Ravi  Talluri
ShareChat
click to see wallet page
@91775
91775
Ravi Talluri
@91775
feelgood
#మన సంప్రదాయాలు సమాచారం వేరో ఏ ఇతర సామాగ్రి అలాంటి స్థితిలో ఉంటే ఎలా ఉండేవారు పబ్లిక్ ఊహించండి_*
మన సంప్రదాయాలు  సమాచారం - A truck carrying books fell and therel were no looters ! Apporently loorers don + redd and readers don + loot. A truck carrying books fell and therel were no looters ! Apporently loorers don + redd and readers don + loot. - ShareChat
*జనాభా లెక్కల స్వీయ గణన (Self Enumeration) – 2027..* * *📆 తేదీలు: ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు.....* * *ఇప్పుడు ప్రజలే తమ వివరాలను తామే నమోదు చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది! ఈ అవకాశాన్ని వినియోగించుకుని సులభంగా మీ కుటుంబ వివరాలను నమోదు చేసుకోండి.* *స్టెప్ బై స్టెప్ విధానం:* * *1 ఈ లింక్ ఓపెన్ చేయండి https://se.census.gov.in #మన సంప్రదాయాలు సమాచారం * * *2 Self Enumeration (HLO) Login వద్ద తెలంగాణ ఎంపిక చేసి, Captcha ఎంటర్ చేసి Verify & Proceed క్లిక్ చేయండి.* * *3 Welcome పేజీలో కుటుంబ పెద్ద పేరు, మొబైల్ నంబర్ నమోదు చేయండి.* * *4 ఒక కుటుంబానికి ఒకే మొబైల్ నంబర్ ఉపయోగించాలి. వచ్చిన OTP ఎంటర్ చేసి Verify & Proceed క్లిక్ చేయండి. తరువాత మీకు నచ్చిన భాషను ఎంచుకోండి.* * *5 మీ జిల్లా, పట్టణం/గ్రామం, పిన్ కోడ్ వివరాలు నమోదు చేయండి.* * *6 మొబైల్ లో Location ON చేసి, మీ ఇంటి వద్ద రెడ్ మార్క్ సెట్ చేయండి. 📍* * *7 ఇళ్ల వివరాలకు సంబంధించిన 33 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, Preview ద్వారా చెక్ చేసి Submit చేయండి.* * *8 Submit చేసిన తరువాత H తో ప్రారంభమయ్యే 11 అంకెల SE ID వస్తుంది. దాన్ని స్క్రీన్‌షాట్ లేదా నోట్ చేసుకుని భద్రపరచండి.* * *9 మే 11 తరువాత మీ ఇంటికి వచ్చే గణన అధికారికి ఈ SE ID చూపిస్తే వారు అప్రూవ్ చేస్తారు.*
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
Self-Enumeration (SE)
*1. ప్రశ్న: ఇండియాలో వేల ఏళ్ల క్రితం కట్టిన కోటలు/దేవాలయాలు ఇప్పటికీ బలంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు కట్టిన బిల్డింగులు 100 ఏళ్ళలోపే కుప్పకూలుతున్నాయి. అంత గొప్ప ఇంజనీర్లు ఇప్పుడెందుకు లేరు? జవాబు: మీ ప్రశ్నలో 'survivorship bias' ఉంది. అంటే, మీరు ఇప్పటికీ దృఢంగా ఉన్న కొన్ని పాతకట్టడాలను చూసి, “పాత నిర్మాణాలన్నీ గొప్పవి, Old is Gold' అని నిర్ణయానికి వచ్చారు. నిజానికి, చాలా పాత దేవాలయాలు, కోటలు, భవనాలు ఎన్నో కూలిపోయాయి. "అవి ఎందుకు కూలిపోయాయి?" అని అడక్కుండా, వాటిలో ఇప్పటికీ బలంగా ఉన్న బృహదీశ్వరాలయం, హంపి, కోణార్క్, ఎర్రకోట లాంటి అత్యుత్తమ కట్టడాలను, ఇటీవల కట్టిన మామూలు భవనాలతో పోలుస్తూ, పక్షపాత వైఖరితో నన్ను ప్రశ్న అడిగారు. ఆ నిర్మాణాలు ప్రజల మౌలిక సదుపాయాల కోసం కట్టినవి కావు. అవి రాజులు తమ వ్యక్తిగత భద్రత, కీర్తి, ప్రతిష్ట, అభిరుచి, ఉద్దేశం, లక్ష్యం, స్వార్థం లేదా మత పరమైన ఉద్దేశంతో ప్రజాధనం వెచ్చించి, పరిమితులు లేని బడ్జెట్'తో కట్టినవి. నిజానికి, ఆ కట్టడాలను నిర్మించిన ఇంజనీర్లు, ఇప్పటి ఇంజనీర్ల కన్నా గొప్పవారేం కాదు. ఇప్పుడున్న పరిజ్ఞానంతో, అవే కట్టడాలను అంతకన్నా ఎంతో మెరుగ్గా నిర్మించే సామర్థ్యమున్న ఇంజనీర్లు ఇప్పుడు మనకున్నారు.* *చెక్కు చెదరని ప్రాచీన కట్టడాలకు సంబంధించిన టెక్నాలజీ ఏమాటో ఇపుడు చూద్దాం*. *2. ప్రశ్న: ప్రాచీన కట్టడాలు ఏళ్ళ తరబడి వాతావరణ పరిస్థితులను తట్టుకోడానికి ఏ టెక్నాలజీ వాడేవారు? జవాబు: పైన నేను మొదటి ప్రశ్నకు జవాబులో చెప్పినట్టుగా*, *ప్రాచీన కట్టడాలు చాలా వరకూ కూలిపోయాయి. రాజులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కట్టిన కొన్ని మాత్రమే కాలానికి ఎదురొడ్డి నిలబడ్డాయి*. *దానికోసం అప్పటి నిర్మాణాల్లో ఒక రకమైన డంగు సున్నం (lime mortar) వాడేవారు. ఆ సున్నానికి, రాళ్ల మధ్య కాలక్రమంలో ఏర్పడే పగుళ్లను స్వయంగా పూడ్చుకోడం (self-healing), తేమను లోపల బంధించకుండా బయటకు