DUDEKULA DASTAGIRI
608 views
#ఫెర్వాల్_పార్టీ_లో_ఎమ్మెల్యే_ముత్తుముల #మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలో 9 వ వార్డు నందు ప్రభుత్వ బాలికల BC హాస్టల్ నందు ఫేర్వెల్ పార్టీ వేడుకకు ముఖ్య అతిథిగా Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు పాల్గొన్నారు... ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ప్రతిభ కనబరచాలని సూచించారు. పాఠశాలలు కేవలం విద్య బోధించే స్థలాలు మాత్రమే కాకుండా, భవిష్యత్ పౌరులను తీర్చిదిద్దే పుణ్యక్షేత్రాలంటూ పేర్కొన్నారు. హాస్టల్ యాజమాన్యం విద్యా , వసతి ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని విద్యా వ్యవస్థ పై ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేస్తుంది అన్నారు. అలాగే మన విద్యాశాఖ మంత్రివర్యులు గౌ శ్రీ Lokesh Nara గారు మన నియోజకవర్గం లోని #రాచర్ల మండలం, #యడవల్లి గ్రామంలో నూతనంగా నిర్మించుకోవడానికి ST గురుకులం కోసం 16 కోట్ల రూపాయలు మంజూరు చేశారు త్వరలో పనులు కూడా మొదలెడుతారు, అలాగే నియోజకవర్గం లో SC - ST హాస్టల్ కోసం 18 లక్షలు , BC హాస్టల్ కు 23 లక్షలు మంజూరు చేశారు అని తెలిపారు , తల్లిదండ్రులు పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.10 తరగతి పరీక్షలు రాసేవారికి అల్ ది బెస్ట్ విషెస్ (ALL THE BEST) తెలియజేశారు... ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య , మున్సిపల్ కమిషనర్ GV రమణ బాబు , రాచర్ల మాజీ ZPTC కుప్పా రంగసాయి, మీజీ సర్పంచ్ దప్పిలి భాస్కర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు షేక్ షెహన్షా వలి, సొసైటీ బ్యాంక్ చైర్మన్ దుత్తా బాల ఈశ్వరయ్య,MEO -2 నాగభూషణం రెడ్డి,7 వ వార్డు కౌన్సిలర్ బిల్లా రమేష్, మొదిగిరి కృష్ణ, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. #MuthumulaAshokReddy #GiddalurMLA #GiddalurTelugudesamparty #మనగిద్దలూరుమనముత్తుముల #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్