Ravi  Talluri
ShareChat
click to see wallet page
@91775
91775
Ravi Talluri
@91775
feelgood
*_అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాల్లో ద్వాదశి రోజు రాత్రి రావణ వాహన సేవ జరుగుతుంది అని మీకు తెలుసా?_* *26-4-26 తారీకు నుంచి 2-5-26 వరకు అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కల్యాణోత్సవాలు.* *_దీని వెనుక కథ & తత్వం_* *రావణుడు కూడా బ్రాహ్మణుడే, గొప్ప శివభక్తుడురావణాసురుడు రాక్షసుడైనా పులస్త్య బ్రహ్మ వంశంలో పుట్టిన బ్రాహ్మణుడు. వేదాలు, శాస్త్రాలు చదివిన మహాపండితుడు, సామవేదాన్ని గానం చేసినవాడు. శివుని కోసం తపస్సు చేసి ఆత్మలింగాన్ని పొందాడు. అందుకే ఆయనను "రావణ బ్రహ్మ" అని పిలుస్తారు*. *1. సత్యనారాయణుడు త్రిమూర్త్యాత్మకుడుఅన్నవరం స్వామిని "మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతశ్చ మహేశ్వరం, అధతో విష్ణురూపాయ, త్ర్త్యేక్య రూపాయతే నమః" అని స్తుతిస్తారు. అంటే స్వామి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఏకరూపం*. *2. రావణ వాహన సేవ అంతరార్థంకళ్యాణ మహోత్సవంలో స్వామి పలు వాహనాలపై ఊరేగుతాడు. రావణుడు అహంకారానికి, దుర్గుణాలకు ప్రతీక. కానీ అతడు గొప్ప భక్తుడు, పండితుడు కూడా. "ఎంతటి పండితుడైనా, భక్తుడైనా అహంకారం వల్ల పతనం తప్పదు" అనే సందేశం ఇవ్వడానికి స్వామి రావణ వాహనం ఎక్కుతాడు.అంటే స్వామి రావణుడిని కూడా తన వాహనంగా చేసుకొని, అతని అహంకారాన్ని అణచి, భక్తుడిగా స్వీకరించాడు అని అర్థం. దుర్మార్గుడైనా చివరికి భగవంతుని సేవలో తరించవచ్చు అనే తత్వాన్ని ఇది తెలియజేస్తుంది* *3. స్మార్త ఆగమ సంప్రదాయంఅన్నవరం బ్రహ్మోత్సవాలు స్మార్త ఆగమ రీతిలో జరుగుతాయి. స్మార్త సంప్రదాయంలో శివకేశవ భేదం ఉండదు. హరి-హరులకు బేధం లేదని నిరూపిస్తూ సత్యన్నారాయణ స్వామి ప్రక్కనే ఈశ్వరుడు కూడా పూజలందుకుంటాడు*. *రావణుడు శివభక్తుడు కాబట్టి, శివకేశవ అభేదాన్ని చాటడానికి కూడా రావణ వాహన సేవ చేస్తారు*. *కళ్యాణం క్రమంఅన్నవరం బ్రహ్మోత్సవాలు వైశాఖ శుద్ధ దశమి నుండి బహుళ పాడ్యమి వరకు 5 రోజులు జరుగుతాయి*. *ఏకాదశి: దివ్య కళ్యాణోత్సవం, ఆ తర్వాత గరుడ వాహనసేవ* *_ద్వాదశి: హోమం,_* *_రావణ వాహనసేవ_* *_కాబట్టి కళ్యాణం_* _అయిన మర్నాడు రాత్రి స్వామి రావణ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. అహంకారాన్ని వదిలి సత్యమార్గంలో నడవమని స్వామి ఈ వాహనసేవ ద్వారా బోధిస్తాడు_ *_అన్నవరం_* *_వీరవెంకట సత్యనారాయణ_* *_స్వామి వార్షిక కళ్యాణ_* *_మహోత్సవాలు 26 నుంచి మే_* *_2 వరకు ఘనంగా, రథోత్సవం, చక్రస్నానం, పుష్పయాగం_* *_26వ తేదీ ధ్వజారోహణం, 27వ తేదీ రాత్రి స్వామి అమ్మ వార్ల కళ్యాణ మహోత్సవం, 28వ తేదీ అన్నవరం గ్రామంలో రావణబ్రహ్మ ఊరేగింపు, 29వ తేదీ శ్రీ సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవార్ల రథోత్సవం, 30వ తేదీన పండిత సదస్యం, ఒకటవ తేదీ పంప శిరోవరంలో స్వామి అమ్మవార్ల శ్రీ చక్రస్నాన మహోత్సవం, రెండవ తేదీ రాత్రి రత్నగిరి కొండల విహార గృహంలో స్వామి అమ్మవార్ల శ్రీ పుష్పయాగ మహోత్సవంతో ఈ కళ్యాణ మహోత్సవాలు ముగియనున్నాయి._* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
*_భారతీయ ఆసుపత్రుల్లో విదేశీ పెట్టుబడుల వెల్లువ_* *_గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ కార్పొరేట్ హాస్పిటల్ రంగంలోకి అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ (Private Equity) సంస్థల పెట్టుబడులు భారీగా పెరిగాయి. చాలా వరకు పెద్ద హాస్పిటల్ నెట్‌వర్క్‌లు ఇప్పుడు విదేశీ సంస్థల మెజారిటీ వాటా (Majority Stake) తో నడుస్తున్నాయి_*. *_​దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్న పరిస్థితిని విశ్లేషిస్తే:_* *_​ఎందుకు అమెరికన్ సంస్థలు కొంటున్నాయి?_* *_​భారతదేశంలో జనాభా పెరగడం, ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరగడం వల్ల వైద్య రంగం ఒక లాభదాయకమైన వ్యాపారంగా మారింది. అమెరికాకు చెందిన సంస్థల దగ్గర భారీగా నిధులు ఉంటాయి, అందుకే అవి ఇక్కడి హాస్పిటల్స్ కొని వాటిని విస్తరిస్తున్నాయి._* *_​అమెరికన్ లేదా విదేశీ యాజమాన్యంలో ఉన్న ప్రముఖ హాస్పిటల్స్:_* *_హాస్పిటల్ పేరు ప్రస్తుత స్థితి /_* *_యాజమాన్యం_* *_కేర్ హాస్పిటల్స్ (CARE) అమెరికాకు చెందిన బ్లాక్‌స్టోన్ (Blackstone) సంస్థ సుమారు 75% వాటాను కలిగి ఉంది._* *_మణిపాల్ హాస్పిటల్స్ సింగపూర్‌కు చెందిన Temasek ఇందులో మెజారిటీ వాటా తీసుకుంది (అమెరికన్ సంస్థ TPG కూడా ఇందులో పెద్ద పెట్టుబడిదారు)._* *_రెయిన్‌బో హాస్పిటల్స్ అమెరికాకు చెందిన కేపిటల్ గ్రూప్ వంటి సంస్థలకు ఇందులో భారీ వాటాలు ఉన్నాయి._* *_మాక్స్ హెల్త్‌కేర్ గతంలో అమెరికన్ సంస్థ KKR దీనిని నడిపించింది (తర్వాత షేర్లను విక్రయించారు)_*. *_సహ్యాద్రి హాస్పిటల్స్ కెనడా/అమెరికాకు చెందిన సంస్థల పెట్టుబడులు ఎక్కువగా ఉన్నాయి_*. *_ఫోర్టిస్ (Fortis) ఇది మలేషియాకు చెందిన IHH Healthcare ఆధీనంలో ఉంది._* #మన సంప్రదాయాలు సమాచారం
*_Wow amazing_* #😁Hello🙋‍♂️
😁Hello🙋‍♂️ - ShareChat
00:17
#మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - A TRUCK CARRVING BOOKS FELL AND THERE WERE NO LOOTERS L 3 THINK IF IT WERE A PETROL OR LIQUOR TRUCK A TRUCK CARRVING BOOKS FELL AND THERE WERE NO LOOTERS L 3 THINK IF IT WERE A PETROL OR LIQUOR TRUCK - ShareChat
#మన సంప్రదాయాలు సమాచారం వేరో ఏ ఇతర సామాగ్రి అలాంటి స్థితిలో ఉంటే ఎలా ఉండేవారు పబ్లిక్ ఊహించండి_*
మన సంప్రదాయాలు  సమాచారం - A truck carrying books fell and therel were no looters ! Apporently loorers don + redd and readers don + loot. A truck carrying books fell and therel were no looters ! Apporently loorers don + redd and readers don + loot. - ShareChat
*జనాభా లెక్కల స్వీయ గణన (Self Enumeration) – 2027..* * *📆 తేదీలు: ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు.....* * *ఇప్పుడు ప్రజలే తమ వివరాలను తామే నమోదు చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది! ఈ అవకాశాన్ని వినియోగించుకుని సులభంగా మీ కుటుంబ వివరాలను నమోదు చేసుకోండి.* *స్టెప్ బై స్టెప్ విధానం:* * *1 ఈ లింక్ ఓపెన్ చేయండి https://se.census.gov.in #మన సంప్రదాయాలు సమాచారం * * *2 Self Enumeration (HLO) Login వద్ద తెలంగాణ ఎంపిక చేసి, Captcha ఎంటర్ చేసి Verify & Proceed క్లిక్ చేయండి.* * *3 Welcome పేజీలో కుటుంబ పెద్ద పేరు, మొబైల్ నంబర్ నమోదు చేయండి.* * *4 ఒక కుటుంబానికి ఒకే మొబైల్ నంబర్ ఉపయోగించాలి. వచ్చిన OTP ఎంటర్ చేసి Verify & Proceed క్లిక్ చేయండి. తరువాత మీకు నచ్చిన భాషను ఎంచుకోండి.* * *5 మీ జిల్లా, పట్టణం/గ్రామం, పిన్ కోడ్ వివరాలు నమోదు చేయండి.* * *6 మొబైల్ లో Location ON చేసి, మీ ఇంటి వద్ద రెడ్ మార్క్ సెట్ చేయండి. 📍* * *7 ఇళ్ల వివరాలకు సంబంధించిన 33 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, Preview ద్వారా చెక్ చేసి Submit చేయండి.* * *8 Submit చేసిన తరువాత H తో ప్రారంభమయ్యే 11 అంకెల SE ID వస్తుంది. దాన్ని స్క్రీన్‌షాట్ లేదా నోట్ చేసుకుని భద్రపరచండి.* * *9 మే 11 తరువాత మీ ఇంటికి వచ్చే గణన అధికారికి ఈ SE ID చూపిస్తే వారు అప్రూవ్ చేస్తారు.*
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
Self-Enumeration (SE)
*1. ప్రశ్న: ఇండియాలో వేల ఏళ్ల క్రితం కట్టిన కోటలు/దేవాలయాలు ఇప్పటికీ బలంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు కట్టిన బిల్డింగులు 100 ఏళ్ళలోపే కుప్పకూలుతున్నాయి. అంత గొప్ప ఇంజనీర్లు ఇప్పుడెందుకు లేరు? జవాబు: మీ ప్రశ్నలో 'survivorship bias' ఉంది. అంటే, మీరు ఇప్పటికీ దృఢంగా ఉన్న కొన్ని పాతకట్టడాలను చూసి, “పాత నిర్మాణాలన్నీ గొప్పవి, Old is Gold' అని నిర్ణయానికి వచ్చారు. నిజానికి, చాలా పాత దేవాలయాలు, కోటలు, భవనాలు ఎన్నో కూలిపోయాయి. "అవి ఎందుకు కూలిపోయాయి?" అని అడక్కుండా, వాటిలో ఇప్పటికీ బలంగా ఉన్న బృహదీశ్వరాలయం, హంపి, కోణార్క్, ఎర్రకోట లాంటి అత్యుత్తమ కట్టడాలను, ఇటీవల కట్టిన మామూలు భవనాలతో పోలుస్తూ, పక్షపాత వైఖరితో నన్ను ప్రశ్న అడిగారు. ఆ నిర్మాణాలు ప్రజల మౌలిక సదుపాయాల కోసం కట్టినవి కావు. అవి రాజులు తమ వ్యక్తిగత భద్రత, కీర్తి, ప్రతిష్ట, అభిరుచి, ఉద్దేశం, లక్ష్యం, స్వార్థం లేదా మత పరమైన ఉద్దేశంతో ప్రజాధనం వెచ్చించి, పరిమితులు లేని బడ్జెట్'తో కట్టినవి. నిజానికి, ఆ కట్టడాలను నిర్మించిన ఇంజనీర్లు, ఇప్పటి ఇంజనీర్ల కన్నా గొప్పవారేం కాదు. ఇప్పుడున్న పరిజ్ఞానంతో, అవే కట్టడాలను అంతకన్నా ఎంతో మెరుగ్గా నిర్మించే సామర్థ్యమున్న ఇంజనీర్లు ఇప్పుడు మనకున్నారు.* *చెక్కు చెదరని ప్రాచీన కట్టడాలకు సంబంధించిన టెక్నాలజీ ఏమాటో ఇపుడు చూద్దాం*. *2. ప్రశ్న: ప్రాచీన కట్టడాలు ఏళ్ళ తరబడి వాతావరణ పరిస్థితులను తట్టుకోడానికి ఏ టెక్నాలజీ వాడేవారు? జవాబు: పైన నేను మొదటి ప్రశ్నకు జవాబులో చెప్పినట్టుగా*, *ప్రాచీన కట్టడాలు చాలా వరకూ కూలిపోయాయి. రాజులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కట్టిన కొన్ని మాత్రమే కాలానికి ఎదురొడ్డి నిలబడ్డాయి*. *దానికోసం అప్పటి నిర్మాణాల్లో ఒక రకమైన డంగు సున్నం (lime mortar) వాడేవారు. ఆ సున్నానికి, రాళ్ల మధ్య కాలక్రమంలో ఏర్పడే పగుళ్లను స్వయంగా పూడ్చుకోడం (self-healing), తేమను లోపల బంధించకుండా బయటకు వదలడం, శతాబ్దాలు గడిచే కొద్దీ మరింత గట్టిపడ్డం, వత్తిడిని తట్టుకోడం, భూకంపాలు వచ్చినా స్థిరంగా ఉండడం లాంటి ఎన్నో అద్భుత గుణాలున్నాయి*. *డంగు సున్నం ను ఎలా తయారుచేస్తారంటే*. *సముద్రపు గుల్లలు/ శంఖాలు/ అల్చిప్పలను పెద్దపెద్ద బట్టీలలో (Kilns) కాలిస్తే, అందులోంచి కార్బన్ డై ఆక్సైడ్ (CO2) బయటకుపోయి, పొడిసున్నం (quick lime) మిగులుతుంది. దానికి కొంచెం నీళ్లు కలిపితే, బుసబుసలాడుతూ పేస్టులా మారుతుంది. (తమలపాకుల్లో వాడేది ఇదే). దానికి కొంత ఇసుక, బెల్లం, కరక్కాయ, గుడ్లు కలిపి గానుగలో తిప్పితే 'డంగు సున్నం' వస్తుంది. అంతేకాకుండా, ప్రతి కట్టడానికి ఒక ప్రత్యేక శైలి, డిజైను ఉండేది*. *దాని గురించి కింద 3వ ప్రశ్నకు జవాబుగా వివరించాను...