విశాఖ ఉక్కు👊ఆంధ్రుల హక్కు💪
19 Posts • 3K views
P.Venkateswara Rao
649 views 2 months ago
#విశాఖ ఉక్కు👊ఆంధ్రుల హక్కు💪 #పవన్ కళ్యాణ్ *జనసేన మాత్రమే టార్గెట్..❗* SEPTEMBER 2, 2025🎯 ఇటీవల కాలంలో జనసేనపై నెగెటివిటీ పెరుగుతోంది. కూటమిలో టీడీపీ, బీజేపీ, జనసేన ఉన్నాయి. మూడు పార్టీలో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచాయి. అయితే కొన్ని కీలక అంశాల్లో జనసేన మాత్రమే టార్గెట్ కావడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, అలాగే సుగాలి ప్రీతి కేసు విషయంలో జనసేన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రధాన కారణం... కేంద్రంలోని మోదీ సర్కార్. ఏదైనా వుంటేనే, ఆ పార్టీ వివరణ ఇచ్చుకోవాలి. కానీ అలా జరగడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ట కరణపై ఇటీవల డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ వివాదాస్ప కామెంట్స్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులు నాడు జగన్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. అలాగే కొందరు నాయకులు ప్లాట్లు తీసుకుని, సర్దుబాటు చేసుకున్నారని ఆయన అన్నారు. ఇది స్టీల్ ప్లాంట్ కార్మికులకు తీవ్ర కోపం తెప్పించింది. అలాగే 2017లో చంద్రబాబు పాలనలో సుగాలి ప్రీతి హత్యాచారానికి గురైంది. ఆ కేసును అప్పట్లో ప్రభుత్వం పట్టించుకోలేదన్న విమర్శ వుంది. ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందో, ఆ కేసు విషయమై పవన్కల్యాణ్ తీవ్రస్థాయిలో దాడి చేశారు. వైసీపీ హయాంలోనే సుగాలి ప్రీతిపై అఘాయిత్యం జరిగిందన్న సంకేతాలు వెళ్లాయి. నిజానికి జగన్ హయాంలోనే సుగాలి ప్రీతి కుటుంబానికి అంతోఇంతో న్యాయం జరిగింది. ఆ విషయం ప్రచారం చేసుకోవడం చేతకాలేదు. సుగాలి ప్రీతికి అన్యాయం చేశారనే ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున జనంలోకి వెళ్లి, రాజకీయంగా నష్టం జరిగింది. ఇప్పుడు అదే సుగాలి ప్రీతి కేసు జనసేన మెడకు చుట్టుకుంది. ఈ కేసు విషయమై టీడీపీ, బీజేపీ నోరు మెదపడం లేదు. మరీ ముఖ్యంగా సీఎం చంద్రబాబు, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అసలు ఆ అమానుష ఘటన ఏపీలోనే జరగలేదన్నట్టు మౌనం పాటిస్తుండడం విశేషం. అందుకే జనసేన ఎక్కువ టార్గెట్ అవుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్, అలాగే సుగాలి ప్రీతి విషయంలో జనసేన నెగెటివిటీని ఎదుర్కొంటుండగా, పాజిటివిటీ మాత్రం చంద్రబాబు, లోకేశ్ ఖాతాల్లో పడుతుండడం విచిత్ర పరిణామం.
10 likes
14 shares
P.Venkateswara Rao
1K views 2 months ago
#విశాఖ ఉక్కు👊ఆంధ్రుల హక్కు💪 *హోదా లాగానే ఉక్కు కూడానా❓* SEPTEMBER 2, 2025🎯 ఏపీకి ఒకటి పోయింది. రెండవది డౌట్లో పడింది. కానీ జరుగుతున్న వ్యవహారం చూస్తే కనుక మొదటి దానిలాగానే అంతా కనిపిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. అలా 2014లో కేంద్రంలో బీజేపీ ఏపీలో టీడీపీ మిత్రపక్షాలు గదెనెక్కాయి. మూడేళ్ళ పాటు హోదా అదిగో ఇదిగో... హోదా ఎక్కడికీ పోదు అన్నది. చివరికి తెలింది ఏమిటి అన్నది అందరికీ తెలిసిందే. హోదా పోయింది. తమాషా ఏమిటి అంటే ప్రత్యేక హోదా అన్న అంశాన్ని ప్రస్తావిస్తూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మీద అవిశ్వాసం తెలుగుదేశం పార్టీ పెట్టింది. కానీ 2024 ఎన్నికల ముందు విశ్వాసం వచ్చేసింది. పాచిపోయిన లడ్డూలు అంటూ ప్రత్యేక ప్యాకేజి గురించి మాట్లాడిన జనసేన కూడా ఆ తరువాత ప్రత్యేక హోదా ఊసే ఎత్తలేదు. ఇపుడు చూస్తే అచ్చం అదే సన్నివేశం అగుపిస్తోంది. విశాఖ ఉక్కు ఎక్కడికీ పోదు అంటున్నారు. ప్రైవేట్ పరం కానే కాదు అని అంటున్నారు. ఒక పక్క చూస్తే కీలక విభాగాలు అన్నీ ప్రైవేట్ పరం అవుతున్నా అంతా బాగుంది అన్నట్లుగా దేవతా వస్త్రాల కధలను వినిపిస్తున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని దాన్ని నిలబెట్టుకుంటామన్న మాటలు అన్ని పార్టీలు చేస్తున్నాయి. ఆనాడు ప్రత్యేక హోదా విషయంలో వారిని వీరు వీరిని వారు అంతా అనుకుని చివరికి ముంచేశారు. అన్నీ గల్లీ పోరాటాలే చేశారు తప్ప అంతా కలసి ఒక్కటిగా ఢిల్లీ వరకూ వెళ్ళి నిలదీయలేదు. ఇపుడు కూడా ఉక్కు విషయంలో టీడీపీ స్థానంలో వైసీపీ వచ్చి విమర్శలు చేస్తోంది. పోరాటాలకు సిద్ధం అంటోంది. అయితే ఈ పోరాటాలు అన్నీ గల్లీలోనే ఎందుకు ఢిల్లీకి అంతా కలసి ఒక్కటిగా వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయరాదా అన్నది జనం మాటగా ఉంది ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అంతా కలిసి బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారు. బీజేపీకి అన్నింటా వెన్నంటి ఉంటున్నారు. బీజేపీ బలం లేకపోయినా ఏపీ ఎంపీల బలంతోనే కేంద్రంలో అధికారంలో ఉంది అన్నది కూడా తెలిసిందే. ఇంతలా ఏపీ మీద ఆధారపడిన కేంద్రాన్ని ఆ ఒక్కటీ తీర్చరూ విశాఖ ఉక్కుని మా హక్కుగా వదిలేయరూ అని ఎందుకు ముచ్చటకు అయినా అడగలేకపోతున్నారు అన్నదే అంతా మాట్లాడుకుంటున్న విషయం. నిన్న హోదా పోయింది నేడు ఉక్కు సంగతి అంతేనా అన్న సందేహాలు వస్తున్నాయంటే ఏపీ రాజకీయ పార్టీల అంతా బాగుంది అంటూ ఊరిస్తూ చెబుతున్న మాటలే అంటున్నారు.
15 likes
10 shares
P.Venkateswara Rao
2K views 3 months ago
#విశాఖ ఉక్కు👊ఆంధ్రుల హక్కు💪 *ఉక్కు పోరాటం వైసీపీ చేతికి..❗* 19.08.2025🎯 విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నది అరవై ఏళ్ళ క్రితం ఒక బలమైన నినాదం. ఆ నినాదం గల్లీ నుంచి ఢిల్లీ దాకా వినిపించింది. ఆనాటి ఉక్కు మహిళ దేశ ప్రధాని అయిన ఇందిరాగాంధీని సైతం పోరాటం కదిలించింది. దాంతో విశాఖ ఉక్కు కర్మాగారం ఆంధ్రుల ఆంక్ష అలా నెరవేరింది. అయితే ఆది నుంచి ఎన్నో అవాంతరాల మధ్య విశాఖ ఉక్కు కర్మాగారం సాగుతోంది. సొంత గనులు లేకపోవడం పెద్ద లోటు. లాభాలను ఆర్జించే సామర్థ్యం ఉన్నా కాళ్ళూ చేతులూ కట్టేసినట్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎన్నో సార్లు బలిపీఠం ఎక్కిన విశాఖ ఉక్కుకు గత నాలుగైదు ఏళ్ళుగా గడ్డు రోజులే దాపురించాయి. ప్రైవేట్ విషయంలో ఎలాగైనా ముందుకు సాగాలన్న పాలకుల ఆలోచనల ముందు ఉక్కు ఉద్యమం గెలుస్తుందా లేదా అన్నదే ఇపుడు అందరికీ కలిగే సందేహం. ఒక వైపు ప్రైవేట్ లేదంటూనే మరో వైపు చేయాల్సింది చకచకా చేస్తున్నారు. దాంతో విశాఖ ఉక్కు భవిష్యత్తు అగమ్యగోచరం అవుతోంది. తాజాగా ఉక్కులో 32 విభాగాలను ప్రైవేట్ పరం చేయడానికి నిర్ణయించారు. దాంతో మరోసారి ఉక్కు విషయంలో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం కానీయమని అంటోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ పాపం కూటమి ప్రభుత్వానిదే అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కులో 32 విభాగాలను ప్రైవేటీకరణ చేసే దిశగా టెండర్లు పిలవటం ద్వారా ఎన్నికలకు ముందు ఉక్కు కార్మికులుకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి మోసం చేసింది అని వైసీపీ నేతలు అంటున్నారు. ఆంధ్రులు హక్కు అయిన విశాఖ ఉక్కు విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెనక్కు తీసుకునే విదంగా కూటమి ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేవాలని వైసీపీ నేతలు డిమాండు చేస్తున్నారు. అదేవిధంగా తొలగించిన కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. 32 విభాగాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కార్మిక సంఘాలు ప్రజలతో కలిసి విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు నినాదంతో వైసీపీ ఉద్యమిస్తుందని అంటున్నారు.
22 likes
28 shares