DUDEKULA DASTAGIRI
576 views
1 days ago
#అమరజీవి_జయంతి_సందర్బంగా_నివాళులు_అర్పించిన_ఎమ్మెల్యే_ముత్తుముల #మార్కాపురంజిల్లా: #గిద్దలూరు పట్టణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన పోరాట స్పూర్తి, తెలుగు ప్రజల హక్కుల కోసం చేసిన త్యాగం గురించి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన చేసిన త్యాగం భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని,తెలుగు ప్రజలకు స్వంత రాష్ట్రం రావాలనే మహత్తర సంకల్పంతో పొట్టి శ్రీరాములు గారు అహింసా మార్గంలో పోరాడారు. తన ప్రాణాలను సైతం త్యాగం చేసి తెలుగు జాతికి గౌరవం తీసుకువచ్చారు. ఆయన చేపట్టిన నిరాహార దీక్ష, ఆయనలో ఉన్న ధైర్యం, సంకల్పబలం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిచ్చే అంశాలు. ఆయన త్యాగం ఫలితంగా తెలుగు ప్రజల ఆకాంక్ష నెరవేరి ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించింది. తర్వాత అది అభివృద్ధి చెందుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా రూపుదిద్దుకుంది. ఇది ఒక వ్యక్తి త్యాగం ఎంత గొప్ప మార్పును తీసుకురాగలదో చూపించిన చారిత్రక ఉదాహరణ. పొట్టి శ్రీరాములు గారి జీవితాన్ని చూస్తే మనకు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది — స్వార్థం లేకుండా ప్రజల కోసం పనిచేస్తే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవచ్చు. తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు ప్రజల గౌరవం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి తరానికి ఆదర్శం. నేటి యువత కూడా ఆయన త్యాగస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధి కోసం పనిచేయాలి. మన తెలుగు జాతి గౌరవాన్ని మరింత పెంచే బాధ్యత మన అందరిదీ అని,ఇంతటి పోరాట స్పూర్తని కారణంగా రాష్ట్రo ఏర్పాటు కారణంగా నేడు ఆ అమరజీవి కి రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో " 56 " అడుగుల కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి గౌ శ్రీ Nara Chandrababu Naidu గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేసినారు. ఈ కార్యక్రమంలో మండల, పట్టణ, నాయకులు, అధికారులు మరియు తదితరులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.... #GiddalurMLA #giddalur #గిద్దలూరు #PottiSreeramulu #AndhraPradesh #MuthumulaAshokReddy #GiddalurTelugudesamparty #amarajeevipottisreeramulu #మనగిద్దలూరుమనముత్తుముల #managiddalurmanamuthumula #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్