"పెద్దలు చెప్పినట్లు 'సంతోషమే సగం బలం'. కష్టాల్లోనూ సంతోషాన్ని వెతుక్కోగలిగిన వాళ్లే నిజమైన ధన్యులు! మనిషికి ఎక్కడో ఒక చోట సంతృప్తి అనేది ఉండాలి. పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. నా జీవితంలోనూ అలా ఎన్నో పదవులు వచ్చాయి, వెళ్లాయి!"
పదవులు వస్తుంటాయి.. పోతుంటాయి! ప్రజాసేవలో మిగిలే 'తృప్తి' మాత్రమే శాశ్వతం!
"సంతోషమే సగం బలం" అన్నారు పెద్దలు. కానీ, ఆ సంతోషం కేవలం విజయాల్లోనే ఉండదు.. కష్టాల్లో, సవాళ్లలో, మనం నమ్మిన సిద్ధాంతం కోసం చేసే పోరాటంలో వెతుక్కున్నవాడే నిజమైన ధన్యుడు. నేడు *'అంతర్జాతీయ సంతోష దినోత్సవం'* సందర్భంగా నా సుదీర్ఘ రాజకీయ ప్రయాణాన్ని, అందులో నేను పొందిన అసలైన తృప్తిని మీతో పంచుకుంటున్నాను.
అలుపెరుగని పోరాటం.. ఆశయాల ప్రయాణం:
నా ప్రస్థానం నిన్న మొన్నటిది కాదు. 1997లో మాజీ మంత్రి స్వర్గీయ పి. ఇంద్రారెడ్డి గారి వెన్నంటి 'జై తెలంగాణ పార్టీ' కందుకూరు మండల కన్వీనర్గా అడుగులు వేశాను. ఆ తర్వాత 2001లో గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ జెండా ఎత్తిన నాటి నుండి నేటి వరకు కందుకూరు మండల తొలి అధ్యక్షుడిగా, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా, నూతన రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా (5.5 ఏళ్లు) పని చేసాను ఎన్నో బాధ్యతలు నిర్వహించాను. లయన్స్ క్లబ్ వంటి సామాజిక సంస్థల్లోనూ సేవ చేసే భాగ్యం కలిగింది. ప్రస్తుతం తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను.
*ముళ్ల బాటలో పూల నవ్వులు:*
2001లో టీఆర్ఎస్ జెండా పట్టినప్పుడు అందరూ పూలదండలు వేయలేదు. సొంత మనుషుల ఈసడింపులు, స్నేహితుల హేళనలు, రాజకీయ ప్రత్యర్థుల కుట్రలు, అక్రమ కేసులు.. ఎన్నో ఎదుర్కొన్నాను. తెలంగాణ కోసం ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చినా, వృద్ద జెంబూకాలు,వూర కుక్కలు మొరిగినా, పిల్ల కాకులు అరిసినా, సమాజంలోను సానుభూతిని అడ్డం పెట్టుకొని బద్నాం చేయాలని చూసినా...
ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చినా వెనకడుగు వేయలేదు.
*కుటుంబం అండ - ఉద్యమ గుండెచప్పుడు:*
2001లో టీఆర్ఎస్ జెండా పట్టినప్పుడు అందరూ పూలదండలు వేయలేదు. సొంత మనుషుల ఈసడింపులు, స్నేహితుల హేళనలు, రాజకీయ ప్రత్యర్థుల కుట్రలు ఎదుర్కొన్నాను. అన్నింటికీ మించి *నా కుటుంబం చేసిన త్యాగాలు నాకు కొండంత బలాన్నిచ్చాయి.*
ఉద్యమ సమయంలో నన్ను ముందస్తు అరెస్టు చేసినప్పుడు, నా శ్రీమతి కప్పాటి కల్పన ఏమాత్రం వెనకడుగు వేయలేదు. అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి సభలో చిదంబరం కట్టుబడడి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలంటూ CMకు వ్యతిరేకంగా తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేసి, తనవంతు బాధ్యతను చాటుకుంది. ఆ క్రమంలో అక్రమ రాజద్రోహం కేసును ఎదుర్కొని, నాలుగు సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరిగింది. ఇక నా కుమారుడు కప్పాటి శివరామకృష్ణా రెడ్డి కూడా తన విద్యాభ్యాసం చేస్తూనే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ యూత్ మీడియా కో-ఆర్డినేటర్గా పనిచేసి, అనంతరం నాతో పాటే తెలంగాణ జాగృతిలో అడుగుపెట్టాడు. నా కష్టంలోనూ, ఉద్యమంలోనూ నా కుటుంబం నాకు తోడుగా నిలబడటం నాకెంతో గర్వకారణం.
*ఆత్మవిమర్శే అసలైన సంతోషం*
మనుషులన్నాక ఎక్కడో ఒకచోట సంతృప్తి చెందాలి. పదవులు అనేవి హోదానిస్తాయి, కానీ మనం చేసిన పని 'గౌరవాన్ని' ఇస్తుంది. "ఇంకా ఏదో రాలేదు" అని బాధపడటం కంటే, "వచ్చిన అవకాశాన్ని ఎంత నిజాయితీగా వినియోగించాం" అని ఆత్మవిమర్శ చేసుకుంటే, ప్రతి మనిషి జీవితంలోనూ అసంతృప్తి అనేదే ఉండదు.
నాకు పదవుల మీద వ్యామోహం కంటే, నా పార్టీ కోసం, నా తెలంగాణ కోసం నిబద్ధతతో పనిచేశానన్న తృప్తి ఎక్కువ. ఆ తృప్తే నాకు నిజమైన సంతోషం!
అందరికీ
_*"international Day of Happiness"*_ *అంతర్జాతీయ సంతోష దినోత్సవ శుభాకాంక్షలు! 💐*
తమ విశ్వసనీయ
*కప్పాటి పాండురంగారెడ్డి*
తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు,🌤️
రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్📚
🌝🌝🌝🌝🌝🌝🌝🌝🌝
#కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిలా అధ్యక్షుడు