వదలడం, శతాబ్దాలు గడిచే కొద్దీ మరింత గట్టిపడ్డం, వత్తిడిని తట్టుకోడం, భూకంపాలు వచ్చినా స్థిరంగా ఉండడం లాంటి ఎన్నో అద్భుత గుణాలున్నాయి*. *డంగు సున్నం ను ఎలా తయారుచేస్తారంటే*. *సముద్రపు గుల్లలు/ శంఖాలు/ అల్చిప్పలను పెద్దపెద్ద బట్టీలలో (Kilns) కాలిస్తే, అందులోంచి కార్బన్ డై ఆక్సైడ్ (CO2) బయటకుపోయి, పొడిసున్నం (quick lime) మిగులుతుంది. దానికి కొంచెం నీళ్లు కలిపితే, బుసబుసలాడుతూ పేస్టులా మారుతుంది. (తమలపాకుల్లో వాడేది ఇదే). దానికి కొంత ఇసుక, బెల్లం, కరక్కాయ, గుడ్లు కలిపి గానుగలో తిప్పితే 'డంగు సున్నం' వస్తుంది. అంతేకాకుండా, ప్రతి కట్టడానికి ఒక ప్రత్యేక శైలి, డిజైను ఉండేది*. *దాని గురించి కింద 3వ ప్రశ్నకు జవాబుగా వివరించాను...* *3. ప్రశ్న: పాత కట్టడాలు వందల ఏళ్లకు పైగా చెక్కు చెదరకుండా ఉండడానికి ఎలాంటి డిజైన్లు వాడేవారు* *జవాబు: గోల్కొండ, ఎర్రకోట, హంపి, చైనా వాల్ లాంటి కట్టడాల మన్నిక కోసం, పైన 2వ ప్రశ్నకు జవాబుగా నేను చెప్పిన డంగు సున్నంను వాటి నిర్మాణంలో వాడేవారు*. *అలాగే వాటి డిజైన్ కూడా ప్రత్యేకంగా ఉండేది. భారీ గ్రానైట్ రాళ్లను పజిల్ ముక్కలు ఒక దాన్లో ఒకటి అమరి పోయినట్టు tongue & groove పద్ధతిలో చెక్కేవారు. దానివల్ల, భూకంపాల వేళ, అవి ఒకదానితో ఒకటి కొద్దిగా కదులుతూ ఒత్తిడిని పంచుకుంటాయి. భూకంపం, ఆగిపోయాక తిరిగి యథాస్థితికి వస్తాయి*. *తంజావూరు బృహదీశ్వర ఆలయం నిర్మాణంలో అయితే: కింద shock absorber లా పని చేసే ఇసుక పొరలు, దానిమీద భారీరాళ్లతో ప్లాట్‌ఫారమ్ కట్టారు. ఆలయ గోపురానికి రూఫ్ లేకుండా, బోర్లించిన కప్పు ఆకారంలో 80 టన్నుల బరువున్న ఒకే ఒక్క భారీ రాయిని (ఏకశిలను) అమర్చారు. దానివల్ల కిందున్న రాళ్లపై విపరీతమైన ఒత్తిడి పడి, మధ్యలో ఎలాంటి సిమెంట్ లేకపోయినా రాళ్లు కదలకుండా స్థిరంగా ఉంటాయి*. *నిర్మాణంలో లోతైన రాతి పునాదులు, మందం పాటి గోడలు, విశాలమైన రాతి బ్లాకులు, గ్రానైట్ స్తంభాలను ఉపయోగించే వారు. తుప్పు పగుళ్ళకు కారణమైన ఇనుప రాడ్లను వీలైనంత వరకు వాడేవారు కాదు. అందుకే, ఆ కట్టడాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి.* *- డాక్టర్ VSN మూర్తి , IZIT* *డా. మూర్తి గారు, ఇండియా లోని పురాతన కట్టడాల గురించి మీరు చాలా సశాస్త్రీయమైన వివరణ ఇచ్చారు, అభినందనలు*. *చాలా మంది మీరన్నట్టు పక్షపాత ధోరణితో.. గతమంతా, వర్తమానం కన్నా గొప్పదని స్వమతాభినంతో మాట్లాడుతుంటారు. (అయితే గతంలో ఏమీ లేదని మనం అనలేము). కొందరు శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం కాల క్రమేణా మెరుగవుతోందని, అది సహజ పరిణామం అని గుర్తించకుండా.. గతంలో ఋషులు అతీబద్రియ శక్తులతో ఉండేవారని, అందుకే ఇప్పటికన్నా వారి పరిజ్ఞానం ఎక్కువని నమ్ముతారు. ప్రచారం చేస్తారు. అలాంటి వారి మాటలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు.* *'ఎంచి చూడగ మంచి అన్నది గతమున కొంచమేనోయ్.. మందగించక మున్ముందుకడుగు వేయవోయ్' అన్న గురజాడ గేయం సర్వదా స్మరణీయం*.. *గురజాడ గతంలో ఏమీ లేదని అనలేదు..* *కొంచమేనోయ్ అన్నాడు. అభ్యుదయ భావానికీ, చాందస వాదానికీ ఇక్కడే తేడా* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
*_ఆంధ్రప్రదేశ్ చరిత్రను చదవాలనే ఆసక్తితో చరిత్ర పుస్తకాలు తిరగేస్తూ వెళ్తే, రెండు మూడు చారిత్రిక ఘట్టాలు నాకు చాలా ఆసక్తిగా అనిపిస్తాయి. అవే, తళ్ళికోట యుద్ధం, బొబ్బిలి యుద్ధం, శ్రీరంగపట్నం ఒడంబడిక (Treaty of Seringapatam). వీటిలో తళ్ళికోట యుద్ధం గురించి వచ్చిన సాహిత్యం ఎంతో ఉంది. కన్నడ నుంచి అనువాదం చేసిన పుస్తకాలు కానీ, తెలుగులో రాసిన కథలు కానీ చాలానే ఉన్నాయి. ఎన్ని వచ్చినా, ఎన్ని విధాలుగా ఆ చరిత్రను చదివినా, ఇంకా చదవాలనిపిస్తూనే ఉంటుంది. ఆ జాబితాలోనిదే బండి నారాయణ స్వామి గారు రాసిన చారిత్రక నవల ‘కడపటి యుద్ధం’ పుస్తకం కూడా ఒకటి_*. *_కథను స్థూలంగా పరిచయం చేసుకుంటే, శ్రీకృష్ణదేవరాయల అల్లుడైన ఆరవీటి రామరాయలు విజయనగర పాలన మొదలుపెట్టినప్పటి నుంచి, తళ్ళికోట యుద్ధంలో రామరాయల వీరమరణం వరకు జరిగిన చారిత్రక పరిణామాలను ప్రామాణికంగా తీసుకొని, అప్పటి సమాజపు పోకడలు, ఆహార అలవాట్లు, సంప్రదాయాలు వంటి ఎన్నో అంశాలను స్పృశిస్తూ రాసిన రచన_*. *_దాదాపు 600 పేజీలలో, విజయనగర సామ్రాజ్యపు సమాజాన్ని పరిచయం చేయడమే కాకుండా, తళ్ళికోట యుద్ధానికి ముందు ఉన్న పరిస్థితులను వివరించిన నవల. పంచ పాదుషాలు ఏకమై అళియ రామరాజుపై యుద్ధం ఎందుకు ప్రకటించారు? ఇద్దరు పాదుషాలు అళియ రామరాజుకి పుత్ర సమానులు. మిగిలిన వారికి అవసరమైనప్పుడు సహాయం కూడా చేశాడు. అయినా కూడా ఎందుకు విజయనగర సామ్రాజ్యం మీద యుద్ధం చేశారు? దక్షిణ భారతదేశం మీద ఆధిపత్యం కోసమా? లేదా తమ మత ప్రచారం కోసమా? అనే ప్రశ్నలకు రచయిత తనదైన శైలిలో సమాధానం ఈ నవల ద్వారా ఇచ్చారు._* *_ఇది కేవలం రాజుల కథ కాదు. విజయనగర సామ్రాజ్యంలో వివిధ వర్గాల ప్రజల కథ. శ్రీవైష్ణవాన్ని నమ్ముకొని జీవితమంతా దైవం కోసం అర్పించిన ఉత్తణ్ణ, పంచముల్లో పుట్టినా దుర్గాధిపతిగా ఎదిగినా, కేవలం కులం కారణంగా తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయిన రెండుకత్తుల హంసణ్ణ, యవ్వనాన్ని తనివితీరా అనుభవించే తెలుగుల మాధవుడు, వేశ్య రత్నమాలను మనసారా ప్రేమించిన వ్యాపారి టిట్టిభ శెట్టి... ఒకటా, రెండా, దాదాపు అరవై పాత్రలు ఉన్నా కూడా ప్రతి పాత్రనీ గుర్తుపెట్టుకునే విధంగా రచన ఉంటుంది_*. *_నవల ప్రారంభంలో గుర్రంపై ప్రయాణిస్తున్న ఆ వేగు, హంపీ సరిహద్దు నుంచి రాజధానిలో ప్రవేశించడం, అంతఃపురాన్ని చేరుకోవడం, అళియ రామరాజుని దర్శించడం వరకు ఉండే వర్ణనలతో, హంపి రాజధాని ఎలాంటిదో మనకు ఒక అవగాహన రావడమే కాకుండా, మనం ఎలాంటి పుస్తకం చదువుతున్నామో కూడా అర్థం అవుతుంది. రచనా శైలి ఎంత సులువుగా ఉందంటే, మనం ఒక 600 పేజీల పుస్తకం చదువుతున్నామనే భావన ఎక్కడా కలగలేదు._* *_చరిత్రను ఒక్కొక్కరు తమకు నచ్చిన విధంగా విశ్లేషించే అవకాశం ఉంది. ఈ నవలలో కూడా కొన్ని కొన్ని వాక్యాలు చదివినప్పుడు, విజయనగర సామ్రాజ్యం మీద దాడిలో కేవలం రాజ్యకాంక్ష మాత్రమే కాకుండా మత కోణం కూడా ఉందనే ప్రతిపాదన కనిపిస్తుంది_*. *_‘కడపటి యుద్ధం’ అనే టైటిల్ పెట్టడం వల్ల ఇది కేవలం యుద్ధం చుట్టూ ఉంటుంది అనే అపోహ ఉండవచ్చు. అలా కాకుండా మొదటి పేజీలో పెట్టిన ‘మహాజనుల హంపి’ అనే పేరునే ఉంచినట్లయితే, నవలలో పేర్కొన్న అంశాలకు సరిగ్గా సరిపోతుంది అనిపించింది. అలానే చారిత్రక ఘట్టాలను ప్రస్తావించినప్పుడు సంవత్సరాలను కూడా ప్రస్తావించినట్లయితే మరింత బాగుండేది అనిపించింది_*. *_Historical Fiction ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా చదవాల్సిన రచన ఇది. అలానే హంపి అంటే, విజయనగర సామ్రాజ్యం అంటే ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా చదవడానికి ఇది ఒక మంచి ఎంపిక అవుతుంది_*. *_ఈ పుస్తకం అమెజాన్ లో దొరుకుతుంది._* *_ధర :700/-_* *_పేజీలు : 590_* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ఆదిహిందూ చారిత్రక నవల . యుద్ధం కదపటి బండి నారాయణ స్వామి @@ 41Pw ఆదిహిందూ చారిత్రక నవల . యుద్ధం కదపటి బండి నారాయణ స్వామి @@ 41Pw - ShareChat
*_మోరింగా (మునగ) గింజల నుండి తయారు చేసిన ఒక సహజ ఎక్స్‌ట్రాక్ట్ త్రాగునీటిలోని మైక్రోప్లాస్టిక్స్‌ను తొలగించడంలో ప్రస్తుతం నీటి శుద్ధి కేంద్రాల్లో ఉపయోగిస్తున్న పారిశ్రామిక రసాయనాలంతే ప్రభావవంతంగా ఉందని, అలాగే మరింత క్షార (ఆల్కలైన్) గల నీటిలో ఇది ఇంకా మెరుగ్గా పనిచేస్తుందని గుర్తించారు_*. *_బ్రెజిల్‌లోని సావో పాలో స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ACS Omega పత్రికలో ప్రచురించిన పరిశోధన ప్రకారం, మోరింగా గింజలతో ఒక సులభమైన ఉప్పు ద్రావణం (సాలైన్ ఎక్స్‌ట్రాక్ట్) ఇంట్లో లేదా చిన్న సముదాయాల్లోనే తయారు చేసి, మైక్రోప్లాస్టిక్ కణాలను ఒకచోట చేర్చి నీటిలో నుంచి వడపోసి తొలగించవచ్చు_*. *_మైక్రోప్లాస్టిక్స్‌కు నెగటివ్ ఎలక్ట్రికల్ ఛార్జ్ ఉండటం వల్ల అవి ఒకదానిని ఒకటి తోసుకుంటూ సాధారణ ఫిల్టర్ల ద్వారా బయటకు వెళ్లిపోతాయి. కానీ మోరింగా ఎక్స్‌ట్రాక్ట్ ఈ ఛార్జ్‌ను తగ్గించి, ఆ కణాలు గుంపుగా చేరేలా చేసి వాటిని తొలగించడానికి సహాయపడుతుంది_*. *_ఈ ఆవిష్కరణ గ్రామీణ ప్రాంతాలు మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని చిన్న సముదాయాలకు ఎంతో ముఖ్యమైనది, ఎందుకంటే అక్కడ పారిశ్రామిక నీటి శుద్ధి రసాయనాలు అందుబాటులో లేకపోవచ్చు లేదా ఖరీదైనవిగా ఉండవచ్చు_.