విద్యార్థులు ఆలోచించండి

16 Posts • 122K views
✓!/\/∆¥•K
1K views 26 days ago
పాఠశాల విద్యార్థుల హెయిర్ స్టైల్ మార్గదర్శకాలు.. నియమాలు పాటించండి . క్రమశిక్షణ పాటించండి. నీ వ్యక్తిత్వాన్ని చాటండి. . #🎒పాఠశాల భద్రతా దినోత్సవం💐 #హెయిర్ స్టైల్ #విద్యార్థులు ఆలోచించండి #ఇంటర్ విద్యార్థులు సూచనలు #విద్యార్థులు
18 likes
15 shares
Sekhar Digitals & Reporter 9603197203
588 views 1 months ago
#విద్యార్థులు #విద్యార్థులు ఆలోచించండి #🆕Current అప్‌డేట్స్📢 #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰ఈరోజు అప్‌డేట్స్ *చేతిలో పుస్తకం కాదు... కిట్ కట్ట.!!* *విద్యార్థులతో కూలీ పనులు చేయిస్తున్నది ఎవరు..???* *✍️..పై ప్రత్యేక కథనం..రిపోర్టర్ :- శేఖర్📲..9603197203..✍️* ప్రభుత్వం ఇచ్చిన రవాణా,కూలీల నిధులు ఏమవుతున్నాయి..? *ఉపాధ్యాయులు, విద్యార్థుల భుజాలపై విద్యాశాఖ భారం..!* కిట్ల కోసం కోట్లు...కష్టం భరించేది మాత్రం పిల్లలే..! *చేతిలో పుస్తకం ఉండాల్సిన పిల్లలకు కిట్ కట్టల భారం..!* *పాఠశాలకు వెళ్లే విద్యార్థి చేతిలో పుస్తకాలు ఉండాలి..* ఉపాధ్యాయుడు తరగతి గదిలో పాఠాలు చెప్పాలి. *కానీ కాట్రేనికోన మండలంలో కనిపించిన దృశ్యాలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.* విద్యార్థుల భుజాలపై కిట్ల కట్టలు, ఉపాధ్యాయుల చేతుల్లో లోడింగ్–అన్‌లోడింగ్ పనులు కనిపించడం విద్యాశాఖ పనితీరుపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర స్టూడెంట్ కిట్స్‌ను మండల పాయింట్ నుండి పాఠశాలలకు చేర్చే బాధ్యత అధికారులదే. అయితే దొంతికుర్రు, కందికుప్ప పాఠశాలల వద్ద విద్యార్థులు, ఉపాధ్యాయులే కిట్లను మోస్తూ కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం కిట్ల రవాణా, లోడింగ్, అన్‌లోడింగ్, కూలీల ఖర్చుల కోసం ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తోంది. అయితే ఆ నిధులు ఎక్కడ ఖర్చవుతున్నాయనే ప్రశ్న ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు, ప్రజల నుంచి వినిపిస్తోంది. విద్యార్థులు చదువుకు సమయం కేటాయించాల్సిన సమయంలో కూలీలుగా మారాల్సి రావడం దురదృష్టకరం. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాల్సిన ప్రభుత్వ యంత్రాంగమే పరోక్షంగా విద్యార్థులతో శారీరక శ్రమ చేయిస్తోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, బోధన బాధ్యతలు నిర్వహించాల్సిన ఉపాధ్యాయులు రవాణా, లోడింగ్, అన్‌లోడింగ్ పనుల్లో నిమగ్నమవడం వల్ల విద్యా కార్యక్రమాలపై ప్రభావం పడే అవకాశం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. గత విద్యా సంవత్సరంలో కిట్ల పంపిణీకి సంబంధించిన కన్వేయన్స్, ప్యాకింగ్ చార్జీల చెల్లింపుల్లో జరిగిన జాప్యంపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని నిధులు విడుదల చేయించిన విషయం ఇంకా ప్రజలకు గుర్తుండగానే మరోసారి ఇలాంటి పరిస్థితులు తలెత్తడం గమనార్హం. *"సార్... బరువుగా ఉంది. కానీ మోయక తప్పడం లేదు" అని ఓ విద్యార్థి చెప్పిన మాటలు ప్రస్తుతం పరిస్థితికి అద్దం పడుతున్నాయి.* *సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు...* * కిట్ల రవాణాకు ప్రభుత్వం కేటాయించిన నిధులు ఎంత..? * ఆ నిధులు ఎక్కడ, ఎలా ఖర్చు అయ్యాయి..? * కూలీలను ఎందుకు నియమించలేదు..? * విద్యార్థులతో బరువులు మోయించడం నిబంధనలకు విరుద్ధం కాదా..? * ఉపాధ్యాయులను కూలీల పనులకు వినియోగించడం వెనుక కారణమేంటి..? * దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందిస్తారా..? విద్యార్థుల సంక్షేమం కోసం ఉద్దేశించిన పథకం అమలులోనే విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి రావడం విచారకరం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజలు కోరుతున్నారు.. ___________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 2️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/GLEFRjZEzc17SzBaKlBfdW?mode=ems_wa_c ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
7 likes
8 shares
Sekhar Digitals & Reporter 9603197203
572 views 3 months ago
#విద్యార్థులు #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🗞ప్రభుత్వ సమాచారం📻 #☀️వేసవి స్టేటస్🌴 *కొనుగోలు చేసి...* *........మూలకు చేర్చి....* *పాఠశాలల్లో పనిచేయని వాటర్ ప్లాంట్లు..* ముమ్మిడివరం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో చేతిపంపు నీటిని తాగుతున్న విద్యార్థి *ముమ్మిడివరం - సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మూలకు చేరిన ఆర్డీఓ ప్లాంట్లు..* ముమ్మిడివరం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన తాగునీటి ప్లాంటు కొన్ని నెలలుగా ఇది పనిచేయడం లేదు. ధూళి పట్టకుండా ఉపాధ్యాయులు బరకంతో కప్పి ఉంచారు.. ఇక్కడి విద్యార్థులు చేతిపంపు నీటిని తాగుతున్నారు. *ముమ్మిడివరం గురుకుల పాఠశాలలోనూ ప్లాంట్ పనిచేయక మూలనపడింది..* ఠాణేలంక జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆర్వో ప్లాంటు లేక విద్యార్థులు ఇళ్ల నుంచి నీటి సీసాలు తెచ్చుకుంటున్నారు. జడ్నీ బాలికోన్నత పాఠశాలలో మన గ్రోమోర్ సంస్థ సీఎస్ఆర్ నిధులతో తాగునీటి ప్లాంటు ఏర్పాటు చేయడంతో అక్కడ సక్రమంగా తాగునీరు అందుతోంది. కొత్తలంక జడ్పీ ఉన్నత పాఠశాలలో గ్రామానికి చెందిన దాతరూ.2 లక్షలతో ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేశారు.. __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 5️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/B84kn3XfnsiIxEJyhmXoyV?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
10 likes
16 shares