*అలసిన వానిని ఊరడించు మాటలు*
🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞
*సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన*
*అనుదిన ధ్యానములు*
🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇
*🌷🌷ఏప్రిల్ 20🌷🌷*
*“మనలో ప్రతివాడును తనను గురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను” (రోమా 14:12)*
మృతుల పునరుర్థానమును, నిత్యమైన తీర్పును అనునవి రక్షణ యొక్క ఐదవ, ఆరవ ప్రధానమైన నియమములు (హెబ్రీ. 6:1,2). ఒక దినమున మనము మృతుల పునరుర్ధానమును పొందుదుమని నమ్మవలెను (1 కొరింథీ 15:50-57). ఎవరైతే ఈ సత్యమును నమ్మరో వారు అజాగ్రత్తగా నుందురు. పునరుర్ధానమును గూర్చి నేను నమ్మునదేమనగా, నా ప్రభువు ఏ విధముగా తిరిగి లేచెనో, ఆ విధముగానే ఆయన నా కొరకు తిరిగి రానై యున్నాడు. నేను ఆయనను చూచినప్పుడు ఆయనను పోలియుందును. ఎవరైతే మృతుల పునరుర్ధానమును గూర్చి నమ్మరో వారు లోకసంబంధులుగా నగుదురు. ప్రభువు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడవలెనను కోరిక వారికుండదు.
ఈ దినము కొరకు సిద్ధ పరచబడుట కొరకే ప్రతి ఆదివారమున మనము ప్రభువు బల్లలో పాలు పొందుదుము. “మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్ర లోనిది త్రాగునపుడెల్ల ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు” (1 వ. కొరింథీ 11:26). మన నిమిత్తము మరణించిన ఏసు క్రీస్తు ప్రభువు మనలను తీసికొని వెళ్లుటకు, మనకు మహిమ శరీరములను ఇచ్చుటకు మరల తిరిగి రానై యున్నాడని ఆ విధముగా మనము ప్రచురించుదుము. మృతుల పునరుర్ధానము నందు విశ్వాసముంచుట ద్వారానే మనము లోక సంబంధమైన మోసముల నుండి రక్షింప బడితిమి.
ఈ భూమి మీద మన జీవితము గురించి లెక్క చెప్పుటకు ఒక దినమున మనము దేవుని ఎదుట నిలువ బడవలసి వచ్చును. “మనలో ప్రతి వాడును తనను గురుంచి దేవునికి లెక్క యొప్పగింపవలెను” (రోమ 14:12). మన మాటలను గురించి, క్రియలను గురించి దేవునికి లెక్క చెప్పవలెనని దీని యర్ధము. “నేను మీతో చెప్పునదేమనగా- మనుష్యులు పలుకు వ్యర్దమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి యుండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు (మత్తయి 12:36,37). నిత్యమైన తీర్పును గూర్చిన నమ్మకము మనము కలిగి యున్న యెడల మన మాటల విషయములో మిక్కిలి జాగ్రత్తగా నుందుము. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. అనుకొనకుండగానే అనేక సార్లు అర్ధములేని మాటలు మాట్లాడుదుము. నిత్యమైన తీర్పునందు నమ్మకముంచు వారు తమ ధనమును గాని, సమయమును గాని, శక్తిని గాని వ్యర్థ పుచ్చరు. మెలకువ కలిగి జీవించుటలో మనము మిక్కిలి జాగ్రత్తగా ఉండవలెను.
హెబ్రీ 6: 1,2 లలో చెప్పబడిన ప్రాముఖ్యమైన ఆరు నియమములు కలసి యుండును. మనము వాటిని వేరు చేయలేము. నిర్జీవ క్రియల విషయమై నీవు పశ్చాత్తాప పడిన యెడల, దేవునియందు విశ్వాసముంచిన యెడల, నీటి బాప్తిస్మము నందు, హస్త నిక్షేపణము యందు సాక్ష్యమిచ్చిన యెడల, మృతుల పునరుర్ధానము నందు, నిత్యమైన తీర్పు నందు నీవు విశ్వాసముంచిన యెడల నీవు బలమైన పునాది మీదకు వచ్చి, ఆత్మీయముగా ఎదిగెదవు.
Please share
🙏🏼Praise the LORD.🙏🏼
#📝అనుదిన వాక్యము #⛪దేవుని వాక్యము ✝