Ravi  Talluri
ShareChat
click to see wallet page
@91775
91775
Ravi Talluri
@91775
feelgood
#మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ದಕ್ಷಿಣಂ 460 శ్రీవేంకటేశ్వరుడు శ్రీరాముడు ಅಯಾಧ್ಯ್ (ಬಾಲಾಜಿ) తిరుపతి తూర్పు పడమర శ్రీ విఠలుడు (విఠోబా) శ్రీ జగన్నాథుడు పండరీపూర్ పూరి ದಕ್ಷಿಣಂ 460 శ్రీవేంకటేశ్వరుడు శ్రీరాముడు ಅಯಾಧ್ಯ್ (ಬಾಲಾಜಿ) తిరుపతి తూర్పు పడమర శ్రీ విఠలుడు (విఠోబా) శ్రీ జగన్నాథుడు పండరీపూర్ పూరి - ShareChat
*స్కూల్లో చరిత్రలో ఛత్రపతి శివాజీ మహరాజ్ గురించి పెద్దగా నేర్చుకోలేదు. కానీ ఛత్రపతి శివాజి మహరాజ్ గారి గురించి కొందరు చెప్పిన మాటలు విని ఆశ్చర్యంపోకమన్నారు* *"కాబూల్ నుండి కాందహార్ వరకు నా తైమూర్ కుటుంబం మొగల్ సుల్తానేట్‌ను సృష్టించింది. ఇరాక్, ఇరాన్, టర్కిస్తాన్ మరియు అనేక దేశాలలో నా సైన్యం క్రూరమైన యోధులను ఓడించింది. కానీ భారతదేశంలో శివాజీ మాకు బ్రేకులు వేశారు. నేను శివాజీకి నా గరిష్ట శక్తిని వెచ్చించాను, కానీ తీసుకురాలేకపోయాను. అతని మోకాళ్లకు.* *యా అల్లాహ్, నువ్వు నాకు శత్రువును, నిర్భయమైన మరియు నిటారుగా ఉన్నవాడిని ఇచ్చావు, దయచేసి అతని కోసం స్వర్గానికి మీ తలుపులు తెరిచి ఉంచండి ఎందుకంటే ప్రపంచంలోని అత్యుత్తమ మరియు విశాల హృదయం ఉన్న యోధుడు మీ వద్దకు వస్తున్నాడు."* *_ఔరంగజేబ్ (శివాజీ మరణానంతరం నమాజ్ చదువుతూ)_* *"ఆ రోజు శివాజీ నా వేళ్లు నరికేయలేదు కానీ నా అహంకారాన్ని కూడా నరికేశాడు. నా కలలో కూడా ఆయనను కలవాలంటే భయం."* *_షాహిస్తా ఖాన్._* *"నా రాజ్యంలో శివాజీని ఓడించే వాడు లేడా??"* *_విసుగు చెందిన బేగం అలీ ఆదిల్షా_*. *"నేతాజీ, బ్రిటిష్ వారిని తరిమికొట్టడానికి మీ దేశానికి హిట్లర్ అవసరం లేదు. మీరు బోధించాల్సింది శివాజీ చరిత్ర మాత్రమే."* *_అడాల్ఫ్ హిట్లర్_* *"శివాజీ ఇంగ్లండ్‌లో జన్మించి ఉంటే, మనం భూమిని మాత్రమే కాకుండా మొత్తం విశ్వాన్ని పాలించి ఉండేవాళ్ళం."* *_లార్డ్ మౌంట్ బాటన్_* *"శివాజీ ఇంకో పదేళ్లు బ్రతికి ఉంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశం ముఖం చూసి ఉండేవారు కాదు."* *_ఒక బ్రిటిష్ గవర్నర్_* *_భారతదేశానికి స్వాతంత్ర్యం కావాలంటే ఒక్కటే మార్గం, 'శివాజీలా పోరాడండి'."* *_నేతాజీ_* *"శివాజీ అనేది కేవలం పేరు కాదు, భారతీయ యువతకు ఇది శక్తి వనరు, ఇది భారతదేశాన్ని స్వేచ్ఛగా మార్చడానికి ఉపయోగపడుతుంది."* *_స్వామి వివేకానంద._* *"శివాజీ అమెరికాలో జన్మించి ఉంటే, మేము అతనిని SUN అని నామకరణం చేస్తాము."* *_బరాక్ ఒబామా_* *ఉంబర్‌ఖైండ్ యొక్క ప్రసిద్ధ యుద్ధం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పేర్కొనబడింది:* *"ఉజ్బెకిస్తాన్ నుండి వచ్చిన 30,000 మంది కరతలాబ్ ఖాన్ సైన్యాన్ని కేవలం 1000 మంది శివాజీ మావలలు ఓడించారు. స్వదేశానికి తిరిగి రావడానికి ఒక్క ఉజ్బెకీ కూడా ప్రాణాలతో మిగిలిపోలేదు."* *శివాజీ అంతర్జాతీయ ఖ్యాతి పొందిన రాజు. తన కెరీర్‌లో 30 ఏళ్ల వ్యవధిలో కేవలం ఇద్దరు భారతీయ యోధులతోనే పోరాడాడు. మిగతా వారంతా బయటి వ్యక్తులు*. *అబూ తాలిబాన్ మరియు టర్కిస్తాన్ రాజుగా తన కలలో కూడా శివాజీకి భయపడే షాహిస్తా ఖాన్*. *బెహ్లోల్ ఖాన్ పఠాన్, సికందర్ పఠాన్, చిదర్ ఖాన్ పఠాన్ అందరూ ఆఫ్ఘనిస్తాన్ యొక్క యోధ సర్దార్లు.* *దిలేర్ ఖాన్ పఠాన్ మంగోలియా యొక్క గొప్ప యోధుడు. వీరంతా శివాజీ ముందు దుమ్ము దులుపుకున్నారు*. *సిద్ధి జౌహర్ మరియు సలాబా ఖాన్ ఇరానియన్ యోధులు, వీరు శివాజీ చేతిలో ఓడిపోయారు.* *సిద్ధి జౌహర్ తర్వాత సముద్ర దాడికి ప్లాన్ చేశాడు.* *ప్రతిస్పందనగా శివాజీ ఒక నౌకాదళాన్ని, మొదటి భారతీయ నౌకాదళాన్ని పెంచారు. అయితే ఆ పని పూర్తి కాకముందే శివాజీ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు.* Google *"శివాజీ, మేనేజ్‌మెంట్ గురువు."* *ఇది బోస్టన్ విశ్వవిద్యాలయంలో పూర్తి సబ్జెక్ట్*. *ఇంకా, భారతీయులమైన మనకు ఆయన గురించి చాలా తక్కువ తెలుసు..... పాపం.... కనీసం మన భావి తరానికి కూడా ఈ గొప్ప భారతీయుని గురించి తెలిసేలా చేద్దాం.* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
*రావణాసురుడు ప్రతిరోజు తప్పకుండా ప్రాతః కాల సమయాన పవిత్ర గంగాజల మునక స్నానంతో శివ నామ స్మరణ చేసేటి మహా శివ భక్తుడు. కానీ ఒకరోజు తన శరీర ఆశ ప్రకారం, శరీర ధర్మ క్రియలో బాగంగా తన భార్య మండోదరితో సృష్టికార్య సంగమ ప్రక్రియలో లోకాన్ని మరచి సుఖంగా సుఖ పడుతున్న సంతోష సందర్భములో అకస్మాత్తుగా తను ప్రతీ రోజు భక్తి శ్రద్ధలతో, క్రమం తప్పకుండా, సమయానికి శివునికి చేసే ప్రాత: కాల శివపూజ మరిచాడు. కానీ, తను పడకగదిలో భార్యతో సుఖపడుతొన్న ఈ సమయములో గంగలోకి వెళ్ళి పవిత్ర స్నానము చేసి, ఆ పవిత్ర గంగాజలముతో శివాభిషేకం చేసి, మిగతా పూజాది కార్యాలు సమయం కాబట్టి నేను శివపూజను ఈ క్షణములో తప్పిపోవద్దూ అనేటి తపనతో మనసులో భక్తిశ్రద్ధలతో శివుణ్ణి తలచుకొని శివా నేను ఈ కొంత సమయంలో నీకు ఇదివరకటిలా పూజ చేయలేను కాబట్టి నన్ను మన్నించి నేను ఇప్పటికిప్పుడు నాకు అందుబాటులో ఉన్న వాటితో నిన్ను పూజిస్తాను మన్నించి ఈ నాటి నాపూజను స్వీకరించూ అంటూ తాను తన భార్యతో పడుకొన్న పక్కలోని పూలను కొన్నింటిని ఏరుకొని ఓం: నమః శివాయ: అంటూ, నీవే శివుడవు అంటూ మంచంపై ఆనుకొని ఉన్న తన భార్య స్థన ప్రదేశములో వేశాడు. అప్పుడు ఆ పూలు అప్పటిదాక తనతో రతి క్రియలో మునిగితేలిన తన భార్య మండోదరిపై వేసినప్పటికీ, అవి కైలాసంలో ఉన్న శివునిపై పడ్డాయి.* *అట్టి పూజను కూడా దేవుడు స్వీకరించాడు*. *_నీతి : నీవు చేసే పూజలో నీతి, నిజాయితీ, భక్తిశ్రద్ధలు ఉంటే నీవు ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. నీవు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, దైవ పూజ చేయుటకు అర్హుడవే. నీ చేతిలో ఏది ఉన్నా అది దైవానికి ఇష్టమే, దాన్నే ఆ దేవుడు ప్రేమగా స్వీకరిస్తాడు_* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - Ramesh Ramesh - ShareChat
*_బ్రూనో సజీవ దహనం... అతిపెద్ద మానవ తప్పిదం_* *_ఫిబ్రవరి 17, 1600 సంవత్సరం._* *ఇటలీలోని రోమ్‌ నగరం, కాంపోడి ఫియోరి కూడలి అక్కడికి ఖగోళ సిద్ధాంత కర్త, గణిత శాస్త్రజ్ఞుడు అయిన గియార్డనో బ్రూనోను రెక్కలు విరిచికట్టి నాలుక తీగతో చుట్టి తీసుకొచ్చారు. నాలుకకు చుట్టిన తీగ విప్పేసి, చివరిసారి అడిగారు*. *''తప్పులన్నీ ఒప్పుకో! ప్రాణభిక్ష పెడతాం!'' అన్నారు రోమన్‌ మత న్యాయస్థానం పెద్దలు. బ్రూనో తల అడ్డంగా తిప్పాడు. తను ఏ తప్పు చేయలేదని నిర్భయంగా చెప్పాడు. ఏ మాత్రం తొణకలేదు. శిక్ష అనుభవించడానికి సిద్ధం అన్నట్టుగా నిలబడ్డాడు. ''నేను చెప్పిన నిజాలు తరతరాలుగా మీ లాంటి మూర్ఖుల్ని తొలుస్తూనే ఉంటాయి' అన్న మనో నిబ్బరం ఆయనది. మత న్యాయస్థానం అధికారులు, రాజ్యాధినేతలు అందరూ ఆత్రంగా ఎదురు చూశారు. ఆ చివరి క్షణంలో నైనా దాసోహమంటాడేమోనని ఆశపడ్డారు. కానీ వారి ఆశ నిరాశే అయ్యింది*. *సత్యస్థాపన కోసం తను ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనన్నట్టు, వారివైపు బ్రూనో జాలిగా చూశాడు. 