* *_శాస్త్రవేత్తలు ఇంకా చెప్పినదేమిటంటే, ప్రస్తుతం ఉపయోగిస్తున్న పారిశ్రామిక రసాయనాలు బయోడిగ్రేడబుల్ కావు, శుద్ధి చేసిన నీటిలో విషపూరిత అవశేషాలు మిగిలే అవకాశం ఉంది, అలాగే వాటిపై నియంత్రణలు కూడా పెరుగుతున్నాయి_*. *_ఇది ప్రయోగశాల స్థాయిలో చేసిన అధ్యయనం మాత్రమే, కాబట్టి దీన్ని విస్తృతంగా ఉపయోగించడానికి ముందు మరింత పెద్ద స్థాయి పరీక్షలు అవసరం_*. *_ప్రపంచవ్యాప్తంగా త్రాగునీటి సరఫరాల్లో, శుద్ధి చేసిన ట్యాప్ వాటర్‌లో కూడా మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని మీరు తెలుసా?_* *ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే పంచబడింది.* *మూలం:ACS Omega — సావో* *పాలో స్టేట్ యూనివర్సిటీ, బ్రెజిల్, 2026,_* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - మోరింగా (మునగ) గింజల నుండి తయారు ఎక్స్ట్రాక్ట్ త్రాగునీటిలోని చేసిన ఒక సహజ మైకోప్లాస్టిక్స్ను తొలగిస్తుంది మోరింగా (మునగ) గింజల నుండి తయారు ఎక్స్ట్రాక్ట్ త్రాగునీటిలోని చేసిన ఒక సహజ మైకోప్లాస్టిక్స్ను తొలగిస్తుంది - ShareChat
*_ప్రపంచాన్ని వణికిస్తున్న 'సూపర్ ఎల్-నినో '_* *_మన చుట్టూ ఉన్న పర్యావరణంలో అతి త్వరలో ఊహకందని పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయా?_* *_దాదాపు 150 ఏళ్ల క్రితం ప్రపంచ జనాభాలో కోట్లాది మందిని బలితీసుకున్న ఆ 'చీకటి రోజులు' మళ్లీ రాబోతున్నాయా? అవునంటున్నాయి.. వాతావరణ శాస్త్రవేత్తల తాజా హెచ్చరికలు. ఈ ఏడాది (2026)లో సంభవిచబోయే ‘సూపర్ ఎల్ నినో' కేవలం ఉష్ణోగ్రతలను పెంచడమే కాదు, గ్లోబల్ ఎకానమీని కూడా కుదిపేసే అవకాశం పుష్కలంగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే భారత్ ఈ ముప్పును ఎలా ఎదుర్కోబోతోంది? పసిఫిక్ సముద్రపు వెనుక దాగి ఉన్న ఆ నిగూఢ వాతావరణ రహస్యాలపై ప్రత్యేక విశ్లేషణ_*. *ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్త ర్యాన్ మ్యూ (Ryan Maue) 2026లో అత్యంత శక్తివంతమైన 'ఎల్ నినో' (El Niño) ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనిని 1877లో సంభవించిన భయంకరమైన ఎల్ నినోతో పోలుస్తున్నారు*. *ఆనాడు ప్రపంచవ్యాప్తంగా కరువుకాటకాలు వచ్చి, సుమారు మూడు నుండి 4 శాతం జనాభా మరణించినట్లు రికార్డులు చెబుతున్నాయి. తాజా విశ్లేషణల ప్రకారం 2026లో కూడా అలాంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.* *_ఎల్ నినో అంటే ఏమిటి?_* *ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్ర ఉపరితల నీరు అసాధారణంగా వేడెక్కే ప్రక్రియ. దీనివల్ల ప్రపంచవ్యాప్త గాలి దిశలు, వర్షపాత పద్ధతుల్లో పెను మార్పులు సంభవిస్తాయి. సాధారణంగా ఎల్ నినో సమయంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వర్షాలు తగ్గి, కరువు పరిస్థితులు ఏర్పడతాయి. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) ఏప్రిల్ 2026 నివేదిక ప్రకారం, ప్రస్తుతం తటస్థంగా ఉన్న పరిస్థితులు మే-జూలై నాటికి ఎల్ నినోగా మారే అవకాశం 61 శాతం మేరకు కనిపిస్తున్నాయి.* *_2026 అంచనాలు: రికార్డు స్థాయి వేడి_* *ప్రస్తుత అంచనా వివరాల ప్రకారం ఈసారి ఎల్ నినో తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం (25 శాతం) వరకు ఉంది. అక్టోబర్ 2026 నాటి ఉష్ణోగ్రతల మ్యాప్ లను గమనిస్తే, ముఖ్యంగా ఉత్తరార్ధ గోళంలో (Northern Hemisphere) సగటు కంటే ఎక్కువ వేడి నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా పంటలపై, వాతావరణంపై తీవ్ర ప్రభావం పడి, గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉంది*. *_1877-2026 మధ్య వ్యత్యాసం_* *1877-78 కాలంలో వచ్చిన ఎల్ నినో సమయంలో సరైన సాగునీటి సౌకర్యాలు, వాతావరణ ముందస్తు హెచ్చరికలు లేకపోవడం వల్ల కోట్లాది మంది ఆకలితో మరణించారు*. *అయితే 2026లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండనుంది. ఆధునిక నీటిపారుదల వ్యవస్థలు, వాతావరణాన్ని తట్టుకునే విత్తన రకాలు, ప్రభుత్వాల అప్రమత్తత వల్ల ప్రాణనష్టం జరిగే అవకాశం చాలా తక్కువ. 1877లో జరిగింది.. మానవ తప్పిదాల వల్ల సంభవించిన విపత్తు అయితే, 2026లో వాతావరణ పరమైన సవాళ్లు ప్రపంచాన్ని వెంటాడనున్నాయి*. *_భారతదేశంలో ఏం జరగనుంది?_* *భారతదేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక వంటి వర్షాధారిత ప్రాంతాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. అయితే, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మెరుగైన సాగునీటి ప్రాజెక్టులు ఉండటం వల్ల కొంత ఊరట లభించనుంది. ఎల్ నినో ప్రభావంతో రుతుపవనాలు బలహీనపడితే ఆహార ధరలు పెరగడం, గ్రామీణ పరపతి రంగంపై ఒత్తిడి పడటం వంటి ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.* *ఆర్థిక వ్యవస్థపై ప్రభావం* *ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో కేవలం ఆహార సంక్షోభమే కాకుండా, విపరీతమైన హీట్ వేవ్ లు(వడగాల్పులు), తుపానులు, ఆకస్మిక వరదలకు కారణం కావచ్చు. ఇది గ్లోబల్ సప్లై చైన్ పై ప్రభావం చూపి, ఆర్థిక అస్థిరతకు దారితీయవచ్చు. ఏదిఏమైనప్పటికీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ దేశాలు ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయని, ఆకలి చావుల వంటివి సంభవించే అవకాశం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.* *_సేకరణ...._* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - 0 50 50 40 40 30 30 २० 10 २० 0 ళ్లీ 1877 భయానక మ 2[]= =20 ಏರಿಸಥಿಯುಲು? 0 50 50 40 40 30 30 २० 10 २० 0 ళ్లీ 1877 భయానక మ 2[]= =20 ಏರಿಸಥಿಯುಲು? - ShareChat
*_లెన్స్‌కార్ట్ (Lenskart) మరియు ఇతర భారతీయ స్టార్టప్ కంపెనీల వెనుక ఉన్న చేదు నిజం!_* *_"భారతీయుల కోసం" అనే మాట వెనుక దాగిన మార్కెటింగ్ మాయాజాలం ఏమిటో తెలుసుకోండి..._* *_చదవండి, ఆలోచించండి మరియు షేర్ చేయండి._* *_​లెన్స్‌కార్ట్ (Lenskart) మీ బొట్టును గౌరవించలేదు._* *_అది మీపై ఉన్న ద్వేషం వల్ల కాదు._* *_వారు అక్షరాలా ఆ సాహసం చేయలేరు కాబట్టి._* *_దానికి అసలు కారణం ఏంటో నేను మీకు స్పష్టంగా చూపిస్తాను._* *_​పియూష్ బన్సాల్ ఇలా ట్వీట్ చేశారు:_* *_"మేము గర్వంగా భారత్‌లో, భారతీయుల కోసం నిర్మించబడ్డాము."_* *_​చాలా అందమైన వాక్యం. కానీ ఇది ఒక పచ్చి అబద్ధం._* *_​ముందుగా ఫ్యాక్టరీ గురించి మాట్లాడుకుందాం_*. *_లెన్స్‌కార్ట్ ఇండియా ప్లాంట్ 2023లో ప్రారంభమైంది_*. *_అంతకు ముందు, చైనాతో జాయింట్ వెంచర్ (JV) ఉండేది._* *_ఆ JV ఇప్పటికీ నడుస్తోంది._* *_​ఫ్రేమ్‌లు. ముడి సరుకులు. సరఫరా వ్యవస్థ (Supply chain)._* *_ఇవన్నీ చైనా నుండే వస్తాయి._* *_భారతీయ ఫ్యాక్టరీలో ఎక్కువగా కేవలం అసెంబ్లింగ్ మాత్రమే జరుగుతుంది_*. *_​ఇప్పుడు ఈ "భారతీయ" కంపెనీకి యజమానులు ఎవరో చూద్దాం:_* *_పియూష్ బన్సాల్: 10.28%_* *_నేహా బన్సాల్:_7.74%_* *_అమిత్ చౌదరి: 0.98%_* *_సుమీత్ కపాహి: 0.96%_* *_​నలుగురు వ్యవస్థాపకుల వాటా కలిపితే: 20%_*. *_​మరి మిగిలిన 80% వాటా ఎవరిది?_* *_సాఫ్ట్‌బ్యాంక్_* *_(SoftBank): జపాన్_* *_టెమాసెక్ (Temasek):_* *_సింగపూర్_* *_ADIA: అబుదాబి_* *_KKR: న్యూయార్క్_* *_ఫిడెలిటీ (Fidelity): బోస్టన్_* *_​ఇక్కడ మీకు ఎవరూ చెప్పని నిజం ఒకటి ఉంది._* *_ప్రతి విదేశీ పెట్టుబడిదారుడు ఒక చెక్ రాసే ముందు ESG నిబంధనలను కచ్చితంగా పర్యవేక్షిస్తాడు._* *_​ESG అంటే ఎన్విరాన్‌మెంటల్ (Environmental), సోషల్ (Social), మరియు గవర్నెన్స్ (Governance)._* *_వాస్తవానికి ఈ స్కోరింగ్ వ్యవస్థకు పర్యావరణంతో ఎలాంటి సంబంధం లేదు. ఇది న్యూయార్క్ మరియు ఆమ్‌స్టర్‌డామ్‌లలో రూపొందించబడింది. ఎవరికి పెట్టుబడి రావాలో ఇదే నిర్ణయిస్తుంది_*. *_​ఈ ESG లోపల మరో జంతువు ఉంటుంది. దాని పేరే DEI._* *_(Diversity, Equity, Inclusion - వైవిధ్యం, సమానత్వం, సమ్మిళితం)_.* *_​DEI అమెరికాలో డిజైన్ చేయబడింది. అమెరికా దేశపు సమస్యలు, నల్లజాతీయుల (Black minorities) హక్కులు, లింగ వివక్ష పోరాటాలు, LGBTQ హక్కుల ఆధారంగా ఇది నిర్మించబడింది._* *_ఇది భారతదేశం కోసం ఎన్నడూ రూపొందించబడలేదు. దీనికి భారతదేశం గురించి అసలు అర్థమే కాదు_*. *_​ఈ DEI స్కోరింగ్ ప్రకారం "పాజిటివ్" అనిపించుకునే అంశాలు ఇవే:_* *_పని ప్రదేశంలో హిజాబ్ (Hijab) = పాజిటివ్ సిగ్నల్._* *_పని ప్రదేశంలో టర్బన్ (Turban) = పాజిటివ్ సిగ్నల్._* *_​అదే DEI దృష్టిలో "రిస్క్" (ప్రమాదం) అనిపించేవి ఏంటో తెలుసా?_* *బొట్టు (బిందీ) = మెజారిటీ మత చిహ్నం*. *తిలకం = మెజారిటీ మత చిహ్నం.* *కలావా (చేతికి కట్టే పవిత్ర దారం) = మెజారిటీ మత చిహ్నం*. *​పాశ్చాత్యుల DEI లాజిక్ ప్రకారం, మెజారిటీ వర్గం ఎప్పుడూ అణచివేసే స్థానంలో (Oppressor) ఉంటుంది. కాబట్టి మెజారిటీకి ఎలాంటి రక్షణ అవసరం లేదు.* *​కాబట్టి, లెన్స్‌కార్ట్ (Lenskart) HR ఒక 'గ్రూమింగ్ పాలసీ' (అలంకరణ నియమాలు) రాస్తున్నప్పుడు, వారు దానిని మీ కోసం రాయడం లేదు. వారు తమ వలసవాద యజమానుల (పాశ్చాత్య పెట్టుబడిదారుల) కోసం రాస్తున్నారు*. *​ఎందుకంటే లెన్స్‌కార్ట్ ఇప్పుడు $10 బిలియన్ డాలర్ల IPO కోసం వేటాడుతోంది. ఆ నంబర్‌లో మీ 'బొట్టు'కి ఎక్కడైనా స్థానం ఉందా?* *​వారి మొదటి కస్టమర్ మీరు కాదు*. *వారి మొదటి కస్టమర్ సాఫ్ట్‌బ్యాంక్ (SoftBank).* *వారి మొదటి కస్టమర్ ADIA.* *వారి మొదటి కస్టమర్ ఆమ్‌స్టర్‌డామ్‌లోని ఒక ESG ఏజెన్సీ*. *​మీరు ఒక కళ్లజోడు కొంటారు. వారు $500 మిలియన్లు పెట్టుబడిగా పెడతారు.* *ఇప్పుడు లెన్స్‌కార్ట్ ఎవరి మాట వింటుందో మీరే లెక్క వేసుకోండి.* *​ఇకపోతే ప్రభుత్వం. వాళ్ళకి ఇవేమీ తెలియవని మీరు అనుకుంటున్నారా?* *వాళ్ళకి అన్నీ తెలుసు. విదేశీ పెట్టుబడులు మన నాగరికత మరియు సాంస్కృతిక గుర్తింపును ఎలా చెరిపేస్తాయో ప్రతి మంత్రిత్వ శాఖకూ బాగా తెలుసు.* *​సెబీ (SEBI) వారి DRHP ని ఆమోదించింది. హిందూ గుర్తింపును కాపాడే ఒక్క నిబంధన కూడా అందులో లేదు*. *ఎందుకంటే ప్రభుత్వానికి కూడా IPO కావాలి. GST, పన్నులు (Tax), ఆర్థిక వృద్ధి వార్తలు కావాలి*. *ఆ సమీకరణంలో మీ కలావా / కడా కి చోటు లేదు.* *​ఇది కేవలం ఒక లెన్స్‌కార్ట్ సమస్య మాత్రమే కాదు. ఇది భారతదేశంలోని ప్రతి యూనికార్న్ (Unicorn) కంపెనీ సమస్య*. *స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato), ఓలా (Ola), మీషో (Meesho), జెప్టో (Zepto)...* *మీరు కావాలంటే వారి క్యాప్ టేబుల్స్ (Cap tables) చెక్ చేయండి. వాళ్ళ ESG నివేదికలు చూడండి. వాళ్ళ HR ఫోల్డర్లలోని గ్రూమింగ్ పాలసీలను చదవండి*. *​60-80% విదేశీ పెట్టుబడులతో నడిచే ప్రతి కంపెనీ, పాశ్చాత్య విలువల ప్రచారానికి ఒక బ్రాంచ్ ఆఫీస్ మాత్రమే*. *​"Built in Bharat" (భారత్‌లో నిర్మించబడింది) అనేది కేవలం ఒక ట్యాగ్‌లైన్*. *"For Indians" (భారతీయుల కోసం) అనేది ఒక మార్కెటింగ్ క్యాంపెయిన్.* *కానీ వారు ఎవరికి సేవ చేస్తున్నారో వారి పాలసీ డాక్యుమెంట్ మాత్రమే నిజం చెబుతుంది*. *​మీ బొట్టు.* *మీ కలావా.* *మీ కడా.* *మీ 5,000 సంవత్సరాల ఘన చరిత్ర.* *IPO వెనక పరుగులు తీసే ఈ బిలియనీర్లకు ఇవన్నీ ఏమాత్రం అవసరం లేదు*. *​కానీ మైనారిటీల బుజ్జగింపు? అది మాత్రం ఆమ్‌స్టర్‌డామ్‌లో వారికి మంచి పాయింట్స్ (స్కోర్) తెచ్చిపెడుతుంది*. *​మళ్ళీ మనం మనల్ని మనం ఒక "స్వతంత్ర దేశం" అని గర్వంగా పిలుచుకుంటాం.* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - BUILT IN BHARAT? CONTROLLED BY FOREICN ESC CAPITAL. COMPLIANCE TESLR ৪UEI KKR ESG FIDELIT ADIA SOFTB ANK   4 BINII HIAB .0 TURBA M ENNIRONMENTAL HI?L ١٥٢ ٥ URITV RISK SUSTAINABILIT Y| DIVEIIU RELItIDNMARKER -15 2 S1U BILLIIN IPO TRICK -[6]0 $500| IIIESEIIEIT BUILT IN BHARAT FOR INDIANS eriskort BUILT IN BHARAT? CONTROLLED BY FOREICN ESC CAPITAL. COMPLIANCE TESLR ৪UEI KKR ESG FIDELIT ADIA SOFTB ANK   4 BINII HIAB .0 TURBA M ENNIRONMENTAL HI?L ١٥٢ ٥ URITV RISK SUSTAINABILIT Y| DIVEIIU RELItIDNMARKER -15 2 S1U BILLIIN IPO TRICK -[6]0 $500| IIIESEIIEIT BUILT IN BHARAT FOR INDIANS eriskort - ShareChat
*_VAISAKHA PURANAM -- 09_* *_వైశాఖ పురాణం - 9వ అధ్యాయము -_* *_పిశాచ మోక్షము_* *పూర్వము రేవానదీ తీరమున మా తండ్రిగారు మృతినంది పిశాచ రూపమునందెను*. *ఆకలి దప్పికల వలన బాధపడుచు తన మాంసమునే తినుచు శుష్కించిన శరీరముతో నీడలేని బూరుగ చెట్టు వద్ద నివసించుచుండెను. పూర్వము చేసిన పాపముల వలన, ఆకలి దప్పికలచేత బాధపడుచున్న వాని కంఠమున సన్నని రంధ్రమేర్పడినది. అది గాయమై మిక్కిలి బాధించుచుండెను*. *దగ్గరనున్న చెరువులోని చల్లని నీరు కూడ త్రాగగనే కాలకూట విషమువలె బాధించుచుండెను. నేను గంగాయాత్ర చేయవలయునను కోరికతో ప్రయాణము చేయుచు దైవికముగ నా ప్రదేశమునకు వచ్చితిని. నీడలేని బూరుగు చెట్టుపైనుండి ఆకలిదప్పికల బాధను భరింపలెక తన మాంసమునే తినుచు దుఃఖభారమున కంఠబాధ ననుభవింపలేక అరచుచున్న ఆ పిశాచమును జూచి అబ్బురపడితిని.* *ఇదేమి యద్భుతమా యని అనుకొంటిని*. *పిశాచరూపమున నున్న అతడు నన్ను జూచి చంపవచ్చెను.* *కాని నా ధార్మిక ప్రవర్తనా బలము వలన నన్నేమియు చేయజాలకపోయెను. నేనును వానిని జూచి జాలిపడి ఓయీ భయపడకుము. నీకు నావలన నేభయమును రాదు. నీవెవరవు నీకిట్టి బాధ కలుగుటకు కారణమేమి? వెంటనే చెప్పుము. నిన్నీ కష్టముండి విడిపింతునని పలికితిని. నేనతని పుత్రుడనని యతడు గుర్తింపలేదు. నేనును నా తండ్రియని గుర్తింప లేకపోతిని.* *అప్పుడా పిశాచ రూపమున నున్న యతడిట్లు పలికెను. నేను భూవరమను పట్టణమున వసించు మైత్రుడనువాడను. సంకృతి గోత్రమువాడను*. *అన్ని విద్యలను నేర్చినవాడను. అన్ని తీర్థములయందు స్నానము చేసినవాడను.* *సర్వదేవతలను సేవించినవాడను*. *కాని నేను వైశాఖమాసమున కూడ అన్నదానమెవరికిని చేయలేదు. లోభము కలిగియుంటిని ఆ కాలమున వచ్చిన వారికిని భిక్షమునైన యీయలేదు. కావున నాకీ పిశాచ రూపము వచ్చినది. ఇదియే నా యీ దురవస్థకు కారణము.* *శ్రుతదేవుడను పుత్రుడు నాకు కలడు. అతడు ప్రసిద్దికలవాడు. వైశాఖమున గూడ అన్నదానము చేయకపోవుటచే నేనిట్లు పిశాచరూపము నందితిననియు, నేనిట్లు బాధపడుచున్నానియు వానికి చెప్పవలయును. నీ తండ్రి నర్మదా తీరమున పిశాచమై యున్నాడు. సద్గతిని పొందలేదు. బూరుగు చెట్టుపై నున్నాడు.* *తన మాంసమును తానే తినుచు బాధపడుచున్నాడని చెప్పుము*. *వైశాఖమాసమున వ్రతమును పాటించుచు నాకు జలతర్పణము నిచ్చి సద్బ్రాహ్మణునకు అన్నదానము చేసినచో నేనీ బాధనుండి విడిపోయి శ్రీమహావిష్ణు సాన్నిధ్యమునందుదును. కావున ఆ విధముగ చేయుమని వానికి చెప్పుము. నాయందు దయయుంచి నాకీ సాయమును చేయుము. నీకు సర్వశుభములు కలుగునని చెప్పుము*. *అనుచు నా పిశాచము పలికెను.* *నేను నా తండ్రిని గుర్తించి వాని పాదములకు నమస్కరించి దుఃఖ పీడితుడనై చిరకాలముంటిని. నన్ను నేను నిందించుకొంటిని.* *కన్నీరు విడుచుచుంటిని. తండ్రీ నేనే శ్రుతదేవుడను.* *దైవికముగ నిచటకు వచ్చినవాడను.* *తండ్రీ! యెన్ని కర్మలను చేసినను పితృదేవతలకు సద్గతిని కలిగింపనిచో ఆ కర్మలు వ్యర్థములు నిరర్థకములు. నీకీ బాధనుండి విముక్తి కలుగుటకు నేనేమి చేయవలయునో చెప్పుమని ప్రార్థించితిని*. *అప్పుడు నా తండ్రియు నన్ను గుర్తించి మరింత దుఃఖించెను. కొంత సేపటికి ఊరడిల్లి మనసు కుదుటపరచుకొని యిట్లనెను. నాయనా! నీవు తలచిన యాత్రలను పూర్తిచేసికొని యింటికి పొమ్ము*. *సూర్యుడు మేషరాశియందుండగా, వైశాఖ పూజను చేసి అన్నమును శ్రీమహావిష్ణువునకు నివేదించి ఉత్తమ బ్రాహ్మణునకు దానమిమ్ము*. *అందువలన నాకే కాదు మనవంశము వారందరికిని ముక్తి కలుగును. కావున అట్లు చేయుమని చెప్పెను.* *నేనును నా తండ్రి యజ్ఞననుసరించి యాత్రలను చేసి నా యింటికి తిరిగి వచ్చితిని.* *మాధవునకు ప్రీతికరమైన వైశాఖమాసమున వైశాఖవ్రతమును చేయుచు నా తండ్రి చెప్పినట్లుగ శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన యన్నమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చితిని*. *అందువలన నా తండ్రి పిశాచ రూపమునుండి విముక్తుడై నా యొద్దకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి యాశీర్వదించి దివ్య విమానమునెక్కి విష్ణులోకమును చేరి యచట శాశ్వత స్థితినందెను*. *కావున అన్నదానము అన్ని దానములలో ఉత్తమము*. *శాస్త్రములయందును యిదియే చెప్పబడినది*. *ధర్మయుక్తమైనది. సర్వధర్మసారమే అన్నదానము. మహారాజా! నీకింకేమి కావలయునో అడుగుము చెప్పెదనని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు వివరించెను*. *ఈ విషయమును నారదమహర్షి అంబరీష మహారాజునకు చెప్పెను.* *_వైశాఖ పురాణం 9వ అధ్యాయం సంమాప్తం._* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - QheLo1A1 QheLo1A1 - ShareChat
