*'స్వచ్ఛ రథం'తో పర్యావరణ మార్పు : చెత్త రహిత సమాజమే లక్ష్యం - ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి*
*మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం అర్థవీడు MPDO కార్యాలయం వద్ద గ్రామంలో పరిసరాల పరిశుభ్రత మరియు వ్యర్థాల నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు అర్ధవీడు MPDO కార్యాలయంలో 'స్వచ్ఛ రథం' కార్యక్రమాన్ని గౌ " ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రథం కేవలం చెత్తను సేకరించే వాహనం మాత్రమే కాదని, ప్రజల ఆలోచనా విధానంలో మార్పు తెచ్చే ఒక వేదిక అని కొనియాడారు.*
*ఈ పథకం యొక్క ప్రాథమిక ఉద్దేశం ప్రజలకు చెత్తపై అవగాహన కల్పించడం, ప్లాస్టిక్, ఇనుము, కాగితం వంటి వ్యర్థాలను పారవేయకుండా, వాటిని తిరిగి ఉపయోగించుకునేలా (Recycling) ప్రోత్సహించడం. "చెత్తను ఇవ్వండి - సరుకులు తీసుకోండి" అనే నినాదంతో ప్రజలను భాగస్వాములను చేయడమని నిత్యావసర సరుకులను ప్రతిఫలంగా ఇవ్వడం ద్వారా ప్రజల్లో ఉత్సాహాన్ని నింపడం అన్నారు.*
*పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం మరియు నిల్వ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను సురక్షితంగా సేకరించడం ఈ రథం యొక్క ముఖ్య లక్ష్యమని ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం వల్ల కలిగే అపరిశుభ్రతను నివారించి, దోమల పెరుగుదల మరియు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడటం.*
*అర్ధవిడు మండలం మరియు గ్రామీణ ప్రాంతాలను పర్యాటక ప్రాంతాల వలె స్వచ్ఛంగా, అందంగా తీర్చిదిద్దడం తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. కూటమి ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలకే పరిమితం కాకుండా, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే ఇలాంటి వినూత్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.*
*"ప్రతి ఇల్లు స్వచ్ఛంగా ఉంటేనే, ఊరు స్వచ్ఛంగా ఉంటుంది. ఊరు స్వచ్ఛంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ స్వచ్ఛ రథాన్ని ప్రతి ఒక్కరూ తమ సొంత వాహనంగా భావించి సహకరించాలన్నారు.*
#✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు