బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
594 views • 3 days ago
అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తున్న అతిసార ( డయేరియా ) - అదమరిస్తే అంతే సంగతులు!
లేదా
వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు,గ్రామ పంచాయితీ సిబ్బంది అతిసార నివారణకు యుద్ధప్రాతిపదికన తక్షణమే చర్యలు చేపట్టాలి!
ప్రస్తుతం కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అతిసార వ్యాధి ( డయేరియా ) ప్రమాద ఘంటికలు మ్రోగిస్తున్నది అనే మాట మనందరికీ విధితమే. అయితే తాగునీటి పైపుల లీకెజీ,తాగునీటి బావుల ప్రక్కన చెత్త చెదారం పేరుకుపోవడం,తాగునీటిని సరఫరా చేసే ట్యాంకులను సకాలంలో శుభ్రం చేయకపోవడం,ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్యం విషయంలో వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు,గ్రామ పంచాయితీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధాశక్తులు కనబరచకపోవడం వంటి ప్రదాన కారణాలు వెరసి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అతిసార వ్యాధి దాటికి పలువురు మృత్యువాత పడటం,మరి కొంతమంది ఆస్పత్రి పాలు కావడంతో పాటు అతిసార వ్యాధి అనేది ప్రస్తుత పరిస్థితిలో అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తుండటం కూడా ఎంతైనా ఆందోళనకరమైన విషయం .అంతేకాకుండా గ్రామాలలోని ప్రజలకు కాచి వడబోసి మరీ తాగునీటిని తాగాలనే విచక్షణ జ్ఞానం, స్ప్రహ లేకపోవడం,అపరిపక్వత,వారి ఇంటి పరిసరాలను అపరిశుభ్ర వాతావరణానికి నిలయంగా చేసుకోవడం,తాగునీటి లీకేజీల వల్ల డ్రెయినేజీ మురుగు కలవడం ఇలాంటి పలు అంశాలు అన్ని కూడా ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా డయేరియా కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరగడానికి కారణభూతమవుతున్నాయి అనే మాట అక్షర సత్యం. అంతేకాదు ఏజెన్సీ గ్రామాలలోని కొన్ని ప్రాంతాలలో శానిటేషన్ మెరుగుదలకు వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు గాని,గ్రామ పంచాయితీ సిబ్బంది గాని యుద్ధ ప్రాతిపదికన ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల ఈ అతిసార వ్యాధి అనేది చాప కింద నీరులా విస్తరించడానికి ఓ కారణభూతంగా నిలుస్తున్నది అనే మాట సత్యదూరం కాదు.అదేమాదిరి మన భారతదేశంలో సాంకేతిక టెక్నాలజీ రోజు రోజుకు ఎంతో అభివృద్ధి పథంలో పయనిస్తూ,కొత్త పుంతలు తొక్కుతూ,దిన దినాభివృద్ధి చెందుతున్నప్పటికి పారిశుద్యం,తాగునీటి సరఫరా వ్యవస్థ మాత్రం ఎందుకనో గ్రామాలలో ఆశాజనకమైన రీతిలో అంతగా అభివృద్ధి చెందక,అద్వానస్థితిలో కొట్టుమిటాడుతుండటం వల్ల అతిసార వ్యాధి గ్రామీణ ప్రాంతాల్లో తమ ప్రతాపాన్ని చాలా తీక్షణంగా చూపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడే స్థాయికి చేరుకోవడం ఎంతైనా అత్యంత బాధాకరమైన విషయం.
ఏదిఏమైన ' అలస్యం అమృతం విషం ' అని మన పెద్దలు తరచుగా అంటూ వుంటారు కదా,ఆ విధంగా ఇప్పటికయినా మన రాష్ట్ర ప్రభుత్వాల వారు ఈ అతిసారవ్యాధిని నియంత్రించే విషయంలో ఏ మాత్రం అలసత్వానికి తావు ఇవ్వకుండా వైద్య,ఆరోగ్య,గ్రామ పంచాయితీ శాఖ అధికారులు అతిసార వ్యాధి మరింతగా ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, వాటి నియంత్రణకు అవలంభించాల్సిన తక్షణ సత్వర చర్యలపై దిశా నిర్దేశం చేసేలా ఓక ప్రత్యేక హుకుం జారీచేయాల్సిన గురుతర బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం వారిపై ఎంతైనా వుంది.ఏమైనా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు,గ్రామ పంచాయితీ సిబ్బంది ఈ అతిసార వ్యాధి ప్రబలకుండా వారంతా మకుమ్మడిగా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి కూడా మన గ్రామాలలోని ప్రజలు సైతం ఈ అతిసార వ్యాధి నివారణకు తమ వంతుగా ఓక చైతన్య పంథాలో ముందుకు వెళ్లి,ఓ అంకితభావం, చిత్తశుద్ధి తో పారిశుద్యం,శుచి - పరిశుభ్రతలకై విశేష కృషి సల్పితేనే చాలా సంతృప్తికరమైన సంపూర్ణ ఫలితాలు మనం అనుకున్నస్థాయిలో చూడగలుగుతాము అనడంలో ఎలాంటి అవాస్తవానికి తావు లేదు.పరిశుభ్రమైన నీరును మనమంతా సేవిద్దాం - అతిసార (డయేరియా) వ్యాధిని తరిమి తరిమి కొట్టి మరీ మన ఆరోగ్యాన్ని అత్యంత సురక్షితంగా కాపాడుకోవడమే కాదు,మరో వైపు మనమంతా ఓ రక్షణాత్మకమైన పంథాలో ముందుకు వెళ్తూ మన అమూల్యమైన జీవితాలను మరో పది కాలాల పాటు అత్యంత దిగ్విజయంగా కాపాడుకుందాం.జైహింద్!✍️✍️✍️
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #డయేరియా #ఏపీలో డయేరియా కలకలం..
11 likes
11 shares