DUDEKULA DASTAGIRI
562 views
#స్వర్ణఆంధ్ర_స్వచ్ఛ_ఆంధ్ర_కార్యక్రమంలో_ఎమ్మెల్యే_ముత్తుముల #మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలోనీ గిద్దలూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు పట్టణాన్ని శుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఈ-వ్యర్థాలు (E-Waste) అయిన పాత మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, బ్యాటరీలు, చార్జర్లు, వైర్లు వంటి వస్తువులను సాధారణ చెత్తలో కలపకూడదని, రోడ్లపై పడవేయకూడదని ప్రజలకు సూచించారు. ఇలాంటి ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పర్యావరణానికి, భూగర్భ జలాలకు మరియు మన ఆరోగ్యానికి హానికరమని తెలిపారు. ప్రత్యేక సేకరణ కేంద్రాలకు అందజేసి సక్రమంగా రీసైకిల్ చేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు శుభ్రమైన గిద్దలూరు – మన అందరి బాధ్యత అనే నినాదంతో ప్రతి ఇంటి నుంచీ సహకారం అందించాలని ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ GV రమణ బాబు , మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య , మున్సిపల్ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, పట్టణ అధ్యక్షుడు షేక్ షెహన్ షా వలి, పట్టణ కౌన్సిలర్ లు, వార్డు నాయకులు, అభిమానులు, పురపాలక అధికారులు , సిబ్బంది మరియు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. #GiddalurMLA #GiddalurTelugudesamparty #మనగిద్దలూరుమనముత్తుముల #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు