Ravi  Talluri
ShareChat
click to see wallet page
@91775
91775
Ravi Talluri
@91775
feelgood
#మన సంప్రదాయాలు సమాచారం 2 నిమిషాల వాల్ సిట్.. అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ ! 🧱🧘‍♀️_* *_జిమ్‌కి వెళ్లే పనిలేదు.. ఇంట్లోనే ఈ సింపుల్ ఎక్సర్‌సైజ్‌తో ఫిట్‌గా ఉండండి!_* *_గోడకు ఆనుకుని కుర్చీలో కూర్చున్నట్లుగా చేసే ఈ చిన్న వ్యాయామం.. మీ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది!_* *_ప్రయోజనాలు :_* *_పొట్ట తగ్గుతుంది :_* *_బెల్లీ ఫ్యాట్‌ను కరిగించడంలో తోడ్పడుతుంది._* *_కాళ్ల బలం :_* *_కాళ్లు, మోకాళ్లు మరియు నడుము దృఢంగా మారుతాయి._* *_సరైన భంగిమ :_* *_మీ బాడీ పోశ్చర్ (Posture) మెరుగుపడుతుంది._* *_స్టామినా :_* *_శారీరక శక్తి మరియు ఏకాగ్రత పెరుగుతాయి._* *_రిలాక్సేషన్ :_* *_ఒత్తిడి తగ్గి మూడ్ ఉల్లాసంగా ఉంటుంది._* *_ఈరోజే మొదలుపెట్టండి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి! :_*
మన సంప్రదాయాలు  సమాచారం - Oveindiw వాల్ సిట్ - రోజుకు 2 నిమిషాలు చాలు! పొట్ట తగ్గుతుంది: బెల్లీ ఫ్యాట్ను కరిగించడంలో తోడ్పడుతుంది కాళ్ల బలం: కాళ్లు మోకాళ్లు మరియు నడుము దృఢంగా మారుతాయి సరైన భంగిమ: మీ బాడీ పోశ్చర్ (Posture) మెరుగుపడుతుంది మినా: శారీరక శక్తి మరియు ఏకాగ్రత పెరుగుతాయి రిలాక్సేషన్: ఒత్తిడి తగ్గి మూడ్ ఉల్లాసంగా ఉంటుంది Oveindiw వాల్ సిట్ - రోజుకు 2 నిమిషాలు చాలు! పొట్ట తగ్గుతుంది: బెల్లీ ఫ్యాట్ను కరిగించడంలో తోడ్పడుతుంది కాళ్ల బలం: కాళ్లు మోకాళ్లు మరియు నడుము దృఢంగా మారుతాయి సరైన భంగిమ: మీ బాడీ పోశ్చర్ (Posture) మెరుగుపడుతుంది మినా: శారీరక శక్తి మరియు ఏకాగ్రత పెరుగుతాయి రిలాక్సేషన్: ఒత్తిడి తగ్గి మూడ్ ఉల్లాసంగా ఉంటుంది - ShareChat
#మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
01:51
#😁Hello🙋‍♂️
😁Hello🙋‍♂️ - ShareChat
01:10
#మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
*_జమ్మూ & కశ్మీర్‌లోని కిష్త్వార్ అడవుల్లో నేడు జరిగిన ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు మన వీర జవాన్లు_*. *కానీ ఆ విజయానికి నిజమైన ముందడుగు వేసింది —* *_ధైర్యవంతమైన స్నిఫర్ కుక్క “టైసన్”._* *Indian Army కు చెందిన 2 పారా స్పెషల్ ఫోర్సెస్‌తో కలిసి పనిచేస్తున్న టైసన్, ఉగ్రవాదుల జాడను ముందుగా గుర్తించింది. కాలికి బుల్లెట్ గాయం అయినప్పటికీ, వెనక్కి తగ్గకుండా తన కర్తవ్యాన్ని కొనసాగించింది.* *నొప్పిని లెక్కచేయకుండా ముందుకు కదులుతూ జవాన్లకు మార్గం చూపింది*. *రక్తం కారుతున్నా…* *కాళ్లు వణుకుతున్నా…* *ధైర్యం మాత్రం ఒక్క క్షణం తగ్గలేదు.* *మన జవాన్లు దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెడితే, ఈ నాలుగు కాళ్ల వీర సైనికులు కూడా అదే త్యాగ భావంతో సేవ చేస్తారు. టైసన్ వంటి సైనిక కుక్కలు మాటలతో మాట్లాడకపోయినా, తమ నిబద్ధతతో దేశభక్తిని గట్టిగా చెబుతాయి*. *మన సైనికులకు,* *ఆ ధైర్యవంతమైన నాలుగు కాళ్ల* *యోధుడు టైసన్‌కు* *హృదయపూర్వక సెల్యూట్.* *_టైసన్ త్వరగా కోలుకోవాలని ప్రార్దిద్దాం_* *_జై హింద్_* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
*_1️⃣4️⃣3️⃣_* *_సంపూర్ణ మహాభారతము_* *_143 వ రోజు_* *_వన పర్వము షష్టమాశ్వాసము:_* *_సీతాపహరణం_* *అవకాశం కోసం చూస్తున్న రావణుడు సన్యాసి వేషంలో అక్కడికి వచ్చాడు. మార్గాయాసంతో అలసినట్లు కనిపిస్తున్న రావణుని చూసి అతిథి సత్కారాలు చేసింది. సీతను చూసిన రావణుడు మోహవివశుడై “సుందరీ! నా పేరు రావణుడు, దానవ నాయకుడను నా రాజధాని లంక. నీవు నన్ను భర్తగా వరించి భోగాలు అనుభవించు.* *రాజ్యాన్ని కోల్పోయి అడవుల వెంట తిరుగుతున్న రామునితో ఏమి సుఖపడతావు. వేరు ఆలోచించక నన్ను వరించు” అన్నాడు.* *సీత “అయ్యా! మీరు ఇలా మాట్లాడటం తగునా! సూర్యచంద్రులు తేజం కోల్పోయినా, ఆకాశం నేల కూలినా, సముద్రములు ఇంకి పోయినా, భూమి బద్దలు అయినా నేను నా భర్త రాముని తప్ప అన్యుని తలవను” అన్నది.* *రావణుడు సీతను బలవంతంగా పట్టుకుని ఆకాశానికి ఎగిరాడు. అప్పుడు సీత పెద్దగా కేకలు వేస్తూ* *“దేవతలారా! నేను జనక మహారాజు కూతురిని, రాముని భార్యను. ఈ రావణుడు నన్ను బలవంతంగా ఎత్తుకు పోతున్నాడు. మీకు నమస్కరిస్తాను నన్ను కాపాడండి” అని రోదించింది.* *ఆ అరుపులు జటాయువు అనే పక్షి విని రావణుని అడ్డగించాడు. “ఓరి రావణా! ఈమెను ఎందుకు బలవంతంగా ఎత్తుకుపోతున్నావు*. *ఈమెను విడవకున్న నిన్ను సంహరిస్తున్నాను” అన్నాడు.* *జటాయువుకు రావణునికి మధ్య పోరు ఘోరంగా జరిగింది.* *జటాయువు తన ముక్కుతో, గోళ్ళతో రావణుని గాయ పరచింది.* *రావణుడు జటాయువు రెక్కలు ఖండించాడు. జటాయువు నేల కూలాడు. రావణుడు సీతను ఎత్తుకు పోతున్నాడు. సీత ఇక తనను రక్షించే వారు లేరని అనుకుంటున్న సమయంలో ఋష్యమూక పర్వతంపై ఉన్న వానరములను చూసి తన ఆభరణములు చీర కొంగున మూటకట్టి పడవేసింది*. *రావణుడు సీతను లంకకు తీసుకు వెళ్ళాడు*. *సీతను అశోకవనంలో ఉంచి రక్షణగా రాక్షస స్త్రీలను కాపలా ఉంచారు*.``` *సీతాన్వేషణ* *దండ కారణ్యంలో మారీచుని సంహరించి రాముడు కుటీరానికి తిరిగి వస్తున్నాడు. దారిలో లక్ష్మణుడు ఎదురు వచ్చాడు*. *రాముడు “లక్ష్మణా! రాక్షసులు తిరిగే ఈ అరణ్యంలో సీతను ఒంటరిగా ఎందుకు వదిలి వచ్చావు” అని మందలించాడు.* *లక్ష్మణుడు సీత తనను ఆక్షేపించిన విషయం వివరించాడు. రాముడు జరిగిన దానికి చింతించాడు. రామునికి దుశ్శకునాలు గోచరించాయి. సీతకు ఏదో ఆపద వచ్చిందని మనస్సు శంకించింది. కుటీరంలో సీత కనపడ లేదు. అక్కడ కనిపించిన సంకేతాలు చూసి సీత అపహరణకు గురి అయినట్లు గ్రహించి వేదన పడ్డారు. సీత కోసం అన్వేషించటం మొదలు పెట్టారు. దారిలో కొన ఊపిరితో ఉన్న జటాయువు కనపడి “రామా! నా పేరు జటాయువు. నేను నీ తండ్రి దశరధునికి మిత్రుడను. నీ భార్య సీతను రావణుడు అపహరించి దక్షిణ దిక్కుగా పోయాడు. నేను అడ్డగించినందుకు నా రెక్కలు ఖండించాడు” అని చెప్పి ప్రాణాలు విడిచాడు.* *రాముడు జటాయువుకు అంతిమ సంస్కారములు చేసాడు.* #మన సంప్రదాయాలు సమాచారం
*_శ్రీ మహావిష్ణు పురాణం_* *_ఐదవ భాగం_* *_శ్రీ మహావిష్ణువు జననం:_* *కృష్ణుడు కృష్ణాదేవి కలయిక వలన కృష్ణాదేవి గర్భం ధరించింది. శత మన్వంతరాల కాలం వరకు గర్భాన్ని మోసి ఒక మగశిశువుకి జన్మ నిచ్చింది. శత మన్వంతరాల కాలం గర్భం మోయడం వలన అలసి సొలసిన కృష్ణాదేవి ఆ మగశిశువుని చుట్టూ నిండి ఉన్న జలధిలోకి వదిలివేసింది. ఆ మగ శిశువు ఒక వటపత్రం మీద తేలుతూ నీటిలో ముందుకు సాగాడు*. *కృష్ణుడికి కృష్ణాదేవి జలధిలో శిశువుని వదిలేయడం నచ్చలేదు*. *“కన్నబిడ్డను జలధిలో వదిలి వేసినందుకు గాను నీకు, నీ అంశతో జన్మించబోయే అప్సరసలకు సంతానం కలుగదు!” అని శాపమిచ్చాడు.* *కృష్ణాదేవి పశ్చాత్తాపం చెంది శరణు వేడింది.* *కృష్ణుడు శాంతి చెంది మన్నించాడు. సృష్టి కృష్ణాదేవి వలన ముందుకు సాగదు అనుకుని ఆమె వంక చూశాడు.* *ఫలితంగా కృష్ణాదేవి జిహ్వాగ్ర భాగం నుండి ధవళ (తెలుపు) స్వరూపిణి, శ్వేతవస్త్రధారిణి, వీణాపుస్తక ధారిణి అయిన "మహాసరస్వతి" ఆవిర్భవించింది. కృష్ణాదేవి కృష్ణుడిలో కలసిపోయింది. సర్వశాస్త్రాధి దేవత యైన మహాసరస్వతి వామభాగం నుంచి ‘లక్ష్మీదేవి’, దక్షిణ భాగం నుంచి ‘రాధాదేవి’ అవతరించారు*. *మహాజలథి లో తేలుతూ వెళుతున్న బాలశిశువు ఆకలి కలిగి కళ్ళు తెరచి రోదించసాగాడు. రోదన విన్న కృష్ణుడు శిశువు ముందు ప్రత్యక్షమైనాడు. తేజోరూపం చూసి శిశువు ఆకలి, దుఖం మరచి విప్పారి చూడసాగాడు*. *కృష్ణుడు ఆ శిశువు వంక చూసి “నాయనా! నా తేజస్సులో పదహారవ అంశయైన నీవు నాతో సమానుడవై ఉంటావు. నీకు ఆకలిదప్పులు, దుఖభయాలు, జరామరణాలు ఉండవు*. *అసంఖ్యాక బ్రహ్మాండాలు నీ రోమకూపాల నుంచి ఉద్భవిస్తాయి. నీవు సమస్త విశ్వంలో ఉంటావు. సమస్త విశ్వము నీలో ఉంటుంది. సమస్త విశ్వానికి ఆధారభూతుడవైన నీవు ‘మహావిష్ణువు’ నామంతో ప్రసిద్ధి పొందుతావు. నీటిని నారములు అంటారు. నారములలో నివసిస్తావు కనుక నిన్ను ‘నారాయణుడు’ అంటారు. సమస్త విశ్వము నీలోనే ఉంటుంది కనుక ‘విశ్వవిరాట్ పురుషుడు’ గా విరాజిల్లుతావు*. *అండ పిండ బ్రహ్మాండాలకు ఆధారమూర్తివైన నీకు సకల శక్తులు ప్రసాదించే షడక్షర మహామంత్రం ‘కృష్ణమంత్రం’ ఉపదేశిస్తాను.”* *వింటున్న బాల విష్ణువు చేతులు జోడించి మంత్రోపదేశానికి సిద్ధం అయ్యాడు*. *సంసిద్ధుడైన విష్ణువుకి చతుర్భుజాలు, పట్టుపీతాంబరాలు, కిరీటాది స్వర్ణాభరణాలు అలంకరించాయి. కృష్ణుడు ముందుకు వంగి శిశువు కుడిచెవిలో షడక్షర మహామంత్రం ‘ఓం కృష్ణాయ స్వాహా’ ఉపదేశించాడు*. *మంత్రోపదేశం పొందగానే బాల శిశువు దేహం దివ్య తేజస్సుతో ప్రకాశించింది*. *వాత్సల్యముతో శిశువు వంక చూసి కృష్ణుడు "నాయనా! ఈ షడక్షర మహామంత్రం జపిస్తూ తపస్సు చేయుము. ఈ మహావిశ్వానికి రక్షకుడివి, పోషకుడివి, విరాట్ స్వరూపుడివి అవుతావు. తిరిగి సకల విశ్వం నాలో మహాలయం పొందేవరకు, అనేక కల్పాంతాలు, యుగాంతాలు కాలచక్ర భ్రమణంలో కలసిపోతున్నా, సకల బ్రహ్మాండాలకు నీవే సృష్టి స్థితి లయ కర్తగా ఉంటావు*. *ఈ జగత్తుకి ఆద్యుడు, ఆధారుడవైన నీవు జగత్తు రక్షణ కోసం అనేక అవతారాలు ధరిస్తావు. నీ నామము ‘ఓం నమో నారాయణాయ’ అనే అష్టాక్షరీ మంత్రంగా జపించబడి సమస్త ప్రాణులకు శుభములు చేకూరుస్తుంది. అనేక మహత్తులు నీకు సహజ లక్షణాలుగా ఉంటాయి”. అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు.* *వటపత్ర సాయి రూపంలో ఉన్న మహావిష్ణువు అష్టాక్షరీ మహామంత్రం జపిస్తూ అనేక వేల సంవత్సరాలు తపస్సు చేసి తపస్సిద్ధి పొందాడు. చాలా కాలం తపస్సు చేయడం వలన అలసిన విష్ణువు విశ్రమించాడు. అలసిన విష్ణువు స్వేదజలంతో పాటు ఒక్కొక్క రోమకూపం నుండి ఒక్కొక్క అండము వెలువడ్ఢాయి. అలా కోట్లాది అండాలు వెలువడి కలసిపోయి ఒక బ్రహ్మాండం రూపొందింది*. *మహావిష్ణువు నిద్రలో ఉండటం వలన, ఆ బ్రహ్మాండం చైతన్య రహితంగా ఉండిపోయింది*. *వేల సంవత్సరాలు అలా విశ్రాంతి తీసుకుని విష్ణువు స్వస్థుడై నిద్ర లేచాడు. సృష్టి పొందిన బ్రహ్మాండంలో నారాయణుని దేహము వ్యాపించి దివ్వతేజస్సుతో బ్రహ్మాండం ప్రకాశించింది. తన ఎదురున్న బ్రహ్మాండాన్ని విష్ణువు తన బోటనవ్రేలితో రెండు భాగాలుగా విభజించాడు. చీలిన రెండు భాగాలకి మధ్య జలరాశి నీరు ఉధృతంగా రావడంతో బ్రహ్మాండం క్రింది భాగము నీటిలో మునిగింది. పై భాగంలో మహావిష్ణువు సంకల్పంతో ఏడు ఊర్థ్వలోకాలు ఏర్పడ్డాయి. నీటిలో మునిగిన క్రింది భాగంలో ‘ఆరు అధోలోకాలు’ ఏర్పడ్డాయి*. *బ్రహ్మాండంలో గల కోట్లాది అండాలు కూడా రెండు రెండు భాగాలుగా విడిపోయి ఊర్థ్వ అధోలోకాలు ఏర్పడ్డాయి*. *సప్త ఊర్థ్వలోకాల పైన ఏర్పడిన గోలోకాన్ని కృష్ణుడు రాధాదేవితో కలసి తన నివాసంగా చేసుకున్నాడు.* *కృష్ణుడి సంకల్పంతో రోమముల నుండి అతని వలె రూప దేహములు కల వెయ్యి మంది పార్షాదులు (గోపాలురు) జన్మించి సేవకులు అయ్యారు*. *రాధాదేవి శరీరం నుండి కూడా వేయి మంది పార్షద గోపికలు జన్మించి చెలికత్తెలు అయ్యారు*. *లోకాలను సృష్టించిన మహావిష్ణువు ఆ లోకాలలో చరాచర జీవులను సృష్టించ సంకల్పించాడు. తనకు అటువంటి శక్తిని ఇమ్మని పరమాత్ముడైన కృష్ణుడిని తలచాడు.* *కృష్ణుడు మహాసరస్వతి నుండి ఉద్భవించిన మహాలక్ష్మిని విష్ణువుకి తోడుగా పంపాడు.* *మహాలక్ష్మి వచ్చి నారాయణుడి వక్షస్థలమందు నివాసము ఏర్పాటు చేసుకుంది*. *శ్రీ లక్ష్మీ వచ్చి చేరడంతో నారాయణుడు సిరి సంపదలు పొంది ‘శ్రీ లక్ష్మీనారాయణుడు’ అయ్యాడు.* *శ్రీమహావిష్ణువు వక్షస్థల నివాసియై* *‘శ్రీ మన్మహాలక్ష్మి’ అయ్యింది* #మన సంప్రదాయాలు సమాచారం
*_దయకలిగి వుండండి!_* *నేను ఉబెర్ డ్రైవర్‌ని. ఎక్కువగా రాత్రి షిఫ్ట్ చేస్తాను. గత వారం ఓ రాత్రి 11 గంటలకు ఒక వృద్ధుడిని ఎక్కించుకున్నాను.* *కారులో కూర్చోగానే ఆయన అన్నాడు:* *“ఈ రాత్రి నన్ను ఐదు చోట్లకు తీసుకెళ్లాలి. నేను నీకు ₹.5000/- ఇస్తాను. కానీ పనంతా పూర్తయ్యే వరకు ‘ఎందుకు’ అని అడగకూడదు.”* *అని ఐదు చిరునామాలు ఇచ్చాడు.* *మొదటి నిలయం:* *పట్టణచివరిలో వున్న ఒక ఇల్లు.* *ఆయన కారులోనే కూర్చొని ఆ ఇంటిని పది నిమిషాలు నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయాడు. కళ్లలో నీరు. మాట లేకుండా ఏడుస్తున్నాడు*. *“సరే. తదుపరి.” అన్నాడు.* *రెండో నిలయం:* *ఒక ప్రాథమిక పాఠశాల* *ఖాళీగా, చీకటిగా ఉంది*. *ఆయనలోపలికి వెళ్లి దగ్గరలో ఉన్న ఊయలపై కూర్చున్నాడు. ఇరవై నిమిషాలు* *అక్కడేవుండి తిరిగి వచ్చి అన్నాడు:* *“ఇక్కడ నేను 43 సంవత్సరాలు టీచర్ గా బోధించాను. నా జీవితంలో నాకు దొరికిన అత్యుత్తమ ఉద్యోగం ఇది.”* *మూడో నిలయం:* *ఒక చిన్న రెస్టారెంట్.* *లోపలికి వెళ్లి కాఫీ ఆర్డర్ చేశాడు* *కానీ తాగలేదు. ఒక మూల టేబుల్ దగ్గర ఒంటరిగా కూర్చుని చుట్టూ చూస్తూ పదిహేను నిమిషాలు గడిపాడు. తర్వాత తిరిగి వచ్చి అన్నాడు: “1967లో నా భార్యతో మొదటి డేట్ ఇక్కడే.”* *నాలుగో నిలయం:* *శ్మశానం*. *ఒక సమాధి దగ్గరకు వెళ్లి ముప్పై నిమిషాలు నిలబడి మాట్లాడాడు*. *ఏమన్నాడో వినిపించలేదు. తిరిగి వచ్చినప్పుడు కళ్లంతా ఎర్రగా ఉన్నాయి*. *“నా భార్య. ఈరోజుకి మూడేళ్లు.” అన్నాడు*. *ఐదో నిలయం:* *ఆసుపత్రి.* *కారును పార్క్ చేయమన్నాడు. “ఇది చివరిది.”* *అని నా వైపు చూసి అన్నాడు:* *“ఇప్పుడు కారణం చెబుతున్నాను. నాకు నాలుగో దశ క్యాన్సర్ ఉంది. ఇంకో కొన్ని వారాలు… లేక కొన్ని రోజులు మాత్రమే ఉండొచ్చు. ఈ రాత్రి నా మొత్తం జీవితాన్ని ఒకసారి చివరిసారి చూడాలని అనిపించింది.”* *అక్కడే నేను ఏడవడం మొదలుపెట్టాను*. *“ఆ ఇల్లు — అక్కడే నా పిల్లలను పెంచాను.* *ఆ పాఠశాల —* *అక్కడే నా జీవితానికి అర్థం దొరికింది.* *ఆ రెస్టారెంట్ — అక్కడే నేను ప్రేమలో పడ్డాను*. *ఆ శ్మశానం — అక్కడే నేను వీడ్కోలు చెప్పాను.* *మరి ఈ ఆసుపత్రి — ఇక్కడే ఈ రాత్రి చేరుతున్నాను. హాస్పీస్ వార్డులో. ఇక ఇంటికి వెళ్లను.”* *అని ₹.5000/- నా చేతిలో పెట్టాడు.* *“నా జీవితమంతా నన్ను నడిపించావు*. *ఇకపై నాకు దయ చూపే చివరి అపరిచితుడు నువ్వే కావచ్చు. ఈ ప్రయాణం సున్నితంగా ఉండాలని అనుకున్నాను*. *నువ్వు దాన్ని సున్నితంగా చేశావు.”* *నేను ఆ డబ్బు తీసుకోలేనని అన్నాను. కానీ ఆయన ఒత్తిడి చేశాడు*. *“దయచేసి తీసుకో. వదిలివేయడానికి నాకు ఎవరూ లేరు. నా పిల్లలు నాతో మాట్లాడరు. స్నేహితులు లేరు.* *నువ్వు నాకు మూడు గంటల దయ చూపావు. అది ₹.5000/- కంటే ఎక్కువ.”* *చిన్న సూట్‌కేస్ తీసుకుని దిగే ముందు అడిగాడు:* *“నీ పేరు?”* *“రాంబాబు .”* *“ధన్యవాదాలు,రాంబాబు. నా జీవితంలో చివరి మంచి జ్ఞాపకంగా నువ్వు ఉండిపోయావు.”* *ఆయన ఆసుపత్రిలోకి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. నేను కారులో కూర్చొని ఒక గంట పాటు ఆగకుండా ఏడ్చాను*. *మరుసటి రోజు తిరిగి వెళ్లాను.* *ఆయన గది 412. పూలతో వెళ్లి తలుపు తట్టాను.* *ఆయన చిరునవ్వుతో అన్నాడు:* *“రాంబాబూ! మళ్లీ వచ్చావా?”* *“అలా వదిలేయలేకపోయాను. మీరు బాగున్నారా?”* *“చనిపోతున్నాను. కానీ నిన్న రాత్రి నా జీవితాన్ని మరోసారి చూసాను. అందుకే… బాగున్నాను.”* *రెండు వారాలు ప్రతి రోజు వెళ్లాను. కాఫీ తీసుకెళ్లాను. వార్తలు చదివాను. కొన్నిసార్లు నిశ్శబ్దంగా కూర్చున్నాం. ఆయన తన ఆనందాలు, బాధలు, పశ్చాత్తాపాలు అన్నీ చెప్పాడు.* *“నేను ఒంటరిగా చనిపోతాననుకున్నాను. కానీ నువ్వున్నావు.* *అపరిచితుడిగా వచ్చి నా చివరి రోజుల్లో కుటుంబమయ్యావు. అది ఒక వరం.”* *ఆయన చేతిని పట్టుకుని అన్నాను:* *“మీరు ఇక ఒంటరిగా లేరు.”* *ఒక మంగళవారం తెల్లవారుజామున 3:17కి ఆయన చనిపోయారు. చనిపోకముందు..నేను ఆయన చెయ్యి పట్టుకున్నాను. చివరి మాటలు:* *“ప్రజలకు చెప్పు. అపరిచితులను నిజంగా చూడమని చెప్పు. మనమందరం ఎక్కడికో వెళ్తున్నాం. కొందరు వేగంగా, కొందరు నెమ్మదిగా. మార్గమధ్యంలో దయ చూపు. నువ్వు చూపావు. నా చివరి రోజులను రక్షించావు.” అని కళ్లుమూశారు*. *అంత్యక్రియలకు ఆరుగురే వచ్చారు — నేను, ముగ్గురు నర్సులు, ఒక న్యాయవాది, పత్రికలో చదివి వచ్చిన ఒక పూర్వ విద్యార్థి. 43 సంవత్సరాలు బోధించిన మనిషి. 52 సంవత్సరాలు ఒక స్త్రీని ప్రేమించిన మనిషి. 81 సంవత్సరాలు జీవించిన మనిషి. ఆరుగురే*. *_నేను ప్రసంగించాను:_* *“ప్రతి అపరిచితుడు ఎవరికో ఒక ప్రపంచం. ప్రతి ఉబెర్ ప్రయాణికుడికి ఒక కథ ఉంది. మనం దాటిపోతున్న ప్రతి మనిషి జీవిస్తూ, చనిపోతూ, ఎవరో తనను గమనించాలని ఆశిస్తూ ఉంటాడు.* *ఆయన నాకు ₹.5000/- ఇచ్చాడు. కానీ దాని కంటే విలువైనదాన్ని ఇచ్చాడు —* *అపరిచితుల పట్ల దయ అనేది అదనపు విషయం కాదు. అదే జీవితం. ఎందుకంటే మనమందరం అపరిచితులమే…* *ఎవరో ఒకరు ఆగి, చూసి, విని, మనతో ఉండే వరకు.”* *ఆ ₹.5000/- ఇప్పటికీ నా గ్లోవ్‌బాక్స్‌లోనే ఉంది. ఖర్చు చేయలేదు. అది ఒక జ్ఞాపకం*. *ప్రతి ప్రయాణికుడు తన చివరి ప్రయాణంలో ఉండవచ్చు*. *ప్రతి అపరిచితుడు తన చివరి వీడ్కోలు చెబుతుండవచ్చు.* *అందుకే ఇప్పుడు నేను వేరేలా డ్రైవ్ చేస్తాను…* *కొంచెం నెమ్మదిగా.* *కొంచెం దయగా.* *కొంచెం ఎక్కువగా మనిషిగా* #మన సంప్రదాయాలు సమాచారం
*_భవభూతి_* *_భవభూతి మహాకవి_* *“ఉత్తరరామచరిత్రమ్” నాటకం వ్రాయటం పూర్తిచేసిన తర్వాత, దాన్ని ఆ కాలంలో అతిప్రసిద్ధుడైన కాళిదాస మహాకవికి చూపించి ఆయన అభిప్రాయం తెలుసుకోవాలని కొన్నాళ్ళు తహతహలాడాడు బాణభట్టులాగే.* *తీరా నాటకం చదివి నచ్చకపోతే మహాకవి ఏమంటాడో అని (బాణుడిలాగే) ఒక శంక.* *అందువల్ల తను స్వయంగా కాళిదాసుకు నాటకం చూపించటానికి సంశయించి, తన కుమారుడికి తన తాళపత్రగ్రంథం యిచ్చి కాళిదాసు యింటికి పంపాడు*. *కాళిదాసు యింట్లో కూచుని చదరంగం ఆడుకుంటున్నాడు*. *భవభూతి కుమారుడు కాళిదాసుతో “మీరు కొంచెం సమయమిస్తే, మా నాన్నగారి నాటకం మీకు వినిపించి మీ అభిప్రాయం తెలుసుకుందామని వచ్చాను” అన్నాడు.* *“వేరే సమయమెందుకు?వచ్చావుగదా! యిప్పుడే చదివి వినిపించు. ఒక చెవి పడేసి వినేస్తాను” అన్నాడు చదరంగం బల్లమీది నుంచి దృష్టి కూడా మరల్చకుండా.* *భవభూతి కుమారుడికి మనసు చివుక్కుమంది. తన తండ్రి వ్రాసిన మహాకావ్యం, శ్రద్ధపెట్టి వినేందుకు కూడా యిష్టం లేని ఈ అహంభావికి నాటకమంతా వినిపించటం చెవిటివాడి ముందు శంఖమూది నట్టు గదా! అనిపించింది. కానీ ఏంచేస్తాడు? తన తండ్రికి కాళిదాసు గురుతుల్యుడు, అంతకంటే ఎక్కువే*. *ఈయన అభిప్రాయం తెలుసుకుంటే తప్ప ఆయనకు మనః శాంతి లేదు. చేసేది లేక నాటకమంతా చదివి వినిపించాడు*. *చదివాడు కానీ కాళిదాసు ఒక్క ముక్కైనా విన్నాడని అతనికి నమ్మకం లేదు. ఆయన మానాన ఆయన చదరంగం ఆడుకుంటూ కూర్చున్నాడు. ఇటుపక్కకు తిరిగి చూడనైనా చూడలేదు.* *అంతా చదివాక మాత్రం, నోటినిండా తాంబూలంతో అస్పష్ట౦గా “సున్నా ఎక్కువైంది” అని మాత్రం వినిపించింది.* *భవభూతి కుమారుడికి 'ఓహో! ఈ వ్యసనపరుడైన అహంభావికి తాంబూలంలో సున్నం ఎక్కువైనట్లుంది.* *దానిమీద వున్న* *ఆసక్తి గూడా ఈయనకు* *యితరులు వ్రాసిన కావ్యాల మీద లేదు” అనుకొన్నాడు. ఆ నిర్లక్ష్యం, అనాసక్తి అతన్ని బాగా నొప్పించాయి*. *ఒకనమస్కారం పెట్టి యింటికివెళ్ళి తండ్రితో జరిగినదంతా చెప్పాడు.* *విని ఆయనకూడా చిన్నబుచ్చుకున్నాడు*. *తండ్రీ కొడుకులిద్దరూ యిలా దిగాలుగా కూర్చొని వుండగా, కాళిదాసే భవభూతి యింటికి వచ్చాడు. వస్తూనే భవభూతిని కౌగలించుకొని “ఎంత గొప్పగా వ్రాశావయ్యా! గ్రంథం” అని మెచ్చుకున్నాడు.* *భవభూతి ఆయనను కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేశాడు.* *మాటల మధ్యలో భవభూతి, కాళిదాసుతో “మహాకవీ, నా కుమారుడు మీకీ నాటకం చదివి వినిపించినప్పుడు మీరు మరేదో పనిలో వుండి, అంత శ్రద్ధగా వినలేక పోయారనీ చెప్పాడు.* *అంతా విన్న తర్వాత కూడా మీరు నాటకం విషయం* *ప్రస్తావించకుండా, మీ* *తాంబూలంలో సున్నం ఎక్కువవడం గురించి మాత్రం యేదో అన్నారని చెప్పాడు. మీరేమో యిప్పుడు నా నాటకాన్ని ఇంతగా ప్రశంసిస్తున్నారు*. *ఏదో సాటి కవినని మర్యాదతో* *మీరిలా అంటున్నారనని అనుకుంటున్నాను*. *మీరేమీ అనుకోకపోతే, మరోసారి నాటకమంతా నేనే స్వయంగా మీకు చదివి వినిపిస్తాను.* *ఈసారైనా విని మీ సూచనలూ, అభిప్రాయమూ నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తాను” అన్నాడు*. *కాళిదాసు నవ్వాడు; “కవిరాజా, నాకు కావ్యరచనలో, కావ్య పఠనంలో, శ్రవణంలో వున్న ఆసక్తి మరే విషయంపైనా లేదు*. *మీ చిరంజీవి చదువుతున్నప్పుడు, నేను మీ కావ్యం క్షుణ్ణ౦గా, శ్రద్ధగా విన్నాను పూర్తిగా ఏకాగ్రతతో. మీరు కావాలంటే నేను ఆ నాటకం ఆమూలాగ్రం ఇప్పటికిప్పుడు తిరిగి చెప్పగలను. నాటకం నాకెంతో నచ్చింది కనుకే నేను స్వయంగా వచ్చి మిమ్మల్ని అభినందించటం నాధర్మం అని భావించి వచ్చాను*. *నేను అన్నమాటలు పై పై మర్యాదకోసం చెప్పినవి కావు.” అన్నాడు*. *ఇక సున్నం విషయమా? మీ అబ్బాయి నేనన్నది సరిగా వినలేదు*. *నేనన్నది సున్నం గురించికాదు*. *'సున్న' గురించి, నాటకం లో ఒకే ఒకచోట ఒక్క సున్నాఎక్కువైందేమో* *ఆ సున్నా తీసేస్తే ఆ శ్లోకం మరింత రమ్యంగా వుంటుందేమో* *ననిపించింది. అందుకే సున్న ఎక్కువైందేమో నని చిన్న సూచన చేశాను తప్ప మీ అద్భుతమైన నాటకం లో ఏ చిన్న మార్పూ అవసరం లేదు.”* *ఆ మాటలువిని భవభూతి ఉప్పొంగి పోయాడు.* *ఉత్సాహంగా “సున్న ఎక్కువైంది ఏ శ్లోకం లో స్వామీ?నాటకంలో* *శ్లోకాలన్నీ గబ గబ మీకు వినిపిస్తాను.* *దయచేసి చెప్పండి.” అన్నాడు*. *“ఆ అవసరం లేదు. నీ కావ్యంలో ఏ శ్లోకమైనా నేను మరిచిపోతే కదా నువ్వు నాకు గుర్తు చేసేది? మొదటి అంకం లోనే,* *రాముడు తను అరణ్యవాసంలో సీతతో గడిపిన తొలిరోజులు గుర్తు చేసుకుంటూ వుండే సందర్భంలో ఒక మనోహరమైన శ్లోకం చెప్పావు.* *“కిమపి కిమపి మందం మంద మాసక్తి యోగాత్* *అవిరళిత కపోలం జల్పతోర క్రమేణ* *అశిధిల పరిరంభ వ్యాపృతైకైక దోష్ణో* *అవిదిత గతయామా రాత్రి రేవం వ్యరంసీత్”* *(అశిధిల పరిరంభ -వ్యాపృత-ఏక - ఏక - దోష్ణోః= అతి సన్నిహితంగా ఒకరి బాహువులలో* *ఒకరుగా ఒదిగి ;* *అవిరళిత కపోలం - చెక్కిలికీ చెక్కిలికీ మధ్యస్థలం లేకుండా* *ఆసక్తి యోగాత్ - అక్రమేణ - కిమపి కిమపి - మందం మందం - జల్పతోః = ఆసక్తి బట్టే తప్ప - మరే వరసా, క్రమం లేకుండా - ఏవేవో ముచ్చట్లు - గుసగుసలుగా చెప్పుకుంటున్న(మనకు)* *అవిదిత గతమయామా - రాత్రికి - ఏవం - వ్యరంసీత్ = తెలియకుండా దొర్లిపోయిన జాములు గల రాత్రి యిలా గడిచిపోయింది*. *అవునవును అన్నాడు భవభూతి*. *అందులో రాత్రిరేవం వ్యరంసీత్ (రాత్రి యిలా గడిచిపోయింది.) అనే బదులు రాత్రి రేవ వ్యరంసీత్ (రాత్రిగడిచి పోయింది, మాటలు యింకా మిగిలే వున్నాయి)* *అని చెప్తే మరీ బాగుంటుంది*. *పరస్పరం అనురక్తులైన దంపతుల మాటలు ఎడతెగనివి. అలా ఉంటూనే ఉంటాయి.* *రాత్రి జాములు మాత్రం దొర్లిపోతూంటాయి*. *అని అందమైన* *భావం వస్తుంది”* *అన్నాడు* *కాళిదాసు*. *“అవశ్యం మహాకవి!* *ఎంత అద్భుతమైనమార్పు సూచించారు!* *అందుకే తమరు కవికుల* *గురువులు” అన్నాడు ఆనంద భాష్పాలతో భవభూతి.* *“అదేమీలేదు మీ అంతటివారు మీరు, మహాకవులు.* *_‘నాటకేషు చ కావ్యేషు’_* *_‘వయం వా వయమేవ వా’_* *_‘ఉత్తరే రామచరితే’_* *_‘భవభూతిః విశిష్యతే’_* *నాటక రచనలో, కావ్య రచనలో మాకు మేమే సాటి. ఉత్తర రామచరిత్ర లో మాత్రం భవభూతి మమ్మల్ని మించి పోయాడు. అని చెప్పక తప్పదు” అన్నాడు కాళిదాసు*. *భవభూతి కవిగానే కాక గొప్ప దార్శనికుడిగా కూడా ప్రసిద్ధి పొందినవాడంటారు*. *కన్యాకుబ్జ౦ రాజు యశోవర్మ ఆస్థాన కవిగా ఉండేవాడు*. *ఈయన విదర్భ దేశం వాడని కొందరూ, గ్వాలియర్ ప్రాంతం వాడని కొందరూ, ఆంధ్రుడని కొందరూ వాదించారు*. *భవభూతి రచనలు మూడూ నాటకాలే.* *'ఉత్తర రామచరితం' 'మాలతీమాధవం'* *'మహావీరచరితం'* *భవభూతి కరుణరసాన్ని ఎక్కువ అభిమానించాడు* #మన సంప్రదాయాలు సమాచారం