* *3. ప్రశ్న: పాత కట్టడాలు వందల ఏళ్లకు పైగా చెక్కు చెదరకుండా ఉండడానికి ఎలాంటి డిజైన్లు వాడేవారు* *జవాబు: గోల్కొండ, ఎర్రకోట, హంపి, చైనా వాల్ లాంటి కట్టడాల మన్నిక కోసం, పైన 2వ ప్రశ్నకు జవాబుగా నేను చెప్పిన డంగు సున్నంను వాటి నిర్మాణంలో వాడేవారు*. *అలాగే వాటి డిజైన్ కూడా ప్రత్యేకంగా ఉండేది. భారీ గ్రానైట్ రాళ్లను పజిల్ ముక్కలు ఒక దాన్లో ఒకటి అమరి పోయినట్టు tongue & groove పద్ధతిలో చెక్కేవారు. దానివల్ల, భూకంపాల వేళ, అవి ఒకదానితో ఒకటి కొద్దిగా కదులుతూ ఒత్తిడిని పంచుకుంటాయి. భూకంపం, ఆగిపోయాక తిరిగి యథాస్థితికి వస్తాయి*. *తంజావూరు బృహదీశ్వర ఆలయం నిర్మాణంలో అయితే: కింద shock absorber లా పని చేసే ఇసుక పొరలు, దానిమీద భారీరాళ్లతో ప్లాట్‌ఫారమ్ కట్టారు. ఆలయ గోపురానికి రూఫ్ లేకుండా, బోర్లించిన కప్పు ఆకారంలో 80 టన్నుల బరువున్న ఒకే ఒక్క భారీ రాయిని (ఏకశిలను) అమర్చారు. దానివల్ల కిందున్న రాళ్లపై విపరీతమైన ఒత్తిడి పడి, మధ్యలో ఎలాంటి సిమెంట్ లేకపోయినా రాళ్లు కదలకుండా స్థిరంగా ఉంటాయి*. *నిర్మాణంలో లోతైన రాతి పునాదులు, మందం పాటి గోడలు, విశాలమైన రాతి బ్లాకులు, గ్రానైట్ స్తంభాలను ఉపయోగించే వారు. తుప్పు పగుళ్ళకు కారణమైన ఇనుప రాడ్లను వీలైనంత వరకు వాడేవారు కాదు. అందుకే, ఆ కట్టడాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి.* *- డాక్టర్ VSN మూర్తి , IZIT* *డా. మూర్తి గారు, ఇండియా లోని పురాతన కట్టడాల గురించి మీరు చాలా సశాస్త్రీయమైన వివరణ ఇచ్చారు, అభినందనలు*. *చాలా మంది మీరన్నట్టు పక్షపాత ధోరణితో.. గతమంతా, వర్తమానం కన్నా గొప్పదని స్వమతాభినంతో మాట్లాడుతుంటారు. (అయితే గతంలో ఏమీ లేదని మనం అనలేము). కొందరు శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం కాల క్రమేణా మెరుగవుతోందని, అది సహజ పరిణామం అని గుర్తించకుండా.. గతంలో ఋషులు అతీబద్రియ శక్తులతో ఉండేవారని, అందుకే ఇప్పటికన్నా వారి పరిజ్ఞానం ఎక్కువని నమ్ముతారు. ప్రచారం చేస్తారు. అలాంటి వారి మాటలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు.* *'ఎంచి చూడగ మంచి అన్నది గతమున కొంచమేనోయ్.. మందగించక మున్ముందుకడుగు వేయవోయ్' అన్న గురజాడ గేయం సర్వదా స్మరణీయం*.. *గురజాడ గతంలో ఏమీ లేదని అనలేదు..* *కొంచమేనోయ్ అన్నాడు. అభ్యుదయ భావానికీ, చాందస వాదానికీ ఇక్కడే తేడా* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat