ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గిద్దలూరులో ఎమ్మెల్యే ముత్తుముల 'ప్రజా దర్బార్'..
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటిని త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు వినూత్నంగా ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 'ప్రజా దర్బార్' కార్యక్రమం నిర్వహించారు. గిద్దలూరు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి, మారుమూల గ్రామాల నుంచి ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. తమ గ్రామాలలోని సమస్యలను, ఇబ్బందులను అర్జీల రూపంలో అందచేశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పెన్షన్లు, రేషన్ కార్డుల సమస్యలు, సాగునీరు మరియు తాగునీటి ఇబ్బందులు,భూ సంబంధిత వివాదాలపై ప్రజలు మొరపెట్టుకున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు, కేవలం అర్జీలు తీసుకోవడమే కాకుండా అక్కడికక్కడే పరిష్కార మార్గాలను చూపారు. సమస్య తీవ్రతను బట్టి సంబంధిత శాఖల అధికారులతో ఎమ్మెల్యే గారు ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడారు. "ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించకూడదని, గడువులోగా వాటిని పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని" అధికారులను ఆదేశించారు.
కొన్ని సంక్లిష్టమైన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని, నియోజకవర్గ అభివృద్ధికి తాను అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రతి సామాన్యుడి గొంతు తనకు వినిపిస్తుందని, అందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని పేర్కొన్నారు. తమ సమస్యలను ఓపికగా విని, తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే గారి పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
#🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్