#గిద్దలూరులో_ఘనంగా_మహిళా_దినోత్సవ_వేడుకలు
మహిళల సర్వతోముఖాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం:
గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలోని చీతీరాల కళ్యాణ మండపంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు శ్రీ Muthumula AshokReddy గారు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వేడుకల్లో పాల్గొన్న మహిళామూర్తులందరికీ ఆయన మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
సమాజ నిర్మాణంలోనూ, కుటుంబ పురోగతిలోనూ మహిళల పాత్ర ఎంతో కీలకమైనదని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కొనియాడారు. అనంతరం, మహిళల సంక్షేమం, వారి ఆర్థిక ప్రగతి కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకుంటున్న వివిధ సంక్షేమ పథకాలను, నిర్ణయాలను ఆయన వారికి కూలంకషంగా వివరించారు.
మహిళలకు ఆర్థిక, సామాజిక సాధికారత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు. "మహిళలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. మీ అభివృద్ధి, శ్రేయస్సే మా ప్రభుత్వ లక్ష్యం" అని తెలుపుతూ మహిళల్లో ఆయన భరోసా నింపారు. అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
#womansday2026
#MuthumulaAshokReddy #GiddalurMLA
#GiddalurTelugudesamparty
#ముత్తుముల_అశోక్_రెడ్డి
#🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్