Failed to fetch language order
ఆరోగ్య ప్రదాయిని 🌄 ఆదిత్యుని పూజ🙏
2 Posts • 150 views
PSV APPARAO
538 views 13 hours ago
#సర్వదేవాత్మకుడు ఆదిత్యుడు 🌄 #ఆరోగ్య ప్రదాయిని 🌄 ఆదిత్యుని పూజ🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: రథసప్తమి 🌅 సూర్యభగవానుని జయంతి 🌄🙏 *ఆరోగ్య ప్రదాయిని.. ఆదిత్యుని పూజ* *జనవరి 25 ఆదివారం రథసప్తమి సూర్య భగవానుని జయంతి...* "మతం అని ఒకదానిని ఎంచుకోవలసి వస్తే, లోకానికి అంతటికీ వెలుగును ప్రసాదించే సూర్యుడిని దేవునిగా ఎంచు కుంటాను" అన్నాడు నిఖిల లోక విఖ్యాతుడైన నెపోలియన్ చక్రవర్తి. భారతావనిలో సూర్యారాధన ప్రాచీనమైనది. రుగ్వే దంలో సూర్యుని స్తుతితో పది రుక్కులు ఉన్నాయి. వేద మంత్రం గాయత్రి సూర్యపరమైనదే. వేదంలోని సూర్యస్తుతిలో సూర్యరథ, సూర్య గుర్రాల ప్రస్తావన ఉంది. సూర్యుడు ప్రత్యక్ష దైవం. అయినా ఆదిలో విగ్రహ పూజ, ఆలయాలు లేకుండేవి. నవగ్రహాలలో సూర్యపూజ ఉత్కృష్టమైనది. వేదా లలో సౌరసూక్తాలు, రామాయణంలో ఆదిత్య హృదయం భార తదేశంలో సూర్యపూజ పౌరాతనాన్ని స్పష్ట పరుస్తాయి. యాలెన్ అనే చరిత్రకారుని ప్రకారం ఆదిలో సూర్యుని రూపా నికి ప్రతినిధిగా కిరణాలతో కూడిన బింబం పుట్టి, పూజార్హ మైంది. ఆదిలో నాణాల మీద క్రీ.పూ.రెండు, ఒకవంద ఏళ్ళ మధ్య తొలుత కిరణాల బింబం కానవచ్చేది. పాంచాలంలోని రాజులైన సూర్యమిత్ర, భానుమిత్ర నామముల నాణేలపైన ఉండేవి. విగ్రహ రూప మిత్ర (సూర్య) పూజ పారశీకమున (ఇరేనియన్) ప్రారంభమైనట్లు కనిపిస్తుంది. సూర్యాలయాలు భారతావనికి శకనృపులతో వచ్చిన మగి పూజారుల భిక్ష. కృష్ణుని కుమారుడు సాంబుడు చంద్రబాగా (చీనాబ్) నదీ తీరాన సూర్యదేవాలయం నిర్మించాడని భవిష్యత్ పురాణ కథనం. నంబాపురం లేదా మూలాస్థానం (ముల్తాన్)లో ఒక సూర్యాలయం ఉందని హూయన్ త్సాంగ్ పేర్కొన్నాడు. ఒరిస్సాలోని కోణార్కాలయం మగి బ్రాహ్మణ పూజారుల ప్రాబల్యానికి ప్రతీకగా ఉంది. గుప్తుల పాలనానం తరం, హర్షవర్ధనుని కాలాన సూర్యారాధన పెరిగి, ఆదిత్య భక్తులైన ఆయన తండ్రి తాతలకు ప్రభాకర, ఆదిత్య వర్ధన నామాలున్నాయి. నవ గ్రహాలలో సూర్యపూజ ప్రధానమైనందున, అట్టి సూర్యుని కొలుచుట ఏడాదికోసారి మాత్రమే, రథ సప్తమినాడే కావడం విశేషం. ఈశ్వరుడు మాఘ శుద్ద సప్తమి నాడు సూర్యుడిని సృష్టించాడని పేర్కొం టారు. పంచాంగ కర్తలు ఈదినాన్నే 'సూర్య జయంతి'గా, 'రథ సప్తమి'గా, 'మన్వాది'గా పేర్కొం టారు. రథ సప్తమిని రాజపుటానాలో సౌర సప్తమియని, వంగ దేశంలో భాస్కర సప్తమియని, కొన్ని చోట్ల జయంతి సప్తమి యని, మరికొన్ని చోట్ల మహా సప్తమియని అంటారు. సూర్యు నికి వివస్వంతుడని పేరు. వివస్వంతుని కుమారుడు ఏడవమనువైన వైవస్వతుడు. మన్వంతరానికి రథ సప్తమి మొదటి