Ravi  Talluri
ShareChat
click to see wallet page
@91775
91775
Ravi Talluri
@91775
feelgood
https://www.youtube.com/live/kWunh_3hcjs?si=QokZ9hXS20OKOj6a #మన సంప్రదాయాలు సమాచారం
youtube-preview
https://www.youtube.com/live/tH0AVmqY5Zs?si=rHzvOLBjags_P6jV #మన సంప్రదాయాలు సమాచారం
youtube-preview
*_ప్రొఫెసర్ ఇవాన్ థాంప్సన్ (Evan Thompson) సమకాలీన తత్వశాస్త్ర ప్రపంచంలో ఒక ప్రముఖ పేరు._* *ఆయన ముఖ్యంగా మైండ్ (Mind), స్పృహ (Consciousness), మరియు కాగ్నిటివ్ సైన్స్ (Cognitive Science) రంగాల్లో విశేష కృషి చేశారు*. *ఉపనిషత్తుల పట్ల ఆయనకున్న గౌరవం కేవలం మతపరమైనది కాదు, అది లోతైన శాస్త్రీయ మరియు తాత్విక విశ్లేషణ.* *​థాంప్సన్ విశ్లేషణలోని ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి:* *_​1. స్పృహ (Consciousness)_* *గురించిన లోతైన అవగాహన* *​పాశ్చాత్య తత్వశాస్త్రం చాలా కాలం పాటు 'స్పృహ'ను కేవలం మెదడు పనితీరుగా లేదా బాహ్య ప్రపంచాన్ని చూసే ఒక సాధనంగా మాత్రమే చూసింది*. *కానీ ఉపనిషత్తులు "అహం బ్రహ్మాస్మి" లేదా "తత్త్వమసి" వంటి సూత్రాల ద్వారా స్పృహ అనేది విశ్వవ్యాప్తమైనదని బోధించాయి*. *​థాంప్సన్ అభిప్రాయం ప్రకారం, ఉపనిషత్తులు మనిషి మేల్కొని ఉన్నప్పుడు (Waking), కలలో (Dreaming), మరియు గాఢ నిద్రలో (Deep Sleep) ఉండే వివిధ స్పృహ స్థితిగతులను అద్భుతంగా విశ్లేషించాయి.* *_​2. సెల్ఫ్ (Self) మరియు ఇగో (Ego) మధ్య వ్యత్యాసం_* *​మనం సాధారణంగా మన శరీరాన్ని లేదా ఆలోచనలను 'నేను' (Ego) అనుకుంటాం*. *కానీ ఉపనిషత్తులు దీనిని దాటిన 'ఆత్మ' లేదా సాక్షి భూతమైన స్పృహ గురించి మాట్లాడతాయి*. *​థాంప్సన్ తన రచనలలో (ముఖ్యంగా Waking, Dreaming, Being పుస్తకంలో),* *భారతీయ తాత్విక చింతన ఆధునిక న్యూరోసైన్స్‌కు ఎలా మార్గదర్శకంగా నిలుస్తుందో వివరించారు.* *​3. విజ్ఞాన శాస్త్రం మరియు ఆధ్యాత్మికత మధ్య వంతెన* *​చాలా మంది శాస్త్రవేత్తలు ఆధ్యాత్మికతను మూఢనమ్మకంగా కొట్టిపారేస్తారు*. *కానీ థాంప్సన్ అలా చేయరు*. *​ఆయన దృష్టిలో ఉపనిషత్తులు అనేవి "ఇన్నర్ సైన్స్" (Inner Science). బాహ్య ప్రపంచాన్ని టెలిస్కోపులతో ఎలా చూస్తామో, అంతర ప్రపంచాన్ని ధ్యానం మరియు విచారణ (Inquiry) ద్వారా ఎలా అర్థం చేసుకోవాలో ఉపనిషత్తులు నేర్పుతాయి.* *_​విశ్లేషణ - ఎందుకు ఇది ముఖ్యం?_* *​ప్రొఫెసర్ థాంప్సన్ వంటి మేధావులు ఉపనిషత్తులను గొప్పవిగా పేర్కొనడానికి ప్రధాన కారణాలు:* *​సార్వజనీనత: ఇవి ఏ ఒక్క మతానికో పరిమితం కాకుండా, మానవ ఉనికికి సంబంధించిన ప్రాథమిక ప్రశ్నలను అడుగుతాయి*. *​సైకలాజికల్ డెప్త్: నేటి సైకాలజీ కనుగొంటున్న విషయాలను వేల ఏళ్ల క్రితమే ఉపనిషత్తులు చర్చించాయి*. *​అద్వైతం: జీవాత్మ, పరమాత్మ ఒక్కటే అనే భావన ఆధునిక ఫిజిక్స్‌లోని 'క్వాంటం ఎంటాంగిల్మెంట్' వంటి అంశాలతో పోల్చదగినదిగా ఉండటం.* *​"భారతీయ తాత్విక సంప్రదాయం, ముఖ్యంగా ఉపనిషత్తులు, మానవ మనస్సును అర్థం చేసుకోవడంలో పాశ్చాత్య దేశాల కంటే వెయ్యి ఏళ్లు ముందున్నాయి." -* *ఇది థాంప్సన్ వంటి విశ్లేషకుల సారాంశం*. *​ముగింపు: ఇవాన్ థాంప్సన్ విశ్లేషణ వల్ల మన ఉపనిషత్తులకు గ్లోబల్ అకడమిక్ స్థాయిలో ఒక గౌరవం లభించింది*. *ఇవి కేవలం పూజా గదులకు పరిమితం కావలసిన గ్రంథాలు కావు, ప్రతి ఒక్కరూ చదవాల్సిన "జ్ఞాన శాస్త్రాలు" అని ఆయన నిరూపిస్తున్నారు* #మన సంప్రదాయాలు సమాచారం
#మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
00:39
#మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
01:25
*_@లింగోద్భవ మహిమ_* *_లింగోద్భవ సమయం (నిశిత కాల పూజ)_* *_ఫిబ్రవరి 15 అర్ధరాత్రి 11:55 నుండి_* *_ఫిబ్రవరి 16 తెల్లవారుజామున 12:56 వరకు_* *_📅 చతుర్దశి తిథి ముగింపు:_* *_ఫిబ్రవరి 16 సాయంత్రం 05:34 వరకు_* *ఈ పవిత్ర సమయంలో పరమేశ్వరుడు తేజోలింగ స్వరూపంగా అవతరించిన క్షణాన్ని లింగోద్భవం అంటారు*. *ఈ సమయాన శివలింగానికి చేసే అభిషేకం, పూజ అనేక రెట్లు పుణ్యఫలాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి*. *_లింగోద్భవ కథ సారాంశం:_* *ఒకసారి బ్రహ్మ, విష్ణువులకు ఎవరు గొప్పవారో అన్న అహంకారం కలిగింది. వారి అహంకారాన్ని తొలగించేందుకు శివుడు అనంతమైన తేజోస్తంభం (లింగం) రూపంలో ప్రత్యక్షమయ్యాడు*. *బ్రహ్మ హంసరూపంలో పైభాగం వెతికాడు* *విష్ణువు వరాహరూపంలో క్రింది భాగం వెతికాడు* *కానీ ఇద్దరికీ ఆ తేజోలింగం* *ఆద్యంతాలు కనబడలేదు*. *బ్రహ్మ అసత్యం చెప్పి తాను అగ్రభాగం చూశానని కేతకి పువ్వును సాక్షిగా చూపించాడు*. *విష్ణువు మాత్రం నిజాయితీగా తనకు అంతు పట్టలేదని ఒప్పుకున్నాడు*. *శివుడు అసత్యం చెప్పిన బ్రహ్మను శిక్షించాడు, అందుకే బ్రహ్మకు ఆలయాలు తక్కువ*. *సత్యాన్ని పలికిన విష్ణువు స్థితికారకుడిగా అందరి పూజలు పొందుతున్నాడు*. *🚫 కేతకి పువ్వు శివపూజలో ఉపయోగించరాదు అనే నియమం కూడా అప్పుడే ఏర్పడింది*. *ఈ కథ ఇచ్చే మహా సందేశం:* *✔️ సత్యం శివునికి ప్రియమైనది* *✔️ అహంకారం నాశనానికి కారణం* *✔️ నిజాయితీ ఉన్నవారికి దైవకృప తప్పకుండా లభిస్తుంది* *ఈ లింగోద్భవ సమయంలో* *శివలింగానికి అభిషేకం* *ఓం నమః శివాయ జపం* *_శివధ్యానం_* *చేస్తే అనేక జన్మల పాపాలు నశించి, శివానుగ్రహం లభిస్తుంది* #మన సంప్రదాయాలు సమాచారం
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* *_సోమవారం ఫిబ్రవరి 16 2026_* *_శ్రీ విశ్వావసు నామ సంవత్సరం_* *_ఉత్తరాయణం శిశిర ఋతువు_* *_మాఘమాసం బహుళపక్షం_* *_తిథి: చతుర్దశి సా 05.26వరకు తదుపరి అమావాస్య_* *_వారం: సోమవారం (ఇందువాసరే)_* *_నక్షత్రం: శ్రవణం రా 08.58వరకు తదుపరి ధనిష్ఠ_* *_యోగం: వరీయాన్ 02.19వరకు తదుపరి పరిఘమ_* *_కరణం:శకుని సా 05.26వరకు తదుపరి చతుష్పాత తె 05.34వరకు ఆ తదుపరి నాగవ_* *_వర్జ్యం; రా 01.06-02.45_* *_దుర్ముహూర్తము: మ 12.36-01.22మరల మ 02.54-03.39వరకు_* *_అమృతకాలం:ఉ 10.01-11.42_* *_రాహుకాలం: ఉ 07.30-09.00_* *_యమగండం/కేతుకాలం; ఉ 10.30-12.00_* *_సూర్యరాశి:కుంభం_* *_చంద్రరాశి:మకరం సూర్యోదయం:06.32 సూర్యాస్తమయం: 05.57_* *_ఓం నమఃశివాయ సర్వేజనాః సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవతు_ _ఓం శాంతి శాంతి శాంతిః_* *_శుభమస్తు సంతోషమస్తు_* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - 9 9 9 9 - ShareChat
*_MAAGHA PURANAM -- 29_* *_29 అధ్యాయము_* *_మాఘమాసమందు ఏకాదశీ మహాత్మ్యము – క్షీర సాగర మథనము._* *మాఘమాసమునందు నదీస్నానము చేసి, మాఘమాస వ్రతము ఆచరించిన వారికి అశ్వమేథ యాగము చేసిన ఫలము కలుగుతుంది. ఈ మాఘమాసములో ఏకాదశీ వ్రతము చేసి ఉపవాసము ఉన్నవారు వైకుంఠప్రాప్తి పొందగలరు. మాఘమాసమందు ఏకాదశీ వ్రతము చేసి సత్ఫలితము పొందిన దేవతలకథలు వినండి*. *పూర్వకాలమందు దేవతలు, రాక్షసులు క్షీర సాగరమును మధించి అమృతమును పొందవలెనని అభిప్రాయమ కలిగి మంధర పర్వతమును కవ్వముగా, వాసుకి అను సర్పమును త్రాడుగా చేసుకొని క్షీరసాగరమును మధించసాగారు. తలవైపు రాక్షసులు, తోక వైపు దేవతలు ఉండి మధిస్తు ఉండగా మొదట పుట్టిన లక్ష్మీదేవిని విష్ణుమూర్తి భార్యగా స్వీకరించాడు*. *తరవాత ఉచ్చైశ్రవము అనే గుఱ్ఱము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించగా వాటిని విష్ణుమూర్తి ఆదేశముపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరల పాలసముద్రమును మధించగా లోకభీకరమై ఘనమైనతేజస్సుతో ఉండే అగ్ని తుల్యమైన హాలాహలము పుట్టింది. ఆ హాలాహల విష జ్వాలలతో సమస్త లోకములు కాలిపోతున్నాయి*. *దేవతలు, రాక్షసులు భయపడి పారిపోయి సర్వేశ్వరుని శరణుకోరగా భోళాశంకరుడగు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషమును తన కంఠమునందు బంధించాడు*. *కాలకూట విషమును పానము చేసినందువల్లనే శివుని కంఠము నీలముగా మారి ఆనాటినుండి నీలకంఠుడని పేరు వచ్చింది. మళ్ళీ దేవ దానవులు అమృతం కోసం పాలసముద్రమును మధించగా అమృతము పుట్టింది.* *ఆ అమృతము కొరకు వారిరువురు తగవులాడుకొన సాగారు*. *శ్రీమహావిష్ణువు మాయామోహిని అవతారము ధరించి వారి తగవును పరిష్కరించాలి అనుకున్నాడు*. *మాయామోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవరూ లేరు. జగన్మోహిని యైన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయా మోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్యరాశి. ఆమె వారిరువురి మధ్యకు వచ్చి అమృతమును ఇరువురికీ సమానముగా పంచెదను. ఎందుకీ తెగని తగవులాట? మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతము పంచుతాను మీకు ఇష్టమేనా? అన్నది*. *దేవదానవులు అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడలేదు. దేవతలందరూ ఒక వరుసలోనూ, రాక్షసులందరూ మరొక వరుసలోనూ నిలబడ్డారు*. *జగన్మోహిని రెండు భాండములను తీసుకొని ఒక భాండమునందు సురను, మరొక దానియందు అమృతమును నింపి నర్తిస్తూ, మురిపిస్తూ, మైమరపిస్తూ, తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు, అమృతమును దేవతలకు పోయసాగింది.* *మందభాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింప సాగారు*. *ఈవిధంగా రాక్షసులను తన వలపు వయ్యారములతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తోంది*. *ఈ విషయము గమనించిన రాహుకేతువులు మాయాదేవతలుగా మారి దేవతల పంక్తిలో కూర్చొని అమృతాన్ని పానం చేశారు*. *రాహుకేతువులు చేసిన ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని రూపములో ఉన్న శ్రీమహావిష్ణువు కోపించి తన చక్రాయుధంతో వారి తలను నరికివేసాడు. మిగిలిన అమృతము దేవేంద్రుడికి ఇచ్చాడు*. *త్రిమూర్తులు అదృశ్యమయ్యారు. దేవేంద్రుడు అమృత భాండమును భద్రపరుస్తూ ఉండగా రెండు చుక్కలు విధివశాత్తూ నేలరాలాయి. అవి పడిన చోట రెండు దివ్యమైన మొక్కలు పెరిగాయి. అవే పారిజాత, తులసి మొక్కలు. సత్రాజిత్తు అనే మహారాజు వాటికి నీరుపోసి పెంచసాగాడు. కొంత కాలమునకు పారిజాత వృక్షము పుష్పించి అద్భుతమైన సువాసనలను వెదజల్లసాగింది*. *ఒకనాడు దేవేంద్రుడు అటువైపుగా వెళ్తూ పారిజాత పుష్ప వాసనకు పరవశించి ఒక పువ్వును కోసుకొని తన భార్యయైన శచీదేవికి ఇచ్చాడు. మిగిలిన దేవతలు కోరగా మళ్ళీ వచ్చి రహస్యముగా పువ్వులను కోయాలని తోటలో ప్రవేశించాడు*. *అప్పటికే తన తోటలోని పువ్వులను ఎవరో అపహరిస్తున్నారని అనుమానము వచ్చిన సత్రాజిత్తు శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి మంత్రించిన అక్షతలను పువ్వులపైన, వనమంతా చల్లాడు. దేవేంద్రుడు పారజాత పువ్వును తుంచబోడగా అక్షతల ప్రభావం వల్లనో, విష్ణు మహిమ వల్లనో మూర్ఛపోయాడు*. *ఈవార్త తెలిసిన దేవతలందరూ నారదుణ్ణి బ్రతిమలాడగా నారదుడు కృష్ణుని వద్దకు పోయి విషయము వివరించాడు*. *కృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తు వద్దకు బయలుదేరాడు*. *అమోఘమైన శక్తి కల సత్రాజిత్తు మిక్కిలి భగవద్భక్తి పరాయణుడు*. *భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణువు రూపమున కనిపించాడు*. *సత్రాజిత్తుకి చెప్పి అమృత తుల్యమగు పారిజాత వృక్షమును దానికి అర్హుడైన దేవేంద్రునికి ఇప్పించి తులసిని తన సన్నిధిలో ఉండమని చెప్పాడు. ఆనాటి నుంచి తులసి శ్రీమహావిష్ణువు సాన్నిధ్యములో ఆయనతో సమానముగా పూజలు అందుకుంటున్నది. అందుచేత తులసిని పూజించిన సకల సౌభాగ్యములు సిద్ధిస్తాయి*. *_ఫలశ్రుతి:_* *సూతమహర్షి శౌనకాది మునులతో మహర్షులారా! వశిష్ఠుల వారు దిలీపునకు తెలియచేసిన మాఘమాస మహత్యము, మాఘస్నాన మహిమ మీకు వివరించాను. మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞం కూడా పూర్తి కావచ్చింది. అందరు మాఘమాస వ్రతమును, నదీ స్నానమును నియమ నిష్ఠలతో చేసి ఆ శ్రీహరి కృప పొందగలరని దీవించాడు*. *మాఘమాసంలో సూర్యుడు మకర రాశియందుండగా సూర్యోదయము అయిన తర్వాత నదిలో స్నానము చేయాలి. ఆదిత్యుని పూజించి విష్ణ్వాలయమును దర్శించి శ్రీమన్నారాయణునకు పూజలు చేయాలి. మాఘమాసం ముప్పది రోజులు క్రమం తప్పక మిక్కిలి భక్తి శ్రద్ధలతోనూ, ఏకాగ్రతతోనూ, చిత్తశుద్ధితోనూ శ్రీమహావిష్ణువును మనసారా పూజించిన సకలైశ్వర్య ప్రాప్తి, పుత్రపౌత్రాభివృద్ధి, వైకుంఠప్రాప్తి పొందుతారు.* *_సర్వేజనాః సుఖినోభవన్తు!!_* *_మాఘపురాణము సంపూర్ణమ్ !!_* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
1️⃣3️⃣6️⃣ *_సంపూర్ణ మహాభారతము_* *_136 వ రోజు_* *_వన పర్వము_* *_షష్టమాశ్వాసము:_* *_136 వ రోజు_* *_దేవదూతను తిరిగి పంపుట_* *ఒక దేవదూత విమానం తీసుకు వచ్చి ముద్గలునితో “మహామునీ! నీవు చేసిన పుణ్యం వలన నీకు స్వర్గలోక ప్రాప్తి కలిగింది. విమానం ఎక్కుము” అని చెప్పారు*. *ముద్గలుడు ఆ దేవదూతను చూసి* *“అయ్యా! దేవలోకం ఎలా ఉంటుంది” అని అడిగాడు* *“తపస్సు చేసి సిద్ధి పొందిన మహా మునులు, యజ్ఞాలు చేసిన వాళ్ళు, సత్యసంధులు, ఇంద్రియములు జయించిన వారు, దానం చేసిన వారు యుద్ధంలో మరణించిన వారు దేవలోకంలో నివసిస్తారు. ఇంకా అప్సరసలు, సిద్ధులు, సాధ్యులు, దేవమునులు, మరుత్తులు నివసిస్తుంటారు*. *మేరు పర్వత శిఖరం అక్కడే ఉంది.* *నందనోద్యానం ఉంది. అక్కడ ఆకలి దప్పులు ఉండవు. వ్యాధులు, ముసలితనం ఉండదు. అక్కడ అందరికీ తేజోమయ దేహాలు ఉంటాయి. స్వర్గంలో ఉన్నంత కాలం దుఃఖం ఉండదు, నిరంతర సౌఖ్యం, ఆనందం ఉంటాయి. స్వర్గలోకం పైన బ్రహ్మలోకం ఉంటుంది. అక్కడ మనువులు, మహర్షులు మాత్రం ఉంటారు. అక్కడ పునర్జన్మ ఉండదు. ప్రళయకాలంలో అన్ని లోకాలు నాశనం అవుతాయి.* *బ్రహ్మలోకం మాత్రం నిలిచి ఉంటుంది. మనుష్యుడు భూలోకంలో చేసిన పుణ్యాలకు ఫలితం స్వర్గలోకంలో అనుభవిస్తారు*. *అక్కడ ఎలాంటి పుణ్యం చేసుకోవడానికి వీలు లేదు. చేసిన పుణ్యఫలం అనుభవించిన తరువాత మరల భూలోకానికి వస్తారు*. *వచ్చిన మానవుడు వాటిని విడువలేక వేదనకు గురి ఔతాడు.* *స్వర్గలోకంలో ఉన్నవారు కూడా తమకంటే ఉన్నత స్థిలో ఉన్న వారిని చూసి మనసులో బాధ పడతారు.* *బ్రహ్మలోకం శాశ్వతం. స్వర్గలోకం అనుభవానికి మాత్రమే. భూలోకం కర్మభూమి.* *భూలోకంలో చేసిన సత్కర్మల ఫలం స్వర్గలోకంలో అనుభవిస్తారు” అని చెప్పి స్వర్గ లోకానికి రమ్మని ముద్గలుని పిలిచాడు*. *ముద్గలుడు “అయ్యా! నాకు అశాశ్వతములైన స్వర్గసుఖములు అవసరం లేదు. ఏ లోకానికి పోతే తిరిగి జన్మలేదో ఆ లోకానికి పోవడానికి ప్రయత్నిస్తాను” అన్నాడు*. *దేవదూత వెళ్ళి పోయాడు*. *ఆ తరువాత ముద్గలుడు ద్వందముల యందు ఆసక్తి వదిలి, అంతటా సమభావంతో చూసి జ్ఞానయోగి అయ్యాడు*. *జీవన్ముక్తుడు అయ్యాడు. కనుక ధర్మరాజా! నీవు రాజ్యం పోయినందుకు చింతించ వలదు” అని హితబోధ చేసాడు. తరువాత తన ఆశ్రమానికి వెళ్ళాడు.*``` *సైంధవుడు ద్రౌపదిని చూచుట* *కొంత కాలం గడిచింది. ఒక రోజు పాండవులు అడవికి వేటకు వెళ్ళారు. ద్రౌపది కుటీరంలో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో సింధు దేశాన్ని పాలించే సైంధవుడు తన చతురంగ బలాలతో పెక్కుమంది ఇతర మిత్ర రాజులతో కలిసి సాళ్వరాజ పుత్రిని వివాహం చేసుకోవడానికి పయనిస్తూ మార్గ మధ్యంలో కామ్యకవనం చేరుకున్నాడు. కుటీరం ముందు నిలిచి ఉన్న ద్రౌపదిని చూసి మోహ పరవశుడైయ్యాడు. తన మిత్రుడైన కోటికాస్యుని పిలిచి “ఈ సుందరాంగి ఎవరు? ఆమెపట్ల నా మనసు లగ్నం అయింది. ఆమెతో మాట్లాడి ఎలాగైనా నన్ను చేరేలా చెయ్యాలి” అన్నాడు*. *కోటికాస్యుడు ద్రౌపది వద్దకు వెళ్ళి “లలనా! నీవెవరు, వన్యమృగాలు తిరిగే ఈ అడవిలో ఎందుకు ఉన్నావు.* *వనదేవతవా? శచీదేవివా? లక్ష్మీ దేవివా? నీ భర్త ఎవరు? నీ పేరేమి? నా పేరు కోటికాస్యుడు. మహా బలవంతుడను. అడుగో అక్కడున్న వాడు త్రిగర్త దేశాధిపతి, ఆ పక్కన కళింగ దేశాధిపతి, ఆ పక్కన ఉన్నది సింధు దేశాధీశుడు జయద్రధుడు. అతనికి నీ మీద మనసు కలిగింది. అందుకే నన్ను పంపాడు” అన్నాడు*. *ఆ మాటలు విన్న ద్రౌపది “అన్నా నేను ఒంటరి దానను, పుత్రవతిని నీవు నా దగ్గరకు రావడం తగదు. నన్ను సామాన్య స్త్రీగా ఎంచవద్దు. నేను పాంచాలరాజ పుత్రిని, నా పేరు కృష్ణ, పాండవుల ధర్మ పత్నిని. వారితో వనవాసం చేస్తున్నాను. కొంత సేపట్లో నా భర్తలు వస్తారు. ఈ సమీపంలో కొంత సమయం ఉండండి. వారు రాగానే అతిథి సత్కారం చేస్తాను” అన్నది*. *కోటికాస్యుడు జరిగినది జయద్రధునికి చెప్పాడు. ఎలాగైనా ద్రౌపదిని అపహరించాలన్న ఉద్దేశంతో జయద్రధుడు కుటీరంలో ప్రవేశించాడు* #మన సంప్రదాయాలు సమాచారం