'ఏమిటీ విచిత్రం? గాలీ, వెలుతురూ లేని చీకటి గదిలో ఏడేండ్లు బంధించినా, రోజూ చిత్రహింసలు పెట్టినా, క్రమం తప్పకుండా మానసికంగా వేధించినా బ్రూనోలో ఏమాత్రం మార్పు రాలేదేమి అని మతాధికారులు ఆశ్చర్యపోయారు*. *వారి పైశాచికత్వానికి వారే భయపడ్డారు. అయితే ఆ పైశాచిక ప్రవృత్తిని బ్రూనోకు అంటగట్టారు.* *ఇతను మనిషి కాదు, సైతానుగా మారిపోయాడు*. *సైతాను రక్తం భూమిమీద పడితే అరిష్టం సంభవిస్తుంది.. అని తీర్మానించుకున్నారు*. *మూఢత్వంలోంచి క్రూరత్వంలోకి జారిపోయారు.* *అప్పటివరకు మత విశ్వాసకులు భూమి కేంద్రకమని, దాని చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని విశ్వసించేవారు. అది తప్పని సూర్యుని చుట్టే భూమి తిరుగుతోందని బ్రూనో చెప్పాడు. ఈ విషయం అంతకుమందు నికొలస్‌ కోపర్నికస్‌ (1473-1543) చెప్పిందే. దాన్ని బ్రూనో బలపరిచాడు. అంతేకాదు, ఈ భూమి లాంటి ''భూములు'' (గ్రహాలు) ఇంకా ఉన్నాయన్నాడు. ఈ విశ్వానికి ఆదీ, అంతం ఉన్నాయని మత విశ్వసకులు బోధిస్తూ ఉంటే, అలాంటి వేమీ లేవన్నాడు బ్రూనో*. *మొత్తానికి సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం క్రైస్తవ సన్యాసి అయి ఉండి.. క్రీస్తుకు, బైబిల్‌కు వ్యతిరేకంగా ప్రశ్నలు గుప్పించడం, విమర్శించడం నాటి రోమన్‌ మత న్యాయస్థానం వారికి ఆగ్రహం తెప్పించింది. మానవీయ విలువల్ని మంటగలుపుతూ ఆనాటి మత పెద్దలు బ్రూనోకు శిక్ష విధించారు. మనిషి, మనిషిని - మనిషిగా గుర్తించక పోవడం అతి దారుణంగా చరిత్రలో నమోదయ్యింది.* *శాస్త్రవేత్త, తత్త్వవేత్త, కవి అయిన గియార్డనో బ్రూనో కాంపోడి ఫియోరి కూడలిలో నిలబెట్టారు. అది పేద క్రైస్తవ సన్యాసులు నివసించే ప్రాంతం. మతానికి వ్యతిరేకంగా ఎవరేమి మాట్లాడినా వారికి ఇలాంటి గతే పడుతుందని బ్రూనోకు బహిరంగంగా శిక్ష విధించారు. మొదట ఆయన బట్టలూడదీశారు. తర్వాత నగంగా తలక్రిందులుగా వేలాడదీశారు.* *సజీవంగా నిప్పంటించారు. అక్కడ ఉన్న జనం కన్నీటి పర్యంతమయ్యారు.* *శాసకుల దురాగతం చూసి భయకంపితులయ్యారు. పొరపాటున వేలి చివర కాలితేనే భరించుకోలేము కదా? మరి సజీవంగా కాలిపోవడానికైనా వెనుకాడని బ్రూనో గుండె ధైర్యాన్ని ఎలా అంచనా వేయగలం? కేవలం అభిప్రాయ బేధాలుండడం వల్ల ఒక మనిషిని నిలువునా కాల్చేసిన దురాగతం ఆనాడు అక్కడ జరిగింది. ఒక అబద్దం నిజాన్ని కాల్చేసింది. మతం, విజ్ఞాన శాస్త్రానికి మంటబెట్టింది. మూఢత్వం జిజ్ఞాసను చంపేసింది*. *గెలిచామనుకున్న మత పెద్దలు ఆరోజు అక్కడ తాత్కాలికంగా సంతోషించి ఉండొచ్చు. కాని మానవ చరిత్రలో వారు దోషులుగా, మూర్ఖులుగా, దుర్మార్గులుగా శాశ్వతంగా మిగిలిపోయారు*. *ఇంతకూ మత న్యాయస్థానం గియార్డనో బ్రూనోపై మోపిన అభియోగాలేమిటీ? ఏఏ కారణాల వల్ల ఆయనకు శిక్ష విధించారు?* *1. కేథలిక్కుల నమ్మకాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు, పుస్తకాలు రాసినందుకు*. *2. జీసస్‌ క్రీస్తును దేవుడిగా కీర్తించడాన్ని నిరసించినందుకు,* *3. ఆనాటి మత బోధకుల విశ్వాసాల్ని.. ట్రినిటీ (ఈశ్వర త్రిగుణత్వవాదం)ని బలంగా దెబ్బతీసినందుకు*. *4. జీసస్‌ తల్లి మేరీ కన్యాత్వాన్ని ప్రశ్నించినందుకు, అంటే.. కన్య అయిన మేరీ క్రీస్తుకు జన్మనెలా ఇచ్చిందీ.. అని అడిగినందుకు.. 5. పునర్జననం ఉండదని అన్నందుకు.* *6. మానవుడి ఆత్మ వేరే శరీరంలో ప్రవేశించలేదని అన్నందుకు*. *7. మత బోధకులు మాయలు, మంత్రాలతో జనాన్ని మభ్యపెడుతూ తప్పుదోవ పట్టిస్తున్నారని తీవ్రంగా నిరసించినందుకు.* *ఇప్పటికీ బ్రూనో ప్రశ్నలు ప్రశ్నలుగానే ఉండిపోయా యన్నది మనం గుర్తించుకోవాలి. క్రీ.