2️⃣0️⃣6️⃣ *_సంపూర్ణ మహాభారతము_* *_206 వ రోజు_* *_ఇంద్రుడు పదవీచ్యుతుడై తిరిగి పట్టాభిషిక్తుడగుట:_* *శల్యుని మాటలు విన్న ధర్మరాజు..* *“మహానుభావా! ఇంద్రుడు, శచీదేవి ఎందుకు కష్టాల పాలయ్యారు. కొంచం వివరించండి” అన్నాడు.* *శల్యుడు ఇలా చెప్ప సాగాడు.. “దేవతలలో త్వష్ట అనే వాడు ఉన్నాడు. అతడు ఉత్తముడు. అతడు తన తపోశక్తితో మూడుతలలున్న ఒక వ్యక్తిని సృష్టించాడు. అతని పేరు విశ్వరూపుడు. విశ్వరూపుడు ఇంద్ర పదవి కోరి ఘోరతస్సు చేస్తున్నాడు. ఇది తెలుసుకున్న ఇంద్రుడు అతని తపస్సు భగ్నం చేయటానికి అప్సరసలను పంపాడు. విశ్వరూపుడు అప్సరసల తళుకుబెళుకులకు లొంగక పోవడంతో ఇంద్రుడు విశ్వరూపుని చంపి ఆ విషయం ఒక సంవత్సరం రహస్యంగా దాచాడు. తరువాత అందరికీ ఆవిషయం తెలిసి ఇంద్రుని చర్యను నిరసించారు, అతడు బ్రహ్మహత్యా పాతకం చేసాడని ఖండించారు. తనకు అంటిన బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోడానికి ఒక యాగం చేసి తనకంటిన పాపాన్ని సముద్రానికి, స్త్రీలకు, వృక్షాలకు పంచి పెట్టి బ్రహ్మహత్యా దోషాన్ని కడిగి వేసాడు.* *_వృత్తాసుర వధ:_* *ఇది తెలిసిన త్వష్ట కోపించి నిష్కారణంగా నిరపరాధి అయిన విశ్వరూపుని చంపినందుకు ఇంద్రుని చంపడానికి ఒక శక్తిని సృష్టించి అతడికి వృత్తుడు అని నామకరణం చేసాడు. అధిక బల సంపన్నుడైన వృత్తుడు ఇంద్రుని జయించి అతనిని మింగి కడుపు బరువెక్కడంతో నిద్రకుపక్రమించి గట్టిగా ఆవలించాడు. అప్పుడు ఇంద్రుడు తన శరీరాన్ని చిన్నదిగా చేసి బయటకు వచ్చాడు. ఇంద్రుడు తిరిగి వృత్తాసురునితో యుద్ధానికి దిగాడు. వృత్తుని ధాటికి తట్టుకోలేక దేవతలు మంధర పర్వత శిఖరానికి చేరి వృత్తుని చంపే ఉపాయంకోసం ఆలోచించారు. అందరూ మహా విష్ణువు వద్దకు వెళ్ళి “వృత్తుని చంపే ఉపాయం చెప్పమ”ని అర్ధించారు*. *“మీరు వెళ్ళి ఇంద్రునికి వృత్తునికి సంధి చేయండి. నేను తగిన సమయం చూసి ఇంద్రుని వజ్రాయుధంలో ప్రవేశించి అతడు అంత మయ్యేలా చేస్తాను" అన్నాడు.* *ఋషులంతా వృత్తుని వద్దకు వెళ్ళి* *“ఇంద్రుడు అజేయుడు నీవా అధిక బలశాలివి మీరు ఒకరిని ఒకరు జయించడం ఎన్నటికీ సాధ్యం కాదు. కనుక ఇంద్రునితో మైత్రి చేసుకో" అని నచ్చచెప్పారు* *వృత్తుడు అందుకు అంగీకరిస్తూ.. “బదులుగా నాకు ఒక వరం ప్రసాదించండి. నేను తడిసిన దానితో కాని ఎండిన దానితో కాని రాత్రి కాని పగలు కాని సంహరించబడకూడదు. అందుకు ఒప్పుకుంటే ఇంద్రునితో సంధి చేసుకుంటాను” అన్నాడు*. *వృత్తుడు మైత్రి చేసుకున్నా ఇంద్రుడు మాత్రం వృత్తుని సంహరించే మార్గం అన్వేషిస్తూనే ఉన్నాడు*. *ఒక రోజు అసుర సంధ్యలో సముద్రతీరంలో విహరిస్తున్న వృత్తుని చూసి అతడిని సంహరించడానికి అది తగిన సమయమని గ్రహించిన ఇంద్రుడు విష్ణువుని ప్రార్ధించి తన వజ్రాయుధాన్ని సముద్ర జలాల నురుగులో ముంచాడు. విష్ణువు ఆ నురుగులో ప్రవేశించాడు. ఆ నురుగు సాయంతో వృత్తుని సంహరించాడు*.``` *_నహుషుడు:_* *ఈ విషయం తెలిసిన భూతాలు బ్రహ్మ హత్య చేసినందుకు నిందించాయి. బ్రహ్మహత్యా పాతకం వెంట తరమగా ఇంద్రుడు పదవీచ్యుతుడై నిషధాచలంలో తలదాచుకున్నాడు. దేవతలంతా ఇంద్రపదవి కోసం తగిన వాడి కోసం అన్వేషిస్తూ భూలోకంలో నూరు అశ్వమేధయాగాలు చేసిన నహుషుడు అనే మహారాజుని ఆ పదవిలో కుర్చోమని అర్ధించారు*. *నహుషుడు మాత్రం అందుకు అంగీకరించ లేదు ఇంద్ర పదవి అధిష్టించేంత సామర్ధ్యం తనకు లేదన్నాడు*. *యముడు, అగ్ని, వరూణాది దేవతలు తమ శక్తిని అతనికి పంచారు. నహుషుడు దానితో అధిక బల సంపన్నుడైనాడు. నహుషుడు ఇంద్రపదవి అధిష్టించి ధర్మ పరుడై సమస్త లోకాలను పాలిస్తున్నాడు. కిన్నెరలూ, కింపురుషులు, యక్షులు, సిద్ధులు, విద్యాధరులు, గంధర్వులు, గరుడులూ సమస్త దేవతల నుండి తేజో భాగములు స్వీకరించి అత్యంత తేజోమయుడయ్యాడు. మునులంతా నహుషుని సేవిస్తున్నారు, తుంబురు నారదులు గానంతో వినోదం అందిస్తున్నారు, రంభ, మేనక, తిలోత్తమ, ఊర్వశి మొదలైన అప్సరసలు నాట్యంతో వినోదం కలిగిస్తున్నారు. ఇన్ని భోగాలు ఒక్క సారిగా సంక్రమించగానే నహుషునిలో గర్వం తొంగిచూసింది* #మన సంప్రదాయాలు సమాచారం