Mohan
1.1K views
3 months ago
#📰జాతీయం/అంతర్జాతీయం #🌍నా తెలంగాణ #lionel messi #🆕Current అప్‌డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత సరదాల కోసం రాష్ట్ర ఖజానాను వాడుకుంటున్నారని సోషల్‌ మీడియాలో నెటిజన్లు విమర్శలు గు ప్పిస్తున్నారు. మార్పు తీసుకొస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. సొంత విలాసా లు, కుటుంబ వైభవానికి పరిమితమైనట్టు కనిపిస్తున్నదని విపక్షాలు మండిపడుతున్నాయి. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నదని చెప్తూనే, మరోవైపు తన వ్యక్తిగత సరదాల కోసం ప్రజాధనాన్ని అడ్డగోలుగా ఖర్చు చేయడమేంటని నిలదీస్తున్నారు. పాలనను గాలికి వదిలేసి, సీఎం రేవంత్‌రెడ్డి, తన మనుమడితో ఫుట్‌బాల్‌ ఆడే సరదా కోసం.. ప్రజల పైసలు ఖర్చు పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. సొంత సరదాలకు ప్రజాధనమా? ఉప్పల్‌ స్టేడియంలో శనివారం రాత్రి మెస్సీ మరికొందరు క్రీడాకారులతో కలిసి సీఎం రేవంత్‌ ఫుట్‌బాల్‌ ఆడారు. ఓ నాలుగు బంతు లు అటూ, ఇటు కిక్‌ చేశారు. తన మనువడితో కూడా కొన్ని బంతులను కిక్‌ చేయించారు. మ నుమడితో కలిసి కుటుంబ పిక్నిక్‌లా స్టేడియం లో సరదాగా గడిపారు. ఫొటోలకు పోజులిచ్చారు. మీడియాలో కనబడేటట్టుగా ఫుట్‌బాల్‌ డ్రెస్‌లో ఒకసారి ఎగిరిదూకారు. ఇంత ఆర్భాటం చేసినా సీఎం రేవంత్‌తో మెస్సీ ఆడ నే లేదు. మెస్సీ ఫుట్‌బాల్‌ డ్రెస్‌ కూడా వేసుకోలేదు. నమూనాకు చిన్న కోర్టులో కేవలం కొద్ది మందితో కాసేపు ప్రాక్టీస్‌ సెషన్‌లా మెస్సీ బాల్స్‌ను అటూ ఇటు కిక్‌ చేశారు. ఇందులో రేవంత్‌ ఇతర క్రీడాకారులు కాసేపు ఆడారు. ఇంత మాత్రం దానికి కొన్ని రోజులుగా రేవంత్‌ చేసిన హంగామా అంతా ఇంతా కాదని నె టిజన్లు ఫైరయ్యారు. మెస్సీ బాల్‌ ఇస్తే కనీసం రిటర్న్‌ పాస్‌ కూడా ఇవ్వలేని వ్యక్తి ఎవరు? అని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటి ఓ ఆట కోసం.. భారీ మొత్తంలో ప్రజాధనాన్ని వెచ్చించడం దేశ చరిత్రలోనే ఎకడా జరిగి ఉండదని చెప్తున్నారు. ఇది కచ్చితంగా అధికార దుర్వినియోగమేనని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.