DUDEKULA DASTAGIRI
591 views
#కాశిరెడ్డికుంటకు_మహర్దశ » అభివృద్ధికి రూ. #2కోట్లు మంజూరు » మరో రూ.#2కోట్లకు ప్రతిపాదనలు » ఫలిస్తున్న ఎమ్మెల్యే Muthumula AshokReddy గారి కృషి వైసీపీ ప్రభుత్వంలో తూతూమంత్రంగా జరిగిన కట్ట పనులు గత ప్రభుత్వంలో నిరుపయోగంగా ఉన్న ఎక్సర్సైజ్ యంత్రాలు #మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలోని #నరవ రోడ్డు లోని కాశిరెడ్డికుంటకు మహర్ణవ పట్టింది. కుంటను అభివృద్ధి చేసి కుంట చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసేందుకు, చిన్నపిల్లల పార్కు కుంట కట్టపై ఏర్పాటు చేసేందుకు పూడికతీత పనులు, రిటైనింగ్ వాల్ నిర్మాణానికి Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ #ముత్తుముల_అశోక్_రెడ్డి గారు బీపీఎస్, ఎస్ఆర్ ఎస్ నిధుల నుంచి రూ.2కోట్లు మంజూరు చేయించారు. ఈ మొత్తం కుంట అభివృద్ధికి సరిపోదని ఇంజనీరింగ్ అధికారులు చెప్పడంతో మరో రూ.2కోట్ల నిధులు మంజూరుకు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదనంగా కావలసిన రూ.2కోట్ల నిధులకు సంబందించి పనుల ప్రతిపాదనలను ఇప్పటికే ప్రభుత్వానికి పంపించారు. ఈలోగా మంజూరైన నిధులకు సంబంధించి ముందుగా ఏఏ పనులు చేయాలి అనే విషయంపై ఇంజనీరింగ్ అధికారులు డీపీఆర్ ను తయారు చేస్తున్నారు. డీపీఆర్ చివరి దశలో ఉండగా ఇది పూర్తయితే అంచనాల ఆమోదం తీసుకుని టెండర్కు వెళ్తుంది. ఈలోగా రెండోసారి పంపించిన రూ.2కోట్ల ప్రతిపాదనలకు కూడా నిధులు మంజూరయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం రూ.4కోట్లు మంజూరైతే ఇప్పటికే పూడిపోయి ఉన్న కాశిరెడ్డికుంటలో నీటిని మొత్తం తోడివేసి పూర్తిగా పూడికతీత పనులు చేపట్టి కుంట చుట్లూ వాకింగ్ ట్రాక్, ఒక వైపు చిన్నపిల్లల పార్కు, ట్రాక్పై చెట్ల పెంపకం, బెంచీల ఏర్పాటు, ఎక్సర్సైజ్ చేసుకునే పరికరాల ఏర్పాటు చేస్తారు. కుంట చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించి వాకింగ్ ట్రాక్కు ఇ బ్బంది లేకుండా చేస్తారు. గిద్దలూరు పట్టణంలో ఇప్పటివరకు ఎక్కడా వాకింగ్ ట్రాక్ లేకపోవడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో రోడ్ల మార్జిన్లలో వాకింగ్ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ పనులు కార్యరూపం దాల్చితే పట్టణవాసులకు మంచి వాకింగ్ ట్రాక్ అందుబా టులోకి రానున్నది. కాశిరెడ్డికుంట అభివృద్ధిపై ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వ హించి నిధుల మంజూరుపై ప్రత్యేకంగా శ్రద్ధచూపుతున్నారు. #తూతూ_మంత్రంగా_పనులు గత వైసీపీ పాలనలో కాశిరెడ్డికుంట అభివృద్ధికి స్వచ్ఛ ఆంధ్ర పథకం కింద కొంతమేర నిధులు మంజూరయ్యాయి. అప్పటి కాంట్రా క్టర్ తూతూ మంత్రంగా కొద్దిమేర పనులు చేసి అర్ధాంతరంగా పనులను నిలిపివేశారు. కొన్ని జిమ్ పరికరాలను పనులు పూర్తికాక ముం దే కుంటపై ఏర్పాటు చేయగా అవి నిరుపయోగంగా ఉన్నాయి. కుంట స్థలం ఆక్రమణలకు గురికాకుండా కాంపౌండ్వాల్ను నిర్మించడం కొం తలోకొంత మేలు చేసింది. చేసిన పనులు కూడా నాసిరకంగా ఉండ దంతో పలువురు ఫిర్యాదు చేయడంతో విజిలెన్స్ అధికారులు పను లను తనిఖీ చేశారు. మొత్తం మీద పనులన్నీ ఆగిపోవడంతో ప్రజాప్ర భుత్వం అధికారంలోకి రాగానే కుంట అభివృద్ధిపై ఎమ్మెల్యే #ముత్తుముల_అశోక్_రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి సారించి ఇప్పటికే రూ.2కోట్లు మంజూరు చేయించి మరో రూ.2కోట్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తు న్నారు. కుంట నీటి మధ్యలో జాతీయ పతాకాన్ని రెపరెప లాడించేం దుకు వీలుగా ప్రత్యేకంగా డిజైన్ చేయిస్తున్నారు. మొత్తమ్మీద కాశిరెడ్డి కుంటకు మహర్దశ పట్టనున్నది. ఈ విషయమై మున్సిపల్ కమిష సర్ రమణబాబును వివరణ కోరగా.. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి కృషి ఫలితంగా రూ.2కోట్ల నిధులు మంజూరు కాగా డీపీఆర్ ను సిద్ధం చేస్తున్నామని, అది పూర్తికాగానే అంచనాలను ఆమోదించి టెండర్ పిలుస్తామని, మరో 3 నెలల్లో పనులు మొదలయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరో రూ.2కోట్ల నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని, అవి కూడా మంజూరైతే పూర్తి స్థాయిలో కాశిరెడ్డికుంట అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. #NaraChandrababuNaidu #NaraLokesh #MuthumulaAshokReddy #GiddalurMLA #IdhiManchiPrabhutvam #NDAGovernment #GiddalurTelugudesamparty #NDAkutami #మనగిద్దలూరుమనముత్తుముల #ThankYouCMsir #ThankyouMlaMuthumulaAshokReddySir #జైతెలుగుదేశం #జైముత్తుముల #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్