
Rochish Sharma Nandamuru
@nvsrs
🤗అందరు బాగుండాలి అందులో నేనుండాలి🙂
సంతోషి మా ప్రార్థనలు మొదట్లో నోటి మాట, వ్రతం - కరపత్ర సాహిత్యం మరియు పోస్టర్ కళ ద్వారా వ్యాపించాయి. ఆమె వ్రతం ఉత్తర భారత మహిళలలో ప్రజాదరణ పొందుతోంది. అయితే, 1975 బాలీవుడ్ చిత్రం జై సంతోషి మా ("సంతోషి మా విజయం") - దేవత మరియు ఆమె తీవ్రమైన భక్తురాలు సత్యవతి కథను వివరిస్తుంది - ఇది అప్పటికి అంతగా తెలియని ఈ దేవతను భక్తి తీవ్రత యొక్క శిఖరాలకు నడిపించింది. ఈ చిత్రం యొక్క ప్రజాదరణ పెరగడంతో, సంతోషి మాత పాన్-ఇండియన్ హిందూ దేవస్థానంలోకి ప్రవేశించింది మరియు ఆమె చిత్రాలు మరియు పుణ్యక్షేత్రాలు హిందూ దేవాలయాలలో చేర్చబడ్డాయి. ఈ చిత్రం దేవతను ప్రసిద్ధ హిందూ దేవుడు గణేశుడి కుమార్తెగా చిత్రీకరించింది మరియు ఆమెను రక్షా బంధన్ పండుగకు సంబంధించినది . మీడియా వేదికలపై కొంతమంది ప్రకారం ఆమె రాజస్థాన్లోని కొంతమందికి దేవతగా మరియు కులదేవిగా పరిగణించబడుతుంది.
సంతోషి మాత వ్రతం లేదా భక్తి ఉపవాసం వరుసగా 16 శుక్రవారాలు లేదా ఒకరి కోరిక నెరవేరే వరకు ఆచరించాలి. భక్తుడు సంతోషి మాతకు పూజ (ఆరాధన) చేసి, ఆమె పువ్వులు, ధూపం మరియు పచ్చి చక్కెర మరియు కాల్చిన శనగపప్పు ( గుర్-చనా ) గిన్నెను సమర్పించాలి. భక్తుడు తెల్లవారుజామున లేచి దేవతను స్మరిస్తాడు. ఉపవాసం ఉన్న రోజులో ఒక భోజనం మాత్రమే తీసుకుంటారు మరియు భక్తులు చేదు లేదా పుల్లని ఆహారాన్ని తినకుండా మరియు ఇతరులకు వడ్డించకుండా ఉంటారు, ఎందుకంటే పుల్లని లేదా చేదు ఆహారం కొంతవరకు వ్యసనపరుస్తుంది మరియు సంతృప్తిని అడ్డుకుంటుంది. కోరిక నెరవేరినప్పుడు, భక్తుడు ఒక ఉద్యానపన ("ముగింపుకు తీసుకురావడం") వేడుకను నిర్వహించాలి, అక్కడ ఎనిమిది మంది అబ్బాయిలకజ పండుగ భోజనం వడ్డిస్తారు.
ఈ రకమైన పూజలో, భక్తుడు గొడవలకు దూరంగా ఉండటం మరియు ఎవరినీ బాధపెట్టడం వంటి ఇతర నియమాలను పాటించాలి. ఈ వ్రతం ద్వారా మానవ జీవితంలోని చెడు అలవాట్లైన దేవునిపై విశ్వాసాన్ని విస్మరించడం, అబద్ధాలు చెప్పడం, అహంకారంతో ప్రవర్తించడం మొదలైన వాటిని తొలగించవచ్చు కాబట్టి సామరస్యంగా జీవించవచ్చు. ఈ వ్రతం భక్తుడికి ప్రేమ, సానుభూతి మరియు ఆనందాన్ని వ్యాప్తి చేయమని బోధిస్తుంది. #🌅శుభోదయం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🙏ఓం శ్రీ మాత్రే నమః🕉️ #🪔శ్రీ సంతోషి మాత...🙏🕉️
_*మన దేవాలయాలు*_
🪴🎪🎪🎪🎪🎪🎪🎪🎪🎪🎪🪴
*శివ దర్శనం*
*కార్తీకమాసం సందర్భం గా రోజుకో శైవక్షేత్రం గురించి తెలుసుకుందాం*
*శ్రీలింగరాజస్వామి- భువనేశ్వర్ - ఒరిస్సా*
భువనేశ్వరం లో లింగరాజ ఆలయం పురాతనమైనదిగా ఉన్న అన్ని దేవాలయాలలో అతి పెద్దదిగా పరిగణించ బడుతుంది...
11 వ శతాబ్దంలో జైపూర్ రాజు తన రాజధానిని భువనేశ్వర్ నగరానికి మార్చినప్పుడు, అతను లింగరాజఆలయాన్ని నిర్మించే ప్రయాణాన్ని ప్రారంభించాడు.
బ్రహ్మ పురాణంలో ఈ ఆలయం గురించి ప్రస్తావించబడింది.
దేవాలయాల నిర్మాణం పూర్తయ్యే దశలో ఉండగా, జగన్నాథ్ స్వామి వారి ఆకృతిని పొందడం ప్రారంభించిందని, ఈ ఆలయంలో శివుడు మరియు విష్ణువు ఇక్కడ కొలువైఉన్న తీరు ఆధారాల ద్వారా నిరూపించబడింది...ఈ ఆలయం భారతదేశంలోని పురాతన నిర్మాణాలలో ఒకటి మరియు ఇది సుమారు 1000 సంవత్సరాల పురాతనమైన నిర్మాణమని చరిత్ర.
25000 చదరపు అడుగుల వైశాల్యంతో 15 కిలోమీటర్ల దూరం నుండి చూసినా కనిపించే 180
అడుగులయెత్తు ఆలయశిఖరం తో ప్రాంగణం లో 108 మందిరాలు, శివపరివారం మరియు నందీశ్వరుడు కి ప్రత్యేక మందిరం ఉన్నాయి.
*ఆలయంతో సంబంధం ఉన్న ఒక పౌరాణికకథ :-*
ఒకసారి శివయ్య తన ప్రియమైన పార్వతికి ఈ క్షేత్రం గురించి వివరించినప్పుడు, స్వయం గా తెలుసుకోవడానికి అమ్మవారు సాధారణ పశువుల కాపరి (గొల్లభామ) రూపంకు మారి నగరాన్ని అన్వేషించడానికి బయలుదేరారు. ఆమె తన ప్రయాణంలో ఉన్నప్పుడు, ఆమెను వివాహం చేసుకోవాలనుకున్న కృత్తి, వాస అనే ఇద్దరు రాక్షసులు ఆమె మార్గంలోకి అడ్డు వచ్చారు.
ఆమె నిరంతరం నిరాకరించిన తరువాత కూడా, వారు ఆమెను అనుసరిస్తూనే ఉన్నారు అప్పుడు అమ్మవారు తనను తాను సురక్షితంగా ఉంచుకోవడానికి ఆమె వారిని తనను భుజాల పై మోయమని కోరి భుజాలపై ఎత్తుకున్న తర్వాత వారిరువురిని అణగ తొక్కి తనను తాను విడిపించుకుంది...
ఈ సంఘటన తరువాత శివయ్య అమ్మవారి దాహార్తి తీర్చడం కోసం బిందుసరస్సు అనే పేరుతో పవిత్ర పుష్కరిణి సృష్టించాడు....ఈ సరస్సులో స్నానం కాశీ గంగా స్నానం తో సమానం. నిత్యం స్వామి అభిషేకానికి కావిళ్ళతో నీరు తీసుకు వెళ్తారు ఆలయం లోనికి ఏటా తెప్పోత్సవ సేవ జరుగుతుంది స్వామికి ఈ సరస్సులో ఈ సరస్సు చుట్టూ ఎన్నో ఆలయాలు నిర్మితమై ఉంటాయి.
*ఆలయ ప్రాంగణం లోని ఇతర ఆలయాలు:-*
ప్రధాన ఆలయాన్ని 4 విభిన్న భాగాలుగా విభజించారు, అవి శ్రీమందిర్ (గర్భాలయం)
జగన్మోహన మండపం (యజ్ఞశాల) నాట్యమందిరం (ఒడిశా నృత్యాలతో నృత్యార్చన) మరియు భోగమండపం (పితృ కర్మలు, తర్పణాలు ఇచ్చే వేదిక).ప్రాంగణం లో ప్రవేశించగానే పెద్ద రాతిస్తంభం దానిపై నందీశ్వరుడు దర్శన మిస్తాడు.ఇక్కడ గర్భాలయం, లింగ స్వరూపం స్వయంగా ఉద్భవించినవని నమ్ముతారు.
ఈ ఆలయం హరి-హర క్షేత్రంగా గౌరవించబడుతుంది, ఇది ఒక రహస్య అర్ధాన్ని కలిగి ఉంది. హరుడు విష్ణువు కోసం మరియు హరి శివుడి కోసం, ఇది కలిసి హరి-హరగా మారుతారు.
ఇక్కడి ఆలయంలో కార్తీకేయ , గణేశుడు మరియు పార్వతి దేవి వేర్వేరు దిశలో ఉంటారు. అమ్మ వారిని భువనేశ్వరి భగవతి గా కొలుస్తారు.. నాగచతుర్ధి కి నాగరాజ అలంకారం ప్రత్యేకం
*నైవేద్యం:-*
వరి అన్నమే నైవేద్యం
ప్రతీరోజు కొత్తకుండల్లో నివేదన రోజుకు 8 సార్లు భోగ్ హారతి పేరుతో నివేదన ఇస్తారు ముందుగా సూర్యుని పూజించి సంతృప్తి చేసి సూర్యకిరణాలు మహా నివేదనపై పడకుండా ప్రత్యేక మార్గం ద్వారా గర్భాలయం కు చేర్చి నివేదన సమర్పించే సంప్రదాయం ఇక్కడ అమలవుతోంది.
*మహా దీపారాధన :-*
ప్రతీ నెలా రెండు సార్లు జరుగుతుంది. మహా శివరాత్రికి మరింత ప్రత్యేకం దీపాలతో ప్రదక్షిణ చేయడం 'సమర్ధ'తెగకు చెందిన ప్రతినిధి కాగడా చేతబూని శిఖరం కు తాడుతో ఎగబ్రాకి శిఖరం పై దీప ప్రజ్వలన చేయడం ఆచారం.ఈ జ్యోతిని దర్శించి తన్మయు లవుతారు భక్తులు.
*శిఖరం పై పరశురాముని ధనస్సు :-*
ఈ క్షేత్రం లో శిఖరం పైభాగాన త్రిశూలం ఉండదు పరసురాముని ధనస్సు ఉంటుంది. ఆలయ నిర్మాణంలో కళింగ శైలి యొక్క జాడకనిపిస్తుంది. ఈ ఆలయం భారతదేశం యొక్క గొప్ప సంస్కృతిని వర్ణిస్తుంది, ఇక్కడ ప్రపంచం లోని వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు ఆలయం యొక్క ఆధ్యాత్మిక పారవశ్యం పొందటానికి ప్రయత్నిస్తారు.
🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔 #🌅శుభోదయం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🙏ఓం శ్రీ మాత్రే నమః🕉️ #🪔🕉️ అమ్మవారి అనుగ్రహం🙏🚩
_*సింహాచల చందనోత్సవం*_
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
‘కోటి పున్నములు ఒక్కసారి వచ్చి వెన్నెల వాన కురిసినట్లు, కోటి పద్మాలు రేకులు విప్పి జల జల తేనె కాలువలు చిందించినట్లు, కోటి హంసలు రెక్కల కాంతితో తళతళలు చిలికినట్లు, కోటి ముత్యాలు దండగా గుచ్చినట్లు’ శ్రీ సింహగిరి వాసుడి నిజరూపం సాక్షాత్కరించిందని అభి వర్ణించారు శ్రీ చందన శతక కర్త, విద్వత్కవివరేణ్యులు శ్రీ మానాప్రగడ శేషసాయి.
శ్రీహరి తన దశావతార వైభవంలోని మూడు, నాలుగు అవతారాల యుగళంగా దర్శనమిచ్చింది సింహాచలంలో శ్రీవరాహాలక్ష్మీ నరసింహస్వామిగా మాత్రమే. నరసింహస్వామి యోగ మార్గంలో అనాహతానికి, విశ్వంలో సూర్యమండలానికి, దేవలోకంలో సుదర్శన చక్రానికి ప్రతీక. వరాహస్వామి భూతత్త్వానికి, మూలాధారానికి, విశ్వ చైతన్య మూలానికి ప్రతీక. వరాహమూర్తి అనాహతం చేరుకున్నప్పుడు కుండలిని ఆత్మ తత్త్వాన్ని దర్శిస్తుందని పండితులు చెబుతారు.
దక్షిణ భారతదేశంలోని వైష్ణవ ఆలయాల్లో ప్రముఖమైనది సింహాచల క్షేత్రం. తూర్పు కనుమల్లో ప్రకృతి సౌందర్యం నడుమ వెలసిన స్వామి అశేష భక్త కోటికి ఇలవేల్పు. శ్రీ మహా విష్ణువు వరాహ రూపంలో హిరణ్యాక్షుని వధించాక, నరసింహ రూపంలో హిరణ్యకశిపుణ్ని సంహరించాడు.
హిరణ్యకశిపుడి పుత్రుడు పరమ విష్ణు భక్తుడు అయిన ప్రహ్లాదుడి కోరికపై స్వామి వరాహ నృసింహుడిగా వైశాఖ శుద్ధ తదియ నాడు వెలసి పూజలందు కుంటున్నాడని ప్రతీతి. స్వామిని ప్రహ్లాదుడు సేవిస్తున్న కాలంలోనే బ్రహ్మ మహేశ్వరుడితో, ఇంద్రాది దిక్పాలురతో సింహగిరికి తరలి వచ్చి బ్రహ్మోత్సవాలు జరిపించాడని పురాణ కథనం. ఇది కృతయుగం నాటి గాథ.
అనంతర కాలంలో స్వామికి ఆరాధనలు లేక ఆలయం శిథిలమై శ్రీవారిపై పుట్టలు లేచి దివ్య మంగళ విగ్రహం కను మరుగైంది.షట్చక్రవర్తుల్లో ఒకరైన పురూరవుడు ఊర్వశితో గగన మార్గాన విహరిస్తుండగా వారి విమానం స్వామి ఉన్న ప్రదేశం నుంచి ముందుకు సాగకుండా నిలిచిపోయింది. ఊర్వశి తన దివ్య దృష్టితో ఆ ప్రదేశంలో వరాహ నరసింహుడు ఉన్నాడని గ్రహించి పురూరవుడికి తెలిపింది. నాటి రాత్రి స్వామి పురూరవుడికి స్వప్నంలో కనిపించి తనను పుట్ట నుంచి బయటకు తీసి గంధాన్ని సమర్పించమన్నాడు. భూమికి గంధవతి అని పేరు. అందుకే పుట్ట మట్టికి బదులు గంధాన్ని సమర్పించ మన్నాడు. చక్రవర్తి సహస్ర కలశ గంగ ధారతో, పంచామృతాలతో స్వామిని అభిషేకించాడు.
*ఇది స్థల పురాణం.* హిరణ్యకశిపుడి వధానంతరం ఉగ్రనరసింహుని చల్లబరచడానికి దేవతలే చందనం పూశారని భక్తుల విశ్వాసం.వైశాఖ శుద్ధ తదియ నాడు అంటే చందనోత్సవం నాడు ఏడాది పొడవునా స్వామి దేహానికి పూసిన చందనాన్ని వలిచి, నిజరూప సందర్శనం కలిగిస్తారు.
అనంతరం స్వామికి తొలి విడతగా మూడు మణుగుల చందనం పూస్తారు. తరవాత వైశాఖ పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి దినాల్లో మూడేసి మణుగుల చందనంసమర్పిస్తారు. మూడు మణుగులు అంటే ఇప్పటి లెక్కల్లో 120 కేజీలని ఆ క్షేత్రంలోని పండితులు చెబుతారు.స్వామి వారి పూజా విధానం పాంచరాత్ర ఆగమ పద్ధతిలో జరుగుతుంది.
గోవిందరాజ స్వామి ఇక్కడ ఉత్సవ మూర్తి. మదనగోపాల స్వామి శయన మూర్తి. వేణుగోపాల స్వామి స్వప్న మూర్తి. యోగ నారసింహ మూర్తి బలి మూర్తి. సుదర్శనుడు చక్ర పెరుమాళ్. ఈ అయిదుగురు మూర్తులకు జరిగే నిత్యారాధనను ‘పంచభేరి’ అంటారు.ఈ ఆలయంలో ‘కప్పస్తంభం’ విలక్షణమైనది.
*అక్షయ తృతీయ రోజునే - చందనోత్సవం ఎందుకు ?*
ఈ రోజు మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. దాదాపు పన్నెండు గంటలపాటు ఈ నిజరూపదర్శనం సాగిన తరువాత తిరిగి స్వామి వారికి చందనాన్ని అలంకరిస్తారు. *ఇదంతా అక్షయ తృతీయ రోజునే జరగడానికి కారణం ఏమిటి ?*
పూర్వం తన భక్తుడైన ప్రహ్లాదుని కాపాడేందుకు , విష్ణుమూర్తి నరసింహ అవతారం దాల్చిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా తన కోసం సింహాచలం కొండ మీద శాశ్వతంగా కొలువుండమంటూ ప్రహ్లాదుడు నారసింహుని వేడుకున్నాడు.
ప్రహ్లాదుని కోరికను మన్నించి స్వామివారు ఇక్కడ వెలిశారు. ఆ స్వామివారికి బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించి , నిత్యం ఆయనను కొలుచుకునేవాడట ప్రహ్లాదుడు. అయితే కాలం మారింది. యుగం మారింది. సింహాచలం మీద ఉన్న ఆలయం శిథిలమైపోయింది. చాలా సంవత్సరాల తరువాత ఈ ప్రాంతానికి పురూరవుడు అనే రాజు విహారానికి వచ్చాడు. అప్పుడు ఆయనకు స్వామివారు కలలో కనిపించి.... తన విగ్రహం ఒక పుట్టచేత కప్పబడి ఉందనీ , ఆ పుట్టని తొలగించి తనని దర్శించమనీ చెప్పారు.
అప్పుడు పురూరవ మహారాజు సహస్ర ఘటాలతో పుట్ట మీద నీరు పోసి స్వామివారి నిజరూపాన్ని దర్శించారు. ఇదంతా జరిగింది అక్షయ తృతీయ రోజునే అని స్థలపురాణం చెబుతోంది.
ఉగ్రమూర్తి అయిన నరసింహుని రూపానికి ప్రకృతి యావత్తూ తల్లడిల్లిపోగలదు. అందుకనే తన మీద చందనాన్ని లేపనం చేయమని పురూరవునికి నారసింహుడు ఆదేశించారు. ఇక మీదట తన నిజరూపాన్ని ఏటా ఒక్కసారి మాత్రమే భక్తులు చూడగలరనీ , మిగతా సమయాలలో చందనపు పూతతో నిండిన తన నిత్యరూపాన్ని మాత్రమే చూస్తారనీ అనుగ్రహించారు.
అలా స్వామివారి ఆదేశంతో అక్షయ తృతీయ రోజున మాత్రమే ఆయన నిజరూపాన్ని దర్శించేందుకు చందనోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️ #🌅శుభోదయం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #💸అక్షయ తృతీయ శుభాకాంక్షలు🌟 #🛕సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి🕉️
🌿🌼 మహాగణపతి సంకట నాశన గణేశ స్తోత్రం ... ప్రతీరోజూ పఠిస్తే శ్రీ గణేశుని అనుగ్రహం వలన అన్ని సంకటాలు తొలగిపోతాయి 🌼🌿
🌿🌼 మనం ఏ కార్యం తలపెట్టినా, అది ఎటువంటి అవరోధాలు కలుగకుండా, విజయవంతంగా కొనసాగాలని ప్రప్రథమంగా శ్రీ విఘ్నేశ్వరుని ప్రార్ధిస్తాము. సకల సంకటాలనూ తొలగించే గణపతి అనుగ్రహం కోసం సంకట నాశన గణేశ స్తోత్రం భక్తి శ్రద్ధ విశ్వాసాలతో పఠిస్తే, శ్రీ గణేశ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఎవరికి వారు స్వయంగా, అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. ప్రతీరోజూ ఈ మహామహిమాన్వితమైన స్తోత్రాన్ని పఠించి, గణేశ అనుగ్రహం పొందుదాం. 🌼🌿
సంకటనాశన గణేశస్తోత్రమ్
నారద ఉవాచ :
ప్రణమ్య శిరసా దేవం , గౌరీపుత్రం వినాయకమ్,
భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే.
ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్,
తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్.
లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ,
సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్.
నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్,
ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్.
ద్వాదశ ఈతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః,
న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికారకం ప్రభో !
విద్యార్థీ లభతే విద్యాం, దనార్థీ లభతే ధనమ్,
పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్.
జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్,
సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః.
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్,
తస్య విద్యా భవేత్ సర్వా, గణేశస్య ప్రసాదతః
ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశన గణేశస్తోత్రం సంపూర్ణమ్.
🌿🌼🙏ఓం గం గణపతయే నమః🙏🌼🌿 #🌅శుభోదయం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🕉️ గణపతి బప్పా మోరియా #🙏శ్రీ వరసిద్ధి వినాయక స్వామి🕉️
సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం .🙏🏵️🙏
ఓం ఆదిత్యవిష్ణువిఘ్నేశరుద్రబ్రహ్మమరుద్గణాః |
లోకపాలాః సర్వదేవాః చరాచరమిదం జగత్ ||
సర్వం త్వమేవ బ్రహ్మైవ అజమక్షరమద్వయమ్ |
అప్రమేయం మహాశాంతం అచలం నిర్వికారకమ్ ||
నిరాలంబం నిరాభాసం సత్తామాత్రమగోచరమ్ |
ఏవం త్వాం మేధయా బుద్ధ్యా సదా పశ్యంతి సూరయః ||
ఏవమజ్ఞానగాఢాంధతమోపహతచేతసః |
న పశ్యంతి తథా మూఢాః సదా దుర్గతి హేతవే ||
విష్ణ్వాదీని స్వరూపాణి లీలాలోకవిడంబనమ్ |
కర్తుముద్యమ్య రూపాణి వివిధాని భవంతి చ ||
తత్తదుక్తాః కథాః సమ్యక్ నిత్యసద్గతిప్రాప్తయే |
భక్త్యా శ్రుత్వా పఠిత్వా చ దృష్ట్యా సంపూజ్య శ్రద్ధయా ||
సర్వాన్కామానవాప్నోతి భవదారాధనాత్ఖలు |
మమ పూజామనుగ్రాహ్య సుప్రసీద భవానఘ ||
చపలం మన్మథవశమమర్యాదమసూయకమ్ |
వంచకం దుఃఖజనకం పాపిష్ఠం పాహి మాం ప్రభో ||
సుబ్రహ్మణ్యస్తోత్రమిదం యే పఠంతి ద్విజోత్తమాః |
తే సర్వే ముక్తిమాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః
. #🌅శుభోదయం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🦚🙏ఓం శరవణ భవః🕉️🚩 #🦚శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి🕉️🚩
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ధ్యాన శ్లోకం:
షణ్ముఖం పార్వతీపుత్రం
క్రౌంచశైల విమర్దనం
దేవసేనాపతిం దేవం
స్కందం వందే శివాత్మజం
తారకాసుర హంతారం
మయూరాసన సంస్థితం
శక్తిపాణిం చ దేవేశం
స్కందం వందే శివాత్మజం.
శ్రీ సుబ్రహ్మణ్య స్వామిషొడషనామస్తొత్రం:
ప్రథమొ జ్ఞానషక్త్యాత్మా ద్వితీయొ స్కంద ఎవ చ
అగ్నిర్గర్భస్చత్రుతీయస్యాత్ బాహులెయస్చతుర్థకః
గాంగెయః పంచమొవిద్యాత్ షష్టః షరవణొత్భవః
సప్తమః కార్తికెయ స్యాత్ కుమారస్యాదథాష్టకః
🌿🌼🙏నవమః షణ్ముఖస్చ.🙏🌼🌿 #🌅శుభోదయం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🦚🙏ఓం శరవణ భవః🕉️🚩 #🦚శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి🕉️🚩
🌺🌺🌺🌹 ఆంజనేయ మతిపాటలాలనం కాంచనాద్రి కమనీయం విగ్రహం పారిజాతం తరుమూల వాసినం భావయామి పవమానందనమ్ యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాజ్ఞలిం బౌష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం సమత రాక్షసాస్తకమ్...🌷🌺🌺🌺 #🌅శుభోదయం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🕉️శ్రీ ఆంజనేయం #జై శ్రీ రామ్...🏹🕉️🚩
🌿🌼🙏శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి స్తోత్రం🙏🌼🌿
🌿🌼🙏శత్రు బాధలు, పిశాచ బాధలు, ఆరోగ్య సమస్యలువున్నవారు ప్రతినిత్యము అత్యంత శ్రద్ధతో శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం పఠించిన వారికి తప్పక శుభములు చేకూరగలవు.🙏🌼🌿
🌿🌼🙏ఐదు ముఖాలు పదిచేతులు అందలి ఆయుధములు తూర్పున వానరము , దక్షిణమున నారసింహ , పడమర గరుత్మాన్ , ఉత్తరాన వరాహం పై భాగాన హయగ్రీవ ముఖములు కల్గిఉండే మూర్తి.🙏🌼🌿
🌿🌼🙏ఒక్కొక్క ముఖానికి 3 నేత్రాలు .పూర్ణ రుద్రావతారం విభీషణుని కుమారుడు.నీలుని కొరకు అవతరించినమూర్తి🙏🌼🌿
శ్లో || విభీషణ సుతో నిలః సతతం సాధుపూజితః పంచవక్ర్త హనుమంత ముపాసే త్సమృద్దిభాక్
🌿🌼🙏మూలమంత్రము 🙏🌼🌿
“ ఓమ్ హరి మర్కట మర్కటాయస్వాహా ”
🌿🌼🙏శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి స్తోత్రం🙏🌼🌿
వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్రాంచితం
నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా
హస్తాబ్జె రసి ఖేట పుస్తక సుధాకుంభాం కుశా ద్రిం గదాం
ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం #🌅శుభోదయం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🕉️శ్రీ ఆంజనేయం #🌿🌼🙏శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి🙏🌼🌿
श्री हनुमान स्तुति
ॐ नमो हनुमते नमः। ॐ नमो हनुमते नमः॥
पवनपुत्र महावीर, रामदूत नमो नमः।
बुद्धिबलं यशो वीर्यं, देहि देहि नमो नमः॥
भयं नाशय दुःखं हर, शक्तिं धैर्यं च मे कुरु।
कार्यसिद्धिं करिष्यामि, त्वत्प्रसादात् नमो नमः॥
बालबुद्धिं प्रकाशय, चित्तशुद्धिं करोतु मे।
सदा मम पन्थानं रक्ष, हनुमन्त नमो नमः॥
ॐ नमो हनुमते नमः। ॐ नमो हनुमते नमः॥
❣️
🪷❤️🪷🩵🪷💖🪷🩷🪷💕
🪷🧡🪷🩶🪷🤍🪷💛🪷
🙏🙏
"कवन सो काज कठिन जग माही,
जो नहिं होइ तात तुम्ह पाहीं"
जय श्री राम, जय जय सियाराम 🚩🙏
जय बजरंगबली 🚩🙏 #🌅శుభోదయం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🕉️శ్రీ ఆంజనేయం #🚩 జై భబజరంగబలి🙏
నిద్రపోయే ముందు ఒక చిన్న మాట...🙏🙏😴😴 #😴శుభరాత్రి #😇My Status #✌️నేటి నా స్టేటస్ #💗నా మనస్సు లోని మాట #😇శివ లీలలు✨











