంశ్చ విభీషణః |* *కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః ||* అర్థం:~ *1) అశ్వత్థామ:~* *ద్రోణాచార్యుని కుమారుడు*. *2) బలి చక్రవర్తి:~* *ప్రహ్లాదుని మనుమడు, దానగుణానికి ప్రసిద్ధి.* *3) వ్యాసుడు:~* *వేదాలను విభజించి, మహాభారతాన్ని రచించిన మహర్షి*. *4) హనుమంతుడు:~* *రామ భక్తుడు,శక్తికి రూపం.* *5) విభీషణుడు:~* *రావణుని సోదరుడు, ధర్మానికి కట్టుబడినవాడు*. *6) కృపాచార్యుడు:~* *కౌరవ-పాండవుల గురువు*. *7) పరశురాముడు:~* *విష్ణుమూర్తి ఆరవ అవతారం*. *ఈ ఏడుగురిని స్మరించడం వల్ల అపమృత్యు భయం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. కొన్ని ప్రాంతాలలో మార్కండేయ మహర్షి పేరును కూడా కలిపి "అష్ట చిరంజీవులు" (ఎనిమిది మంది) అని పిలుస్తారు*. *అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః ।* *కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః ॥* *సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయ తథాష్టమం ।* *జీవేద్వర్షశ్శతమ్ సొపి సర్వవ్యాధి వివర్జిత ॥*``` శ్రీకృష్ణుని శాపము వలన అశ్వత్థామ, వామనానుగ్రహము వలన బలిచక్రవర్తి, లోకహితముకై వ్యాసుడు, శ్రీరామభక్తితో హనుమంతుడు, రామానుగ్రహము వలన విభీషణుడు, విచిత్రజన్మము వలన కృపుడు, ఉత్క్రుష్ట తపోధనుడైన పరశురాముడు సప్తచిరంజీవులైనారు. *_శివానుగ్రహము_* *చేత* కల్పంజయుడైన మార్కండేయ మహాఋషిని ప్రతినిత్యం తలచుకొన్న సర్వవ్యాధి వివర్జితులై శతాయుష్మంతులు అవుతారని ఈ శ్లోకం తాత్పర్యము_*.``` *_1. అశ్వద్ధామ స్త్రోతం:~_* *_బ్రహ్మసుత్రోజ్వలభుజో రాజత్ కృష్ణా జినాసనః !_ _అశ్వత్థామ చిరంజీవి దీర్ఘాయుర్ దదాతుమే !!_* *_2. బలి చక్రవర్తి స్త్రోతం:~_* *_పాతాళ నిలయో ధనుర్భాణ ధనో నృపః ! విష్ణు పాదాంకిత శిరా: చిరంజీవి ప్రసీదతు!_!* *_3. వ్యాస మహర్షి స్త్రోతం:~_* *_వ్యాసః సమస్త ధర్మాణం వక్తా మునివరేడితః !_ _చిరంజీవి దీర్ఘమాయుః దదాతు జటిలో మమ !!_* *_4. హనుమత్ స్త్రోతం:~_* *_హనుమాన్ రామ పాదాబ్జ సంగీవర్ని వరసుచిః !_ _సంజీవనో స హర్తాచ రోగ శాంతిం దాదాతుమే !!_* *_5. విభీషణ స్త్రోతం:~_* *_విభీషణో ధర్మపరో రామార్చన పరాయణ:! దదాతు చిరoజీవిత్త్వం చిరంజీవి జితేంద్రియః !!_* *_6. కృపాచార్య స్త్రోతం:~_* *_కృపః కృపా పయోరాసిః తపస్వీ చిరవస్త్రద్రుతు ! వితనోతు ప్రసన్నాత్మ యావజ్జీవం ఆరోగతాం !!_* *_7. పరశురామ స్త్రోతం:~_* *_పరసూజ్వల హస్తా హస్తాభ్జో జటా మండల మండితః_ ! _దదాతు చిరoజీవిత్త్వం ప్రసన్నాత్మ భృగూద్వః !!_* *వీరితో పాటు మార్కండేయమహర్షి, ధృవుడు మరియు ప్రహ్లాదుడు కూడా జన్మతః చిరంజీవులు అని చెప్పబడుచున్నారు*. *ఆవు పాలు, బెల్లము, నల్లనువ్వులు కలిపిన మిశ్రమాన్ని నివేదన చేసి సప్త చిరంజీవి శ్లోకాన్ని చదివి తీర్ధంగా మూడు సార్లు తీసుకోవడం ద్వారా అపమృత్యు దోషం తొలుగుతుంది* #మన సంప్రదాయాలు సమాచారం
*_అమ్మమ్మ నేర్పిన అద్భుతపాఠం_* *_శ్రీమతి సుధామూర్తి,చైర్మన్,_* *_ఇన్ఫోసిస్ ఫౌండేషన్_*. *_ఓ ప్రముఖ సంస్థ 'కార్పొరేట్ సామాజిక బాధ్యత' అన్న అంశంపై ప్రసంగించేందుకు కొన్నేళ్ళ క్రితం నన్ను ఆహ్వానించింది._* *_ఉత్సాహంగా ఉపన్యసించాను;_* *_ఉపన్యాసం అయిన తరువాత చాలామంది యువతీ యువకులు ఉత్తేజితులై, పాత వస్త్రాలు, ఇంటిసామగ్రి మా ట్రస్టుకు పంపుతామని బాస చేశారు._* *_వాళ్ళ ప్రతిస్పందన నన్ను ఆనందపరచింది. “ఇవ్వదలచుకున్న వాటన్నింటిని సంచుల్లో పెట్టండి; ఆ సంచుల్ని నా కార్యాలయానికి పంపండి; అవి అవసరమైన వారికి అందేలా చూస్తాను” అని అన్నాను_*. *_వారం తిరక్కముందే మా కార్యా లయానికి వందలకొద్దీ సంచులు వచ్చిపడ్డాయి._* *_నా ఉపన్యాసంతో జనాన్ని బ్రహ్మాండంగా ప్రభావితం చేయగలిగానని గర్వపడ్డాను._* *_ఒక ఆదివారం సంచులు తెరిచాం. వాటిలోని వస్తువులను చూసి, ఆశ్చర్యానికి గురయ్యాం. రకరకాల వస్తువులను సంచుల నిండా కుక్కారు._* *_చినిగిన దుస్తులు, ఉతకని చొక్కాలు, కట్టుకుంటే ఒళ్ళంతా కనబడే చీరలు, రంగూ రూపం లేని ఆట వస్తువులు, ఉపయోగపడని దుప్పట్లు, అల్యూమినియం పాత్రలు, పగిలిన క్యాసెట్లు - ఇలాంటివే అన్నీ కుప్పగా పోశారు. వాటిలో పనికొచ్చే చీరలు, చొక్కాలు కొన్ని మాత్రమే!_* *_చెత్తకుండీల్లో వెయ్యకుండా, పాత సామాన్లవాడికి అమ్మ కుండా,_* *_విరాళమంటూ జనం వాటన్నిటినీ_* *_నా కార్యాలయానికి పంపారు._* *_నేను కలిసిన యువతీ యువకులు నిజానికి చాలా తెలివిగలవాళ్ళు, పెద్ద ఉద్యోగస్థులు, హోదా ఉన్నవారు, సంపన్నులు. వీరే ఇలా ప్రవర్తిస్తే- ఇక విద్యాగంధం అబ్బనివారి పరిస్థితి ఎలా ఉంటుంది?_* *_చదువులేకపోయినా ఉన్నత భావాలుగలవారు ప్రవర్తించే తీరు ఎలా ఉంటుందో గుర్తుచేసే నా చిన్ననాటి జ్ఞాపకం ఇది.._* *నా బాల్యమంతా కర్ణాటకలోని మారుమూల పల్లెలోని అమ్మమ్మ, తాతయ్యల ఇంట గడిచిపోయింది.* *తాతగారు విశ్రాంత ఉపాధ్యాయులు. అమ్మమ్మ ఇంటికే అంకితమైన సాధారణ గృహిణి. ఆ ఊరు దాటి బయటకు వెళ్ళడమే అరుదు. వారు మనఃస్ఫూర్తిగా శ్రమించేవాళ్ళు. ఎవరి నుంచీ ఏమీ ఆశించని వాళ్ళు. కొద్దిపాటి సంపదనైనా, ఆనందాన్ని అయినా నలుగురితో పంచుకోవాలని తపన పడేవాళ్ళు. గ్రామంలో మాకు పొలాలుండేవి; పండిన ధాన్యాన్ని పాతర్లలో నిల్వచేసేవాళ్ళు. మాకు ధాన్యపు పాతరలు రెండు ఉండేవి. ఒకటి ఇంటి ముందు; మరొకటి ఇంటి వెనుక. ఇంటిముందు పాతరలో నాణ్యమైన తెల్ల బియ్యం పోసేవాళ్ళు. గింజ పెద్దగా ఉండే తక్కువ రకమైన ఎర్రని బియ్యాన్ని వెనుక పాతరలో పోసేవాళ్ళు. భిక్ష కోసం ముస్లిం ఫకీర్లు, హిందూ దాసయ్యలు, మల్లమ్మ జోగినులు, పేద విద్యార్థులు, అంగవికలురు మా ఇంటికి వచ్చేవాళ్ళు*. *అమ్మమ్మవాళ్ళు ఆర్థికంగా అంతగా ఉన్నవాళ్ళేమీ కాదు. తాతయ్య బియ్యం రూపంలో మాత్రమే సహాయం చేసేవారు. అప్పుడు నేను చిన్నపిల్లను; ఇంటి ముందు మంచి బియ్యం ఉన్న పాతర ద్వారం క్రిందుగా ఉండేది: పెద్దవాళ్లు లోపలి కెళ్ళడం కష్టం; అందువల్ల నా చేతికి ఓ చిన్న బొక్కెన ఇచ్చి లోపలికి పంపేవాళ్ళు; బియ్యాన్ని అందులో నింపి పైకి అందించేదాన్ని. అలా భిక్షకు వచ్చిన వారికి దానం చేసేవారు*. *ఇంట్లో వంటకానికి అమ్మమ్మ నన్ను వెనుకనున్న పాతరలో ఉన్న నాసిరకం ఎర్ర బియ్యాన్ని తీసుకురమ్మని చెప్పేది. ఇలా చాలా ఏళ్ళు గడిచాయి. ఒకసారి అమ్మమ్మను “మంచి బియ్యం పేదవాళ్ళకు పంచి, మనం ఎర్రబియ్యం అన్నం ఎందుకు తినాలి?” అని ప్రశ్నించాను*. *అప్పుడు అమ్మమ్మ నవ్వుతూ చెప్పిన మాటల్ని నేనెన్నటికీ మరచిపోలేను*. *“పాపా! ఎప్పుడైనా, ఎవరికైనా, ఏమైనా ఇవ్వాలనుకున్నప్పుడు నీకున్న దాంట్లో మంచిదాన్ని ఇవ్వాలి; తక్కువ రకం వాటిని ఇవ్వకూడదు. నా అనుభవంలో నేను నేర్చుకున్నది ఇంతే! దేవుడు ఆలయంలోనో, మసీదులోనో, చర్చిలోనో కూర్చొని ఉండడు. ఆయన అందరిలోనూ ఉన్నాడు. నీకు ఉన్నదాంతో వాళ్ళను సేవిస్తే దేవుణ్ణి సేవించినట్లే!” అంటూ నన్ను అక్కున చేర్చుకుంది అమ్మమ్మ*. *అలా ఏ విశ్వ విద్యాలయమూ, మేధావి వర్గమూ నేర్పని అద్భుతమైన పాఠం మా అమ్మమ్మ నుంచి నేర్చుకున్నాను* #మన సంప్రదాయాలు సమాచారం
#మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
00:10
#మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
00:15