*శ్రీలంక అండర్ 19 క్రికెటర్లు అరెస్ట్*
* శ్రీలంక అండర్ 19 టీమ్కు చెందిన ఇద్దరు క్రికెటర్లు అరెస్టు అయ్యారు. హోటల్ బాత్రూమ్లో మహిళలను అసభ్యకరంగా వీడియోలు తీశారనే ఆరోపణలపై వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కొలంబోలో చోటుచేసుకుంది. అరెస్టు అనంతరం వారిని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. మహిళల వీడియోలను ఆన్లైన్లో షేర్ చేశారా అనేదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై శ్రీలంక క్రికెట్ బోర్డు ఇంతవరకు స్పందించలేదు.#cricket #cricket news 📰🗞️ #news #sharechat
*మండల టాపర్గా ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని*
* ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రతిభకు కొదువలేదని మరోసారి నిరూపిస్తూ ఎ.కొండూరు మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన విద్యార్థిని మోటూరి అనూష పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది.#news #apnews #sharechat
*గల్ఫ్లో కొత్త ఆట*
* ఒపెక్ నుంచి వైదొలగాలన్న యూఏఈ నిర్ణయం ఆకస్మికమే అయినా.. అనూహ్యం కాదు! కూటమిలో పరిమితుల కారణంగా తన ఉత్పత్తి సామర్థ్యాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేక ఆ దేశం చాన్నాళ్లుగా అసంతృప్తితో ఉంది.#news #sharechat
*మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు*
హైదరాబాద్: మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. గాయని మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలించారు. రమావత్ మధు బ్యాంకు ఖాతా నుంచి శివ అకౌంట్కు మూడు సార్లు డబ్బులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఖాతాలో డబ్బులు జమ అయిన తరువాత రోజే విత్ డ్రా అయినట్లు తెలిసింది. రమావత్ మధు బ్యాంకు ఖాతాలను సైబరాబాద్ పోలీసులు సీజ్ చేశారు. మధు, హిమకాంత్ రెడ్డి, శివచౌహాన్ల బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలని బ్యాంకులకు లేఖ రాశారు.#news #sharechat
*ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా*
* ఏపీ వ్యాప్తంగా ఇంధన సరఫరా సాధారణ స్థితికి చేరింది. 4,345 బంకుల్లో కొత్తగా 47 మినహా అన్నింటా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయి. కంపెనీల నుంచి బంకులకు 3,714 కిలోలీటర్ల పెట్రోల్, 7,107 కిలోలీటర్ల డీజిల్ సరఫరా చేశారు. మూడు జిల్లాల్లో మాత్రమే పదికిపైగా బంకుల్లో నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పశ్చిమగోదావరి, కడప, తిరుపతి జిల్లాల్లో మూతపడిన బంకులకు స్టాక్ సరఫరాకు అధికారులు చర్యలు చేపట్టారు.#news #sharechat
*ఫొటో పెట్టి మరీ ట్రంప్ వార్నింగ్*
చర్చల విషయంలో ఇరాన్ సరిగ్గా వ్యవహరించలేకపోతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ‘ట్రూత్ సోషల్’లో పోస్టు చేశారు. అణు ఒప్పందం ఎలా చేసుకోవాలో వారికి తెలియడం లేదన్నారు. వారు తెలివిగా వ్యవహరిస్తే మంచిదని హితవు పలికారు. ‘ఇక మీదట అంత మంచి వాడిగా ఉండను’ అని పేర్కొంటూ రైఫిల్ పట్టుకున్న ఫొటోను ట్రంప్ షేర్ చేశారు. #news #sharechat
*పెట్రోల్ను అంటారు కానీ.. ధరలతో ఆటాడించేది డీజిలే*
* పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల చమురు ధర భగ్గుమంటోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు, మార్కెట్లపై ఇది ప్రభావం చూపిస్తోంది. #news #sharechat
*శునకాల రక్తంతో వ్యాపారం..!*
* పిడికెడు అన్నం పెడితే చాలు.. శునకాలు జీవితాంతం ఆ మనిషిని గుర్తుపెట్టుకుని విశ్వాసంగా ఉంటాయి. అలాంటి వాటిని కొందరు డబ్బు కోసం అపహరించి.. వాటి రక్తాన్ని అమ్ముకుంటున్న ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది.#news #sharechat
ప్రజలకు ఆఫర్ ప్రకటించిన ప్రభుత్వం
AP: గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్ను చెల్లించేవారికి ప్రభుత్వం 5శాతం రాయితీ ఆఫర్ ప్రకటించింది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆస్తి పన్నును వచ్చే ఏడాది మార్చి వరకు చెల్లించవచ్చు. అయితే మే 1 నుంచి 31 లోపు చెల్లించేవారికి ఈ రాయితీ వర్తించనుంది. స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ట్యాక్స్ కట్టవచ్చు. ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. #news #apnews #sharechat













