Sekhar Digitals & Reporter 9603197203
ShareChat
click to see wallet page
@sekhar9603197203
sekhar9603197203
Sekhar Digitals & Reporter 9603197203
@sekhar9603197203
Reporter & Digital's Studio
#🏛️రాజకీయాలు #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ *రేపటి నుంచి శుభకార్యాలకు బ్రేక్‌* శుభకార్యాలకు 36 రోజుల పాటు బ్రేక్‌ పడనుంది. ఈ నెల 18 నుంచి వచ్చేనెల జూన్‌ 18 వరకు అధిక జ్యేష్ఠ మాసం(మూఢమి) కావడంతో వివాహాలకు బ్రేక్‌ పడనుంది. ఈ క్రమంలో ఈనెలలో ఆఖరి ముహూర్తమైన 13న పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరగనున్నాయి. మళ్లీ జూన్‌ 19 నుంచి వివాహాధి శుభకార్యాలు ప్రారంభం కానున్నాయి. __________________________ *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 4️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/2opEPGh68Zq0FMQqQWreQy?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🏛️రాజకీయాలు - వెళ్లిక్ుశుభకార్యాలకుబ్రేక వెళ్లిక్ుశుభకార్యాలకుబ్రేక - ShareChat
#📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు *'స్థానిక' ఎన్నికలకు ఏర్పాట్లు చేయండి* *రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిలచంద్ర పునేఠ..* మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీకి ముందు చేప ట్టాల్సిన ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఎన్నికల ముందస్తు కార్యక్రమాల పురోగతిపై ఆయన అధికారులతో ఎస్ఈసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. నగర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన కొనసాగుతోందని,ఈ డీలిమిటేషన్ ప్రక్రియకు జూన్ 26వరకు గడువు ఉందని మున్సిపల్ శాఖ అధికారులు చెప్పారు. గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితాల ప్రచురణ పూర్తయిందని, మున్సిపాలిటీల్లోనూ ప్రచురణ చేపట్టాలంటే వార్డుల పునర్విభజన పూర్తి కావాల్సి ఉందని వివరించారు. బీసీ రిజర్వేషన్ల నిర్ధారణకు అవసరమైన డెడికేషన్ కమిషన్ పరిశీలన కొనసాగుతోందని అధికారులు తెలిపారు.. __________________________ *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 4️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/2opEPGh68Zq0FMQqQWreQy?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
📰ఈరోజు అప్‌డేట్స్ - 4 గామపంచాయతికార్యాందుము  35 4 గామపంచాయతికార్యాందుము  35 - ShareChat
#రైతులు #రైతులు #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్ *అన్నదాత కంట కన్నీరు..!!* *చేతికొచ్చిన పంట నీటిపాలు.!* *కళ్ళముందే ధాన్యం మొలకలు..* *దిక్కుతోచని స్థితిలో రైతులు...* *✍️..పై ప్రత్యేక కథనం..రిపోర్టర్ :- శేఖర్📲..9603197203..✍️* ప్రకృతి ప్రకోపానికి తోడు అధికారుల నిర్లక్ష్యం తోడై కాట్రేనికోన మండలంలోని రైతాంగం తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. చేతికొచ్చిన వరి పంట నీట మునిగి, కళ్లముందే ధాన్యం మొలకలు వస్తుంటే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నారు.​మండలంలోని చెయ్యేరు, లక్ష్మీవాడ, పెనుమల్ల, బంటుమిల్లి, ఉప్పూడి, కాట్రేనికోన, నడవపల్లి, కందికుప్ప, పల్లంకుర్రు తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నది. ఇంత జరుగుతున్నా, గ్రామ స్థాయిలో వ్యవసాయ అధికారులు కనీసం పంటను పరిశీలించిన దాఖలాలు లేవని రైతులు మండిపడుతున్నారు. లక్ష్మీవాడ గ్రామంలో తాను పండించిన రెండు ఎకరాల వరి పంట ఇటీవల కురిసిన వర్షాలకు నీట మునిగి మొలకలు వచ్చి నష్టపోయానని స్థానిక రైతు కాండ్రేగుల సింహాద్రి రావు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పంట నష్టంపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సర్వే (ఎన్యూమరేషన్) ప్రారంభం కాలేదు. అధిక తేమ కారణంగా ధాన్యం రంగు మారి, మొలకలు వస్తుండటంతో బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు సిండికేట్‌గా మారి తక్కువ ధరకు అడుగుతున్నారు.​ప్రభుత్వ ధాన్య కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకుందామన్నా రైతులకు కష్టాలు తప్పడం లేదు..​"ధాన్యం అమ్మాలంటే నిబంధనలు రైతులకు సౌకర్యంగా ఉండటం లేదంటున్నారు . గోనె సంచులు, జట్టు కూలీలు , వాహనాలను తామే సమకూర్చుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెట్టుబడి పెట్టి నష్టపోయిన మాకు, మళ్లీ చేతిలో నగదు లేక ఇబ్బంది పడుతున్నాం" అని పలువురు రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఈ బాధలు పడలేక బయట వ్యాపారులకు అయినకాడికి అమ్మేసికుంటున్నారు.వ్యవసాయ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి, నష్టపోయిన ప్రతి ఎకరాను నమోదు చేయాలని రైతులు కోరుతున్నారు.తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని ఎటువంటి కోతలు లేకుండా ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటున్నారు.​ ఉచితంగా గోనె సంచులు సరఫరా చేసి, ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతున్నారు. తడిసిన ధాన్యం ను ​ఒబ్బిడి చేసుకోవడానికి కూడా వీలులేని పరిస్థితుల్లో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకోకపోతే, అప్పుల ఊబిలో కూరుకుపోతామని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి కాట్రేనికోన రైతులకు అండగా నిలవాలని కోరుతున్నారు. మండల వ్యవసాయ అధికారిని మృదులను వివరణ కోరగా ఇటీవల మండలంలో కురిసిన వర్షాలకు *135 ఎకరాలు వరి పంట పనల పై మునిగి దెబ్బతిన్నట్లు గుర్తించామన్నారు. రాశుల్లో 250 పనులు ధాన్యం తడిసిందన్నారు.* ప్రభుత్వం నుండి దెబ్బతిన్న వరి పంటను గుర్తించి నష్టాలు అంచనాకు ఆదేశాలు ఏమీ రాలేదని వ్యవసాయ అధికారిని తెలిపారు.. __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 4️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/2opEPGh68Zq0FMQqQWreQy?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
రైతులు - ShareChat
#💪పాజిటీవ్ స్టోరీస్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం *అభివృద్ధికి నోచుకోని ఇసుకపర్ర..* *మత్స్యకారుల జీవనోపాధికి గండి..* నిరసన వ్యక్తం చేసినానేటికీ దక్కని ఫలితం.. *✍️..పై ప్రత్యేక కథనం..రిపోర్టర్ :- శేఖర్📲..9603197203..✍️* అసెంబ్లీలో లేవనెత్తిన ముమ్మిడివరం నియోజకవర్గం *ఎమ్మెల్యే దాట్ల* కాట్రేనికోన, మండల పరిధిలో గచ్చకాయలపోర,.పల్లం, చిర్రయానం, గెద్దనపల్లి, దొంతికుర్రు మొదలైన గ్రామ ప్రాంతాలను ఆనుకొని సుమారు నాలుగువేల హెక్టార్లలో పర్ర భూమి విస్తరించి ఉంది . దశాబ్దాలు తరబడి ఈ భూమి మట్టితో పూడికపోయింది. దీనికి తోడు సముద్రం నుండి ఈ పర్ర లోకి ప్రవేశించే నీరు మొగ మూసుకుపోవడంతో ఆగిపోయింది. ఈ పర్ర పై ఆధారపడి సుమారు *పదివేల మంది మత్స్యకారులు వారి కుటుంబాలు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఆధారపడ్డాయి.* *పర్ర ప్రత్యేకత* : పర్ర భూమి ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది. ఒకే విధమైన లోతు కలిగి ఉండి మహిళలు,పిల్లలు సహా అందరూ వేట చేయడానికి అనువుగా ఉంటుంది. వేసవికాలంలో మోకాలు లోతు, వర్షాకాలంలో మొల లోతు మాత్రమే కలిగి ఉంటుంది. దీంతో స్థానిక మత్స్యకారులు చిన్నపాటి పడవలు, దోనెలు వంటి వాటిని ఉపయోగించి వేట కొనసాగిస్తారు. ఎక్కువ శాతం నడక, మోచేతి వలలు ఊస వలన వేట కొనసాగుతుంది. *గతమెంతో ఘనం* *నేడు దైన్యం* : ఈ పర్ర గతంలో సముద్రపు ఆటుపోట్లకు నీరు వచ్చి వెళ్లే విధంగా ఉండేది. పూడికలు ఏర్పడిన ప్రతిసారి దివంగత లోక్ సభ స్పీకర్ జిఎంసి బాలయోగి వీటి అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు. డ్రెడ్జర్ల తొలగింపు చేసే కార్యక్రమాలను ప్రోత్సహించేవారు. దీంతో మత్స్య సంపద ఎక్కువగా లభించడంతో చేపల వేటలు కూడా ఎక్కువగా ఉండేవి. పరిస్థితుల్లో మార్పు కారణంగా మొగలు మూసుకుపోవడంతో సముద్రపు నీరు పర్ర లోకి చేరకపోగా నాచు విపరీతంగా పెరిగిపోయి పూడికలు పెరిగిపోయాయి. క్రమేపి ఈ పర్ర పై ఆధారపడి జీవించేవారు ఇతర జీవనోపాదులను వెతుక్కోవాల్సి వచ్చింది. *పెరిగిన వలసలు* : స్థానిక మత్స్యకారుల జీవనోపాధికి గండిపడడంతో వలసలు మొదలయ్యాయి.హైదరాబాదు,గుంటూరు,విశాఖపట్నంవంటి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. *మొగ పునరుద్ధరణ* *పై* *ఉద్యమం* : పూడికపోయిన మొగను భవిష్యత్తులో పూడికకు అవకాశం లేకుండా పునరుద్ధరించాలని మండలానికి చెందిన పలువురు మత్స్యకారులు మత్స్యశాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వరావు ఆధ్వర్యంలో సుమారు రెండు నెలల క్రిందట ఈ ప్రాంతంలో ఉద్యమం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పిల్లలు సైతం పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం..మొగను పునరుద్ధరించడంతోపాటు,పర్రభూముల్లో ఆక్రమణలను పూర్తిగా తొలగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. కొంతమంది ఆక్రమణదారులు పర్ర భూములను ఆక్రమించుకుని రొయ్యల చెరువులుగా మార్చేశారని నాగిడి నాగేశ్వరరావు తదితరులు మండిపడ్డారు.. *అసెంబ్లీలో లేవనెత్తిన ఎమ్మెల్యే* : ముమ్మిడివరం ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు మొగ పునర్ధరణ, ఆక్రమణల తొలగింపు విషయమై అసెంబ్లీలో మాట్లాడారు. కానీ నేటికీ ఇది కార్యరూపం దాల్చలేదు.. *మత్స్యకారుల* *డిమాండ్లు ఇవి* : పర్ర లోకి సముద్రపు నీరు వచ్చి పోయే విధంగా సముద్రపు మొగలను అభివృద్ధి చేయాలి, డ్రెడ్జర్ సహాయంతో పర్ర లో పూడికలను తొలగించాలి, కర్ర భూములో ఆక్రములను స్వాధీనం చేసుకోవాలి, చేపల వేటల విషయంలో గ్రామాల మధ్య వివాదాల తలెత్తకుండా శాంతి కమిటీలు వేయాలి.. __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 4️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/2opEPGh68Zq0FMQqQWreQy?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
💪పాజిటీవ్ స్టోరీస్ - ~ ~ - ShareChat
#🆕Current అప్‌డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్ *సిరిపల్లి సొసైటీలో రూ. 15 లక్షల నిధుల గోల్మాల్‌..!!!* అయినవిల్లి మండలం సిరిపల్లె ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (PACS)లో భారీ అవినీతి వెలుగుచూసింది. అమాయక రైతు పేరు మీద అతనికి తెలియకుండానే లక్షలాది రూపాయల రుణం డ్రా చేసి, సొసైటీ సిబ్బంది చేతివాటం ప్రదర్శించిన తీరు స్థానికంగా కలకలం రేపుతోంది. *​..అసలేం జరిగింది..???* ​సిరిపల్లి సొసైటీలో ఖాతా కలిగిన ఒక రైతు పాస్‌బుక్‌ను ఆసరాగా చేసుకున్న సిబ్బంది, గత ఏడాది సుమారు రూ. 15 లక్షల అప్పును మంజూరు చేయించారు. ఆ నిధులను రైతుకు అందజేయకుండా పక్కదారి పట్టించి గోల్‌మాల్ చేశారు. తాజాగా, సదరు రుణం గడువు ముగియడం, వాయిదా చెల్లించాలంటూ బ్యాంక్ నుండి రైతుకు నోటీసులు రావడంతో ఈ బాగోతం బయటపడింది.​షాక్‌కు గురైన రైతు వెంటనే సొసైటీ కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా, తన పేరు మీద భారీ మొత్తంలో అప్పు ఉన్నట్లు తెలిసి నివ్వెరపోయాడు. తాను తీసుకోని అప్పుకు నోటీసులు రావడంపై బాధితుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు.​తెర వెనుక రాజకీయ చక్రం..???​ఈ అవినీతి వ్యవహారం బయటకు పొక్కడంతో బాధ్యులైన సిబ్బందిని కాపాడేందుకు రంగంలోకి దిగినట్లు సమాచారం.​ఈ విషయాన్ని పెద్దది చేయకుండా లోలోపలే సర్దుబాటు చేసేందుకు రాజకీయ నాయకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు..నిధుల రికవరీ లేదా ఆ అప్పును ఏదో ఒక విధంగా మాఫీ చేయించి, సిబ్బందిపై చర్యలు తీసుకోకుండా అడ్డుకునేందుకు లాబీయింగ్ జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.​సహకార సంఘాల్లో రైతుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఇలాంటి అక్రమాలకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా సహకార శాఖ అధికారులు స్పందించి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.. __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- పి.గన్నవరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 4️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/2opEPGh68Zq0FMQqQWreQy?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🆕Current అప్‌డేట్స్📢 - అమా ஒலகு అమా ஒலகு - ShareChat
#📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్‌డేట్స్📢 *రాజోలు లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్ లు* రాజోలు మండలం - పొన్నమండ లో ఘటన రాజోలు ఎంపీపీ కడలి శ్రీ దుర్గ మెడలో పుస్తెలు తాడు తెంపుకుపోయిన దుండగులు రాజోలు ఎంపీపీ మెడలో పుస్తెలు తాడు తెంపుకుపోతే... సామాన్యులకు ఏంటి రక్షణ అని వాపోతున్న స్థానికులు.. __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- రాజోలు - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 4️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/2opEPGh68Zq0FMQqQWreQy?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
📰ఈరోజు అప్‌డేట్స్ - ShareChat
#🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ *ఓటు ఉంటేనే ఆధార్ ... ఆధార్ ఉంటేనే ఓటు..!!!* *రికార్డుల్లో లేని మనిషి.. ఆధార్ చట్రంలో నలిగిపోతున్న శ్రీనివాసరావు..!!!* *✍️..పై ప్రత్యేక కథనం..రిపోర్టర్ :- శేఖర్📲..9603197203..✍️* ​ అతనో సామాన్యుడు..చదువు అబ్బలేదు కానీ, రెక్కాడితే గానీ డొక్కాడని బతుకు అతనిది. 50 ఏళ్లుగా ఈ గడ్డపైనే పుట్టి పెరిగాడు. కానీ నేడు 'నేను ఉన్నాను' అని నిరూపించుకోవడానికి ఆ అక్షరాల కార్డు అతని దగ్గర లేదు. అదే 'ఆధార్' అది లేకపోవడంతో నేడు ప్రభుత్వ రికార్డుల్లో అతను అస్తిత్వం లేని వ్యక్తిగా మిగిలిపోయాడు. కాట్రేనికోన మండలం, లక్ష్మీవాడకు చెందిన చొల్లంగి శ్రీనివాసరావు పడుతున్న వ్యధ ఇది. శ్రీనివాస రావు సమస్య ఒక విచిత్రమైన ఉచ్చు లాంటిది..*రేషన్ కార్డు కావాలన్నా, బ్యాంక్ ఖాతా తెరవాలన్నా, కనీసం ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నా ఆధార్ తప్పనిసరి..* ఆధార్ కోసం వెళ్తే ఓటర్ కార్డు అడుగుతున్నారు. తీరా ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేస్తే ఆధార్ కార్డు అడుగుతున్నారు. ఈ రెండింటి మధ్య శ్రీనివాస రావు ఏళ్ల తరబడి నలిగిపోతున్నాడు..నివాస ధృవీకరణ కోసం రెవెన్యూ అధికారులను ఆశ్రయించినా, ఫలితం లేని పరిస్థితి నెలకొంది.​ ఉమ్మడి జిల్లా కేంద్రమైన కాకినాడ, పిండాల చెరువు వద్ద ఉన్న ప్రధాన ఆధార్ సేవా కేంద్రానికి ఆయన ఎన్నో సార్లు ఆధార్ కార్డు నమోదుకు వెళ్ళాడు..కాట్రేనికోన తహసీల్దార్ సంతకం చేసిన నివాస ధృవీకరణ పత్రాన్ని సమర్పించినా, అక్కడ సిబ్బంది,అధికారులు 'ఇది చెల్లదు..ఓటర్ కార్డు తీసుకురావాల్సిందే' అని వెనక్కి పంపేస్తున్నారు..ఆధార్ అథారిటీ నిబంధనల ప్రకారం గెజిటెడ్ ఆఫీసర్ ధృవీకరణ చెల్లుబాటు కావాల్సి ఉన్నా, క్షేత్రస్థాయిలో శ్రీనివాస రావు లాంటి అమాయకులకు చుక్కలు కనిపిస్తున్నాయి.​"నాకు ఈ దేశంలో ఆధార్ పొందే హక్కు లేదా..? కనీసం ఓటు వేసే హక్కును కూడా అధికారులు కల్పించరా? ఏళ్లు గడుస్తున్నా నా గోడు ఎవరూ వినడం లేదు. ఆధార్ లేకపోతే నేను బతికున్నా లేనట్టేనా..?" అంటూ శ్రీనివాస రావు ఆవేదనగా ప్రశ్నిస్తున్నాడు..​ఆధార్ లేకపోవడం వల్ల అతను ఏ ప్రభుత్వ సంక్షేమ పథకానికి దరఖాస్తు చేసుకోలేకపోతున్నాడు. వృద్ధాప్యం దరి చేరుతున్న తరుణంలో, రేషన్ కార్డు కూడా లేకపోవడంతో అతని జీవనం ప్రశ్నార్థకంగా మారింది.​డిజిటల్ భారత్ అని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో, ఒక నిరుపేద వ్యక్తి తన ఉనికిని చాటుకోవడానికి ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగడం వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. ప్రత్యేక కేసుగా పరిగణించి, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి అతనికి ఆధార్, ఓటర్ కార్డు అందేలా చూడాలని లక్ష్మీవాడ గ్రామస్తులు కోరుతున్నారు.​ఓ మనిషిని రికార్డుల్లోకి చేర్చి, అతనికి పౌర హక్కులు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఈ సమస్య ఒక్క శ్రీనివాసరావు వ్యక్తిగత సమస్యే కాదు. ఇలాంటి అడ్రస్సు లేని వారు ఎందరో ఆధార్ కార్డులు పొందలేక ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ పడిగాపులు పడుతున్నారు. అక్కడి ఆధార్ నిబంధనలు వారి పాలిట శాపంగా మారాయి.అయినా ఇలాంటి అభాగ్యులకు నేటికీ ఆధార్ అందక అనేక ఇక్కట్లు పడుతున్నారు. ఆధార్ సంస్థ ఇటువంటి వారి విషయంలో ప్రత్యేకంగా పరిగణించి నిబంధనలు సడలించి ఆధార్ కార్డులు జారీ చేయాలని బాధితులు కోరుతున్నారు. ఇకనైనా ప్రభుత్వాలు ప్రత్యేక కేసులుగా పరిశీలించి గుర్తింపు లేని వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి ఆధార్ కార్డులు జారీ చేసి ఆదుకోవాలని వారు కోరుతున్నారు..
🆕Current అప్‌డేట్స్📢 - ShareChat
#📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు *​దొంతికుర్రులో అక్రమ చెరువుల తవ్వకం* *..నిబంధనలు బేఖాతరు..* కాట్రేనికోన మండల పరిధిలోని దొంతికుర్రు గ్రామ సర్వే నంబర్ 227లో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న అక్రమ చెరువుల తవ్వకాలు స్థానిక రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే శుక్రవారం రాత్రి నుంచి భారీ ప్రోక్లైన్లతో ఇక్కడ తవ్వకాలు ప్రారంభించడం కలకలం రేపుతోంది. శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో తవ్వకాలకు ముహూర్తం పెట్టుకుని మూడు ప్రోక్లైన్లు తో తవ్వేస్తున్నారు. వాటికీ ​అనుమతులు లేవు.తవ్వకాలు మాత్రం జోరు గా సాగుతున్నాయి.​ *సర్వే నంబర్ 227 పరిధిలోని సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ తవ్వకాలు జరుగుతున్నాయి* కేవలం మూడు ఎకరాలకు మాత్రమే అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ, సంబంధిత అధికారుల నుండి ఇంకా ఎటువంటి అధికారిక అనుమతులు మంజూరు కాలేదు. అయినప్పటికీ, ఈ భూములను లీజుకు తీసుకున్న వ్యక్తులు ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ అక్రమంగా చెరువులు తవ్వేస్తున్నారు.​ఈ అక్రమ తవ్వకాల వల్ల పరిసర ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు:​పంటలు, కొబ్బరి చెట్లు దెబ్బతినే అవకాశం ఉంది.పక్కనే ఉన్న సాగు భూములు ఈ తవ్వకాల వల్ల ఉప్పు భూములుగా మారే ప్రమాదం ఉంది.పంట కాలువల్లోకి చెరువుల నీరు చేరి కలుషితం అయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రధాన తీర ప్రాంత గ్రామమైన పల్లం రక్షిత మంచినీటి పథకం కు ఈ కాలువ నీటినే వినియోగిస్తారు. తవ్వకాల వల్ల నీరు కలుషితమైతే వేలాది మంది ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు.​శనివారం సాయంత్రం తహసీల్దార్ రవికిరణ్ ఆదేశాల మేరకు ఆర్. ఐ విశ్వనాథ్, వీఆర్వో నరసింహమూర్తి పోలీసులను వెంటబెట్టుకుని సంఘటనా స్థలానికి చేరుకుని పనులను తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ, తవ్వకాలకు ఉపయోగిస్తున్న ప్రోక్లైన్లను సీజ్ చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు వెళ్ళిన తర్వాత మళ్లీ పనులు మొదలవుతాయేమోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.వెంటనే రెవెన్యూ, ఫిషరీస్ అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలను శాశ్వతంగా నిలిపివేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్కడ ఉన్న యంత్రాలను సీజ్ చేయాలని స్థానికులు కోరుతున్నారు.. __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 4️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/2opEPGh68Zq0FMQqQWreQy?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
📰జాతీయం/అంతర్జాతీయం - ShareChat
#🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం *అవగాహనలేని ఇరిగేషన్ అధికారుల తీరుపై రైతుల ఆగ్రహం..* డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విలస గ్రామ పంచాయితీ పరిధిలో సిరిపల్లి నుండి అమలాపురం వైపు ప్రవహించే ప్రధాన పంట కాలవపై ప్రైవేటు వ్యక్తులు కల్వర్ట్ (చిన్న వంతెన) నిర్మాణ పనులు చేపట్టడం పట్ల రైతులు ఆందోళనకు గురవుతున్నారు. గ్రామం చివరలో లేఅవుట్ అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఈ నిర్మాణానికి సంబంధించి అధికారిక అనుమతులు ఎవరు ఇచ్చారో తెలియకపోవడం వివాదాస్పదంగా మారింది. రైతుల వివరాల ప్రకారం ప్రస్తుతం నిర్మిస్తున్న వంతెన బాటం కాలవ లోతు కంటే ఎత్తుగా ఉండటంతో భవిష్యత్తులో నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు. వర్షాకాలంలో కాలవ నీరు కిందకు సక్రమంగా వెళ్లక పంట పొలాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు నిర్మాణ పనులను పరిశీలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. కాలవ వెడల్పు, నీటి ప్రవాహ సామర్థ్యం, భవిష్యత్ అవసరాలను పరిగణలోకి తీసుకోకుండా పనులు కొనసాగుతున్నాయని ఆరోపిస్తున్నారు..ఉన్నతాధికారుల నుండి కల్వర్ట్‌కు డిజైన్ మరియు డ్రాయింగ్ అప్రూవల్ రాకుండానే నిర్మాణ పనులు ప్రారంభించడమేకాక, ప్రభుత్వానికి సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించకుండా పనులు చేపట్టడం వలన భవిష్యత్తులో రైతులకు సాగునీరు అందక ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..తక్షణమే ఈ నిర్మాణ పనులను నిలిపివేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే “ప్రజా సమస్యల ప్రజావేదిక” కార్యక్రమంలో అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. అధికారులను ఫోన్ ద్వారా రెండు మూడు పర్యాయాలు సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందన లభించలేదని రైతులు ఆరోపిస్తున్నారు..ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు.. __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 4️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/2opEPGh68Zq0FMQqQWreQy?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🏛️రాజకీయాలు - ShareChat
#🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం రహదారిపై ప్రయాణిస్తున్న వాహనాల రికార్డులను పరిశీలించిన ఎస్సై జానీ భాష.. *హెల్మెట్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి అపరాధ రుసుము విధించిన ఎస్.ఐ..* ఉప్పలగుప్తం మండలం *ఎస్.ఐ షేక్ జానీ బాషా,* సిబ్బందితో కలిసి సింగరాయపాలెం సెంటర్‌లో వాహనాల తనిఖీ చేపట్టారు. హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, సరైన వాహన పత్రాలు లేకుండా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చలానాలు విధించారు.. __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 4️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/2opEPGh68Zq0FMQqQWreQy?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - డిబిటల్స్ 88%6%03197203 edEvaram Pindnra Pradesh Wa 2025,1/41 605*85 9603197203 3e e 2026.1738 Godsuari Andhra Pracesh eua {268ಬe * 5~85 9603197203 {  FlaetaLaram  rdhiaac 202636 డిబిటల్స్ 88%6%03197203 edEvaram Pindnra Pradesh Wa 2025,1/41 605*85 9603197203 3e e 2026.1738 Godsuari Andhra Pracesh eua {268ಬe * 5~85 9603197203 {  FlaetaLaram  rdhiaac 202636 - ShareChat