DUDEKULA DASTAGIRI
599 views
#గిద్దలూరు_నియోజకవర్గ_ప్రజలారా... #కదలిరండి! మార్కాపురం జిల్లా ఏర్పాటుతో 5 దశాబ్దాలుగా పోరాడుతున్న స్థానికుల ఆకాంక్షను నెరవేర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ శ్రీ Nara Chandrababu Naidu గారు. 2024లో తన పుట్టిన రోజున ప్రతిపక్ష నాయకుడిగా #మార్కాపురంజిల్లా ఏర్పాటుకు హామీ ఇచ్చిన చంద్రబాబు గారు... చంద్రబాబు గారి కృషితో 2025 డిసెంబర్ 31వ తేదీన, ఆంధ్రప్రదేశ్ లోని 28వ జిల్లాగా ప్రకాశం జిల్లా నుండి విడిపోయి... మార్కాపురం, కనిగిరి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలతో... మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా ఏర్పాటయింది. ఇన్నాళ్ళూ జిల్లా కేంద్రం ఒంగోలుకు దూరంగా ఉండి అభివృధిలో వెనుక పడిపోయిన మార్కాపురం ఇకపై ప్రగతిని అందుకోబోతోంది... జిల్లాలో విస్తారమైన భూములు, సహజ వనరులు ఉండటంతో పరిశ్రమలు ఏర్పాటవుతాయి. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి... మార్కాపురం జిల్లా ఏర్పాటుతో ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ముఖ్యమంత్రి శ్రీ #నారాచంద్రబాబునాయుడు గారు మొదటిసారిగా 2026 ఫిబ్రవరి 25న జిల్లాకు వస్తున్నారు... వెలిగొండ ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా రూ.456 కోట్లతో చేపట్టిన ఫీడర్ కాలువ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తున్నారు. అనంతరం మార్కాపురం పట్టణంలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. మార్కాపురం జిల్లా ప్రజలారా... కదలి రండి! తన హామీని నిలబెట్టుకుని మన ఆకాంక్షలు నెరవేర్చిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఘనస్వాగతం పలుకుదాం. కృతజ్ఞతలు తెలియజేద్దాం!! Muthumula AshokReddy #GiddalurMLA #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్