తెలంగాణా రాజకీయాలు 🚩🚩😁

174 Posts • 30K views
P.Venkateswara Rao
630 views 1 months ago
#తెలంగాణా రాజకీయాలు 🚩🚩😁 *అక్క‌డ ప‌వ‌న్ వేగం పెంచితే.. బీఆర్ఎస్ నెత్తిన పాలు❗* 20.06.2026🎯 తెలంగాణ‌లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌రికొత్త‌గా అడుగు పెట్టారు. హైద‌రాబాద్‌లో పార్టీ కార్యాల‌యాన్ని కూడా ప్రారంభించారు. తెలంగాణ‌లో ఇక‌పై ఉధృతంగా రాజ‌కీయాలు చేస్తాన‌ని ఆయ‌న అంటున్నారు. జ‌న‌సేన ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తుంద‌ని చెప్పారు. కేర‌ళ‌, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లోనే విస్త‌రిస్తున్నామ‌ని చెబుతున్న‌ప్పుడు, సాటి తెలుగు రాష్ట్ర‌మైన త‌మిళ‌నాడులో రాజ‌కీయం చేయ‌డం పెద్ద విష‌య‌మేమీ కాదు. అయితే తెలంగాణ‌లో ప‌వ‌న్ రాజ‌కీయ అడుగులు వేయ‌డం అంటే బీఆర్ఎస్ నెత్తిన పాలు పోయ‌డ‌మే అనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదే సంద‌ర్భంలో తెలంగాణ‌లో అధికారంలోకి రావాల‌ని క‌ల‌లు కంటున్న బీజేపీని నీట ముంచ‌డ‌మే. మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీని రాజ‌కీయంగా దెబ్బ‌తీయ‌డానికి ప‌వ‌న్ ప‌రోక్షంగా దోహదం చేస్తార‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా హైద‌రాబాద్‌లో జ‌న‌సేన కార్యాల‌యాన్ని ప‌వ‌న్ ప్రారంభించ‌డం ఎలాంటి వివాదానికి చోటు లేకుండా సాగిపోయింది. ప‌వ‌న్ అడుగు పెట్ట‌డం వ‌ల్ల త‌మ‌కు లాభ‌మ‌ని బీఆర్ఎస్ నేత‌ల‌కు బాగా తెలుసు. అందుకే మొద‌ట ప‌వ‌న్‌ను తెలంగాణ‌లో రాజ‌కీయాల్ని సీరియ‌స్‌గా చేసేలా ముగ్గులోకి దింపుతున్నారు. అస‌లు క‌థ ఎన్నిక‌ల స‌మ‌యంలో వుంటుంద‌ని బీఆర్ఎస్ నేత‌ల‌కు బాగా తెలుసు. తెలంగాణ‌కు వ్య‌తిరేకంగా డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేసిన ఘాటు వ్యాఖ్య‌ల్ని బీఆర్ఎస్‌, అలాగే అక్క‌డి ప్ర‌జాసంఘాల నాయ‌కులు, జ‌ర్న‌లిస్టులు సిద్ధం చేసుకున్నారు. అదును చూసి, ప్ర‌యోగించ‌డానికి తెలంగాణ వ్య‌తిరేక అస్త్రాన్ని రెడీ చేసుకున్నార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడే ప‌వ‌న్‌పై ప్ర‌యోగించాల‌ని అనుకోలేదు. ఈ నెల మొద‌టి వారంలో తెలంగాణ ఆవిర్భావ దినాన్ని పుర‌స్క‌రించుకుని ఏదో చేయాల‌ని ప‌వ‌న్ అనుకుంటే, అక్క‌డి స‌మాజం ఏ రకంగా విరుచుకుప‌డిందో చూశాం. తెలంగాణ‌లో నివాసం వుండ‌డానికి, అలాగే రాజ‌కీయాలు చేయ‌డానికి త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని వారు చెబుతున్నారు. అయితే తెలంగాణ ఏర్పాటునే కించ‌ప‌రిచే వ్యాఖ్య‌లు చేస్తూ, మ‌రోవైపు ఆ రాష్ట్ర శ్రేయోభిలాషి అంటే ఒప్పుకునే ప‌రిస్థితే వుండ‌ద‌నేది ఆ స‌మాజ నిశ్చితాభిప్రాయం. ఈ నేప‌థ్యంలో నిజంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ తెలంగాణ‌లో సీరియ‌స్‌గా రాజ‌కీయాలు చేయాల‌ని అనుకుంటే మాత్రం, అదంతా బీఆర్ఎస్‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. ప‌వ‌న్ కార‌ణంగా తెలంగాణ‌లో మ‌రోసారి సెంటిమెంట్ ర‌గులుతుంది. 2018లో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుని, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసింది. చంద్ర‌బాబు రూపంలో మ‌రోసారి సీమాంధ్ర పాల‌న సాగించాల‌ని అనుకుంటున్నార‌ని కేసీఆర్ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. దీంతో అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశాన్ని చంద్ర‌బాబు కార‌ణంగా కాంగ్రెస్ కోల్పోయింది. 2028లో కూడా ఇదే జ‌రుగుతుంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ రూపంలో బీజేపీ సీమాంధ్ర పాల‌న తీసుకురావాల‌ని అనుకుంటోందంటూ బీఆర్ఎస్ అస్త్రం ప్ర‌యోగిస్తుంది. ఆ దెబ్బ‌కు బీజేపీ, కాంగ్రెస్ రాజ‌కీయంగా తీవ్రంగా న‌ష్ట‌పోవ‌డం ఖాయ‌మ‌ని ప‌లువురు అంటున్నారు. అంతిమంగా బీఆర్ఎస్ రాజ‌కీయంగా ల‌బ్ధి పొందుతుంది. బీఆర్ఎస్‌తో ప‌వ‌న్‌క‌ల్యాణ్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని, అక్క‌డ రాజ‌కీయాలు చేయాల‌ని అనుకంటున్నారా? అనే అనుమానం కూడా కొంద‌రిలో లేక‌పోలేదు. మ‌రీ ముఖ్యంగా బీఆర్ఎస్ నేత‌ల‌తో త‌న‌కు గొడ‌వ లేద‌ని ప‌వ‌న్ అంటుండ‌డాన్ని వారు గుర్తు చేస్తున్నారు. రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే.
9 likes
13 shares
P.Venkateswara Rao
12K views 2 months ago
#తెలంగాణా రాజకీయాలు 🚩🚩😁 #ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯 *బస్తీమే సవాల్… లై డిటెక్టర్ టెస్టుకు రెడీయా… పీకేకు కేవీపీ సవాల్…⁉️* June 5, 2026🎯 కేవీపీ రామచంద్రరావు… అవును, మరిచిపోయారా..,? వైఎస్ ఆత్మ అనేవాళ్లు అప్పట్లో… ఆ ఆత్మకూ, వైఎస్ కొడుకు ఆత్మకూ శృతి కుదరలేదు… ఆస్తులు, బినామీ సంపాదన ఎట్సెట్రా ఏం యవ్వారాలున్నాయో తెలియదు గానీ… ఆయన పాపం, కాంగ్రెస్‌లోనే ఉండిపోయాడు… పార్లమెంటులో తెలంగాణ విభజన బిల్లుపై చర్చ సమయంలో కూడా ఓ ప్లకార్డు పట్టుకుని స్పీకర్ పోడియం దగ్గర రాయిలా నిలబడిపోయాడు… సహజంగానే ఆయన మొహంలో భావోద్వేగాలు కనిపించవు… ఆయన తెలంగాణ కాంగ్రెసో, ఏపీ కాంగ్రెసో కూడా ఎవరికీ అంతుపట్టదు… కానీ జగన్ మాత్రం తనను అస్సలు దగ్గరకు రానివ్వలేదు, ఏవో సహేతుక కారణమే అయి ఉంటుంది… కేసీయార్ ప్రభుత్వ హయాంలో ఏదో కులచక్రం తిప్పాడు అంటారు గానీ నిర్ధారణలు, ఆధారాలు ఉండవు, అలా కనిపించడం కేవీపీకి అలవాటే ఉండదు కూడా… ఇప్పుడిదంతా ఎందుకూ అంటే… పవన్ కల్యాణ్ అనే కేరక్టర్ విజ్ఞత కోల్పోయి జాగీర్‌దార్ భాషలో అందరి మీద ఏవేవో వ్యాఖ్యలు చేసేస్తున్నాడు కదా అదుపు తప్పి… చివరకు గద్దర్ మీద కూడా… పనిలోపనిగా ఎక్కడో వైఎస్ మీద కూడా ఏదో తూలాడు… తన మీద కేసులు పెట్టాలని ఎవరో ఐపీఎస్‌ను వైఎస్ ఆదేశించాడట… అదుగో అక్కడ కాలింది కేవీపీకి… ఏయ్, ఏం మాట్లాడుతున్నావ..? వైఎస్ మీద మాట తూలితే బాగుండదు అని నేరుగా చెప్పొచ్చు కదా… లేదు, అత్యంత విచిత్రమైన శైలిలో ఓ లేఖ రాశాడు… ఆయన తత్వం, మాటతీరు, కెరీర్ లాగే ఓపట్టాన అర్థం కాదు… వాక్యం వాక్యం కూడబలుక్కుని కష్టపడితే తప్ప… ఈ లేఖను ఎవరు రాసిచ్చారో గానీ… నమోనమః… విదేశాంగశాఖలో ఉండాల్సినవాడు… ఇంతకీ అందులో ఏమంటాడయ్యా అంటే..? ‘‘ఏమయ్యా పవన్ కల్యాణ్, నువ్వు ప్రజారాజ్యం యువవిభాగంలో ఉన్నప్పుడు ఏదేదో మాట్లాడితేనే వైఎస్ నిన్నేమీ అనలేదు… కేసులు పెట్టలేదు… అలాంటి వైఎస్ తరువాత నీమీద కేసులు పెట్టాలని ఐపీఎస్ ఆఫీసర్లను పురమాయించాడని నిందలేల..? అసలు వైఎస్‌కూ ఇప్పటి వైసీపీకి సంబంధం లేదని తెలియదా నీకు..? వైఎస్ మరణించి 17 ఏళ్లయినా వైఎస్ మీద నిందలేమిటి..? నీమీద కేసులు పెట్టాలని వైఎస్ ఆదేశించాడని అంటున్నావు కదా, సదరు ఐజీ ఎవరో లైడిటెక్టర్ పరీక్షకు తీసుకురా, నిజం తేలితే నేను 10 కోట్లు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తా, లేదంటే నువ్వు చెప్పినోడికి ఇస్తా, సవాల్ స్వీకరించు’’ అని సవాల్ చేశాడు… కష్టమ్మీద ఆ లేఖ చదివితే అర్థమైంది ఇదే… వివరాలు కావాలంటే పైన పీడీఎఫ్ లింక్ చదవండి… ఇక్కడ మరో డౌట్, 10 కోట్లు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు దేనికి..? సదరు ఐజీ తెలంగాణ కేడర్‌లో ఉన్నాడా..? లేక కేవీపీ కూడా తెలంగాణ కాంగ్రెస్‌లోనే ఉన్నాడనా..? ఇంతకీ ఆ ఐజీ ఎవరో..!! ఐనా రాజకీయ బలప్రత్యర్థి చంద్రబాబు వియ్యంకుడు ఓ కాల్పుల సంఘటనలో అడ్డంగా దొరికితేనే క్షమించేసి వదిలేసిన వైఎస్ అప్పట్లో ఏమీకాని పవన్ కల్యాణ్ మీద కేసులు పెట్టాలని సూచించాడా..? హేమిటో… నోటికి ఏదొస్తే అది వాక్రుచ్చడమే కదా పవన్ స్టయిల్..!!
92 likes
1 comment 100 shares
P.Venkateswara Rao
683 views 2 months ago
#తెలంగాణా రాజకీయాలు 🚩🚩😁 *పవన్ కల్యాణ్‌కు తెలంగాణ నిజతత్వం తెలిసింది… మాట మారింది…‼️* June 4, 2026🎯 మామూలుగా పవన్ కల్యాణ్ భాషే అది… అర్థం లేని ఆవేశం, మాటలో దురుసుతనం, ఆలోచనరాహిత్యం వంటివి చాలా కనిపిస్తాయి… దీనికితోడు అహంతో ‘ఎవడబ్బ జాగీర్’ వంటి జాగీర్దార్ భాష సరేసరి… తెలంగాణ మీద పదే పదే విషాన్ని, ద్వేషాన్ని కురిపించే తను మళ్లీ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి గోకబోయాడు… తెలంగాణ సమాజం స్పందన అర్థమైంది… జాలిమ్ కౌన్‌రే ఉస్‌కా జులుమ్ క్యారే… అని ఏళ్లుగా పోరాడుతూనే ఉన్న నేల ఇది… బరాబర్ ఇది మా జాగీరే, నువ్వు అయ్యోడివా, అవ్వోడివా అని ప్రతి పరాయోడినీ అడుగుతుంది… నిన్న అమరావతికి వెళ్లేసరికి కిక్కు దిగింది, తత్వం అర్థమైంది… అక్కడ అంటున్నాడు ఇలా… ‘‘రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లయినా తగ్గలేదు తెలంగాణ సెంటిమెంట్… తెలంగాణ, తమిళనాడుల్లో ప్రాంతీయ అస్థిత్వం బలంగా ఉంది… కులాల మధ్య పంచాయితీలే తప్ప ఏపీలో ఆంధ్రా అనే భావనే లేదు… తెలంగాణలో పోటీచేసే ఉద్దేశమేదీ వ్యక్తిగతంగా లేదు… పార్టీ నాయకులు పిలిస్తే మీటింగుకు సరేనన్నాను… చిన్న ఘటన గాలివానైంది… సభకు అనుమతిస్తే వివాదం ఉండకపోయేది…’’ ఇలా చెబుతూ పోయాడు… పన్నెండేళ్లయింది ద్వేషం తగ్గింది అనుకున్నాననే మాటా చెప్పాడు… నిజానికి ద్వేషం తెలంగాణకు లేదు, ఏపీ సమైక్య నాయకులదే ద్వేషం… పదే పదే పవన్ కల్యాణ్‌లాగే బయటపడిపోతుంటారు… కానీ తను చెప్పింది నిజం… ఆత్మమథనం… ఏపీలో కులాల కొట్లాట తప్ప పాలన లేదు, సరైన రాజకీయం లేదు… తను అన్నట్టు సభకు అనుమతిస్తే వివాదం ఉండకపోయేది అనేదీ తప్పు… మరిన్ని కూతలు వచ్చేవి కదా ఆ నోటి వెంట… ఒకవైపు తెలంగాణ ఆవిర్బావదినం జరుపుకుంటుంటే, ఈ ద్వేష, విష వ్యాఖ్యలు వినాలా తెలంగాణా… అందుకే రేవంత్ రెడ్డి సమావేశానికి అనుమతి నిరాకరించి, ఓ కాలుష్య ప్రవాహానికి అడ్డుకట్ట వేశాడు… తను మరో మంచి పనిచేశాడు… పవన్ కూతలపై ఒక్క ముక్క కూడా స్పందించలేదు, పవన్ కల్యాణ్‌ను ఓ నాయకుడిగా, తను స్పందించాల్సిన రేంజ్ ఉన్న నాయకుడిగా గుర్తించకపోవడం అది… పవన్ కల్యాణ్ వంటి విద్వేషులకు అది సరైన జవాబు… నిజానికి పవన్ కల్యాణ్‌ ఏదేదో మాట్లాడేస్తాడు, ఒక వాక్యానికీ, తరువాత వాక్యానికీ పొంతన ఉండదు, కంట్రాస్టు కూడా… ప్రాంతీయ వాదం ఉగ్రవాదంకన్నా ప్రమాదం అంటాడు… ప్రాంతీయ ఆకాంక్షలు- పోరాటాల బాధ తెలిస్తే కదా… మరి పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర కోసం చేసిన పోరాటం ప్రాంతీయ వాదం కాదా..? మళ్లీ తనే అంటాడు పొట్టి శ్రీరాములుకూ కులాన్ని అంటగట్టారని..! ఆయన్ని ఓన్ చేసుకున్న కులం మీలాంటి ఆధిపత్య కులాల్లాగా రాజకీయాలు చేయలేదు… భాషా ప్రయుక్త రాష్ట్రాలకు శ్రీరాములు త్యాగమే కారణం అంటాడు… మద్రాస్ నుంచి ఆంధ్ర వేరుపడింది 1953లో… భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది 1956లో… (ఆరోజే తెలంగాణ మెడకు ఉరి బిగించారు)… అసలు ఏపీకి ఓ అవతరణ దినమే లేదనే సోయి పవన్ కల్యాణ్‌కు ఉందా… జూన్ 2 ను గుర్తించరు… ఆంధ్ర మద్రాస్ నుంచి వేరుపడిన అక్టోబరు ఒకటిని గుర్తించరు… ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నవంబర్ 1 కూడా గుర్తించరు… అఫ్‌కోర్స్, నవంబరు ఒకటి అనేది ఆప్ట్ కాదు, అప్పుడు ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు లేదు… సరే, ఇదంతా పక్కన పెడితే… చంద్రబాబు సన్నాయినొక్కులు కూడా ఓసారి ప్రస్తావించాలి… ‘విడిపోయి పన్నెండేళ్లయింది, మళ్లీ ద్వేషం పెంచే ధోరణి సరికాదు, సమావేశానికి అనుమతించాలి’ అంటున్నాడు… ద్వేషం పెంచే ధోరణి నీ భాగస్వామి పవన్ కల్యాణ్‌ది, చెప్పాల్సింది తనకు… ఎవడబ్బ జాగీర్ అనే భాషను మాట్లాడతాను, అదీ తెలంగాణ అవతరణదినం రోజే మీటింగు పెడతాను అంటే ఎందుకు అంగీకరిస్తుంది తెలంగాణ… నువ్వూ మారవు, నీ పవన్ కల్యాణూ మారడు..!!
4 likes
5 shares