శ. 1593-1600 మధ్య కాలంలో ఏడేండ్లు చెరసాలలో బంధించి, బ్రూనోను శిక్షించడానికి అన్ని రకాల కారణాల్ని వెతికింది నాటి మత న్యాయస్థానం. అతను పుస్తకాలలో రాసిన విషయాల ఆధారంగా, ఆయన మాట్లాడుతున్నప్పుడు విన్నవారు ఇచ్చిన సాక్ష్యాల ఆధారంగా కేసును బలోపేతం చేశారు. అబద్దపు కేసుల్ని గెలిపించాలంటే చట్టాలు, న్యాయస్థానాలు ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. బ్రూనోకు వ్యతిరేకంగా సమకూర్చుకున్న పత్రాలు ఓసారి నోనా టవర్‌లో గల్లంతయ్యాయి*. *నాటి ప్రభువుల అడుగులకు మడుగులొత్తే వారు కొందరు మరికొన్ని సాక్ష్యాలు తెచ్చి సమర్పించారు. అంటే మూఢుల పట్టుదలను తక్కువగా అంచనా వేయగూడదని మనమిక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంది. తన తప్పిదాలను ఒప్పుకుని, క్షమాభిక్ష అర్థించవల్సిందిగా నాటి రోమన్‌ మత న్యాయస్థానం బ్రూనో మీద ఎంతగానో ఒత్తిడి తెచ్చింది. అయినా స్థిర చిత్తుడైన బ్రూనో లొంగలేదు. వారి అన్ని ప్రయత్నాలు విఫలమైనాయని గ్రహించి ఎనమిదవ పోప్‌ క్లిమెంట్‌ మరణశిక్ష విధించాడు. ఆ రోజు జనవరి 20, 1600 సంవత్సరం. ఈ ఉత్తర్వు ఫిబ్రవరి 17 నాడు అమలులోకొచ్చింది*. *పత్రికలు, మీడియా లేని రోజుల్లో విషయాలు ఉన్నదున్నట్టుగా ఎలా బయటకొచ్చాయీ? అనే సందేహం ఎవరికైనా వస్తుంది. బ్రూనో ఆలోచనా విధానంతో ఏకీభవించే వారు సామన్య జనంలో ఉంటారు కదా? వారు చూసింది చూసినట్టుగా ప్రపంచానికి తెలియజేశారు*. *ముఖ్యంగా బ్రెస్‌ లౌ ప్రాంతానికి చెందిన గాస్పర్‌ స్కూప్‌ అనే అతను అక్కడ జరిగిన సంఘటనల్ని నమోదు చేశాడు. అందులో మానవాళి సగర్వంగా తలెత్తి చెప్పుకోగల విషయం ఒకటుంది. నాటి మత న్యాయాధీశులకు వణుకు పుట్టించే మాట గియార్డనో బ్రూనో అన్నాడని.. గాస్పర్‌ స్కూప్‌ రాశాడు*. *''మీరుపలికే ఆ వాక్యం (మరణశాసనం) నా కన్నా అది మిమ్ముల్నే ఎక్కువ భయకంపితుల్ని చేస్తుంది'' అని నిర్భయంగా, ధైర్యంగా ప్రకటించి తన ఆత్మ విశ్వాసాన్ని ప్రకటించుకున్నాడు బ్రూనో. గియార్డనో (1548-17 ఫిబ్రవరి 1600) ఫిలిప్పో బ్రూనోగా ఇటలీ, నాప్లస్‌ రాజ్యం, నోలాలో పుట్టాడు*. *కవిగా, తత్త్వవేత్తగా, గణిత శాస్త్రాజ్ఞుడిగా పేరు సంపాదించుకున్నా, ఖగోళ సిద్ధాంత కర్తగా ప్రపంచ ప్రఖ్యాతుడయ్యాడు. ఆధునిక వైజ్ఞానిక పరికరాలు లేని రోజుల్లో, టెలిస్కోపులు, అబ్జర్వేటరీలు లేని రోజుల్లో కొన్ని వైజ్ఞానిక విషయాలు కచ్చితంగా చెప్పగలిగాడంటే.. ఆయన ఎంతటి మేధావో మనం అంచనా వేసుకోవాలి.* *చుక్కలు చాలా దూరంలో ఉన్న సూర్యుళ్ళు అని మొదట చెప్పిన వాడాయన. తరువాత కాలంలో ఆయన చెప్పిన అంశాల్ని ఆధునిక పరిశోధనలు ధృవీకరించాయి. స్వయం ప్రకాశితాలై ఉండి, వేడినిచ్చే కొన్ని 'సూర్యుళ్ళు' నిశ్చలంగా ఉన్నాయని, వాటి చుట్టు తిరిగేవాటినే ''భూములం'టున్నామని, అవి వెలుగునూ, వేడిని సూర్యుల నుండి స్వీకరిస్తున్నాయని బ్రూనో ప్రకటించాడు*. *అసలు మొదటిసారి నక్షత్రాలను సూర్యుళ్ళుగా గుర్తించింది బ్రూనోయేనని ఆస్ట్రో ఫిసిస్ట్‌ - స్టీవెన్‌ సోటర్‌ ధృవీకరించారు*. *అమోఘమైన ధారణాశక్తి, గొప్ప రచనా కౌశలం గియనార్డో బ్రూనో సొత్తు. ధృఢ చిత్తుడిగా ఉండడం, సత్యశోధన కోసం, సత్య స్థాపన కోసం ఎలాంటి కఠిన పరిస్థితులనైనా ఎదుర్కోగలగడం.. ఏ తరం వారికైనా ఆయన ఆదర్శం*. *ఖాళీ మెదళ్ళతో కేవలం ప్రచార ఆర్భాటాలతో, అబద్దాలతో, నిజాయితీ అనే పదం ఒకటుందని కూడా తెలుసుకోకుండా బతుకుతున్న వాళ్ళను చూస్తే జాలేస్తుంది. సత్యం ఏదో తెలిసి కూడా దాన్ని ప్రకటించడానికి జడుసుకునే పిరికి వాళ్ళు మన సమాజం నిండా ఉన్నారు. శాస్త్ర వైజ్ఞానిక రంగంలో కూడా ఉన్నారు.* *అలాంటి వారు రోజూ బ్రూనో వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకుని, తమలో కొద్ది కొద్దిగా మార్పు తెచ్చుకోగలిగితే సమాజాన్ని బాగుచేసిన వారవుతారు. చుట్టూ ఉన్నవారికి ఆదర్శప్రాయులు కావడం తర్వాత, ముందు వారు తమను తాము మోసం చేసుకోకుండా బతికితే చాలు*. *వైజ్ఞానికంగా ప్రపంచం ఏమీ సాధించని రోజుల్లోనే బ్రూనోలాంటి వాళ్ళు గట్టిగా నిలబడి మూఢ నమ్మకాల్ని నిరసించారు. ప్రాణత్యాగానికి సిద్ధమయ్యారు*. *ఆనాటి నుంచి ఈనాటి వరకు మతపెద్దలు పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ అబద్దాలని నిజాలుగా భ్రమింప జేస్తున్నారు. జనాన్ని మూఢత్వంలో ముంచి ఉంచుతున్నారు. బ్రూనో వారసుల అవసరం ఈనాడు కూడా ఉంది. ఇప్పటికీ భూమినే కేంద్రకంగా తీసుకుని, లెక్కలు కడుతున్న అజ్ఞాన పండితుల్ని జనం తిరస్కరించాల్సిన సమయం ఆసన్నమైంది. మనమిప్పుడు ఆస్ట్రాలజీ కాదు, ఆస్ట్రానమి తెలుసుకోవాలి!* *ఫిబ్రవరి 17వ తేదీ ప్రపంచ ఆలోచనా సరళిని మార్చిన బ్రూనోను గుర్తుచేయడంతో పాటు, అలాంటి మరో మహానుభావుడు ఛార్లెస్‌ డార్విన్‌ను కూడా గుర్తు చేస్తుంది. ఇదే రోజు 1836లో డార్విన్‌ హెచ్చెమ్మెస్‌ బీగిల్‌ అనే ఓడ మీద టాస్మోనియా నుండి బయలుదేరాడు* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
#మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
01:27
*_1️⃣3️⃣8️⃣_* *_సంపూర్ణ మహాభారతము_* *_138వ రోజు_* *_వన పర్వము షష్టమాశ్వాసము_* *_138 వ రోజు_* *_సైంధవుడి పరాభవం_* *జయద్రధుడు తన సైన్యాలను యుద్ధసన్నద్ధం చేసాడు. భీముడు గద తీసుకుని సింధురాజు వైపు పోతుండగా కోటికాస్యుడు భీముని ఎదుర్కొన్నాడు*. *అర్జునుడు సేన అగ్ర భాగాన నిలిచిన ఐదు వందల మందిని చంపేశాడు. సౌరాష్ట్ర రాజు గద తో ధర్మరాజు యొక్క నలుగు అశ్వాలను చంపగా క్రుద్దుడైన ధర్మరాజు అర్ధచంద్ర బాణంతో రొమ్ముపై కొట్టగా అతడు గుండెలు బ్రద్దలై కూలిపోయాడు*. *యుధిష్టరుడు సహదేవుడి రధం ఎక్కాడు. త్రిగర్త రాజు సురధుడు తన ఏనుగు చేత నకులుడు రధమును త్రుక్కు చేయగా నకులుడు రధంనుండి దూకి కత్తి, డాలు తీసుకుని ఆ ఏనుగు యొక్క తొండాన్ని దంతాలతో సహా నరకగా ఆ ఏనుగు పెద్దగా ఘీంకరిస్తూ భూమి మీదకు ఒరిగిపోతూ తన మీదవున్న వున్న సురధనుడిని క్రింద పడవేయగా నకులుడు అతడిని సంహరించాడు. భీముడు కోటికాస్యుడిని చంపివేశాడు. క్హేమంకరుడు, మహాముఖుడనే రాజులు నకులుడిమీదకు రాగా నకులుడు వారిరువురిని సంహరించాడు*. *అర్జునుడు పన్నెండు మంది సౌవీర రాజులను, అడ్డువచ్చిన త్రిగర్తులను, సైన్ధవులను, శిబి ఇక్ష్వాకు ప్రముఖుల నందరిని చంపివేశాడు*. *ఆ ప్రదేశ మంతా తలలు లేని మొండెములు, శరీరాలు లేని తలలతో చెల్లా చెదురుగా పడిపోయాయి. పాండవుల ధాటికి సైంధవ సేనలు ఆగలేక పోయాయి. అర్జునుడు సృంజయుడు, స్తుకుడు, శత్రుంజయుడు, సుప్రబుద్ధుడు, శుభంకరుడు, భ్రమంకరుడు, శూరుడు, రథి, గుహకుడు, బలాడ్యుడు అనే పేరుగల సౌవీర వీరులను చంపాడు. అలా వీరులంతా చనిపోగా సైందవుడు సంకుల సైన్య మధ్యలో ద్రౌపదిని తన రథం నుండి దింపి రథం తోలుకుంటూ పారిపోయాడు. భీముడు తన పేరు చెప్పి మరీ మిగిలిన వారిని చంపుతున్నాడు. అది చూసిన అర్జునుడు సైంధవుడు పారి పోతున్నాడు ఇక అమాయకులైన వీరిని వధించడంవలన లాభ మేమున్నది, అపమన్నాడు. అందరూ ద్రౌపది దగ్గరకు వెళ్ళారు. అర్జునుడు ధర్మరాజుతో “అన్నా! నువ్వూ,ద్రౌపది, నకుల సహదేవులు, ధౌమ్యుని తీసుకుని కుటీరానికి వెళ్ళండి. నేను భీమసేనుడు సైంధవుని వెంబడిస్తాము” అన్నాడు.* *యుధిష్టరుడు “సైంధవుడు దురాత్ముడైనప్పటికి గాంధారిని, దుస్సలను తలచుకుని చంపకూడదు” అనగా ద్రౌపది “భార్యను అపహరించిన, రాజ్యమును అపహరిచిన శత్రువును ప్రాణదానం చేయమని ప్రాధేయపడినా వదిలిపెట్ట కూడదు. కాబట్టి సైంధవుడు దుర్మార్గుడు వాడి పట్ల దయ చూపవద్దు వధించండి!” అన్నది.* *ధర్మరాజు తమ్ములతో ద్రౌపదితో ఆశ్రమానికి తిరిగి వెళ్ళగా అక్కడి ఆసనములు ఇతర వస్తువులన్ని చిందర వందరగా పడి వున్నాయి. అప్పటికే అక్కడికి మార్కండేయాది విప్రులు వచ్చి వున్నారు.* *భీమార్జునులు సైంధవుడిని వెంబడించారు*. *అర్జునుడు క్రోసెడు దూరంలో వున్న సైంధవుడి రధమును చూసి బాణములతో అతని గుర్రాలను చంపాడు*. *జయద్రధుడు రథం దిగి పారిపోసాగాడు. భీముడు,అర్జునుడు వాడిని వెంబడించి పట్టుకున్నారు. భీముడు వాడిని చితక కొట్టి మెడమీద కాలు వేసి పట్టుకున్నాడు. వాడు స్పృహ తప్పాడు.* *అర్జునుడు “ఇక చాలు ఇంకా కొడితే వీడు చస్తాడు. అన్నగారి మాట మన్నించి వీడిని విడిచి పెట్టు!” అన్నాడు*. *భీముడు “అయ్యో! వీడిని వదిలితే ఎన్ని అనర్ధాలు జరుగుతాయో. అన్న ధర్మజుడు ఎప్పుడూ దయాళువే. నీవు గూడా ఎప్పుడూ నన్ను బాధపెడుతూ వుంటావు/వీడికి తగిన శాస్తి చేస్తాను”* *అని పదునైన కత్తి తీసుకుని తల అయిదు శిఖలుగా గొరిగి* *“జయద్రధా! నీవు పోయిన చోటంతా నేను పాండవుల దాసుడను అని చెప్పు. లేకుంటే చస్తావు” అన్నాడు*. *జయద్రధుడు ‘సరే అలాగే’నన్నాడు. తరువాత వాడిని రథానికి కట్టి ధర్మరాజు వద్దకు తీసుకు వచ్చాడు. భీముడు జయద్రధుని ధర్మరాజు పాదాలపై పడవేసి “అన్నయ్యా! వీడు పాండవదాసుడు జయ ద్రధుడు” అన్నాడు*. *ద్రౌపది వాడిని హేళనగా చూసింది. ధర్మరాజు “జయద్రధా! ఇక మీదట ఇలాంటి చెడ్డ పనులు చేయకు. నీ బుద్ధి ధర్మమందు ఉంచు. అధర్మము మీద మానసు పెట్టక బుద్ధిగా ఉండు” అని వదిలి పెట్టాడు*. *అవమాన భారంతో జయద్రధుడు గంగా తీరానికి వెళ్ళి శివుని గురించి ఘోరంగా తపస్సు చేసాడు. శివుడు ప్రత్యక్షం కాగా జయద్రధుడు “దేవా! యుద్ధంలో నేను పాండవులను జయించేలా వరం ప్రసాదించు!” అని కోరాడు.* *శివుడు “జయద్రధా! అది అసాధ్యం. పాండవులను జయించడం ఎవరికీ సాధ్యం కాదు. నీవు అడిగావు కముక ఒక్క రోజు మాత్రం అర్జునుడుని తప్ప మిగిలిన వారిని జయించే వరం ఇస్తున్నాను. ఇందులో అంతరం గ్రహించి మసలుకో!” అని చెప్పి అంతర్ధానం అయ్యాడు*. *తరువాత జయద్రధుడు సింధు దేశానికి వెళ్ళాడు* #మన సంప్రదాయాలు సమాచారం
*_"మన వంతు కొంత"_* *మానవుడు సంఘజీవి. ప్రతి నిత్యం సమాజం నుంచో, ప్రకృతి నుంచో ఏదో ఒకటి, ఎంతో కొంత తీసుకుంటూ ఉంటాడు,తిరిగి ఇస్తూ ఉంటాడు. అంటే ఆధారపడుతూ, ఆధారంగా ఉంటూ జీవిస్తున్నాడని అర్థం*. *ఇది సృష్టి నియమం. ఈ నియమాన్ని అతిక్రమించడానికి ప్రయత్నించేవాడు స్వార్థజీవి. అతడు ఎప్పుడూ ఇతరుల నుండి పొందాలనుకుంటారడేగానీ, ఇవ్వాలన్న ఆలోచనే ఉండదు.* *అందుకే స్వామి వివేకానంద అంటారు. “ఇవ్వండి! లేదంటే ప్రకృతి మీ నుంచి తీసేసుకుంటుంది. మీరు కేవలం తీసుకోవడానికి, ఇవ్వడానికి ఉన్న యంత్రాలు మాత్రమే! మీరు ఎంత ఇస్తే, అంతకంటే ఎక్కువ తిరిగి పొందుతారు.!”* *పరోపకారాయ వహన్తి నద్యః* *పరోపకారాయ దుహన్తి గావః* *పరోపకారాయ ఫలన్తి వృక్షాః* *పరోపకారార్థమిదం శరీరమ్.* *“ఇతరులకు ఉపకారం చేయడం కోసమే నదులు ప్రవహిస్తున్నాయి, ఆవులు పాలు ఇస్తున్నాయి, వృక్షాలు ఫలాలను ఇస్తున్నాయి, ఈ శరీరం ఉన్నది ఇతరులకు ఉపకారం చేయడం కోసమే!”అని చెబుతోంది సుభాషితం*. *పరోపకారానికి పరాకాష్ఠగా నిలిచిన కథలు మన పురాణ, ఇతిహాసాలలో ఎన్నో ఉన్నాయి* #మన సంప్రదాయాలు సమాచారం
*_ఫాల్గుణం మాసం_* *_ఫాల్గుణం ప్రఖ్యాతం....._* *సూర్యతేజస్సుతో ప్రభావితమైన ప్రకృతిలో కాలాలు.. ఋతువులు, మాసాలు, తిథులు, అహోరాత్రములు మొదలగునవి ఏర్పడుతున్నాయి.* *ప్రకృతిలో ఆకురాలే కాలం. నిర్మలాకాశంలో చక్కటి శీతల పవనాలు, ఆహ్లాద వాతావరణం ఆరోగ్యపు సిరులు చిగురులు తొడిగే కాలం. వసంతం అంకురించే కాలము పచ్చదనము పరిమళించే కాలం ఆద్యంతమూ ఆనందభరితమైన, లౌకిక ఆధ్యాత్మిక సమ్మిళితమైన అనుభూతులను పంచే కాలం అదే ఫాల్గుణ మాస శుభతరుణం* *షడృతువులలో ఆఖరిదైన శిశిర ఋతువులలో రెండవది, మాసాలలో చివరిది ఫాల్గుణం.* *ఈ మాసంలో రవి సాధారణంగా మీనరాశిలో ప్రవేశిస్తాడు. ఈ రాశిలో ఉన్న సూర్యరశ్ముల ఫలితంగా మానవుల మనస్సు సంకల్ప వికల్పాలపై పరిగెడుతుంది. కామోద్రేకం వలన మానసికానందం తగ్గి మానవుడు ఆవేశానికి లోనవుతాడు. ఆ సమయంలో మనో నిగ్రహం కావాలి. దానిని అభ్యాస వైరాగ్యాలతో సాధించుటకు అనువైన మాసం ఫాల్గుణము.* *వినీలాకాశంలో శ్వేతవర్ణంతో దండాకారంగా ప్రకాశిస్తున్న రెండు నక్షత్రాలతో కూడిన మండలమే ఫల్గుణీ నక్షత్రం. అందు ప్రధమం పూర్వ పల్గుణీ (పుబ్బ) ద్వితీయం ఉత్తర ఫల్గుణీ (ఉత్తర) పాండవ మధ్యముడు అర్జునుడు ఈ నక్షత్రం నాడు జన్మించుట వలన ఫల్గుణుడయ్యాడు. పూర్ణిమ నాడు ఫల్గుణీ నక్షత్రం ఉన్న చాంద్రమాసమును ఫల్గుణ మాసమని పిలుస్తారు. ఈ మాసం శిశిర ఋతువుకు వీడ్కొలు చెప్తూ వసంతాగమనానికి ఆహ్వానం పలుకుటకు స్వాగత ద్వారం వంటిది.* *ఫల+గుణ = ఫాల్గుణంలో చేసిన దైవ కార్యక్రమాలు రెట్టింపు ఫలితాలనిస్తాయి. కావుననే ఫాల్గుణం విశిష్టమైనది, దివ్య ప్రభావం కలిగినది. అందుకే ప్రాముఖ్యత పొందింది.* *విష్ణు సహస్రనామాలలో శిశిరఃశర్వరీ కరః నారాయణునకు ఒక నామం కలదు. నారాయణుడు ఈ సమాసంలో గోవిందనామంతో నియామకుడు. ఈ కారణంచే ఫాల్గుణ మాసం విష్ణు ప్రీతికరమని చెబుతారు.* *ఫల్గుణీ నక్షత్రం దేవతా గణం. పూర్వ ఫల్గుణీ నక్షత్రానికి సూర్యడు "ఆర్యముడు” అనే పేరుతో దేవతగా ఉంటాడు. ఈయన అధిక తేజస్సు కలవాడు కావున దేవతలందరూ అనుసరించి ఉంటారు. ఫాల్గుణ మాసంలో ఎన్నో వ్రతాలాచరించాలని శాస్త్ర వచనం.* *నేటినుండి ఫాల్గుణ మాసం ప్రారంభమవుతుంది. ఫాల్గుణం ఆహ్లాద వాతావరణంలో బ్రహ్మీ ముహూర్త వేళలో క్రియాశీలమైన సంధ్యాకాలం దేవతార్చనలకు పవిత్రమైన మాసం. ఫాల్గుణం ఆధ్యాత్మికమయం, తపోమయం, ఆరోగ్యమయం. విజ్ఞానమయం. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుండి ద్వాదశి వరకు చేసే వ్రతం ప్రయోవ్రతమంటారు. ఈ పన్నెండు దినాలు నదీస్నానమాచరించాలి. పాడ్యమినాడు గుణావాప్తి వ్రతం, తదియనాడు మధూక వ్రతం చేస్తారు. ఫాల్గుణ శుద్ధ చవితిని "తిల" చతుర్థి అంటారు. దీనినే పుత్రగణపతి వ్రతమని, శాంత చతుర్థీ వ్రతమని అంటారు. ఈ రోజున ఉపవాసం చేసి తిలాన్నంతో గణపతి హోమం చేసి అతిథులు భుజించిన తరువాత హోమం చేసినవారు తినాలి. దీని వలన సర్వవిఘ్నాలు తొలగిపోతాయి. ఈ రోజున పుత్రగణపతి వ్రతమాచరించిన వారికి సత్సంతానం కలుగుతుంది.* *శుద్ధ పంచమినాడు అనంత పంచమి వ్రతం చేయాలి. ఈనాడు గణేశుని అర్చించి నువ్వులు కలిపి వండిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా తినాలి. సప్తమి నాడు అర్కసంపుట సప్తమి ఆచరించాలి. ఉషోదయ కాల స్నానానంతరం సూర్యునకు అర్ఘ్యమివ్వాలి. సూర్యనమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయం పఠించాలి. ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్. కావున ఆరోగ్యం కొరకు సూర్యుని ప్రార్థించాలి.* *ఈ మాసంలో లక్ష్మీదేవిని, సీతామాతను షోడశోపచారాలతో పూజించాలి. ప్రదోషకాలంలో దీపారాధన చేసిన వారికి సౌభాగ్యం, సంపద చేకూరుతుంది. లలితా కాంతి దేవి వ్రతమాచరించాలి. నవమి నాడు ఆనంద నవమి అని శ్రీలక్ష్మీ నారాయణులను తులసి దళాలతో మందార పుష్పాలతో అర్చించాలి. మీన సంక్రమణం మతత్రయ ఏకాదశి, అమలకీ ఏకాదశి, ధాత్రి ఏకాదశి, అమృత ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున శ్రీలక్ష్మీ నారాయణులను పూజించి ఉపవాసం, జాగరణం చెయ్యాలి. ఉసిరిక చెట్టు క్రింద శ్రీలక్ష్మీ నారాయణులను పూజించిన వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున చేసిన వ్రతాల వలన వేలకొలది గోదానాలు చేసిన ఫలితా కలుగుతుంది. శుద్ధ ద్వాదశి విష్ణు ప్రీతికరమైన తిథి. దీన్ని నృసింహ ద్వాదశి అంటారు. శ్రీనృసింహస్వామిని అర్చిస్తే సర్వ విఘ్నాలు తొలగి అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఈ రోజున చేసే గంగానది స్నానం అత్యంత మహిమాన్విత ఫలితాన్నిస్తుంది. శుద్ధ త్రయోదశి రోజున గ్రామక్షేమం కొరకు మన్మధ విగ్రహ దహనం చేస్తారు. శుద్ధ చతుర్దశి నాడు శ్రీమహేశ్వర వ్రతమాచరించాలి. ఈ నెలలో హోళి పండుగ నిర్వహిస్తారు. పూర్ణిమను హోళికా పూర్ణిమ అని, మదన పూర్ణిమ అని, హోళి అని, 'హోల' అని, కామదహనమని వ్యవహరిస్తారు. ఈ రోజు ఉదయాన్నే ఎండిన పిడకలు రాశిగా పోసి అగ్నిని రగిల్చి దానిలో రాక్షస పీడ పోయేందుకు హోళికా అనే ఒక విధమైన శక్తిని ఆవహింపజేసి "శ్రీహోళికాయైనమః " అని పూజించి మూడుసార్లు అగ్నికి ప్రదక్షిణలు చేస్తూ "వందితాసి సురేంద్రణే బ్రహ్మణా శంకరేణ ఛ అతస్త్వాం పాహినోదేవి భూతే భూతి ప్రధోభవ" అని చదవాలి.* *హోళి పసుపుకు, పసుపు పరిమళానికి ప్రతీక. నీటిలో కలిపిన ద్రవాన్ని "వసంతం" అని అంటారు.* *వసంతాలాడుకోవడం వసంతమాసానికి స్వాగతం చెప్పడమే. పూర్ణిమ సాయంత్రం నృత్యగీత వాద్యాలతో బాలకృష్ణుని లేదా రాధాకృష్ణులను ఊయలలో ఉంచి ఆరాధించి డోలోత్సవం జరపాలి. ఇలా చేయడం వలన వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పెద్దల నమ్మకం.* *ఈ పూర్ణిమనాడు మధురైలో శ్రీమీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం, తమిళనాట శివపార్వతుల కళ్యాణం జరుపుతారు. ఈ రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానమాచరించి గోమయంతో అలికిన ఇంటి ప్రాంగణంలో తెల్లటి వస్త్రాన్ని ఆసనంగా చేసుకొని తూర్పు ముఖంగా కూర్చొని ఒక ముత్తెదువచే వందన తిలకం, నీరాజనం పొంది కొత్త చందనంతో కూడిన మామిడి పూవును భక్షించడం వలన అభీష్టసిద్ధి కలుగుతుందని శాస్త్రవచనం.* *బహుళ ఏకాదశిని విజయైకాదశి, పాప విమోచన ఏకాదశి అని అంటారు. ఈ రోజున శ్రీలక్ష్మీ నారాయణులను అర్చించి ఉపవాసముండి నియమ బద్ధంగా ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి శుభఫలితాలు కలుగుతాయి. బహుళ ద్వాదశి అన్నమాచార్య వర్ధంతి కావున ఆయన కీర్తనలు పాడి స్మరించుకోవాలి.* *బహుళ అమావాస్య కొత్త సంవత్సరానికి ముందు వచ్చే అమావాస్య కనుక దీనిని కొత్త అమవాస్య అంటారు. ఈరోజు దేవ, పితృ ఆరాధనలు చేయడం శ్రేష్ఠం, పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. అన్నదానం చెయ్యాలి. పాండవులు ఈ మాసంలోనే జన్మించారు. ఈ మాసంలో క్షీరసాగరమథనం జరిగింది. అయ్యప్పస్వామి అవతరణ, ఈ మాసంలోనే జరిగింది. ఈమాసంలో చేసే ప్రతి దానం గోవిందునికి ప్రీతి కలిగిస్తుంది. ఈ మాసం నారాయణునికి ప్రీతికరం. భక్తులందరికీ పావనం, ముక్తిదాయకం. అందుకే ఫాల్గుణం యింత ప్రాముఖ్యం.* #మన సంప్రదాయాలు సమాచారం
#మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
00:17