panduranga vittal mandir
55 Posts • 250K views
పండరీపురం మహారాష్ట్రలోని ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఇది చంద్రభాగా నది (ప్రస్తుతం భీమా నది) ఒడ్డున ఉంది. ఇక్కడ ప్రసిద్ధమైన పాండురంగ విఠలుడు రుక్మిణీ దేవి సమేతంగా వెలసి యున్నాడు. హిందువులు ఇతన్ని శ్రీకృష్ణుని అవతారంగా భావిస్తారు. మహారాష్ట్రకు కర్నాటకకు చెందిన వైష్ణవ భక్తులు 13 నుండి 17 శతబ్దాల మధ్యకాలంలో జ్ఞానేశ్వర్, నామ్ దేవ్, ఏక్ నాథ్, తుకారాం, పురంధర దాసు, విజయ్ దాస్, గోపాల్ దాస్, జగన్నాథ్ దాస్, ఇతన్ని కొలిచి తరించారు. ఈ దేవాలయానికి ఆరు ద్వారాలున్నాయి. మహారాష్ట్రీయులు పండరీ పురాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. ఇక్కడి స్వామి వారిని విఠోభా, పాండురంగ, పండరినాధ్, విఠల్, విఠల్ నాద్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. కొందరు భక్తులు దేవుళ్లపై దీక్ష వహిస్తారు. అలాంటి దీక్షలో ముఖ్యమైనది అయ్యప్ప దీక్ష. అలాగే, వేంకటేశ్వర దీక్ష, శివ దీక్ష, దుర్గమ్మ దీక్ష భవానీ దీక్ష చేపట్టి కొన్ని రోజులు నియమ నిష్టలతో దీక్ష సాగించి ఒక రోజున ఆయా దేవాలయాలకు యాత్రగా కాలినడకన బయలు దేరుతారు. ఆలాంటి దీక్షకు పండరి నాధుని దీక్షకూడ ఒక మంచి ఉదాహరణ. ఆషాఢ మాస తొలి ఏకాదశి నాడు జరిగే ఉత్సవాలకు జనం లక్షల సంఖ్యలో వస్తారు. పక్కనున్న నదీ ప్రాంతమంతా జన సంద్రంలాగా కోలాహలంగా వుంటుంది. పాద యాత్రికులు ఆ రోజుకు చేరుకునేలాగా తమ ప్రయాణాన్ని నిర్ణయించుకుంటారు... #☀️శుభ మధ్యాహ్నం #🌸శనివారం స్పెషల్ స్టేటస్ #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🪈జై శ్రీ కృష్ణ🕉️ #🛕పండరీపురం శ్రీ పాండురంగ స్వామి🕉️
116 likes
2 comments 78 shares
🌿🌼 పండరీపురం పాండురంగ స్వామివారి దర్శనం 🌼🌿 🌿🌼#శ్రీకృష్ణ #జన్మాష్టమి శుభాకాంక్షలు 🌼🌿 🌼🌿 దయచేసి సద్వినియోగం చేసుకోండి🌼🌿 #పూర్తిగా_చదవండి #సంభవామి_యుగే_యుగే #అందరికీ_తెలిసేందుకు_దయచేసి_షేర్_చేయండి🌼🌿 #కృష్ణాష్టమి - #జన్మాష్టమి 🌿🌼శివరాత్రి పరమ శివునికి, నవరాత్రి అమ్మవారికి, రామనవమి శ్రీరామ చంద్రునికి, స్కంద షష్ఠి సుబ్రహ్మణ్య స్వామికి మనం చూస్తూ ఉన్నాము. కానీ కృష్ణాష్టమి ఒక్క కృష్ణునికే కాక కృష్ణుడు పుట్టి పెరిగిన గోకులం అంతటికీ పుట్టిన రోజుగా పిలువబడుతుంది. ఎందుకంటే కృష్ణావతారం పూర్ణావతారం. మిగిలిన అవతారములలో శ్రీమహావిష్ణువు అంశగానే కనపడతాడు. రామావతారంలో కూడా రాముడు, ఆదిశేషుడైన లక్ష్మణుడు, శంఖ చక్రములైన భరత శతృఘ్నులతో కలిసి తనకు తాను మానవునిగా కనపడతాడు. కృష్ణావతార౦ పూర్ణావతారంలో చిన్నతనం నుంచి నేనే భగవంతుడిని, ధర్మాన్ని బోధించడానికి ఈ అవతారంలో వచ్చాను అని చెప్పాడు. భగవద్గీతలో మనం ఒకటి గమనించవచ్చు. అర్జున ఉవాచ, సంజయ ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ అని ఉండి కృష్ణ ఉవాచకు బదులుగా భగవానువాచ అని ఉంటుంది. దీనిని బట్టి మహా విష్ణు పరిపూర్ణావతారంగా కృష్ణావతారాన్ని చెప్పవచ్చు. నేటి రోజులలో కూడా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారిని పరమాచార్య, పెరియవా, నడిచే దేవుడు, అని అంటారు తప్ప ఆ పేరుతో చెప్పరు. అది మనం ఆ వ్యక్తికి ఇచ్చే గౌరవమును తెలియచేస్తుంది. వైష్ణవులు ఈ కృష్ణాష్టమిని లక్ష్మితో కూడినదిగా జరుపుకుంటారు.మధుర కారాగృహములో కృష్ణుడు జన్మించాడు. ద్వారకలోని గోకులంలో నందుని ఇంట పెరిగి ద్వాదశ జ్యోతిర్లి౦గమైన సోమనాధకు దగ్గరలోని ప్రతాప్ ఘర్ లో ముక్తిని పొందాడు. పూతన, శకటాసుర, వంటి రాక్షసులను సంహరించి, పదునాలుగు భువనములను, తనను, ఆమెను తన నోట తల్లియైన యశోదకు చూపి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. బ్రహ్మదేవుడు గోవులను బంధించిన సమయంలో ఆయా లేగ దూడల, గోప బాలుర ఆకారాలు తానే ధరించి అన్నీ తానె అయి ఆ లీలా గోపాల బాలుడు తమ గోకులానికి తిరిగి బయలు దేరాడు. తన విశ్వరూపాన్ని పలు సందర్భాలలో చూపినప్పటికీ, ప్రత్యేకించి అర్జునునకు కురుక్షేత్ర సంగ్రామంలో చూపి భగవద్గీతను జగతికి అందించిన మహానుభావుడు శ్రీకృష్ణుడు.🌼🌿 🌺🌺🌺🌹ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః🌷🌺🌺🌺 #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🌸శనివారం స్పెషల్ స్టేటస్ #🛕పండరీపురం శ్రీ పాండురంగ స్వామి🕉️ #🌿🌼🙏శ్రీ విఠల్ పాండురంగ స్వామి🙏🌼🌿
11 likes
18 shares