తిథి. వైవస్వత మన్వాది దినమైనందున పితృదేవతలకు ప్రియక రమైనది. ఒకప్పుడు భారత దేశంలో వైవస్వత మన్వాది తిథి సంవత్సరాదిగా చెప్పబడి, ఉగాది పండగగా ఉండేదని భావించ బడుతున్నది. తెలుగుదేశంలోనూ రథసప్తమినాడు అనేక స్త్రీల వ్రతాలు పట్టే ఆచారం ఉంది. సూర్య ఆరాధన ప్రధానంగా ఆచరించే ఈనాడు సూర్య రథాలు మళ్ళుతాయని, అవి ఉత్తర గతిని సూచిస్తాయని పురాణ కథనం. రథ సప్తమి నాడు సూర్య గ్రహణ తుల్యమైన పుణ్యకాలమని భావించే భక్తులు సూర్యోదయానికి పూర్వమే స్నానాదులు ఆచరించి, దానాదులు సూర్యోదయానంతరం చేయాలని ధర్మ సింధువు స్పష్ట పరుస్తున్నది. అతి పుణ్యప్రదమైన గ్రహణ కాలాలు వేయింటి ఫలితం ఒక్క రథ సప్తమికే ఉండగలదని మత గ్రంథాలు వివరిస్తున్నాయి. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
14 likes
10 shares
PSV APPARAO
550 views 13 hours ago
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: భానుసప్తమి, విజయ సప్తమి, కల్యాణ సప్తమి (సూర్యారాధన విశేష ఫలప్రదము) #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: రథసప్తమి 🌅 సూర్యభగవానుని జయంతి 🌄🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆరోగ్య ప్రదాయిని 🌄 ఆదిత్యుని పూజ🙏 #సర్వదేవాత్మకుడు ఆదిత్యుడు 🌄 *సూర్యారాధన* *బ్రహ్మస్వరూపముదయే, మధ్యాన్నేతు మహేశ్వరం* *సాయంధ్యాయే సదా విష్ణుం, త్రయీమూర్తిర్దివాకరః* మనకు ప్రతిరోజూ సాక్షాత్కరించే సూర్యభగవానుడు త్రిమూర్తి స్వరూ పుడని పైశ్లోకానికి అర్థం. ముల్లోకములలోనివారికి త్రికాలలో ఆరాధనీ యుడు సూర్యుడు. ఈ చరాచర జగత్తునుండి తిమిరాలను పోగొట్టి తన కరుణా కటాక్ష వీక్షణాలనుండి వెలుగును ప్రసాదించే అవతారమూర్తి సూర్యభగవానుని వేద స్వరూపునిగా, కర్మసాక్షిగా పేర్కొంటున్నాయి పురా ణాలు.'సూర్య' అను పదమునకు సకల జగత్తును చైతన్యపరిచేవాడని భావము. 'సువతి ప్రేరయతి వ్యాపారేష్టితి సూర్యః' అని ఉపనిషద్ నిర్వ చనం. జగత్తును చైతన్యపరిచేవాడు కనుక జగదారాధ్యుడైనాడు. సూర్యుడు అదితి కశ్యపుల తొలి సంతానం. కశ్యప పుత్రుడు కనుక కాశ్యపేయుడని, అదితి కుమారునిగా ఆదిత్యుడని పిలువబడుతున్నాడు. సూర్యునికి సంజ్ఞ, ఛాయ అని ఇద్దరు భార్యలు. యముడు, శని పుత్రులు. సూర్యరథానికి చిత్రరథమని పేరు. ఆ కారణంగా చిత్రరథుడనే పేరు వచ్చింది. సూర్యుని రథానికి ఒకే ఒక చక్రం. సూర్యరథాన్ని సప్త అనే అశ్వం లాగుతుంది. అది 'సప్తకాంచన సన్నిభం' అంటే ఏడు రంగుల కిర ణాలను ప్రసరింపజేస్తుంది. ఆ ఏడు రంగులు వ్యక్తి శరీరంలో ఉండే ఏడు ధాతువులు- మజ్జ, మాంసం, మేధస్సు, ఎముక, శుక్రం, శోణితం, చర్మం అనువాటిపై ప్రభావం కలిగివుంటాయి. అనంత శక్తిమయమైన ఆ కిర ణాలు వ్యక్తిపై ప్రసరిస్తే వాటివల్ల ఆయా ధాతువులపై ఉన్న రోగ లక్షణాలు నిర్మూలనమై ఆరోగ్యం లభిస్తుంది. అందుకే మనుస్మృతి 'ఆరోగ్యం భాస్క రాదిచ్ఛేత్' అని కీర్తించింది. _సూర్యుని నుండి ప్రసరించే ఏడు కిరణాలు-_ 1. *సుషుమ్నము - నాడీ మండలాన్ని ఉత్తేజపరస్తుంది.* 2. *హరికేశము - గుండె జబ్బులను నివారిస్తుంది.* 3. *విశ్వకర్మము - రక్తహీతను, తత్సంబంధమైన వ్యాధులను నిర్మూలిస్తుంది.* 4. *విశ్వత్వచము - శ్వాసకోస సంబంధిత వ్యాధులను తొలగిస్తుంది.* 5. *సంపద్వసుము - జననేంద్రియ వ్యవస్థను దృఢపరుస్తుంది.* 6. *అర్వాగ్యాసుము - నరాల బలహీనతను నివారిస్తుంది.* 7. *స్వరాజ్యసుము - స్వరపేటికకు, మూత్రపిండాలను వ్యాధులను నివారిస్తుంది.* సూర్యారాధన గురించి రామాయణము, మహాభారత గ్రంథాలలో విస్తృతంగా చెప్పడం జరిగింది. అగస్త్యుని ద్వారా ఆదిత్య హృదయము అను స్తోత్రాన్ని ఉపాసించి శ్రీరాముడు రావణ సంహారం చేసినట్లు, వన పర్వంలో ధర్మరాజు ఆదిత్యుని ఉపాసించి అక్షత పొందినట్లు కథలు న్నాయి. దివోదాసుడనే రాజు సూర్యకిరణాల సాయంతో జీవితమంతా ఆహారాన్ని వండుకుని భుజించినట్లు స్కాందపురాణం వచిస్తున్నది. శ్రీకృ ష్ణుని పుత్రుడు సాంబుడు సూర్యోపాసనతో తనకు సంక్రమించిన కుష్ఠు రోగం నుండి విముక్తుడయ్యాడు. జ్యోతిష శాస్త్రం ననుసరించి ప్రళయాంతరంలో సకల జగత్తు అంధకా రమయం కాగా పరాశక్తి ఆదేశానుసారం పరమేశ్వరుడు తిరిగి సృష్టిని ప్రారంభిస్తూ తొల్గొల్తగా గ్రహ నక్షత్రాదులను సృష్టించి గ్రహాధిపతియైన సూర్యునిగా తానే వెలుగొందాడని పురాణ వచనం. అట్టి భాస్కరుని నుండి సృష్టి రచించబడిందని సూర్యోపనిషత్తు తెలియజేస్తుంది. భగవతారాధనలో ఆదిత్యుని మించిన దైవం లేదని చెబుతూ శ్రీ శంకర భగవత్పాదులు ఏర్పాటుచేసిన పంచాయతన అర్చనావిభాగంలో ఆదిత్యు నికి ప్రముఖ స్థానం కల్పించారు. సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, శరీర కాంతి, పటుత్వం, పాపక్షయంతోపాటు సకల సౌభా గ్యాలు లభిస్తాయని శాస్త్రవచనం. సూర్య నమస్కారాల విశిష్టతను యోగ శాస్త్రం అతిఘనంగా చెప్పింది. సూర్యుడు సకల విద్యలకు అధినేత. యాజ్ఞవల్కునికి, ఆంజనేయునికి సకల విద్యలు ప్రసాదించిన గురువు. సూర్యారాధన ప్రశస్తి త్రేతాయుగం నాటికే ఉందని ప్రశస్తి. విశ్వామిత్రుడని గాయత్రీ మంత్రం సూర్యోపాసనే. వైవశ్వత మనువుకు సూర్యనారాయ ణుడు మాఘ శుక్ల సప్తమినాడు దర్శనమిచ్చాడు. ఆ రోజును రథసప్త మిగా, సూర్య జయంతిగా పరిగణింపబడుతున్నది. అందరూ రథసప్తమి నాడు శుచిగా సూర్యారాధనతోపాటు సూర్య నమస్కారాలు చేసి ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుని అనుగ్రహం పొందాలని ఆకాంక్ష. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
9 likes
11 shares