#రైతన్నమీకోసం_వారోత్సవం_పాల్గొన్న_ఎమ్మెల్యే_ముత్తుముల
#మార్కాపురంజిల్లా :#గిద్దలూరు మండలం #క్రిష్ణంశెట్టిపల్లె గ్రామంలో నిర్వహించిన #రైతన్నమీకోసం వారోత్సవం కార్యక్రమంలో Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో సమావేశమై వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
వ్యవసాయ రంగం బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, రైతులకు అవసరమైన సాయం అందించేందుకు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.వ్యవసాయ శాఖ అధికారులు ఎటువంటి పంటలు పండించాలి, భూమి ఏ విధంగా సాగుచేయాలి అని రైతులకు వివరించడం జరిగింది
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, పాలుగుళ్ల ప్రతాప్ రెడ్డి, భూపాల్ రెడ్డి, సర్పంచ్ దాసరి ఎలిజబెత్,పగడాల శ్రీను, దప్పిలి శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ రంగారావు, మాజీ zptc మచ్చ వెంకటేశ్వర్లు, రవిప్రకాష్ రెడ్డి, ప్రసాద్, మాజీ mptc శ్రీను, కేశవులు , షేక్షావలి,స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, నాయకులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#IdhiManchiPrabhutvam #GiddalurMLA
#GiddalurTelugudesamparty #giddalur
#MuthumulaAshokReddy #గిద్దలూరు
#మనగిద్దలూరుమనముత్తుముల
#✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు